/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ కు కంచుకోట : డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు Vijay.S
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ కు కంచుకోట : డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు

బిజెపి వ్యాపారుల పార్టీ, రైతుబంధు పథకం పై కొంతమంది ఫిర్యాదు చేశారు .భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ కు కంచుకోట సేవా భావం కలిగిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి బిజెపి వ్యాపారస్తుల పార్టీ బిజెపికి ఓటు వేస్తే వృధా అవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమాలు అన్నారు. మంగళవారం ఆయన చౌటుప్పల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతాంగ సోదరులందరికీ అమల్లో ఉన్న రైతు బీమా, రైతు బంధం పథకం కింద 7624 కోట్లు మంజూరు చేసాం. కొంతమంది సీఎం పైన ఫిర్యాదులతో అవి నిలిచిపోయాయి. భువనగిరి లోక్సభ స్థానం ఎప్పుడూ కాంగ్రెస్కు కంచుకోట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం రావడానికి ఈ ప్రాంత ఓటర్లు అత్యధికమంది ఎమ్మెల్యేలను గెలిపించి పంపించారు. ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలను మహారాణులుగా చూస్తుంది. డ్వాక్రా మహిళల కు అయిదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం కింద వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ ఏడు నుంచి డ్వాక్రా మహిళ లకు వడ్డీలేని రుణాల కింద చెక్కులు పంపిణీ చేశాము అన్నారు. మూడు నెలల్లోనే 30వేల మంది నిరుద్యగులకు ఉద్యోగాలు కల్పించాం అన్నారు. మూసి కాలువలు మరమ్మతు చేయాలని నిర్ణయించి తెలిపారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు బాగుండాలంటే భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓవైపు, మోడీ అదానీ అంబానీ మరోవైపు నిలుచున్నారని తెలిపారు. ఈ దేశ సంపద ఇక్కడి ప్రజలకు ప్రజలకే పంచాలని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినట్టు తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు రిజర్వేషన్లు రద్దు చేసేందుకు 400 సీట్లు ఇవ్వాలని బిజెపి కోరుతుందని తెలిపారు. సేవా భావం కలిగిన వ్యక్తి యువజన సంఘంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకుడు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మే 13న ,జూన్ 4న వేతనంతో కూడిన సెలవు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 13న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. ఎన్నికల ఫలితాల తేదీ అయిన జూన్ 4న వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేసింది.* కాగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎన్నికల అధికారులు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న ఒకే దశలో జరుగుతాయి. మొత్తం ఏడు దశల్లోని ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. రాష్ట్రంలో వేడిగాలుల కారణంగా 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గంట వరకు పొడిగించబడింది. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో భాగమైన కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లకు మే 13న రెండుసార్లు పోలింగ్ జరగనుంది. ఇందులో ఒకటి ఎంపీ, రెండోది ఎమ్మెల్యే ఓటు వేయాల్సి ఉంటుంది.. కాగా.. ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఎన్నికల కోసం 3,986 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 23,500 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఓటు ఉన్న వారు వచ్చి ఓటు వేయాలన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం హెచ్చరించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని సూచించారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్ష, కార్యదర్శులకు ఆదేశాలు ఇస్తూ ప్రకటన విడుదల చేశారు.
భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు


