/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz 'తెలుగు నాటకం- సాహిత్య సమాలోచన' జాతీయ సదస్సు Mane Praveen
'తెలుగు నాటకం- సాహిత్య సమాలోచన' జాతీయ సదస్సు

NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో 'తెలుగు నాటకం- సాహిత్య సమాలోచన' అను అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, సాహిత్య పరిశోధకులు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సులు నాటక సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందింపజేయడమే కాకుండా విద్యార్థులను పరిశోధకులుగా సాహిత్య అభిమానులుగా తీర్చిదిద్దేటట్లు చేస్తాయని అన్నారు.

తెలంగాణ నాటక సాహిత్యాన్ని గురించి తెలియజేస్తూ ఎంతోమంది నాటకా రచయితల రచనలు నేటి సాహితీ లోకానికి అందడం లేదని అలాంటివారి సాహిత్యాన్ని వెలికిదీసి భావితరాలకు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

కీలకోపన్యాసం గావించిన జాతీయ ఉత్తమ సినీ విమర్శక పురస్కార గ్రహీత డాక్టర్ ఎం. పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ తెలుగు నాటక రంగం ఆరంభ వికాసాలను గురించి సమగ్రంగా తన ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. నాటక రచయితతో పాటు నటులు, నాటక ప్రయోక్త అందరూ తమ తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఆ నాటకం జనరంజకం అవుతుందని, పది కాలాలపాటు నిలుస్తుందని అన్నారు. అంతేకాకుండా నాటకం రమణీయమైన దృశ్యకావ్యమని ఇలాంటి కావ్యాలను రాసినటువంటి ఎంతోమంది రచయితలు తెలుగు సాహిత్యంలో సుస్థిరమైన స్థానాన్ని పొందినారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ నాటక రంగం మనోరంజకమైనదని ఇవాళ సినిమా ప్రభావం వల్ల నాటక రంగ సంస్థలు కనుమరుగైపోతున్నాయని అలాంటి సంస్థల్ని, నటుల్ని ఆదరించాల్సిన అవసరం నేటి ప్రభుత్వం పైన ఉందని అన్నారు. అదేవిధంగా సాహిత్యంలో నాటకం చాలా ప్రధానమైనదని, సాహిత్యాన్ని నేటి విద్యార్థులు ఎక్కువ అధ్యయనం చేస్తూ మంచి పరిశోధకులుగా రాణించాలని అన్నారు. ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ ఇలాంటి సదస్సుల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందుతుందని, ప్రతి విద్యార్థి ఇలాంటి కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య కరిమిళ్ళ లావణ్య, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ వెల్దండి శ్రీధర్, జి. గోవర్ధనగిరి, డాక్టర్ టి. సైదులు, ఎస్. ప్రభాకర్, ఎం. లింగస్వామి, బి. రమ్య, డి. అంజయ్య, గ్రంథపాలకులు డాక్టర్ ఎ. దుర్గాప్రసాద్ ఫిజికల్ డైరెక్టర్ కె. మల్లేశంతో పాటు,సుమారు 20 మంది వివిధ కళాశాల నుండి విచ్చేసిన అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు పత్ర సమర్పణ చేశారు. ఇతర శాఖల అధ్యాపకులతో పాటు విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం

ఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. 

ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఇది తొలి భేటీ కానుంది. 

ఈ భేటీలో ప్రజాసమస్యలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలను ప్రభావితం చేయని నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలని ఈసీ సూచించింది.

NLG: జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు

ఈరోజు నల్లగొండలో ఎన్జీ కాలేజ్ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు ఓటర్ అవేర్నెస్ రన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఏఎస్పి, అధికారులు, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఫుట్బాల్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు జిల్లా కలెక్టర్ హరిచందన, ఏఎస్పీ రాములు నాయక్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాకారుల వెంట శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మాపాల గిరిబాబు ఉన్నారు.

