నిజంనిప్పులాంటిది

May 11 2024, 12:35

పార్లమెంట్ ఎన్నికలపై మావోయిస్టుల లేఖ కలకలం

- తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు

- ప్రజలకు మావోయిస్టుల కీలక పిలుపు

- పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయవద్దని పిలుపు

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ మావోయిస్టుల వాల్‌పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లోని ములుగు జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో ఈ వాల్‌పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు తుది అంకాని చేరుకున్నాయి. నేడు సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. గత 50 రోజులకు పైగా ఊదరగొట్టిన మైకులు మూగబోనున్నాయి. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈసీ గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ పూర్తవుతుంది. మెుత్తం 17 పార్లమెంట్ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలకు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కరపత్రాలు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ కరపత్రాల్లో ఓటర్లకు మావోయిస్టు పార్టీ కీలక పిలుపునిచ్చింది. ప్రస్తుతం జరగుతున్న పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరహద్దుల్లో ఈ కరపత్రాలు కలకలం రేపాయి. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ సమీపంలో మావోయిస్టుల పేరిట వాల్ పోస్టర్లు, కరపత్రాలు దర్శనమిచ్చాయి.

పార్లమెంట్ ఎన్నికలను ఓటర్లు బహిష్కరించాలని ఈ కరపత్రాల ద్వారా మావోయిస్టులు పిలుపునిచ్చారు. వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ పేరుతో వాల్ పోస్టర్లను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే నేపథ్యంలో మావోయిస్టుల కరపత్రాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. దీంతో పోలీసులు, కేంద్రబలగాలు అలర్ట్ అయ్యాయి. ఏజెన్సీ ఏరియాలో భారీగా భద్రత బలగాలను మోహరించారు. సమీప గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.

నిజంనిప్పులాంటిది

May 11 2024, 12:08

సీఎం రేవంత్‌ రెడ్డికి ఈసీ నోటీసులు

- 48 గంటలు డెడ్‌‌లైన్.. దాటితే చర్యలే..!

ఓవైపు లోక్ సభ ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండగా.. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి (Anumula Revanth Reddy) ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) పై వ్యక్తిగత దూషణలపై బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు.. సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (మే 10న) షోకాజు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నోటీసులపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నిరంజన్‌ను ఈసీ ఆదేశించింది. గడువు ముగిసేసరికి వివరణ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు.

కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో.. మందు వేసి మాట్లాడుతుండో తెలియట్లేదు. సోయిలేనోడు, సన్నాసోడు, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడు.." అంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు. రైతుబంధు సాయం, రైతురుణమఫీ విషయంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్న క్రమంలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో.. సీఎ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎంకు ఈసీ నోటీసులు ఇచ్చింది.

నిజంనిప్పులాంటిది

May 11 2024, 08:15

ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు..

ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు.. 

ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనున్న ప్రచారం.. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు నాల్గో విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించనున్న ఈసీ.. 

మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్..

నిజంనిప్పులాంటిది

May 10 2024, 18:03

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మతిభ్రమించింది

•బండి సంజయ్ పై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

•కాంగ్రెస్ అభ్యర్థి జనంలో ఉండని నాయకుడు

•కాంగ్రెస్ లో అంతర్గత కుమ్మలాటలు, రాజకీయలు ఎక్కువయ్యాయి.

బిజెపి కరీంనగర్ మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పై అవాకులు చివాకులు పేలారని, దీన్ని పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి ఉద్యోగం కోల్పోయిన కెసిఆర్ కు పతిభ్రమించి, పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు భాస సత్యనారాయణ రావు విమర్శించారు. శుక్రవారం కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన పార్టీ బిఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పి గద్దె దించిన వాళ్ల తీరు మారలేదన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అసత్య ప్రచారాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ దాదాపు 12,000 వేల కోట్ల నిధులు ప్రజా సంక్షేమం, ఇతర అభివృద్ధి పనుల కోసం తీసుకొచ్చారన్నారు . కళ్ళు ఉండి చూసేవారికి చేసిన అభివృద్ధి పనులు కరీంనగర్ పార్లమెంటు వ్యాప్తంగా కళ్ళముండే కనబడతాయని, కళ్ళు ఉన్నా కూడా నటించే వారికి ఆ పనులు కనిపించవన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి పార్లమెంటు పరిధిలో ఉందన్నారు.

తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి , చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకుందామనే ప్రయత్నంలో ఉన్నాడని, కాంగ్రెస్ అభ్యర్థి ఏనాడు ప్రజల్లో లేడన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల పక్షాన ఏనాడూ నిలబడలేదని, కేవలం తన రాజకీయ అవసరాల కోసం గతంలో పిఆర్పి నుండి ఎంపీగా పోటీ చేసి కనబడకుండా పోయారని విమర్శించారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల బరిలో ఎంపీ అభ్యర్థిగా నిలిచారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల కోసం ఇన్నేళ్లలో ఏమైనా సేవ చేశారా..? కష్టాల్లో ఉన్న ఎప్పుడైనా ఆదుకున్నారా..? ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు.

కేవలం తన రాజకీయ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలపై గాని, పార్లమెంటు పరిస్థితులపై గాని ఏమాత్రం అవగాహన లేదన్నారు. అలాంటి వ్యక్తికి ఓటు వేయడం దండుగా అనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు, రాజకీయాలు ఎక్కువ అని, అందుకే కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి పురమళ్ళ శ్రీనివాస్, హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లు దూరమయ్యారని తెలిపారు. పార్టీ వ్యవహారాలనే చక్కదిద్దుకోనొళ్ళు ప్రజల సమస్యలను ఏం పరిష్కరిస్తారు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

కాంగ్రెస్ రోజురోజుకి ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోతుందన్నారు. జరగబోయే పార్లమెంటు ఎన్నిక లో వార్ వన్ సైడ్ జరగనుందని, బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధి సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర, సోషల్ మీడియా కన్వీనర్ ఉప్పర పల్లి శ్రీనివాస్ ,నాయకులు అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 10 2024, 17:53

BJP,RSS, మోడీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం

•ఇండియా కూటమి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపిద్దాం.

•రాజ్యంగాన్ని,రిజర్వేషన్లను కాపాడుకుందాం

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు పిలుపు

సిపిఐ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు మద్దతుగా పదవ డివిజన్ కట్ట రాంపూర్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు. 

ఈసందర్బంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షులు బత్తిని చంద్రయ్య గౌడ్ లు మాట్లాడుతూ... 

మోడీ 10 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా హిందుత్వ ఫాసిస్టు శక్తులు పెట్రేగిపోయా యని, దళితులపైన, ఆదివాసీల పైన, మహిళల పైన, మైనారిటీ లపైన దాడులు, హింసలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ముస్లిం, క్రిస్టియన్ తదితర మైనారిటీ మతాలకు వ్యతిరేకంగా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశ సమైక్యతకు, లౌకిక, ప్రజాస్వామిక విధానాలకు తూట్లు పొడుస్తు 80% హిందువుల సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతు హిందువుల్ని బిజెపి మభ్యపెడుతుందన్నారు.

దేశంలోని మణిపూర్లో మైనారిటీలపై, తెగలపై ఎడతెగని హత్యాకాండ కొనసాగిస్తున్నారని, రామ మందిర నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 రద్దు తదితర చట్టాలతో మైనారిటీలను కేంద్రంగా చేసుకొని దాడులు చేస్తూ, వారిని అభద్రతా భావానికి గురిచేస్తున్నారన్నారు.

లౌకిక, ప్రజాస్వామిక వాదులపై, ఆలోచనాపరులపై పాశవిక నిర్బంధాన్ని బీజేపీ అమలు చేస్తుందని, రాజ్యాంగ పరంగా ఏర్పడిన సంస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని మోడీ ప్రభుత్వం చట్టసభలను నామమాత్రం చేస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులను, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నారని, పార్లమెంటరీ ఫాసిజాన్ని దేశంలో అమలు చేస్తున్నదని విమర్శించారు.

భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూసే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తుల ప్రమాదాన్ని అడ్డుకోవాలని తెలిపారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో బిజెపిని, దాని మిత్రపక్షాలను ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థి రాజేందర్ రావు ని గెలిపించాలని పైడిపల్లి రాజు, బత్తిని చంద్రయ్య గౌడ్ లు పిలుపునిచ్చారు.

 

 పదవ డివిజన్ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో సిపిఐ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంకటి మమత, మంజుల, పోచయ్య, ప్రశాంత్, పద్మ, హరి, శ్రీనివాసరెడ్డి, కవిత, సంధ్య, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 10 2024, 17:50

గడ్డం వంశీని ఆదరించి ఓటు వేసి పార్లమెంటుకు పంపండి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని స్టానిక ప్రజలను కోరారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ వేవ్ నడుస్తుందని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని పూర్తి విశ్వాసంతో ఉన్నామని, ఐదు న్యాయాలతో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల గురించి ఆలోచించి, వారి సంక్షేమం కోసం ముందుకు సాగుతుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనరావు ల నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కోసం, యువత ఉద్యోగ అవకాశాల హామీ ఇస్తున్నా గడ్డం వంశికృష్ణ ను గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

 సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని గడ్డం వంశీ కృష్ణ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దలగట్టు యాదవ్, గాజుల శివశంకర్, అమ్ముల బిక్షపతి, అటెపల్లి రాజు, అసరి ఎర్రయ్య, గుండేటి సదయ్య, గుండేటి రాములు, గడ్డం రాజకుమార్, గాజుల శ్రీచరణ్, గుండేటి శ్రీకాంత్, సోమయ్య, శ్రీనివాస్, అసరి కుమార్, రాంచందర్ గుండేటి శంకర్, గుండేటి అనిల్, అమ్ముల శంకర్, గుండేటి సాయిలు, అంబుల మల్లయ్య, గుండేటి రజినీకాంత్, గంట రాజు తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 10 2024, 17:47

భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రదారులను తరిమికొట్టాలి

•కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిచాలి 

•సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్ రెడ్డి

సిపిఐ పార్టీ బలపరిచిన కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని సైదాపూర్ మండల కేంద్రంలో సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు ఆద్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వేంకట్ రెడ్డి హజరై మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వస్తే దేశం అల్లకల్లోలంగా మారుతుందని, సామాన్య ప్రజలు ఈ దేశంలో జీవించే హక్కులు కోల్పోతారని, దేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ , ఇండియా కూటమి గెలిస్తేనే దేశంలో సామాన్య ప్రజలకు న్యాయం చేకూరుతుందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ లో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ కు పంపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వేంకటస్వామి, బోయిని అశోక్, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, మిట్టపల్లి కిష్టయ్య, వేముల రమేష్ సిపిఐ సినియర్ నాయకులు కంది రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ సదానందం, హమ్మయ్య, రవి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 10 2024, 15:01

నిన్న శ్రీకాళహస్తిలో... ఆర్. కృష్ణయ్య గారి పై జరిగిన రాయి దాడిని ఖండిస్తున్నాం

బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ 

నిన్న ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాళహస్తి లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ .కృష్ణయ్య గారి పై కొంతమంది టిడిపి నాయకులు రాయితో దాడి చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం గత 50 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న

ఏకైక నాయకుడు ఆర్ .కృష్ణయ్య గారు ఆర్. కృష్ణయ్య గారి పోరాటాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ .కృష్ణయ్య గారినీ రాజ్యసభ సభ్యులుగా నియమించడం జరిగింది ఆర్ .కృష్ణయ్య గారు రాజ్యసభ కి వెళ్లడాన్ని ఓర్చుకోలేని టిడిపి నాయకులు ఆయన నిన్న ప్రచారంలో ఉండగా కొంతమంది టిడిపి నాయకులు ఆయనపై రాయి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు బీసీ వ్యతిరేకి కాబట్టే గతంలో ఆర్ .కృష్ణయ్య గారు రాజ్యసభని వ్యతిరేకించడం జరిగింది అంతే కాకుండా బీసీలను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఓటమి జీర్ణించుకోలేక రాళ్ల దాడులు చేయిస్తున్నారని ఆయన అన్నారు.

ఆర్ .కృష్ణయ్య గారి పై ఎవరైతే దాడి చేశారో వారిని తక్షణమే గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తూ శునకానందం పొందుతున్నారని ఆయన అన్నారు ఇలాంటి రాళ్ళ దాడులను తక్షణమే ఆపకపోతే బీసీ లందరూ తిరగబడి చంద్రబాబు నాయుడు పై చెప్పులు దాడులు కూడా చేస్తానికి వెనకకు పోమని ఆయన హెచ్చరించారు..

ఈ కార్యక్రమంలో .. ఆర్లపూడి శ్రీను, రాయించు నరసింహ, చిలకల మురళి యాదవ్, నరేష్, గంగాధర్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 10 2024, 14:55

సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట..

సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట.. 

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్.. 

జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. 

ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్న విజ్ఞప్తిని సమర్థించిన సుప్రీంకోర్టు.

నిజంనిప్పులాంటిది

May 09 2024, 12:56

Vande Bharat Sleeper: వామ్మో.. వందే భారత్ స్లీపర్ ట్రెయిన్‌లో ఇన్ని ఫీచర్సా!

ప్రస్తుతం రైల్వే ప్రయాణికులను అమితంగా ఆకర్షిస్తున్నాయి వందేభారత్ రైళ్లు. ఆధునిక సౌకర్యాలున్న ఈ రైళ్లకు భారీ డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ సర్వీసు ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రయాణికులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ వీటిని ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ దిశగా తాజాగా మరో ముందడుగు పడింది.

