/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఆదరించండి అభివృద్ధి చేస్తాం: రాహుల్ గాంధీ Yadagiri Goud
ఆదరించండి అభివృద్ధి చేస్తాం: రాహుల్ గాంధీ

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ముఖ్య నేత సోనియాగాంధీ ఎలా అయితే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో.. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అదే విధంగా ఆరు హామీలను అమలు చేస్తాం అన్నారు.

పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ. ఇవ్వాల ఆదివారం జరిగిన విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి పథకాలను తెలియజేస్తూనే.. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు చేసిన అవినీతిని, ఇక్కడినేతల అవినీతిపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ప్రసంగం ఆయన మాటల్లోనే…

రాజకీయాల్లో మనం ఎవరితో పోరాడుతున్నామో మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఏ శక్తులైతే మనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో వారి గురించి తెలుసుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్తోనే కొట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంతో పోరాటం చేస్తోంది. ఇవన్నీ వేర్వేరు పార్టీలుగా కనిపించినా, తెలంగాణలో అన్నీ కలిసిపోయాయి.

నేను లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలను చూశాను. పార్లమెంట్లో బీజేపీ అవసరం ఉన్నప్పుడల్లా బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు తెలిపింది. జీఎస్టీకి సపోర్టు ఇచ్చింది. ఎప్పుడూ బీజేపీకి అవసరం పడితే అప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టుగా నిలుస్తోంది. ఈ రోజు కాంగ్రెస్ మీటింగ్ పెట్టామని వాళ్లు ముగ్గురు కూడా వేర్వేరేరు మీటింగ్లు పెట్టాయి.

కానీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఎవరూ డిస్టర్బ్ చేయలేరు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న విషయం మీరు గమనించాలి. ఇంకొక విషయం దయచేసి గమనించాలి.ప్రతిపక్షాల అందరి నాయకులపై ఏదో ఒక కేసు ఉంది.

ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ వంటివన్నీ విపక్ష నేతలపై ఉన్నాయి. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ వారు ఏ ఒక్క కేసు పెట్టలేదు. ఎంఐఎం నాయకులపై కూడా ఏ కేసు లేదు. కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కేసులు పెట్టారు. నరేంద్ర మోదీ తన సొంత మనుషులపై కేసులు పెట్టడు. అందుకే కేసీఆర్, ఎంఐఎం నేతలపై కేసులు లేవు. మోదీ వీళ్లిద్దరినీ తన మనుషులుగా భావిస్తున్నారు.

కాబట్టే ఎట్లాంటి కేసులు పెట్టలేదు. ఇక్కడ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయినా వీరిపైన కేసులు ఏవు. ఇవ్వాల సోనియా గాంధీ స్పీచ్ వింటున్నాను. సోనియా గాంధీ మాట ఇస్తే తప్పనిసరిగా మాట నిలబెట్టుకుంటారు.

ఏమి జరిగినా, ఎంత నష్టపోయినా సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. 2012లో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఆలోచిస్తామని చెప్పారు.ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నారు. మీ కల, మీ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు.

ఇక్కడ మొత్తం అన్ని లాభాలు కూడా ముఖ్యమంత్రి కుటుంబానికే దక్కుతున్నాయి. మేము తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబానికి ఇవ్వలేదు. వారి లాభాల కోసం ఇవ్వలేదు. పేదల కోసం, రైతుల కోసం, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం ఏర్పాటు చేశాం.

కానీ, తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ న్యాయం జరగలేదు. మేము అప్పడు తెలంగాణ విషయంలో గ్యారెంటీ ఇచ్చాం.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి విషయంలో కూడా అదే గ్యారెంటీ ఇస్తున్నాం..

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో తమిళి సై

వినాయక చవితి ఉత్సవాలకు ఖైరతాబాద్ బడా గణేశ్ సిద్ధమయ్యారు. తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి పూజలు అందుకోనున్నారు.

ఇందుకోసం గణేశ్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వినాయకుడికి సోమవారం తొలి పూజ గవర్నర్ తమిళి సై‌తో చేయించాలని కమిటీ నిర్ణయించారు.

ఈ మేరకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఆమెను కలిశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేయాలని గవర్నర్‌కు కోరారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించారు.

