/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడి ఉద్యోగులు Mane Praveen
NLG: కలెక్టరేట్ ముట్టడించిన అంగన్వాడి ఉద్యోగులు

నల్లగొండ: తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (సిఐటియు ఏఐటియూసి)ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు వేలాదిమంది అంగన్వాడి ఉద్యోగులు ముట్టడి చేయగా ఆఫీస్ స్తంభించిపోయింది. ప్రధాన గేటుకు తాళాలు వేసి అంగన్వాడీ ఉద్యోగులు నాలుగు గంటలపాటు బైటాయించడంతో కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఆఫీసుకు రాకుండా పోయినారు. అంతకుముందు డైట్ కాలేజీ నుండి కలెక్టరేట్ వరకు మహా ప్రదర్శన నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యము లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి, కనీస వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్న ఆడపడుచుల కోరికలను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పై ఉన్నదని వారన్నారు.

శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కార్మిక సంఘాలతో మొదట చర్చలు జరిపి వాగ్దానం చేసినవి అమలు పరచకుండా మాట మార్చడం సరైనది కాదని అన్నారు. పర్మినెంట్ , కనీస వేతనాలు, గ్రాడ్యుటి ,రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, వారసులకు ఉద్యోగాలు, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చుతూ అధికారికంగా సర్కులర్ , జీవోలు ఇచ్చి అంగన్వాడీల సమ్మె విరమింపజేయాలని వారు డిమాండ్ చేశారు

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి లు మాట్లాడుతూ.. 45 సంవత్సరాల పైగా అంగన్వాడీ ఉద్యోగులు ఐసిడిఎస్ సంస్థలో పనిచేస్తున్న ఎలాంటి చట్టబద్ధ హక్కులు కల్పించడం లేదని వారన్నారు. అంగన్వాడీల పనితో పాటు గర్భిణీ బాలింతలు చిన్నపిల్లలు ఇతర ప్రజలకు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న పట్టించుకోవడంలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ.. నీటి మూటగానే మిగిలిపోయిందని అన్నారు.

రాష్ట్రంలో పోరాడుతున్న సంఘాలతో చర్చలు జరపకుండా భజన సంఘాలతో చర్చలు జరిపి ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టి సమ్మెను విచ్చిన్నం చేయాలనే ప్రభుత్వ కుట్రను తిప్పి కొడుతారని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి టీచర్స్, ఆయాలను భయభ్రాంతులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ అంగన్వాడీ కేంద్రాలను ఇతర ఉద్యోగులతో నడుపాలని చూస్తున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు.

అనేక రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి పర్మినెంట్ చేసి హెల్త్ కార్డులు ఇచ్చారని వారన్నారు. పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు గ్రాడ్యుటి పెన్షన్

బోనస్, వెల్ఫేర్ బోర్డు ద్వారా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని వారన్నారు. ఒకవైపు పరివారం అనేక రెట్లు పెంచి ప్రభుత్వ పథకాలు సర్వే నువ్వు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కి మంచి పేరు తీసుకొస్తున్న అంగన్వాడీలకు కదా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు రూ.26000/- ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమ్మె డిమాండ్ల పరిష్కారం చేయకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

అంగన్వాడి ఉద్యోగ సంఘాల జేఏసీ సిఐటియు ఏఐటీయూసీ అధ్యక్షులు పొడి శెట్టి నాగమణి, వనం రాధిక లు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసురత్నం ప్రసంగించారు

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎడమ సుమతమ్మ, సిఐటియు ఏఐటియూసి జిల్లా నాయకులు దోటి వెంకన్న, చాపల శ్రీను, డి వెంకన్న,దండంపల్లి సత్తయ్య, బయన్న,సలీం, సైదయ్య ,అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ,విజయలక్ష్మి,కోట్ల శోభ ,అరుణ,సాయి విజిత, రాణి ,అన్నపూర్ణ , శాంత కుమారి, రమాదేవి,సరిత,మమత, సుజాత , శాంతాబాయి, విజితా,లక్ష్మి, పద్మ, కేదారి , నాగమణి,జగదీశ్వరి, విజయ,సుజాత,అంజలి, స్వప్న ,మహిత, జయమ్మ ,విజయ,సువార్త,మనెమ్మా, జ్యోతి ,లెనిన్, అద్దంకి నరసింహ,తదితరులు పాల్గొన్నారు