వందేభారత్ రైలు భద్రతా ప్రమాణాలను పరీక్షించే కాంట్రాక్ట్‌ను (Safety Assesment) ఆర్ఐటీఈఎస్ (RITES) సంస్థకు రైల్వే శాఖ తాజాగా ఇచ్చింది. ఐటల్‌సర్టిఫయర్ ఎస్‌పీఏతో సంయుక్తంగా ఆర్ఐటీఈఎస్ ఈ తనిఖీలు చేపడుతుంది. మరోవైపు, ప్రయాణికుల అంచనాలను అందుకునేలా రైల్వే శాఖ (Indian Railways) వందే భారత్ స్లీపర్‌‌ను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతోంది. రాజధాని, తేజస్ ఎక్స్‌ప్రెస్‌లను తలదన్నేలా వీటి ఫీచర్లు ఉండనున్నాయి.

వందే భారత్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయట. వీటిలో 11 ఏసీ 3 టైర్, నాలుగు ఏసీ 2 టైర్, రెండు ఏసీ ఫస్ట్ కోచ్ ఉంటుంది. ఒకేసారి 823 మంది ప్రయాణికులు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ 3 టైర్‌లో 611, ఏసీ 2 టైర్‌లో 188 మంది, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 24 మంది ఉంటారు.

అత్యధికులు ప్రయాణించే ఏసీ 3 టైర్‌లో అత్యాధునిక సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. వీటిల్లోని బెర్తుల్లో ఎక్స్ట్రా కుషన్ ఏర్పాటు చేస్తు్నారు. రాజధాని కంటే మెరుగ్గా బెర్తులను సిద్ధం చేస్తున్నారు.

కోచ్‌లో వాతావరణం కంటికి ఇంపుగా ఉండేలా క్రీమ్, పసుపు రంగులకు చెందిన వివిధ షేడ్స్‌ను వినియోగిస్తారు. అప్పర్, మిడిల్ బెర్తులను ఎక్కేందుకు మరింత అనువైన నిచ్చెనను డిజైన్ చేశారు.

కోచ్‌లో వాతావరణం కంటికి ఇంపుగా ఉండేలా క్రీమ్, పసుపు రంగులకు చెందిన వివిధ షేడ్స్‌ను వినియోగిస్తారు. అప్పర్, మిడిల్ బెర్తులను ఎక్కేందుకు మరింత అనువైన నిచ్చెనను డిజైన్ చేశారు.

రైల్లో అంతటా సెన్సార్ ఆధారిత లైట్లను ఏర్పాటు చేస్తారు. విద్యుత్ తక్కువగా వినియోగిస్తూ రాత్రుళ్లు కావాల్సినంత వెలుతురును అందించేలా లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. సులువుగా నడిచేందుకు వీలుగా రైలు ఫ్లొర్‌లపై స్ట్రిప్స్‌ను కూడా వినియోగిస్తున్నారు.

సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, శబ్ద కాలుష్యం తగ్గించేందుకు నాయిస్ ఇన్సులేషన్, సెలూన్ స్పేస్, దివ్యాంగులకు కూడా అనువుగా ఉంటే టాయిలెట్లను రైల్లో ఏర్పాటు చేస్తారు.

రైలు టాయిలెట్లలో దుర్వాసన రాకుండా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మాడ్యులార్ ఫిట్టింగ్స్‌తో కూడిన బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్ ఉంటాయి. నీరు చిందకుండా ఉండేందుకు వాష్ బెసిన్స్‌లో కూడా యాంటీ స్పిల్లేజ్ ఫీచర్లు ఉంటాయి.

ప్రయాణ అనుభవం మెరుగ్గా ఉండేలా ఇంటీరియర్స్‌ను అత్యాధునికంగా డిజైన్ చేస్తున్నారు. జీఎఫ్‌ఆర్‌పీ పానల్స్, పబ్లిక్ అనౌన్స్‌‌మెంట్ వ్యవస్థ, విసువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు జోడిస్తున్నారు.

ప్రయాణాల్లో కుదుపులు తక్కువగా ఉండేందుకు రైల్లో సెమీ పర్మెనెంట్ కప్లర్స్ వాడుతారు. దీంతో, ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

కోచ్‌ల మధ్య ప్రయాణానికి వీలుగా పూర్తిగా మూసి ఉంచిన గ్యాంగ్‌వేస్‌ను డిజైన్ చేశారు. ఇది వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని వ్యవస్థ మాదిరిగానే ఉంటుంది.

ఇవి సెమీ హైస్పీడ్ రైళ్లు కావడంతో గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే శాఖ చెబుతోంది. అయితే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నమూనా రైలును గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగం వద్ద పరక్షిస్తారు. ఈ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చాక రాత్రి ప్రయాణాల సమయం చాలా వరకూ తగ్గుతుందని రైల్వే శాఖ చెబుతోంది.