/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz బోగారం లో అంబేద్కర్ విగ్రహ దాతకు ఘనంగా సన్మానం Vijay.S
బోగారం లో అంబేద్కర్ విగ్రహ దాతకు ఘనంగా సన్మానం


రామన్నపేట మండలంలోని బోగారం గ్రామములో అంబేద్కర్ విగ్రహ దాతను ఘనంగా సత్కరించిన యువజన సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులున గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు మేడి అంజి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి విగ్రహ దాత ప్రముఖ వ్యాపారవేత్త కూనూరు సాయి కుమార్ గౌడ్ ను కమిటీ అధ్యక్షులు, సభ్యులు కలసి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపి, శాలువాతో సన్మానినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేడి కృష్ణ, విగ్రహ ఏర్పాటు కమిటీ అధ్యక్షులు మేడి రవీందర్, గౌరవ అధ్యక్షులు మేడి యాదయ్య, ఉపాధ్యక్షులు చింతల మల్లేష్, మేడి సాయి బాబా, ప్రధాన కార్యదర్శి చింతల వెంకటేష్, కోశాధికారి మేడి నర్సింహా, సహాయ కార్యదర్శి మేడి రామలింగం, సభ్యులు మేడి నర్సింహా, మేడి మల్లేష్, చిరంజీవి, నాయకులు ఎస్కే. మోహిన్, జల్లా శ్రీనివాస్, జరుపటి రాంబాబు, బిన్.యాదవ్, బైకానీ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం: ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు


వలిగొండ: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఈరోజు వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ

-అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.8% మాత్రమే కేటాయించింది. అంటే విద్యారంగానికి 21,389 కోట్ల రూపాయలు కేటాయించింది. గత బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం 2,296 కోట్లు విద్యారంగానికి పెరిగినట్లు ఉన్నా మొత్తం బడ్జెట్ పోల్చినప్పుడు పెరిగింది ఇది చాలా తక్కువ గత విద్యారంగ బడ్జెట్ తో పోల్చినప్పుడు కేవలం 1.31 % మాత్రమే పెంచారు. ఈ నిధులతో ప్రస్తుతం ప్రభుత్వ విద్య యే మాత్రం అభివృద్ధి కాదని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పెట్టినట్లు ప్రతి మండలంలో తెలంగాణ మోడల్ ఇంటర్నేషనల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేటాయించింది 500 కోట్ల రూపాయలు మాత్రమే, 500 కోట్లతో ఎలా వీటిని నిర్వహిస్తారని ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనలో యూనివర్శీటీలు దెబ్బతిన్నాయి.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెస్ ,భవనాలు, ఖాళీల భర్తీ, మౌళిక సదుపాయాలు కల్పిస్తామని ప్రతి యూనివర్శీటీకి అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు. ఉస్మానియా కు 1000కోట్లు ,మహిళ యూనివర్శీటీఅభివృద్ధి కోసం నిధులు నిర్వహణ, బాసర ఐఐఐటి అభివృద్ధి, అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాలలో నూతన యూనివర్శీటీలు కోసం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ యూనివర్శీటీలు అభివృద్ధి కోసం 500కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న 11 రాష్ట్ర యూనివర్శీటీలకు కనీసం నిర్వహణకు కూడా నిధులురావు. ఒక్క ఉస్మానియా యూనిర్శీటీకే 350 కోట్లు పైగా నిర్వహణకు అవసరం. కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, జెఎన్టీయుహెచ్, ఫైన్ ఆర్ట్స్, మహిళా యూనివర్శీటీ,అగ్రికల్చర్ యూనివర్శీటీ,వెటర్నరీ, హర్టీకల్చర్ లాంటి వాటికి నిధులు కేటాయింపులు లేవు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రకారం బాసర ఐఐఐటిల లాగా మరో రెండు కేటాయిస్తామని చెప్పి వాటి గురించి కూడా ప్రస్థావన లేదు.

