/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz మానవత్వం చాటిన వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ Vijay.S
మానవత్వం చాటిన వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై గుండెపోటుతో ఓ మహిళ పడిపోయినది. మెయిన్ రోడ్ లో వానలు తనిఖీలు చేస్తున్న స్థానిక ఎస్సై మహేందర్ లాల్ ఆ మహిళను గమనించి ఆమెకి సిపిఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ మహిళా భువనగిరి మండలం మన్యెంవారి వంపుకు చెందిన బోయిన వెంకటమ్మ గా గుర్తించారు. సకాలంలో ప్రధమ చికిత్స నిర్వహించిన స్థానిక ఎస్సైని పలువురు అభినందించారు. వెంకటమ్మ పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు.

ఈనెల 16న దేశవ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు కమిషనర్ నాగిరెడ్డికి అందజేసిన యూనియన్ అధ్యక్షులు మాయ కృష్ణ


ఈనెల 16న దేశవ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు కమిషనర్ నాగిరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది.*

మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మాయ కృష్ణఈనెల ఫిబ్రవరి 16 దేశవ్యాప్త మున్సిపల్ కార్మికుల సమ్మె చేయాలని కమిషనర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ లకు భద్రత లేకుండా పోయింది కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి మున్సిపల్ కార్మికులకు పర్మిట్ చేయాలని కనీస వేతనము 26,000 నిర్ణయించాలని నాలుగు లేబర్ కోడను రద్దు చేయాలని అదేవిధంగా ఈపిఎఫ్ పెన్షన్ 10000 రూపాయలు ఇవ్వాలని ఆహార వస్తువులను మరియు నిత్యవసర లపై జీఎస్టీ ని ఉప సమరించాలి పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వంటగ్యాసులపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలి అట్టడుగు వర్గాలపై అణిచివేతను అరికట్టాలి సామాజిక న్యాయాన్ని కాపాడాలి మన పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్నట్లుగానే తెలంగాణలో కూడా 21000 వేతనాలు చెల్లించాలి పారిశుద్ధ్యం సేవల్లో ప్రైవేటీకరణ చర్యలను ఉపసంహరించాలి రా0కి తదితర ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి ప్రమాదాల్లో మరణిస్తే కార్మికులకు 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి దహన సంస్కారాలకు 30000 ఇవ్వాలి ఆదివారాలు పండుగ సెలవులు ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి వాటర్ వర్క్ కూడా వర్తింపజేయాలి కార్మికులకు అందరికీ మొదట ప్రాధాన్యత ఇచ్చి డబల్ బెడ్ రూములు ఇళ్ల స్థలాలు కేటాయించాలి వీటన్నిపై వర్తింపజేయాలని ఈనెల 16న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారని కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది

పట్టణ కన్వీనర్ గంధ మల్ల మాతయ్య పిసికే సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిదో వార్డులో అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కౌన్సిలర్ పంగ రెక్క స్వామి


 భువనగిరి పట్టణంలో8 వ వార్డ్ రామ్ నగరంలో ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ పంగ రెక్క స్వామి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ....పిల్లలకు పౌష్టికాహారం అందుతుందా లేదని అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు .అనంతరం గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబిత , సుదర్శన్, సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్ సరోజ, అయమ్మ‍ ధనలక్ష్మీ ,మహిళలు వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

భువనగిరి లో ఎస్సీ హాస్టల్ ను సందర్శించిన డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సి హాస్టల్ ను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం సందర్శించారు .ఈ సందర్భంగా వారు హాస్టల్ లోని ఆయా ను సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎస్సీ ,ఎస్టీ ,బీసీ విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కనీసం సంఘీభావం తెలుపకుండా ,మౌనం కూడా పాటించకపోవడం, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ ఇద్దరి పిల్లల కోసం , ఈనెల 12న శాంతియుత భారీ మహా ధర్నా సంక్షేమ భవనం ముందు చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, హత్య అయితే దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆహ్వాన పత్రిక విడుదల


      తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా కమిటీ విస్తృత సమావేశ ఆహ్వాన పత్రికను ఆత్మకూర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దొడ్డి స్వామి మాట్లాడుతూ ఫిబ్రవరి 18న ఆత్మకూరు లోని ఎం ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ విస్తృత సమావేశం నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంసృతిక కమిటీ కన్వీనర్ కట్టా రమేష్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దర్శనం వెంకన్న, జూకంటి కరుణాకర్, ఉపాధ్యక్షులు వెలిమినేటి సోమయ్య, మండల సాంస్కృతిక కమిటీ కన్వీనర్ పులిగిల్ల నర్సయ్య, ఆడిట్ కమిటీ కన్వీనర్ గడ్డమీది శ్రీను, మండల కార్యదర్శి జోరుక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

రాజపేట లో జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని తరలించవద్దని తహసిల్దార్ కు బీఆర్ఎస్ నేతల వినతి