NLG: రాష్ట్రస్థాయి పురుషుల ఫుట్బాల్ సెలక్షన్స్ కు నల్లగొండ నుండి 5గురు ఎంపిక

NLG: ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న, రాష్ట్ర పురుషుల ఫుట్బాల్ జట్టు కొరకు, సెలక్షన్స్ లో పాల్గొనడానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన 5 మంది ఫుట్బాల్ క్రీడాకారులు B.రాజేష్, K.కోటేష్, S.సాగర్,

G కుషాల్, N.కార్తీక్ లను సెలెక్ట్ చేసి పంపిస్తున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

3 రోజులపాటు నిర్వహించే సెలక్షన్ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారని గిరిబాబు తెలిపారు.

SB NEWS

SB NEWS NALGONDA DIST

మర్రిగూడెం: తహసిల్దార్ కు సమ్మె నోటీసు ఇచ్చిన ఆశ వర్కర్లు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ మహేందర్ రెడ్డి కి బుధవారం ఆశ వర్కర్లు చేపట్టబోయే సమ్మె నోటీసు అందజేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ఆశా వర్కర్స్ కి ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా తదితర డిమాండ్ల కోసం సమ్మెకు పోవడానికి సిద్ధమయ్యారని తెలిపారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు సబ్ సెంటర్ నాయకురాలు మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత ,ఏర్పుల పద్మ, సుజాత, సైదా బేగం, లపంగి దుర్గమ్మ, కలమ్మ, రోజా, విజయ తదితరులు పాల్గొన్నారు

SB NEWS

SB NEWS NALGONDA DIST

మహిళా రిజర్వేషన్ లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సెపరేట్ కోటా ఉండాలి: మాయావతి

న్యూ ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఎస్పీ అభినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లలోనూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు వేర్వేరుగా కోటా ఉండేలా చూసుకోవాలని మంగళవారం సూచించారు. అలాగైతేనే, ఈ రిజర్వేషన్ లక్ష్యం నేరవేరుతుందని అన్నారు. బీఎస్పీ సహా చాలా పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సానుకూలంగా ఓటేస్తాయి. ఈ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత గతంలో మాదిరిగా పెండింగ్‌ కాకుండా ఈ సారి ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాను. మహిళలకు ప్రతిపాదిత 33 శాతం రిజర్వేషన్లు కాదు.. 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. మహిళల జనాభాను దృష్టిలో పెట్టుకుని వారికి 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని గతంలోనూ బీఎస్పీ పార్టీ తరపున పార్లమెంటులో ఆమె మాట్లాడినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని ఆలోచిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు సెపరేట్ కోటా ఉండాలి. అలాగైతేనే వారికి న్యాయం దక్కుతుంది అని మాయావతి అన్నారు.

SB NEWS
చండూర్: అంగన్వాడీ ఉద్యోగుల ధర్నాకు మద్దతు తెలిపిన బిఎస్పి నాయకులు

నల్గొండ జిల్లా, చండూరు: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు, అంగన్వాడీ వర్కర్స్ సమ్మెకు మద్దతు తెలుపుతూ, మంగళవారం చండూరు మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర తొమ్మిదవ రోజు ధర్నా లో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు నేరల్ల ప్రభుదాస్  ఆధ్వర్యంలో పలువురు బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీలను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26000 ఇవ్వాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మునుగోడు అసెంబ్లీ కార్యదర్శి అన్నేపాక శంకర్, అసెంబ్లీ మున్సిపల్ అధ్యక్షులు బూసిపాక మాణిక్యం, సీనియర్ నాయకులు బొట్ట శివ, మాజీ మండల అధ్యక్షులు కొమ్ము గణేష్, మరియు ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు. SB NEWS NALGONDA DOWNLOAD SB NEWS APP
లెంకలపల్లి లో ఘనంగా రెండవ రోజు విఘ్నేశ్వరుడికి పూజలు

