/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz సైన్స్ డే ఉత్సవాలలో భాగంగా రాష్ట్రస్థాయి పెయింటింగ్ కాంపిటీషన్ కు ఎన్నికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలువర్తి విద్యార్థిని ఎం కీర్తి Vijay.S
సైన్స్ డే ఉత్సవాలలో భాగంగా రాష్ట్రస్థాయి పెయింటింగ్ కాంపిటీషన్ కు ఎన్నికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలువర్తి విద్యార్థిని ఎం కీర్తి


యాదాద్రి భువనగిరి జిల్లా సైన్స్ డే ఉత్సవాలలో భాగంగా భువనగిరి జిల్లా కేంద్రంలోని బచ్ పన్ స్కూల్ లో జరిగిన పెయింటింగ్  జిల్లా స్థాయి పోటీలో వలిగొండ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెలువర్తి లో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఎం కీర్తి జిల్లాస్థాయిలో తృతీయ స్థానం పొంది , రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనారు . ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు కూరెళ్ల శ్రీనివాస్ న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు. ఎం కీర్తి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ... శ్రీమతి డి మంజుల... ఉపాధ్యాయులు మల్లేష్, అంజయ్య, స్వామి రాజ్ , అర్ట్ టీచర్ రాము అభినందించారు.

వలిగొండ మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి....


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ  పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి మహేందర్ లాల్ మండలంలోని ప్రజలు కొన్ని సూచనలు ,సలహాలు పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...గ్రామాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు, సంచరిస్తున్నట్లుగా అనుమానం కలిగితే వెంటనే... ఆ సమాచారాన్ని వలిగొండ పోలీసులకు అందజేయాలని అన్నారు. చిన్నపిల్లలను ఒంటరిగా వదిలిపెట్టకుండా, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు.. మీ ఊర్లో సంచరిస్తూ ...మీ బంగారు వస్తువులకి మెరుగు దిద్దుతామంటూ.. వచ్చినట్లయితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు. మహిళలు మరియు వృద్ధులు బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా నడుచుకుంటూ... ప్రయాణిస్తున్నట్లయితే, మీ ఆభరణాలు కనిపించకుండా, వస్త్రాలతో కప్పుకోవాలని, సైబర్ నెరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో ,మీ బ్యాంకు సంబంధిత వివరాలు తెలియజేయకుండా ....తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా అపరిచితుల ఆన్లైన్ లింక్స్, వెబ్సైట్ లో ,మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దని తెలిపారు.

ఎన్ హెచ్ ఎం స్కీం లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి: ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్


 ఎన్ హెచ్ ఎం స్కీం లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి, పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    సోమవారం రోజున డిఎం & హెచ్ఓ కార్యాలయంలో ఈ నెల 16 ఫిబ్రవరి 2024న జరిగే దేశవ్యాప్త సమ్మెకు కు సంబంధించిన సమ్మె నోటీస్ ను డి ఈ ఓ లతో కలిసి డిఎంహెచ్ఒ డాక్టర్ ఏ పరిపూర్ణ చారీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ఎన్.హెచ్.ఎం.స్కీమ్ ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని అప్పటివరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలనీ , ఎన్. హెచ్.ఎం.ఉద్యోగులకు రెండు నెలల వేతనాలు అనగా డిసెంబర్, జనవరి వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 16వ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా డి.హెచ్ కార్యాలయం కోటి హైదరాబాద్ వద్ద జరిగే ఒక రోజు సమ్మెలో అల్ క్యాడర్స్ ఉద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్. హెచ్. ఎం ఉద్యోగుల క్యాలెండర్ ను డిఎంహెచ్ఓ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

    ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ శిల్పిని, ప్రోగ్రాం ఆఫీసర్ సుమంత్ కళ్యాణ్, ఏ.ఎస్.ఓ జమాల్ షరీఫ్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, డి. ఈ. ఓ లు వినోద్ కుమార్, దుర్గా, సరిత, సౌజన్య, శ్రీదేవి, రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 18న వలిగొండలో జరిగే ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టును విజయవంతం చేయండి: వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు


భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కార్యాలయంలోని మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశం మండల అధ్యక్షులు పోలేపాక విష్ణు అధ్యక్షతన జరుగగా... ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ ....ఈనెల 18వ తేదీన వలిగొండ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో జరుగు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టులను మండల వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు .అదేవిధంగా త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల్లో ఉన్న భయం పోగొట్టేందుకు, వారిలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీయడానికి ఈ టాలెంట్ టెస్ట్ ఎంతో దోహదపడుతుందని అన్నారు

చాలామంది విద్యార్థులు పరీక్షలు అనగానే భయం మొదలవుతుంది, ఆ భయంతో ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో అని మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,అలాంటి ఒత్తిడిని తగ్గించడానికి ఈ టాలెంట్ టెస్ట్ 100% ఉపయోగపడుతుందని అన్నారు 

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు వేముల జ్యోతిబాస్ మండల నాయకులు వేములకొండ వంశీకృష్ణ ,వేముల శివమణి ,ఎస్.కె ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు

కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి తరలిరండి: యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం


 తెలంగాణ రాష్ట్ర కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి కురుమలు అధిక సంఖ్యలో తరలి రావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గవ్వల నర్సింహులు, రాష్ట్ర కార్యదర్శి డోకె బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, జెడ్పీటీసీ సుబ్బురు బీరు మల్లయ్య పిలుపునిచ్చారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు . ఫిబ్రవరి 18 న మధ్యాహ్నం రెండు గంటలకు కోకాపేట సెజ్ లో కురుమల ఆత్మగౌరవ భవనం (దొడ్డి కొమురయ్య భవన్) ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర రవాణా , బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం లు హాజరవుతారని వారన్నారు. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని కురుమ కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమలు, షెఫర్డ్స్, కురుమ కుల పెద్దలు అధిక సంఖ్యలో హాజరై, ప్రారంభోత్సవ కార్యక్రమం ను విజయవంతం చేయాలని వారు కోరారు.

