/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz నామపురం గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం Mane Praveen
నామపురం గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

మర్రిగూడ మండలం, నామపురం గ్రామంలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ, ఇంటి ఇంటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నామాపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హస్తం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. 

NLG: రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

నాంపల్లి: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని బిఆర్ఎస్ ను పూర్తిగా బొంద పెట్టేంత వరకు నిద్రపోనని అన్నారు.

శనివారం నాంపల్లి మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మండల కేంద్రంలోనీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం సభ వేదిక నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాడని బిడ్డే లిక్కర్ కేసులో అడ్డంగా దొరికి తీహార్ జైల్లో ఉందని, ఫోన్ టాపింగ్ అంశంపై మరో కేసు నడుస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో సిగ్గు లేకుండా కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని జనాల్లో తిరుగుతున్నాడో చెప్పాలని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

బూర నర్సయ్య గౌడు పాత బిఆర్ఎస్ పార్టీ బుద్ధులు కొత్త బిజెపి పార్టీలో చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ డాక్టర్ జేఏసీ తరఫున బూర నర్సయ్య గౌడ్ ను తీసుకురాకపోతే నేడు ఆయన ఎవరికి తెలుసు అని ప్రశ్నించారు.

కేసీఆర్ కు గతంలో అత్యంత సన్నితుడైన బుర్ర నర్సయ్య గౌడ్ భువనగిరికి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. 2014 విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఎయిమ్స్ వచ్చిందని, 5 ఏళ్లు ఎంపీగా ఉండి ఎయిమ్స్ ను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. బిజెపి నాటినుండి నేటి వరకు కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య వైశమ్యాలు సృష్టించి రాజకీయాలు చేస్తుందని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. త్వరలోనే బిజెపికి ప్రజలు బుద్ధి చెప్పి కాంగ్రెస్ కు అధికారం కట్టబెడతారని ఆశించారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే పాటుపడే పార్టీ అన్నారు.

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని మెజార్టీ ఎంత వస్తుందనే దానిమీదనే ఎదురుచూస్తున్నామన్నారు. అలాగే బోనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ కు అత్యధిక మెజార్టీ ఇవ్వడంలో మునుగోడు నియోజక వర్గం పోటీ పడనున్నట్లు చెప్పారు. కిష్టరాంపల్లి, చర్లగూడెం, రిజర్వాయర్ పూర్తిచేసి మండల రైతన్నల పొలాల్లోకి కృష్ణా జలాలను అందిస్తామని తెలిపారు. రైతన్నలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.

ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ప్రాజెక్టుల పేరుతో కమిషనర్లను దండుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మధు యాస్కిగౌడ్, పున్న కైలాష్, నాంపల్లి జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, గజ్జల శివారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య, పెద్దిరెడ్డి రాజు, చిలుకూరి బిక్షం, బట్టు జగన్ గిరి, అల్లంపల్లి ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఉచిత వేసవి ఫుట్బాల్ శిక్షణ శిబిరం ప్రారంభం

 

NLG: జిల్లా యువజన మరియు క్రీడల శాఖ, యువత స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తానేదార్ పల్లి గ్రామంలో ఉచిత వేసవి ఫుట్బాల్ శిక్షణ శిబిరాన్ని గుర్రంపోడు ఎస్ఐ శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మారుమూల ప్రాంతమైన తానేదార్ పల్లి గ్రామంలో ఫుట్బాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం ఎంతో అభినందనీయమని, చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ఉదయం సాయంత్రం శిక్షణ శిబిరంలో పాల్గొనాలని తద్వారా శారీరకదారుఢ్యం మంచి ఆరోగ్యం, పెంపొందుతున్నదని తెలిపారు. క్యాంపు నిర్వహకుడు ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ బొల్లు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..1 నెల రోజులపాటు తమ గ్రామ పంచాయతీలో నిర్వహించే ఫుట్బాల్ శిక్షణ శిబిరానికి సంపూర్ణ సహకారం అందిస్తానని, గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు వెలుగులోకి రావడానికి క్రీడాకారులకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, UPS చైర్మన్ మడ్డి యాదయ్య, ఖమ్మంపాటి నరసింహ, కుంభం కొండల్, గిరి శ్రీను, ఖమ్మంపాటి గణేష్, గార్లపాటి మల్లికార్జున్, మరిమహేష్, గిరిఅజయ్ కుమ్మరి ఆంజనేయులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

నల్లగొండ పట్టణం 5 వ వార్డులో బిజెపి ఇంటింటికి ప్రచారం

నల్లగొండ: బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిపించాలని బిజెపి నాయకులు గడ్డం మహేష్ ఆధ్వర్యంలో 5వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేశారు.ప్రధానిగా నరేంద్ర మోడీ 3వ సారి అధికారంలోకి రావడానికి ఈవీఎం యందు 4 వ నెంబర్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