నిరంతరం ప్రజల తరఫున, కూలీల, రైతుల తరుపున నిలబడుతూ సమస్యల పరిష్కారానికై , వారి హక్కుల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ ని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామంలో పనిచెస్తున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని దగ్గరికి వెల్లి కూలీల దగ్గర ప్రచారం నిర్వహించడం ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఆమె చట్టం వచ్చిందని అన్నారు. నేడు బిజెపి 10 సంవత్సరాల పాలనలో ఉపాధి హామీ పథకంకు ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు బిజెపి ప్రభుత్వం చేస్తున్నది వారు విమర్శించారు. కొన్ని జిల్లాలకి పని చూపాలని, కూలీల సంఖ్యను తగ్గించాలని, పని దినాలు వేతనాలు తగ్గించాలని ప్రయత్నం చేస్తుందని అన్నారు. చట్టంలో ఉన్న మౌలిక సమస్యలు కూడా అమలు చేయడం లేదని ఆవేదన వెలుబుచ్చారు. కొత్త కొత్త జీవోలు తెచ్చి కూలీలను అయోమయంలో నెడుతున్నారని సరిగా బిల్లులు విడుదల చేయకపోవడం, రెండుసార్ల ఫోటో తీసే విధానం, బ్యాంకుకు ఆధార్ లింకు ఇలాంటివి కూలీల పోట్టగొట్టే విధంగా బిజెపి తీసుకొస్తున్న విధానాలు ఉన్నాయని అన్నారు. కూలీలంతా బిజెపిని ఓడించకపోతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉండదని అందుకే పోరాడే సిపిఎంను గెలిపించాలని నరసింహ కూలీలను కోరినారు. మరో పక్క బీజేపీ అధికారంలో వచ్చినాకనే ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్ముతున్నారని ఇలాంటి బీజేపీని మళ్లీ అధికారంలో రాకుండా ప్రజలందరూ చూడాలని కోరినారు. నిరంతరం కూలీల కోసం రైతుల కోసం పేదల కోసం ఈ ప్రాంతం తాగు తాగునీరు విద్యా వైద్యం అభివృద్ధి కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని నర్సింహ ప్రజలను కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, గ్రామ కమిటీ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, నాయకులు ఎండి. జహంగీర్, బొల్లెపల్లి కిషన్, పాండు, నర్సింహ, బొల్లెపల్లి పరమేష్, కళ్లెం లక్ష్మీ, నరసయ్య, మైలారం శివ, తోటకూరి మల్లేష్ ,ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు గంటెపాక శివ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ చట్ట రక్షణకై పోరాడే సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు ఓటేయండి: నారీ ఐలయ్య వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి


మోడీ అధికారంలోకొస్తే ఉపాధి హామీ చట్టం రద్దు చేపడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య తెలిపారు ఈరోజు మండలంలోని గోకారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులను ఉద్దేశించే మాట్లాడుతూ అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం నిధులు కుదిస్తూ చట్టాన్ని నీరుగారిచే పద్ధతుల్లో వ్య వరిస్తూ ఉపాధి హామీ చట్టం లేకుండా చేయడం కోసం అనేక మార్పులు చేర్పులు ఉపాధి హామీలో తీసుకురావడం జరిగిందజరిగిందని కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించడం మూలంగా ఉపాధి కార్మికులు పనిచేసిన వాటికి పెద్ద ఎత్తున బకాయిలు పేరుకు పోయాయని గత సంవత్సరం తో పాటు ఈ సంవత్సరం పనిచేసిన కార్మికులకు ఆరేడు వారాల బిల్లులు రాకపోవడం మూలంగా కూలీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ఈ చట్టం నిలబడాలంటే తిరిగి పార్లమెంట్లో వామపక్ష ఎంపీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని అందుకోసమే వ్యవసాయ కార్మికులంతా భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు పనిచేసే చోట నీడ నీరు ప్రైమరీ చికిత్స కోసం మెడికల్ కిట్టు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీలకు అనుమతిస్తూ 18 94 జీవోను తీసుకురావడం అని జరిగింది కానీ పని చేసే చోట ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదు కాబట్టి పంచాయతీ కార్యదర్శుల మీద చర్య తీసుకోవలసిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుండి 300 రూపాయలు కూలీనిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కానీ ఎర్రటెండాలో పనిచేస్తున్న కూలీలకు 100,150 కి మించి రావటం లేదని కరువును తీవ్రమైన ఎండలను దృష్టిలో పెట్టుకొని చట్టం వచ్చినటువంటి నేటి వరకు రెగ్యులర్ గా పని చేస్తున్న కార్మికులకు కొలతలు లేకుండా 300 రూపాయల కూలీని అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్,నాయకులు నారి రామస్వామి, నారి జంగయ్య,కొమ్ము ముత్తయ్య,శనిగారపు నరిసింహ, తదితరులు పాల్గొన్నారు.
క్షత గాత్రుని తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరిఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రచారం మధ్యలోనే ఆపి క్షత గాత్రుడిని తన సొంత వాహనంలో ఆసుపత్రి కి చేర్చి మానవత్వం చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం  చొక్లా తండా గుర్రాల దండి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ భువనగిరి పట్టణంలోని ఆర్బి నగర్ చౌరస్తాలో మూర్చ వ్యాధితో ద్విచక్ర వాహనం నుండి పడిపోవడంతో ప్రచారంలో భాగంగా అక్కడికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బాధితున్ని వెంటనే తన సొంత వాహనంలో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఏరియా ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి చిన్న నాయక్ ను పిలిపించి బాధితుని ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు.
వెలువర్తి గ్రామం లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి లో రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వలిగొండ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు .మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, భద్రతపై ప్రజలకు భరోస కల్పించారు.
వలిగొండ మండల టాపర్స్ కి సన్మానం, పురస్కారాలను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలోని గాయత్రి హై స్కూల్ లో గాంధీ గ్లోబల్ జ్ఞాన ప్రతిష్ట వారి సౌజన్యంతో మండల కన్వీనర్ పాలకూర వెంకటేశం సమక్షంలో మండలంలోని అన్ని పాఠశాల టాపర్ లకు ఘన సన్మానం చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి ,కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, స్కూల్ చైర్మన్ నరహరి , వాకిటి రామిరెడ్డి ,కాసుల వెంకటేశం, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