- పాఠశాల విద్యారంగ లో ఖాళీలు భర్తీ ,మధ్యాహ్న భోజనం నిధులు, ఏకోపాధ్యాయ పాఠశాలలు, నూతన భవనాలు, లైబ్రరీ, ముత్రశాలలు ,మౌళిక సదుపాయాలు కోసం ఈ నిధులు సరిపోవని ఎస్ఎఫ్ఐ భావిస్తోంది.

- గురుకులాలు నిర్మాణం కోసం 1546కోట్లు కూడా సరిపోవని 800 పైగా గురుకూలాలకు స్వంత భవనాలు లేవని, ఉన్న గురుకులాలు కూడా సరైన మౌళిక సదుపాయాలు లేవు.

- ఈబడ్జెట్లో గత ఆరేళ్ళ నుండి పెండింగ్ ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ 7200 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి విడుదల కోసం నిధులు కేటాయించలేదు. గురుకులాలు, కెజిబివిలు, సంక్షేమ వసతిగృహలకు గత సంవత్సరం నుండి మెస్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. వాటి నిధులు గురించి కూడా ప్రస్తావన లేదు. అందుకే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాకుండా 15% నిధులు విద్యారంగానికి కేటాయిస్తామని చెప్పి 7.8% నిధులు మాత్రమే కేటాయించారు. నిధులను పెంచి‌ ప్రభుత్వ విద్యారంగాని అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. లేకపోతే విద్యార్థులను కలుపుకుని ఎస్ఎఫ్ఐ గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్


బీబీనగర్ : తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ అని, ప్రాజెక్టులన్ని కేఆర్ఎంబికి అప్పజెప్పి రాష్ట్ర హక్కులను కాలరాయుద్ధని నియోజికవర్గ ఇంచార్జి జీవి రామకృష్ణారావు, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. రక్షిణ తెలంగాణ ప్రాంతంలో 68 శాతం మూడు జిల్లాల్లో ప్రభావం ఉంటుందది. నాగార్జునసాగర్, శ్రీశైలం, నెట్టించరు తో పాటు సలు ఆలాశయాలు అంతర్భాగమై ఉన్నాయని ఆవన్నీ పరిధిలోకి తీసుకు రావణానికి కాంగ్రెష్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించి, సంతకం చేసి రైతుల హక్కులను కాలరా పారన్నారు. కేఱరందికి అప్పజెప్పడమే కాకుండా బిఆర్ఎస్ పార్టీన బద్నాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. ప్రాజ్కెలన్నీ కెఆర్ఎంది పరిధిలోకి వెళ్తే ఈ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కేంద్ర ప్రభుత్వ పరిమిషన్ లేనిటీ అక్కడ ఏం చేయలేము అని • తర్వాత ఎక్కడ భూపినా సుద్ర బలగా సహార కాసే పరిస్థితి వస్తుంద న్నారు. రానున్న రోజుల్లో రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిరూపేందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భలో నల్గొండ సభ నిర్వహిస్తున్నారని అన్నారు. భువనగిరి నియోజకవర్ల నుండి బిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను, జరుగుతున్న అన్యాయాలను కాపాడేవీ టిజర్ఎస్ పార్టీయే అని ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించాలన్నారు. అబద్దాలు చెప్పి సభర్వాప్తు ఏర్పాటు చేశారని అదే అబద్దాలు చెప్పి సంక్షేమ పధకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలమ్మ హక్కులను కాపాణీరి కేసీఆర్ ఉది టిఆర్ఎస్ పార్టీ అన్నారు. ఇప్పుడున్న కార్యకోస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కెసీఆర్ ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. సాధించుకున్న హక్కులను హరించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటివరకు దక్షిణ తెలంగాణ ప్రజలకు తీవ్ర చేస్తున్నారన్నారు. ప్రజలందరూ సమాయత్తం కావాల్సిన సమయం వచ్చిందని జిల్లా ప్రజలు అందరూ ఒకటి కావాలన్నారు. ముఖ్యమంత్రి అయి రెండు నెలలు పూర్తి కావస్తున్న ముఖ్యమంత్రి స్థాయిని మరిచి దిగజార్చి ఒక సర్ఫబర్ లా మాట్లాడుకున్నాను. ముఖ్యమంత్రి స్థాయిని గుర్తించలేకపోతుండా బాధ్యతను గుర్తించలేకపోతున్నా తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఇందన్నారు. కెసీఆర్ పధకాలను రద్దు చేస్తా. అన్నింటినీ రూపు మసుతా అంటున్నాడు. భగీరథ ద్వారా ఇంటింటికి జిల్లా నీళ్లు అందించిన పథకాన్ని రూపుమాపులేవ, 24 గంటలు కరంటు ఇచ్చిన పథకాన్ని రూపుమాపుతవ, కళ్యాణ్ లక్ష్మి, దళిత బంధు పథకాలను రద్దు తీస్తావా అని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటి రిజర్ఎస్ పార్టీ అందజేసిన పథకాలను రద్దు చేస్తా అని ప్పుకోవాలన్నారు. పొగునీటి ప్రాజెక్టులన్ని కాలువలు అన్నీ బిఆర్ఎస్ హయాంలో నిర్మాణం చేపట్టామని వాటన్నిటినీ ఎలా రూపుమాపుతావన్నారు. ఆదరణ సాధ్యం కానీ సధకాలు ఇస్తా అని చెప్ని ప్రజలను మోసం చేయుద్దన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ స్థాయిని దిగదాల్పోదని, తెలంగాణ ప్రజలను ఆగం చేయుద్ధని అన్నారు. నల్గొండలో 13 న నిర్వహించనున్న సభను ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ నాయకులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డిగారు, ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి , ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, బిఆర్ఎస్ ఆర్ఎస్ నాయకులు కొంతం భాస్కర్ గౌడ్, మంచాల రవి కుమార్, గాండ్ల రవి, శ్రీనివాస్, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ నాయకుని మృతి