NLG: ఓటరు అవగాహన.. 5 కే రన్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరిచందన

నల్లగొండ: ఓటరు అవగాహన కార్య క్రమంలో భాగంగా పట్టణం లో నైతిక ఓటింగ్ పై ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు నిర్వహించిన 5 కే రన్ ను, జిల్లా కలెక్టర్ హరిచందన జండా ఊపి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఓటు హక్కు ను వినియోగించుకోవాలన్నారు. 85 సం.లు నిండిన ఓటర్ల కు, దివ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించిందని, హోమ్ ఓటింగ్ వేయాలనుకునే ఓటర్లు ఫామ్ 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ పుల్లారావు, అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: మర్రిగూడ మండలంలో ఘనంగా అమరజీవి ధర్మ బిక్షం 13 వ వర్ధంతి

  

మర్రిగూడ: సిపిఐ మండల కార్యాలయంలో, నేడు అమరజీవి కామ్రేడ్ ధర్మబిక్షం 13 వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు మాట్లాడుతూ..  అమరులు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 1922 ఫిబ్రవరి 15 జన్మించి , తన విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు పార్టీ కి ఆకర్షితులై, సాయుధ రైతాంగ, తెలంగాణ పోరాటం లో విరోచిత పోరాటం చేశారు. దున్నే వానికే భూమి, గీసే వానికే చెట్టు కావాలని జరిపిన పోరాటంలో 8 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపి, అనంతరం జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసన సభ్యులు గా, రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ప్రజా సమస్యల పరిష్కారం కోసం, గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించారని, గీత కార్మికులకు సొసైటీలను ఏర్పాటు చేసిన ఘనత ధర్మ బిక్షం గారి దేనని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, జిల్లా యూత్ అద్యక్షుడు బూడిద సురేష్, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు చెల్లం పాండు రాంగరావు, మండల కార్యవర్గ సభ్యులు ఆకుల రఘమయ్య, ఐతగోని వెంకటయ్య, నిరంజన్, AISF ఏ.ఐ.ఎస్.ఎఫ్ మండల కార్యదర్శి ఇస్కీళ్ళ మహేందర్, సుభాష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

NLG: చర్లగూడెంలో ఘనంగా నీలకంఠ రామస్వామి వారి రథోత్సవం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, చర్లగూడెం గ్రామంలో నీలకంఠ రామ స్వామివారి రథోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, వెన్నమనేని రవీంద్రరావు, దేవాలయ కమిటీ చైర్మన్ రాపొల్ యాదగిరి, వెంకటం పేట బాలయ్య, దేవాదాయ కమిటీ మెంబర్లు మంచుకొండ వెంకటేశ్వర్లు, వల్ల భాస్కర్ గౌడ్, ఏర్కలి యాదయ్య గౌడ్, జమ్మల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

NLG: నల్గొండ జిల్లా ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఈ రోజు నల్గొండ జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో హోలీ పండగ కొత్త కాంతులను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తూ.. ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్తగా హోలీ పండగను జరుపుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

NLG: జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు

నల్లగొండ: జిల్లా ప్రజలకు ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండలో వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సహజమైన, ప్రకృతి సిద్ధమైన రంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో హోలీ రంగేళి ని నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

NLG: నల్లగొండ పట్టణ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ మొదటి సమావేశం

నల్లగొండ పట్టణ ఫోటో మరియు వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ మొదటి సమావేశం ఆదివారం పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కంభంపాటి రవి మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి పాటు పడతానని, సభ్యుల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తానని, వచ్చే నూతన టెక్నాలజీని సభ్యులకు తెలిసే విధంగా వర్క్ షాప్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

TG: గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుక

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపింది.

ఇసుక కొరతతో లోకల్ గా నిర్మాణ పనులు ఆగిపోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన రీచ్ ల నుంచి ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించింది. సరైన పత్రాలు చూపించిన వారికి స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణా కు అనుమతించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.

ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణా కు అనుమతి ఇవ్వాలంటూ వరుసగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల లలో ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతిస్తారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.