     జిల్లాకు మంజూరైన మెడికల్ మంజూరైన మెడికల్ కాలేజీని తరలించొద్దని రాజాపేట మండల బిఆర్ఎస్ నాయకులు తాహసిల్దార్ దామోదర్ కి శుక్రవారం  వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అహర్నిశలు కష్టపడి అప్పటి వైద్యశాఖ మంత్రి సహకారంతో యాదాద్రి జిల్లాకు వైద్య కళాశాల మంజూరి అయిందని అన్నారు. దీనికోసం సుమారు 182 కోట్ల నిధులు కూడా ఉన్నాయని అన్నారు . ఎన్నికల కోడ్ రావడం వల్ల శంకుస్థాపన కార్యక్రమం ఆలస్యం అయిన సందర్భంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హ కళాశాలను వేరే జిల్లాకు తరలించకపోవడం అనే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.కలశాల తరలింపు చర్యలు మానుకోవాలని సూచించారు 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, మండల పార్టీ ప్రెసిడెంట్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ సంధిల భాస్కర్ గౌడ్, సట్టు తిరుమలేష, పల్లె సంతోష్ గౌడ్, జస్వంత్, గుర్రం నరసింహులు, కటకం స్వామి,తదితరులు పాల్గొన్నారు

మా మెడికల్ కాలేజీ ...మాకే కావాలి; భువనగిరిలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో


భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్థానిక వినాయక చౌరస్తా వద్ద శుక్రవారం మా మెడికల్ కాలేజీ ...మాకే కావాలి అంటూ భారీ రాస్తారోకో నిర్వహించారు.యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని కొడంగల్ కు తరలించడానికి నిరసిస్తూ.. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాస్తా రోకో తో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జోనల్ ఇన్చార్జి పట్నం కపిల్ బలరాం, బీజేవైఎం రాష్ట్ర జిల్లా నాయకులు భాస్కర్ ,దయ్యాల కుమారస్వామి బూరుగు మణికంఠ ,మునగాల రాజశేఖర్ రెడ్డి ,వాసం నరసింగరావు ,కానుకుంట్ల రమేష్, కిషోర్ ,కుచ్చుల మహేష్ ,ఎరుకల చైతన్య, బోనగిరి సదానందం ,ఫాదరాజు ఉమా శంకర్ రావు ,ఉదయగిరి విజయకుమార్ , శ్యాం సుందర్ రెడ్డి ,వైజయంతి ,మల్లికా ,పట్టం శ్రీనివాస్ ,జనగాం నరసింహ చారి ,ఉడుత భాస్కర్, విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ సమీక్ష సమావేశం... పోచంపల్లి మండల కమిటీ నియామకం


బహుజన్ సమాజ్ పార్టీ భూదాన్ పోచంపల్లి మండల అధ్యక్షులు మీసాల సైదులు అధ్యక్షతన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించి పోచంపల్లి మండల కమిటీని వేయడం జరిగినది, ఈ సమీక్ష సమావేశానికి

 ముఖ్య అతిథులుగా యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు బాసాని మహేందర్ , కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు బొల్లెపల్లి అనిల్ కుమార్

విశిష్ట అతిథులుగా:భువనగిరి అసెంబ్లీ ఇన్చార్జి కొమ్ము జగన్ , అసెంబ్లీ ఉపాధ్యక్షులు బర్రె నాగేష్ హాజరైనారు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని అన్నారు. ఈనెల 10వ తేదీ భువనగిరి జిల్లా కేంద్రంలో జరుగు పార్లమెంటరీ సమావేశాలను జయప్రదం చేయాలని అన్నారు.

 భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు గుండు కృష్ణ గౌడ్ సమక్షంలో

1)పోచంపల్లి మండలం ఉపాధ్యక్షులుగా :

 ఎంజాల ఉపేందర్ (రజక ) గారిని,

2)పోచంపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా :

కోట మల్లేష్ గారిని ,

3)మండల :

మీసాల ప్రశాంత్ గారిని ,

4)మండల కోశాధికారిగా :

 పోలే జగన్ గారిని నియమించడం

 జరిగినది,

పరీక్షల సమయాలలో విద్యార్థులకు వార్డెన్లు, సంక్షేమ అధికారులు అందుబాటులో ఉండాలి:AISF


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ బాలుర వసతి గృహన్నీ సందర్శించిన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ విద్యార్థులతో మాట్లాడుతూ.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల ల్లో వార్డెన్లు , పరీక్ష సమయాలలో విద్యార్థులకు అందుబాటులో ఉండాలని, వారికి స్పెషల్ క్లాస్లు ఏర్పాటు చేసి చదువుపై శ్రద్ధ పెంచే విధంగా చూసుకోవాలని అన్నారు .

విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడి,ఆందోళనకు గురికాకుండా కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యంగా ఉండే విధంగా చూడాలని వారు డిమాండ్ చేశారు. 

రాత్రి సమయాలలో కచ్చితంగా వాచ్మెన్ ఉండే విధంగా చూడాలని సంక్షేమ అధికారులను విజ్ఞప్తి చేశారు. 

  ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మోత్కూరు మండల నాయకులు కందుకూరు దినేష్, వినయ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సాక్షర భారత్ కోఆర్డినేటర్లను విధుల్లోకి తీసుకోవాలని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేసిన కోఆర్డినేటర్లు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సాక్షర భారత్ మండల గ్రామ కోఆర్డినేటర్లును విధుల్లోకి తీసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని ,రోడ్డు భవనాల మరియు సినిమా ట్రోగ్రాఫ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని మండల సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్లు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ల మండల అధ్యక్షులు బుగ్గ బీరప్ప, గ్రామ కోఆర్డినేటర్లు పోలేపల్లి బాల నరసింహ ,మల్లం ధనమ్మ, రొయ్యల రజిత, ధనలక్ష్మి, మాధవి ,సుజాత ,చైతన్య , స్వరూప , తదితరులు పాల్గొన్నారు.