/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz గణపతి పూజకు వేళాయె Yadagiri Goud
గణపతి పూజకు వేళాయె

వినాయక చవితి పండుగ అంటేనే అందరిలో ఉత్సాహం. భారీ విగ్రహాలు.. వీధి వీధినా మండపాలు.. ఆకర్షణీయమైన సెట్టింగులు..

ఉదయం నుంచి విశేష పూజలు, భక్తుల దర్శనాలతో అర్ధరాత్రి వరకు సందడే సందడి. విఘ్నాలు తొలగించే వినాయకుడు

నేడు సోమవారం కొలువుదీరనుండగా, విభిన్న ఆకృతుల్లో గణనాథుడు పూజలందుకుంటాడు. ఏటేటా మండపాలు, విగ్రహాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

వీటిని నిమజ్జనం చేసినప్పుడు నీరు కలుషితమవుతున్నది. గతంలో మట్టితో తయారుచేసిన విగ్రహాలనే పూజించేవారు.

కానీ నేడు యువత పోటీపడి ఆకర్షణీయమైన రంగులతో ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.

భారీ విగ్రహాల విషయంలో ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గడం లేదు...

Sonia Gandhi: కర్ణాటకకు అప్పుడు 5 హామీలే.. తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించిన సోనియా

Telangana: కర్ణాటక ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికి 5 హామీలు ప్రకటించి గెలుపొందిన కాంగ్రెస్ (Congress) పార్టీ తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించింది.

6 హామీలు ఇవే..

1. మహాలక్ష్మి పథకం

2. రైతు భరోసా పథకం

3. గృహ జ్యోతి పథకం

4. ఇందిరమ్మ ఇంటి పథకం

5. యువ వికాసం పథకం

6. చేయూత పెన్షన్‌ పథకం

అధికారంలోకి రాగానే పై ఆరు పథకాలను అమలు చేస్తారు. గృహలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తారు. అలాగే, ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తారు. రాష్ట్రంలోని పేద మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారు.

రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15,000 ఇస్తారు. కౌలు రైతుకి కూడా అంతే ఇస్తారు. రైతు కూలీలకు ఏడాది రూ.12,000 అందుతాయి.

యువ వికాస పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డులు అందిస్తారు. ఇందిరమ్మ ఇంటి పథకం కింద గృహ నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ఇస్తారు..

Kharge: రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన మల్లికార్జున ఖర్గే

తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే (Mallikarjuna Kharge) మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రజలకు చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు..

తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలను ప్రకటిస్తోందని తెలిపారు. రైతు భరోసా పథకాన్ని (Rythu Bharosa scheme) మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.

"రైతు భరోసా కింద రూ.15 వేలు పెట్టుబడి సాయం. కౌలురైతులకు రూ.12 వేలు సాయం.

వరికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్‌. వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌.

ప్రజా సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశాం. ఉపాధిహామీ చట్టం చేసింది కాంగ్రెస్సే. ఆహార భద్రత చట్టం చేసి ప్రజల ఆకలి తీర్చింది కాంగ్రెస్‌." అని ఖర్గే అన్నారు..

ఆదరించండి అభివృద్ధి చేస్తాం: రాహుల్ గాంధీ

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ముఖ్య నేత సోనియాగాంధీ ఎలా అయితే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో.. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అదే విధంగా ఆరు హామీలను అమలు చేస్తాం అన్నారు.

పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ. ఇవ్వాల ఆదివారం జరిగిన విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి పథకాలను తెలియజేస్తూనే.. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు చేసిన అవినీతిని, ఇక్కడినేతల అవినీతిపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే…

రాజకీయాల్లో మనం ఎవరితో పోరాడుతున్నామో మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఏ శక్తులైతే మనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో వారి గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్తోనే కొట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతో పోరాటం చేస్తోంది. ఇవన్నీ వేర్వేరు పార్టీలుగా కనిపించినా, తెలంగాణలో అన్నీ కలిసిపోయాయి.

నేను లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలను చూశాను. పార్లమెంట్లో బీజేపీ అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు తెలిపింది. జీఎస్టీకి సపోర్టు ఇచ్చింది. ఎప్పుడూ బీజేపీకి అవసరం పడితే అప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టుగా నిలుస్తోంది. ఈ రోజు కాంగ్రెస్ మీటింగ్ పెట్టామని వాళ్లు ముగ్గురు కూడా వేర్వేరేరు మీటింగ్లు పెట్టాయి.

కానీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న విషయం మీరు గమనించాలి. ఇంకొక విషయం దయచేసి గమనించాలి.ప్రతిపక్షాల అందరి నాయకులపై ఏదో ఒక కేసు ఉంది.

ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ వంటివన్నీ విపక్ష నేతలపై ఉన్నాయి. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ వారు ఏ ఒక్క కేసు పెట్టలేదు. ఎంఐఎం నాయకులపై కూడా ఏ కేసు లేదు. కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కేసులు పెట్టారు. నరేంద్ర మోదీ తన సొంత మనుషులపై కేసులు పెట్టడు. అందుకే కేసీఆర్, ఎంఐఎం నేతలపై కేసులు లేవు. మోదీ వీళ్లిద్దరినీ తన మనుషులుగా భావిస్తున్నారు.