 భువనగిరి పట్టణానికి చెందిన బీ ఆర్ ఎస్ నాయకులు, పార్టీ పట్టణ మాజీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ శనివారం సాయంత్రం 6 గంటలకు యశోద హాస్పిటల్ లో మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన కాలేయం వ్యాధితో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం చెకప్ కోసం వెళ్లిన శ్రీనివాస్ డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ గతంల  టీ ఆర్ ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రావులశ్రీనివాస్ భార్య అనురాధ భువనగిరి లోని రాంనగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ గా పనిచేస్తున్నారు.ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భువనగిరి లోని రాంనగర్ లో శ్రీనివాస్ టెంట్ హౌస్ నడిపేవారు. భువనగిరి మండలం సిరివేణికుంటకు చెందిన శ్రీనివాస్ కుటుంబం చాలా ఏళ్ళ క్రితం భువనగిరికి వచ్చి స్థిరపడ్డారు. రావుల శ్రీనివాస్ మృదు స్వభావం హకలిగి, అందరితో కలిసి మెలిసి ఉండేవాడిని ఆయన మృతి తీరని లోటని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. రావుల శ్రీనివాస్ కు వినమ్ర నివాళులు అర్పించిన వెంకటేష్ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసారు. కుటుంబ సభ్యులు మనోధైర్యం తో ఉండాలని ఆయన కోరారు.

వేములకొండ గ్రామం లో గావ్ చలో... ఘర్ చలో అభియాన్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామంలోని ప్రజలకు విద్యావంతులకు యువతకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కొత్త రామచంద్రు, బిట్ల గోవర్ధన్ కొత్త మచ్చగిరి నోముల దశరథ కుమ్మరి రాములు తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం చాటిన వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై గుండెపోటుతో ఓ మహిళ పడిపోయినది. మెయిన్ రోడ్ లో వానలు తనిఖీలు చేస్తున్న స్థానిక ఎస్సై మహేందర్ లాల్ ఆ మహిళను గమనించి ఆమెకి సిపిఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ మహిళా భువనగిరి మండలం మన్యెంవారి వంపుకు చెందిన బోయిన వెంకటమ్మ గా గుర్తించారు. సకాలంలో ప్రధమ చికిత్స నిర్వహించిన స్థానిక ఎస్సైని పలువురు అభినందించారు. వెంకటమ్మ పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు.