సూర్యాపేట గురుకులంలో బాలిక మృతి కి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి :మేడి ప్రియదర్శిని


సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శి ఒక ప్రకటనలో ప్రబుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫెర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి ,పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది.ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని ,తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండకపోవడం నిర్వహణ లోపం వలన ఈ ఘటన జరుగుతున్నట్లు తెలుస్తున్నదని తెలియజేశారు.

కేంద్రంలో మరో మారు బిజెపి సర్కార్: ఏలే చంద్రశేఖర్ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు


భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈ రోజు వలిగొండ మండల కేంద్రంలో గావ్ చలో ఘర్ చలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏలే చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ ,కేంద్ర పథకాల గురించి వివరించడం జరిగింది, రాబోయే పార్లమెంట్ ఏలెక్షన్లలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీనీ మరొకసారి ఆశీర్వదించాలని వారిని కోరడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సతయ్య గౌడ్,శీలోజు శ్రీరాములు ,రాచకొండ కృష్ణ, బంధారపు రాములు ,బచ్చు శ్రీనివాస్ ,మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్ ,మండల ఉపాధ్యక్షులు దయ్యాల వెంకటేష్ ,BJYM మండల అధ్యక్షులు రేగురి అమరేందర్, BJYM మండల ప్రధాన కార్యదర్శి బుంగమట్ల మహేష్, ఏర్రబోలు జంగయ్య,పిట్టల రాజు ,మందుల నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

నల్లగొండ సభ విజయవంతం చేయాలని.. వలిగొండలో బీఆర్ఎస్ పార్టీ సన్నహాక సమావేశం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మార్కెట్ ప్రాంగణంలో మండల టిఆర్ఎస్ తరఫున సన్నాహక సమావేశనికి మార్కెట్ కమిటీ చైర్మన్ పైల్ల రాజా వర్ధన్ రెడ్డి. మండల టిఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి.

ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించినారు. ముఖ్య అతిథులుగా భువనగిరి నియోజకవర్గం ఇన్చార్జి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్. కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ హాజరై వారు మాట్లాడుతూ రేపు జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కెసిఆర్ 

కృష్ణానది జలాల తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఈ భారీ బహిరంగ సభకు హాజరై ప్రజల పక్షాన పోరాటం కోసం వస్తున్న ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి భారీగా కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ శివశాంత్ రెడ్డి పడమటి మమతారెడ్డి ఐటిపాముల రవీందర్ డేగల పాండు యాదవ్ కీసర్ల సత్తిరెడ్డి సురగంటి వెంకటరెడ్డి మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సేవాలాల్ మహారాజ్ జయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా ... ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య తన నివాసంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ... సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు, ఆప్షనల్ హాలిడే కాకుండా, అధికారికంగా హాలిడే ఇవ్వాలని కోరారు, అలాగే యాదాద్రి పుణ్యక్షేత్రంలో బంజారా భవన్ మరియు సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించాలని, కమిటీ తరఫున ప్రభుత్వ విప్ బీర్ల ఐలన్న కి విన్నపించడం జరిగింది, వారు తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి *జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్, రాష్ట్రఉపాధ్యక్షులు రాంజీనాయక్, రాష్ట్ర నాయకులు రవి నాయక్, శ్రీహరి నాయక్,జిల్లా నాయకులు రమేష్ నాయక్, కిషన్, దేవేందర్ నాయక్,వెంకటేష్,క్రాంతి నాయక్,శ్రీను నాయక్,అరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ - ఏఐటియుసి పోరాటాల ఫలితమే కొండపైకి ఆటోల అనుమతి: ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్


 గత రెండు సంవత్సరాలుగా సిపిఐ - ఏఐటీయూసీ పోరాటాల ఫలితమే యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలకు అనుమతి లభించిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి తెలిపారు.

    ఆదివారం రోజున యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలను అనుమతించడం పై ఏఐటీయూసీ ఆటో యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ హర్షo వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా యాదగిరిగుట్ట కొండపైకి నడిచే 300 ఆటో కార్మికుల కుటుంబాలు వీధిన పడ్డాయని అనేక సందర్భాల్లో చేసిన పోరాటాల్లో స్థానిక సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు మరియు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఆటో కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని కొండపైకి తీసుకు వెళ్లడానికి పూర్తిగా సహకారం అందించిన ప్రభుత్వ విప్ స్థానిక ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపారు.

   ఏప్పటికైనా పోరాటం విజయం సాధిస్తుందని కార్మికులు తమ హక్కుల కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

   ఈ ఉద్యమానికి సహకరించిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు  గారికి, సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి గారికి, సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు గారికి, ఏఐటీయూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ బోస్, ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశం గారికి ధన్యవాదాలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గనబోయిన వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సామల భాస్కర్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు తదితరులు హర్షo వ్యక్తం చేశారు.