కాబట్టే ఎట్లాంటి కేసులు పెట్టలేదు. ఇక్కడ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినా వీరిపైన కేసులు ఏవు. ఇవ్వాల సోనియా గాంధీ స్పీచ్ వింటున్నాను. సోనియా గాంధీ మాట ఇస్తే తప్పనిసరిగా మాట నిలబెట్టుకుంటారు.

ఏమి జరిగినా, ఎంత నష్టపోయినా సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. 2012లో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆలోచిస్తామని చెప్పారు.ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నారు. మీ కల, మీ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు.

ఇక్కడ మొత్తం అన్ని లాభాలు కూడా ముఖ్యమంత్రి కుటుంబానికే దక్కుతున్నాయి. మేము తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబానికి ఇవ్వలేదు. వారి లాభాల కోసం ఇవ్వలేదు. పేదల కోసం, రైతుల కోసం, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం ఏర్పాటు చేశాం.

కానీ, తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదు. మేము అప్పడు తెలంగాణ విషయంలో గ్యారెంటీ ఇచ్చాం.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా అదే గ్యారెంటీ ఇస్తున్నాం..

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో తమిళి సై

వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ బడా గణేశ్ సిద్ధమయ్యారు. తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి పూజలు అందుకోనున్నారు.

ఇందుకోసం గణేశ్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వినాయకుడికి సోమవారం తొలి పూజ గవర్నర్ తమిళి సై‌తో చేయించాలని కమిటీ నిర్ణయించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆమెను కలిశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేయాలని గవర్నర్‌కు కోరారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించారు.

ఖైరతాబాద్ గణేశ్‌కు తొలి పూజ చేయడం తన పూర్వ జన్మ సుకృతమని గవర్నర్ చెప్పినట్లు తెలుస్తోంది.కాగా ఖైరతాబాద్‌లో ‌ వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.

ఈ ఏడాది 63 అడుగల గణేశుడు పూజలందుకునేందుకు సిద్ధమయ్యారు. 9 రోజుల పాటు భక్తుల దర్శనాలకు ఉత్సవ కమిటీ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ జరగనుంది.

దీంతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభవుతాయి. 9 రోజలు పాటు గణనాథుడు పూజలందుకుంటారు. అనంతరం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఖైరతాబాద్ పరిసరాల్లో శోభాయాత్ర నిర్వహించి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు...

మళ్లీ కలవబోతున్న నాగచైతన్య, సమంత?

ఈ ఏడాది సమంత రెండు చిత్రాలతో ముందుకొచ్చింది. అందులో శాకుంతలం నిరాశపరచగా, ఖుషీ సినిమా మాత్రం పర్వాలేదనిపించుకుంది. లాభాలను కూడా

ఈ సినిమా కళ్ల చూసిందని చెబుతున్నారు.

నాగచైతన్య ఇటీవలికాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోతున్నాడని అభిమానులు ఆవేదనలో ఉన్నారు. తర్వాత సినిమాతో భారీ విజయం సాధిస్తాడనే నమ్మకంతో ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితమే వీరిద్దరూ విడాకులు తీసుకొని అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో నాగచైతన్య ఫోటోలు సైతం సమంత ఇన్ స్టాగ్రామ్ లో కనిపించలేదు. హఠాత్తుగా ఇప్పుడు సమంత ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అయ్యేవాళ్లకు చైసామ్ పెళ్లి ఫోటోలతో పాటు వాళ్లిద్దరూ విహార యాత్రకు వెళ్లిన ఫోటోలు సైతం కనిపిస్తున్నాయి.

ఈ ఫోటోలను చూసిన అక్కినేని అభిమానులు వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చై, సామ్.. ఇద్దరూ కలవబోతుంటే అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులకు ఇంతకంటే మంచి వార్తే ఉండదు.

నాగచైతన్యకు సంబంధించిన ఫొటోలు కనపడకుండా ఆర్చీవ్ చేసిన సమంత వాటిని తిరిగి ఇన్ స్టా లోకి వచ్చేలా చేయడంతో ఏం చెప్పబోతుందా? అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి జోడి సూపర్ అని, బెస్ట్ కపుల్ అని, క్యూట్ జోడీ అని నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. విడాకులు తీసుకున్న సమయంలో అందరూ ఎక్కువగా సమంతనే టార్గెట్ చేశారు. నాగచైతన్య గురించి ఎక్కడా నెగెటివ్ కామెంట్స్ రాలేదు.

ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ సినిమాలలో నాగచైతన్య, సమంత కలిసి నటించారు. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఉందంటున్నారు.

ఇద్దరికీ వేర్వేరుగా క్రేజ్ పెరుగుతోంది. చైతన్య పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సామ్ పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నటన పరంగా వంక పెట్టే పనిలేకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.