ఈనెల 16న దేశవ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు కమిషనర్ నాగిరెడ్డికి అందజేసిన యూనియన్ అధ్యక్షులు మాయ కృష్ణ


ఈనెల 16న దేశవ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు కమిషనర్ నాగిరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది.*

మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మాయ కృష్ణఈనెల ఫిబ్రవరి 16 దేశవ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె చేయాలని కమిషనర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ లకు భద్రత లేకుండా పోయింది కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి మున్సిపల్ కార్మికులకు పర్మిట్ చేయాలని కనీస వేతనము 26,000 నిర్ణయించాలని నాలుగు లేబర్ కోడను రద్దు చేయాలని అదేవిధంగా ఈపిఎఫ్ పెన్షన్ 10000 రూపాయలు ఇవ్వాలని ఆహార వస్తువులను మరియు నిత్యవసర లపై జీఎస్టీ ని ఉప సమరించాలి పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వంటగ్యాసులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలి అట్టడుగు వర్గాలపై అణిచివేతను అరికట్టాలి సామాజిక న్యాయాన్ని కాపాడాలి మన పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్నట్లుగానే తెలంగాణలో కూడా 21000 వేతనాలు చెల్లించాలి పారిశుద్ధ్యం సేవల్లో ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించాలి రా0కి తదితర ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి ప్రమాదాల్లో మరణిస్తే కార్మికులకు 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి దహన సంస్కారాలకు 30000 ఇవ్వాలి ఆదివారాలు పండుగ సెలవులు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి వాటర్ వర్క్ కూడా వర్తింపజేయాలి కార్మికులకు అందరికీ మొదట ప్రాధాన్యత ఇచ్చి డబల్ బెడ్ రూములు ఇళ్ల స్థలాలు కేటాయించాలి వీటన్నిపై వర్తింపజేయాలని ఈనెల 16న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారని కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది

పట్టణ కన్వీనర్ గంధ మల్ల మాతయ్య పిసికే సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిదో వార్డులో అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కౌన్సిలర్ పంగ రెక్క స్వామి


 భువనగిరి పట్టణంలో8 వ వార్డ్ రామ్ నగరంలో ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ పంగ రెక్క స్వామి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ....పిల్లలకు పౌష్టికాహారం అందుతుందా లేదని అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు .అనంతరం గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబిత , సుదర్శన్, సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్ సరోజ, అయమ్మ‍ ధనలక్ష్మీ ,మహిళలు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

భువనగిరి లో ఎస్సీ హాస్టల్ ను సందర్శించిన డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సి హాస్టల్ ను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం సందర్శించారు .ఈ సందర్భంగా వారు హాస్టల్ లోని ఆయా ను సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీ ,ఎస్టీ ,బీసీ విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కనీసం సంఘీభావం తెలుపకుండా ,మౌనం కూడా పాటించకపోవడం, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ ఇద్దరి పిల్లల కోసం , ఈనెల 12న శాంతియుత భారీ మహా ధర్నా సంక్షేమ భవనం ముందు చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, హత్య అయితే దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆహ్వాన పత్రిక విడుదల


      తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా కమిటీ విస్తృత సమావేశ ఆహ్వాన పత్రికను ఆత్మకూర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దొడ్డి స్వామి మాట్లాడుతూ ఫిబ్రవరి 18న ఆత్మకూరు లోని ఎం ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ విస్తృత సమావేశం నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంసృతిక కమిటీ కన్వీనర్ కట్టా రమేష్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దర్శనం వెంకన్న, జూకంటి కరుణాకర్, ఉపాధ్యక్షులు వెలిమినేటి సోమయ్య, మండల సాంస్కృతిక కమిటీ కన్వీనర్ పులిగిల్ల నర్సయ్య, ఆడిట్ కమిటీ కన్వీనర్ గడ్డమీది శ్రీను, మండల కార్యదర్శి జోరుక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.