భూత్ అధ్యక్షులు కార్యకర్తలు వేణు, హేమంత్,దేవ,నిఖిల్,మధు,రాజు, లక్ష్మణ్,శ్రీను,ధన్రాజ్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

NLG: INTUC 327 ఆధ్వర్యంలో ఘనంగా 'మే' డే

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడ: మండల కేంద్రంలో INTUC 327 విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో ' మే' డే ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి,ఉపాధ్యక్షులు సూదిని వెంకటరెడ్డి, రవికుమార్, రవీందర్,జగాల్ రెడ్డి శ్రీశైలం,జింకల వెంకన్న,కస్తాల వెంకన్న,చింటూ,చరణ్, రామకృష్ణ,చందు,బ్రహ్మచారి,బిల్ లీడర్స్ ఏర్పుల వెంకటేష్, కిరణ్,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: INTUC 327 ఆధ్వర్యంలో ఘనంగా 'మే' డే

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: మండల కేంద్రంలో INTUC 327 విద్యుత్ యూనియన్ ఆధ్వర్యంలో ' మే' డే సందర్భంగా శుక్రవారం ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సూదిని వెంకటరెడ్డి, రవికుమార్, రవీందర్, జగాల్ రెడ్డి శ్రీశైలం, జింకల వెంకన్న, కస్తాల వెంకన్న, చింటూ, చరణ్, రామకృష్ణ, చందు, బ్రహ్మచారి, బిల్ లీడర్స్ ఏర్పుల వెంకటేష్, కిరణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

TG: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది.

వాస్తవానికి నేటితో ఈ గడువు ముగియగా.. విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాళాలల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువును మే 4 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

అన్ని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ కూడా టీఎస్‌బీఐఈ ఖాతాకు అదే తేదీలోగా ఫీజులు చెల్లించాలని సూచించింది.

తెలంగాణలో మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఉదయం గం. 9 నుంచి 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం గం. 2.30 నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

NLG: ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు

నల్గొండ: పట్టణ సమీపంలోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లోక సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, కళ్యాణ్ కుమార్ దాస్, ఆమోగ్ జీవన్ గాంకర్లు జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి లతో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కై ఏర్పాటు చేసిన బారికేడింగ్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు హాళ్లను తనిఖీ చేశారు.

    ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావ్ సూర్యవంశి ఓట్ల లెక్కింపుకు వినియోగించనున్న టేబుల్లు, పోలింగ్ కేంద్రాలు, సిసి టీవీల ఏర్పాటు తదితర వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు .

SB NEWS NLG

NLG: ఉచితంగా విద్య- వైద్యం అందిస్తాం

పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు ఉచితంగా విద్య- వైద్యం అందిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మరిగూడ మండలం తమ్మడపల్లె, తిరుగండ్లపల్లి గ్రామాలలో ఇంటింటికి ప్రచారం మరియు ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు.

సిపిఎం పోరాట ఫలితంగానే ఉపాధి హామీ చట్టం వచ్చిందని అయినప్పటికీ రోజు కూలి వంద మాత్రమే ఇస్తున్నారని అన్నారు. సిపిఎం అభ్యర్థులు గెలిపించినట్లయితే ఉపాధి హామీ రోజు కూలి రూ. 600 తో పాటు 210 పని దినాలు గ్యారెంటీ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఉపాధి కూలీలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు.

రోజుకు ఒక పార్టీ మారే నాయకులను నమ్మొద్దని దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాజ్యాంగాన్ని తొలగించడానికి కుట్రలు చేసే వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. మే 13న జరిగే పోలింగ్ రోజు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి మహమ్మద్ జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య , వెంకటయ్య అంజయ్య చారి, దామెర లక్ష్మి, ఆయిలు కృష్ణయ్య, ప్రతాపరెడ్డి అమృత, యాదమ్మ, ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

మే డే స్ఫూర్తిని కొనసాగిద్దాం: నెల్లికంటి సత్యం సిపిఐ జిల్లా కార్యదర్శి
చికాగో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మే డే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా  పోరాటాలు నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు. 138 వ మేడే దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పార్టీ అరుణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు.

చికాగో నగరంలో చిందిన రక్తం ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు నాంది పలికిందని అనేక కార్మిక ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ, పెట్టుబడుదారు వ్యవస్థకు పారిశ్రామిక వర్గాలకు అనుకూలంగా చట్టాలు చేస్తూ కార్మిక వర్గానికి ద్రోహం చేస్తుందన్నారు.

దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తూ కార్మిక వర్గాన్ని మరింత దోపిడికి గురి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరస్వామి,గురిజ రామచంద్రన్,  నరసింహ, వెంకటేశ్వర్లు, లెనిన్, ముత్యాలు, వెంకన్న, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.