Rajinikanth: అందుకే చంద్రబాబును కలవలేకపోయా: రజనీకాంత్‌

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu)తో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) ములాఖత్‌ అవుతారనే వార్తలు ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే.

వాటిపై రజనీకాంత్‌ తాజాగా స్పందించారు. చంద్రబాబును తాను కలవాలనుకున్నానని, ఫ్యామిలీ ఫంక్షన్‌ వల్ల వెళ్లలేకపోయానని తెలిపారు.

కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్‌ చెన్నై నుంచి కోయంబత్తూరు బయలు దేరారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయం చేరుకోగానే.. చంద్రబాబుతో ములాఖత్‌ గురించి మీడియా ప్రశ్నించగా రజనీకాంత్‌ సమాధానమిచ్చారు..

చంద్రబాబు, రజనీకాంత్‌ల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తనయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ (Nara Lokesh)కు రజనీకాంత్‌ కొన్ని రోజుల క్రితం ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు.

తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు. 'చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష.

తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు. చేసిన మంచి పనులు, ప్రజాసేవే ఆయణ్ని బయటకు తీసుకొస్తాయి' అని అన్నారు..

Daggubati Purandeswari: పవన్‌ వ్యాఖ్యలను తప్పుగా చూడట్లేదు: పురందేశ్వరి

విజయవాడ: జనసేన తమ పార్టీతో పొత్తులోనే ఉందని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడలోని కోమల విలాస్ సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు..

ఈ సందర్భంగా పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.

''పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను మేం తప్పుగా చూడట్లేదు. భాజపా అధిష్ఠానానికి అన్నీ వివరిస్తానని పవన్‌ చెప్పారు. కేంద్ర పెద్దలతో చర్చించాక మా అభిప్రాయాలు చెబుతాం. పొత్తుల విషయం అధినాయకత్వమే చూసుకుంటుంది.

చంద్రబాబు అరెస్టు విధానాన్ని తొలుత భాజపానే తప్పుపట్టింది. ఏపీ, తెలంగాణ భాజపా నేతలు ఈ అరెస్టును ఖండించారు. చంద్రబాబు అరెస్టు వెనుక భాజపా ఉందనేది అసత్య ప్రచారం. సీఐడీ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది'' అని పురందేశ్వరి అన్నారు.

2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం:- రాజా సింగ్

హైదరాబాద్:-టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు.

చంద్రబాబు అరెస్ట్ తప్పని ఆరోపించారు.

‘ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు అంటే భయం.. కేసుతో సంబంధం లేకపోయినా అరెస్ట్ చేశారు.. చంద్రబాబును ఎంత తిట్టిన , ఎంత ఇబ్బందులకు గురిచేస్తే.. అంత ఎదుగుతాడు.. 2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది.. జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నాడు.. ప్రజా సేవ కోసం చంద్రబాబు జైలుకు వెళ్లాడు.

అతనిపై పెట్టిన కేసు కోర్టు కొట్టివేస్తుందని ఆయన అన్నారు.

ఈనెల 28వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళనున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు

•మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

•యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ

మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఈనెల 28వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళనున్నారని శనివారం అడిషనల్ కలెక్టర్ అడిషనల్ విద్యాధికారులకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (సిఐటియు) జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ కార్మికులతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐటీయూ అనేక పోరాటాల ఫలితంగా గౌరవ ముఖ్యమంత్రి 2022 మార్చి 15న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న వేతనంకు అదనంగా ₹2000/ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు.

జీవో నెంబర్ ఎంఎస్ 8 విడుదల చేశారు. కానీ నేటికీ అవి అమలు కాలేదని వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని, పెంచిన గౌరవ వేతనానికి బడ్జెట్ విడుదల చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త మేనకు మరియు ఉదయం టిఫిన్ కు బడ్జెట్ కేటాయించి కార్మికులకు కనీస వేతనం ₹26 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు.

కార్మికులు వంట చేసే సమయంలో ఏదైనా ప్రమాదాలకు గురి అయినట్లయితే వారికి ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యాలు లేవని పోస్టల్ బీమా యోజన పథకం కింద ప్రతి కార్మికుడికి ప్రభుత్వము భీమా ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు అట్లాగే ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు, వంటకు సరిపడా గ్యాస్ను పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని, ప్రభుత్వం ప్రోసిడింగ్ ఆర్డర్స్, గుర్తింపు కార్డులు, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని ఒక్కొక్క విద్యార్థికి స్లాబ్ రేటు ₹25/ రూపాయలు ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28వ తేదీ నుంచి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో వంట బంధు చేసి నిరవధిక సమ్మెలోకి వెళ్ళనున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోలగోని యాదమ్మ, మేడి సైదులు యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ నాయకులు ఇండ్ల రేణుక, చెరుపల్లి సత్తెమ్మ, జాకటి లక్ష్మి, కోయగుర పద్మ తదితరులు పాల్గొన్నారు.