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా..  మంగళవారం గాంధీ సెంటర్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నవరాత్రి గణేష్ పూజలలో భాగంగా 2వ రోజు, గ్రామానికి చెందిన దంపతులు బిజ్జాల శ్రీధర్ - శ్రీదేవి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. విగ్రహదాత పగిళ్ల రాజశేఖర్, లడ్డు దాత వావిళ్ళ అంజి యాదవ్. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA DIST
చిన్న కొండూరు గ్రామంలో అభివృద్ధి పనుల కోసం పర్యటించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంగళవారం, నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో వాడవాడల పర్యటించారు. ఈ సందర్భంగా  గ్రామంలోని ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో మిగిలి ఉన్న సిసి రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై పర్యవేక్షణ చేపడుతున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల మాట్లాడుతూ.. మిగిలి ఉన్న సిసి రోడ్లు మరియు డ్రైనేజీ పనులను పరిశీలించి, ఆ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. SB NEWS, TELANGANA
అంగన్వాడి ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య

నల్లగొండ జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మంగళవారం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య హాజరై అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వారికి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, 26 వేల వేతనం ఇవ్వాలని, అధికారుల వేధింపులు ఆపాలని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చేయని పక్షంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఓడించడం ఖాయమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య, వ్యవసాయ కార్మిక సంఘం చింతపల్లి మండల నాయకులు ఊడిగుండ్ల రాములు, అంగన్వాడి ఉద్యోగుల సంఘం సిఐటియు నాయకురాలు కే. రజిత ఆర్. శోభ, శారద, అనంతలక్ష్మి, సువర్ణ, కలమ్మ, జయ శ్రీ, విమలాదేవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు

SB NEWS, NALGONDA DIST

NKL: జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి: గద్దపాటి రమేష్

NLG, నకిరేకల్: తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బిఎస్పి నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రమేష్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికలలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల హామీ ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ ప్రజాప్రతినిధుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. లేనట్లయితే జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. SB NEWS NALGONDA DIST

PLEASE DOWNLOAD STREETBUZZ APP
డోర్నకల్ లో దొరల ఆధిపత్య పార్టీలను అంతం చేస్తాం: జిల్లా బీఎస్పీ మహిళా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్

మహబూబాబాద్ : డోర్నకల్ నియోజకవర్గం లో దొరల ఆధిపత్య పార్టీలను అంతం చేసి బహుజనులకు రాజ్యాధికారం తెస్తామని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మహిళ కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ పరిధిలోని మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో బిఎస్పీ మొదటి పది హామీల గోడ పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పార్వతి రమేష్ నాయక్ మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గంలో తరతరాలుగా దొరలు, వారి బినామీ పాలకులే పరిపాలనలో ఉంటున్నారని.. అధికారంలో పార్టీలు మారుతున్నాయే తప్ప దొరలు, దొరల బినామీ పాలకులు మారడం లేదని.. వారి ఆధిపత్యంలో బహుజనులు ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా తీవ్ర వివక్షకు గురయ్యారని ఇక గడీ ల పాలనను,  బిఎస్పీ ఆధ్వర్యంలో భూస్థాపితం చేస్తామని అన్నారు. బిఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో  తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం తెచ్చి, అధికారంలో బహుజనులందరికి వాటా కల్పిస్తామని బహుజనులందరు బిఎస్పీ తో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  బిఎస్పీ జిల్లా ఇంచార్జ్ లు తేజావత్ అభి నాయక్, ఎల్ విజయ్ కాంత్, జిల్లా ఉపాధ్యక్షులు తగరం నాగన్న, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐతం ఉపేందర్, జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు, జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల శ్రీను, బిఎస్పీ కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి ఏడెల్లి అఖిల్, డోర్నకల్ అసెంబ్లీ అధ్యక్షులు భాషిపంగు మహేందర్,మరిపెడ మండల అధ్యక్ష, కార్యదర్శులు జినక కృష్ణమూర్తి, గుగులోత్ బాసునాయక్, నాయకులు కోర్ని సురేష్, జినక వీరయ్య తదితరులు పాల్గొన్నారు. SB NEWS, TELANGANA

PLEASE DOWNLOAD STREETBUZZ APP & FOLLOW MANE PRAVEEN