సైలింగ్ లో భారత్ కు వెండి, కాంస్య పతకలు
చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత క్రీడాకారులు నేడు కూడా పతకాల వేట కొనసాగిస్తున్నారు..
నేడు జరిగిన సెయిలింగ్ పోటీలలో వెండి, కాంస్య పతకాలు మన సెయిలర్స్ గెలుచుకున్నారు.. సైలింగ్ లో 4 క్యాటగిరి మహిళల విభాగంలో భారత్ కు చెందిన17 ఏళ్ల నేహా ఠాకూర్ వెండి మెడల్ ను కైవసం చేసుకుంది..
ఇక పురుషుల విండ్ సర్పర్ విభాగంలో మన దేశానికి చెందిన ఇబాద్ అలి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు..
సైలింగ్ లో భారత్ ఇదే తొలి మెడల్ అందించిన నేహా ఠాకూర్ రైతు కుటుంబం కావడం విశేషం.. హాంగ్జౌలోని గర్ల్స్ డింగీ – ఐఎల్సీఏ 4 కేటగిరీలో పోటీ పడిన నేహా.. 11 రేసులలో 27 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.
థాయ్ లాండ్ చెందిన ఖున్బూంజన్ 16 పాయింట్లతో స్వర్ణం నెగ్గగా సింగపూర్ కు చెందిన కీరా మేరీ కార్లిల్ 28 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకుంది...
SB NEWS
Streetbuzz News
![]()
Streetbuzz News
![]()
Streetbuzz News
Sep 26 2023, 19:23