మహిళల T20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

మహిళల టి20 వరల్డ్ కప్- 2024 షెడ్యూల్‌ను విడు దల చేసింది ఐసిసి. అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానున్న ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 10 జట్లు పోటీపడ నుండగా వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో అయిదు జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, న్యూజిలాండ్, క్వా లిఫయిర్-1 జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ 2 జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడతాయి. గ్రూప్ ద శలో టాప్‌లో తొలి రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సిల్హె ట్ వేదికగా అక్టోబర్ 17న తొలి సెమీఫైనల్ జరుగనుండగా ఢాకా వే దికగా అక్టోబర్ 18న రెండో సెమీస్ జరగనుంది. ఇక ఢాకా వేదికగా అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ నిర్వ హించనున్నారు. ప్రారంభ మ్యాచ్ లో ఇంగ్లండ్ -సౌతా ఫ్రికా జట్లు తలపడతాయి. ఇక భారత్ అన్ని గ్రూప్ మ్యాచ్‌లు సిల్హెట్‌లోనే ఆడనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో, 9న క్వాలిఫయిర్-1 టీమ్‌తో, 13వ తేదీన ఆస్ట్రేలియాతో భారత్ తలపనుంది.

ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు చెల్లింపు వార్తల పట్ల నిశితంగా పరిశీలించాలి: జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు కే జండగె


ఎన్నికల  నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు, (పెయిడ్ న్యూస్) చెల్లింపు వార్తల పట్ల నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే. జండగే మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. సోమవారం నాడు కాన్ఫరెన్స్ హలులో ఆయన సభ్యులతో సమావేశమైనారు. ఎన్నికల ప్రవర్తనా నియావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే ప్రకటనలను పరిశీలించాలని, ఓటరుపై ప్రభావితం చేసే వార్తల పట్ల అప్రమతంగా ఉండాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్, లోకల్ కేబుల్ ఛానల్స్, సోషల్ మీడియా, వాట్సప్, ఈ పేపర్లలో రాజకీయ ప్రకటనలు మానిటరింగ్ చేయాలని, అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేస్తే రిటర్నింగ్ అధికారికి తెలిపి నోటీస్ జారీ చేయాలని అన్నారు. ప్రచారం కొరకు అవసరమయ్యే అనుమతులను పరిశీలించి జారీ చేయాలని, వివిధ వార్తాపత్రికలు, టెలివిజన్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేయడంతో పాటు ప్రసారాలు, ప్రకటనలు వచ్చినట్లయితే వాటికి అయ్యే ఖర్చులు ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ కు పంపాలని, సంబంధిత నివేదికలను ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు. సమావేశంలో మెంబర్ సెక్రెటరీ, జిల్లా సంబంధాల అధికారి పి. వెంకటేశ్వర రావు, సోషల్ మీడియా నోడల్ అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి, కమిటీ సభ్యులు జి.దయాకర్, కె.శ్రీనివాస్, ఎ.శ్రవణ్, పాల్గొన్నారు.

గోకారంలో బిఆర్ఎస్ విస్తృత ప్రచారం
వలిగొండ మండలం గోకారం గ్రామంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్న గెలుపు కోసం ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్ , గ్రామ శాఖ అధ్యక్షులు కనికరపు రాము, పాల్గొన్నారు.