/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి విరాళం అందించిన మంత్రి కోమటిరెడ్డి Mane Praveen
NLG: శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి విరాళం అందించిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: పట్టణంలోని హనుమాన్ నగర్ లో నూతనంగా నిర్మించే, శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నేడు 10 లక్షల రూపాయల విరాళం ను మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ద్వారా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

18 అడుగుల హనుమాన్ విగ్రహం కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ భైరగోని రాజా గౌడ్, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, గుండెబోయిన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

NLG: కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ హరిచందన

నల్లగొండ: రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో, తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి లో ఉన్న గోదాములో ఏర్పాటు చేయనున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిచందన అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, సంబంధిత అధికారులతో కలిసి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. 

ఇక్కడ ఏర్పాటు చేసే కౌంటింగ్ కేంద్రంలో 7 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా స్ట్రాంగ్ రూములను సైతం ఈ కేంద్రంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇదివరకే 6 స్ట్రాంగ్ రూములు ఉండగా మరో స్ట్రాంగ్ రూమును ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, పంచాయతీరాజ్ డిఈ నాగయ్య, ట్రాన్స్కో

అధికారులు, తదితరులు పాల్గొన్నారు 

సూర్యాపేట జిల్లాలో మరో గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి

సూర్యాపేట: ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన మరువకముందే, మరో విద్యార్థిని శనివారం ఫిబ్రవరి 17న చనిపోయింది.  పదవ తరగతి విద్యార్థిని, స్వగ్రామం మోతే మండలం, బురకచర్ల గ్రామం కాగా, హైదరాబాదులో తల్లి దగ్గరకు వెళ్ళింది. తల్లి పనికి వెళ్ళినప్పుడు ఇంటి వద్ద ఉరి వేసుకొని చనిపోయింది. బాలిక మృతి పట్ల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NLG: రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన జేబిఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

నల్గొండ: జపాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి షోటోకాన్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో.. పట్టణంలోని జేబీఎస్ హైస్కూల్లో, 6వ తరగతి చదువుతున్న జిడ్డి నాగేశ్వరి 'కటా విభాగం'లో అత్యున్నత ప్రతిభను కనబరిచి, రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ తో పాటు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కూడా సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు

నిమ్మల నిర్మల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందించారు.

ఈ సందర్భంగా ఈరోజు పాఠశాల ప్రార్థన సమయంలో ఆయన మాట్లాడుతూ.. జేబీఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించడానికి ఉపాధ్యాయులందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలియజేస్తూ విద్యార్థిని నాగేశ్వరి ని ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

NLG: SVEEP పై అవగాహన సదస్సు

నల్లగొండ: స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల నందు రాజనీతి శాస్త్రం మరియు జిల్లా ఎన్నికల విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో SVEEP ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతి 18 సంవత్సరాలు నిండిన విద్యార్థినీ విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, వివిధ స్థాయిలలో జరిగే ఎన్నికలలో నిష్పక్షపాతంగా, నిజాయితీగా, ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, ఓటరు చైతన్యమే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని సూచించారు. 

జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియ పై అవగాహన పెంచుకోవాలని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. 

జిల్లా పరిషత్ సీఈవో మరియు SVEEP నోడల్ ఆఫీసర్ ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని తెలుపుతూ విద్యార్థినీ విద్యార్థులు అందరి చేత "ఓటరు ప్రతిజ్ఞ" చేయించారు. 

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షత వహించగా, వైస్ ప్రిన్సిపల్ సయ్యద్ మునీర్, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి ఎస్.యాదగిరి, అధ్యాపకులు ఈ. యాదగిరి రెడ్డి, ఎన్. వేణు, ఏ మల్లేష్, లక్ష్మణ్ గౌడ్, నారాయణరావు, ప్రవీణ్ రెడ్డి, తిరుమలేష్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కే. మల్లేష్, బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డిఏ ఏపిఎం అరుణ్ కుమార్ మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి: పాలడుగు నాగార్జున

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:

రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు కార్మిక సంఘాల సిఐటియు ఆధ్వర్యంలో.. మర్రిగూడ చౌరస్తా నుండి బస్టాండు కూడలి వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సం.లు అయినా, రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు.

కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, రైతుకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, ఉపాధి కూలీలకు రోజు కూలి 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రవేటీకరం చేస్తుందని, అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ ల ను తెచ్చిందని అన్నారు. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికిందని, సమ్మె హక్కును కాలరాస్తుందని పీఎఫ్, ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డులను నిర్విరారం చేస్తుందని ఆరోపించారు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇచ్చిన సూచనలను పాటించే పరిస్థితుల్లో లేదని, నూతనంగా 12 గంటలు పని విధానం తీసుకురావడానికి కుట్ర చేస్తుందన్నారు. 

నాలుగు లేబర్ కూడా రద్దు చేయాలని కనీస వేతన చట్టాలను అమలు చేయాలని, వెంటనే ఆశ, అంగన్వాడి మధ్యాహ్న భోజనం ఐకెపి వివో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, స్కీం వర్కర్ ను పర్మనెంట్ చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న క్లైమ్ లను పెండింగ్లో ఉన్న కార్డులను వెంటనే ఇవ్వాలని, ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఏర్పుల యాదయ్య, సిపిఐ మండల నాయకులు బుర్ర శేఖర్, అబ్బనగోని కృష్ణయ్య, ఎరుకలి యాదయ్య అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శోభ, రజిత, జయశ్రీ, విజయలక్ష్మి ఆశా వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి జంపాల వసంత, ఏర్పుల పద్మ, ధనమ్మ, అరుణ, పందుల పద్మ, దుర్గమ్మ, సైదాబీ, కంసల్య, బాలమణి, ఐకెపి వివోఏ ల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రంగినేని చంద్రకళ, వంపు సుమలత, నక్క సిరియాల, పద్మ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు ఒట్టిపల్లి హనుమంతు, ఊరుపక్క లింగయ్య మంజుల, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నామ సైదులు, యాదయ్య, హమాలీ వర్కర్స్ యూనియన్ బి.యాదయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు

NLG: మునుగోడులో ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మునుగోడులో ఏఐటీయూసీ, తెలంగాణ రైతు సంఘం మరియు సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురిజ రామచంద్రం, జిల్లా కార్యదర్శి బండ శ్రీశైలం మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో రైతులకు ఇతర కార్మికులకు ఇబ్బంది పెట్టే కార్మిక చట్టం తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు సురికి చలపతి, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు బండమీది యాదయ్య, మందుల పాండు, ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు దుబ్బ వెంకన్న, బెల్లం శివయ్య, భవనిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఈద యాదయ్య, హమాలి కార్మిక సంఘం నాయకులు దామ ఖాసిం, చందపాక యాదయ్య ఆటో కార్మికులు భిక్షం మాధవన్, నరసింహ,చిరంజీవి, బండారు శంకర్, దశరథ, చాపల విప్లవ కుమార్, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ మున్సిపల్ కమిషనర్ గా సయ్యద్ ముసాబ్ అహ్మద్

నల్గొండ: అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్‌ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కు నల్గొండ మున్సిపల్ కమీషనర్‌ గా పదోన్నతి లభించింది. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ గా సయ్యద్ ముసాబ్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

NLG: మేడిగడ్డ పై సమగ్ర విచారణ జరిపించి బాద్యులపై చర్యలు తీసుకోవాలి: జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ: మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబి పై తక్షణమే అఖలపక్ష సమావేశం నిర్వహించాలని, నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాలని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గజిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మేడిగడ్డ ప్రాజెక్టును బొందల గడ్డగా మార్చింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కెసిఆర్ పై మండిపడ్డారు. గత ప్రభుత్వ హయంలో నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులన్ని ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయ్యాయని, గత ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులకు మాత్రమే శంకుస్థాపనలు చేశారని, ఏ ఒక్క కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయలేదని విమర్శించారు.

ఈ సమావేశంలో సీ పి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేష్, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, చిన్నపాక లక్ష్మీనారాయణ. తదితరులు పాల్గొన్నారు.

NLG: నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జలెంధర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: నాంపల్లి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జలెంధర్ రెడ్డి గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు HYD వనస్థలిపురం పోలీస్ స్టేషన్ నుండి, బదిలీపై నాంపల్లి సర్కిల్ కి వచ్చారు. ఇక్కడ పని చేసిన సిఐ నవీన్ కుమార్ ను అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేశారు. సీఐ నవీన్ కుమార్ కు హాలియా కు పోస్టింగ్ ఇవ్వవచ్చని సమాచారం.