ఖైరతాబాద్ గణేశ్‌కు తొలి పూజ చేయడం తన పూర్వ జన్మ సుకృతమని గవర్నర్ చెప్పినట్లు తెలుస్తోంది.కాగా ఖైరతాబాద్‌లో ‌ వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.

ఈ ఏడాది 63 అడుగల గణేశుడు పూజలందుకునేందుకు సిద్ధమయ్యారు. 9 రోజుల పాటు భక్తుల దర్శనాలకు ఉత్సవ కమిటీ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ జరగనుంది.

దీంతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభవుతాయి. 9 రోజలు పాటు గణనాథుడు పూజలందుకుంటారు. అనంతరం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఖైరతాబాద్ పరిసరాల్లో శోభాయాత్ర నిర్వహించి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు...

మళ్లీ కలవబోతున్న నాగచైతన్య, సమంత?

ఈ ఏడాది సమంత రెండు చిత్రాలతో ముందుకొచ్చింది. అందులో శాకుంతలం నిరాశపరచగా, ఖుషీ సినిమా మాత్రం పర్వాలేదనిపించుకుంది. లాభాలను కూడా

ఈ సినిమా కళ్ల చూసిందని చెబుతున్నారు.

నాగచైతన్య ఇటీవలికాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోతున్నాడని అభిమానులు ఆవేదనలో ఉన్నారు. తర్వాత సినిమాతో భారీ విజయం సాధిస్తాడనే నమ్మకంతో ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితమే వీరిద్దరూ విడాకులు తీసుకొని అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో నాగచైతన్య ఫోటోలు సైతం సమంత ఇన్ స్టాగ్రామ్ లో కనిపించలేదు. హఠాత్తుగా ఇప్పుడు సమంత ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో అయ్యేవాళ్లకు చైసామ్ పెళ్లి ఫోటోలతో పాటు వాళ్లిద్దరూ విహార యాత్రకు వెళ్లిన ఫోటోలు సైతం కనిపిస్తున్నాయి.

ఈ ఫోటోలను చూసిన అక్కినేని అభిమానులు వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చై, సామ్.. ఇద్దరూ కలవబోతుంటే అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులకు ఇంతకంటే మంచి వార్తే ఉండదు.

నాగచైతన్యకు సంబంధించిన ఫొటోలు కనపడకుండా ఆర్చీవ్ చేసిన సమంత వాటిని తిరిగి ఇన్ స్టా లోకి వచ్చేలా చేయడంతో ఏం చెప్పబోతుందా? అనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి జోడి సూపర్ అని, బెస్ట్ కపుల్ అని, క్యూట్ జోడీ అని నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. విడాకులు తీసుకున్న సమయంలో అందరూ ఎక్కువగా సమంతనే టార్గెట్ చేశారు. నాగచైతన్య గురించి ఎక్కడా నెగెటివ్ కామెంట్స్ రాలేదు.

ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ సినిమాలలో నాగచైతన్య, సమంత కలిసి నటించారు. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఉందంటున్నారు.

ఇద్దరికీ వేర్వేరుగా క్రేజ్ పెరుగుతోంది. చైతన్య పారితోషికం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా సామ్ పారితోషికం 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నటన పరంగా వంక పెట్టే పనిలేకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.

Rajinikanth: అందుకే చంద్రబాబును కలవలేకపోయా: రజనీకాంత్‌

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu)తో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) ములాఖత్‌ అవుతారనే వార్తలు ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే.

వాటిపై రజనీకాంత్‌ తాజాగా స్పందించారు. చంద్రబాబును తాను కలవాలనుకున్నానని, ఫ్యామిలీ ఫంక్షన్‌ వల్ల వెళ్లలేకపోయానని తెలిపారు.

కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్‌ చెన్నై నుంచి కోయంబత్తూరు బయలు దేరారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయం చేరుకోగానే.. చంద్రబాబుతో ములాఖత్‌ గురించి మీడియా ప్రశ్నించగా రజనీకాంత్‌ సమాధానమిచ్చారు..

చంద్రబాబు, రజనీకాంత్‌ల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తనయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ (Nara Lokesh)కు రజనీకాంత్‌ కొన్ని రోజుల క్రితం ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు.

తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు. 'చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు. చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష.

తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు. చేసిన మంచి పనులు, ప్రజాసేవే ఆయణ్ని బయటకు తీసుకొస్తాయి' అని అన్నారు..

Daggubati Purandeswari: పవన్‌ వ్యాఖ్యలను తప్పుగా చూడట్లేదు: పురందేశ్వరి

విజయవాడ: జనసేన తమ పార్టీతో పొత్తులోనే ఉందని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడలోని కోమల విలాస్ సెంటర్‌లో వేడుకలు నిర్వహించారు..

ఈ సందర్భంగా పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు.

''పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను మేం తప్పుగా చూడట్లేదు. భాజపా అధిష్ఠానానికి అన్నీ వివరిస్తానని పవన్‌ చెప్పారు. కేంద్ర పెద్దలతో చర్చించాక మా అభిప్రాయాలు చెబుతాం. పొత్తుల విషయం అధినాయకత్వమే చూసుకుంటుంది.

చంద్రబాబు అరెస్టు విధానాన్ని తొలుత భాజపానే తప్పుపట్టింది. ఏపీ, తెలంగాణ భాజపా నేతలు ఈ అరెస్టును ఖండించారు. చంద్రబాబు అరెస్టు వెనుక భాజపా ఉందనేది అసత్య ప్రచారం. సీఐడీ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది'' అని పురందేశ్వరి అన్నారు.

2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం:- రాజా సింగ్

హైదరాబాద్:-టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు.

చంద్రబాబు అరెస్ట్ తప్పని ఆరోపించారు.

‘ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు అంటే భయం.. కేసుతో సంబంధం లేకపోయినా అరెస్ట్ చేశారు.. చంద్రబాబును ఎంత తిట్టిన , ఎంత ఇబ్బందులకు గురిచేస్తే.. అంత ఎదుగుతాడు.. 2024లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది.. జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నాడు.. ప్రజా సేవ కోసం చంద్రబాబు జైలుకు వెళ్లాడు.

అతనిపై పెట్టిన కేసు కోర్టు కొట్టివేస్తుందని ఆయన అన్నారు.

ఈనెల 28వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళనున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు

•మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

•యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ

మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఈనెల 28వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళనున్నారని శనివారం అడిషనల్ కలెక్టర్ అడిషనల్ విద్యాధికారులకు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం (సిఐటియు) జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ కార్మికులతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐటీయూ అనేక పోరాటాల ఫలితంగా గౌరవ ముఖ్యమంత్రి 2022 మార్చి 15న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న వేతనంకు అదనంగా ₹2000/ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించారు.

జీవో నెంబర్ ఎంఎస్ 8 విడుదల చేశారు. కానీ నేటికీ అవి అమలు కాలేదని వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని, పెంచిన గౌరవ వేతనానికి బడ్జెట్ విడుదల చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త మేనకు మరియు ఉదయం టిఫిన్ కు బడ్జెట్ కేటాయించి కార్మికులకు కనీస వేతనం ₹26 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు.

కార్మికులు వంట చేసే సమయంలో ఏదైనా ప్రమాదాలకు గురి అయినట్లయితే వారికి ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యాలు లేవని పోస్టల్ బీమా యోజన పథకం కింద ప్రతి కార్మికుడికి ప్రభుత్వము భీమా ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు అట్లాగే ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు, వంటకు సరిపడా గ్యాస్ను పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని, ప్రభుత్వం ప్రోసిడింగ్ ఆర్డర్స్, గుర్తింపు కార్డులు, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని ఒక్కొక్క విద్యార్థికి స్లాబ్ రేటు ₹25/ రూపాయలు ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28వ తేదీ నుంచి జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలో వంట బంధు చేసి నిరవధిక సమ్మెలోకి వెళ్ళనున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోలగోని యాదమ్మ, మేడి సైదులు యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి అనురాధ నాయకులు ఇండ్ల రేణుక, చెరుపల్లి సత్తెమ్మ, జాకటి లక్ష్మి, కోయగుర పద్మ తదితరులు పాల్గొన్నారు.

Revanth Reddy: కేసీఆర్‌, కిషన్‌ రెడ్డి వేర్వేరు కాదు: రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్: భారాస నేతలకు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హతలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్‌ ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు.

పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయం కన్నా.. దానికి చేసిన ప్రకటనల ఖర్చే ఎక్కవన్నారు. నగరంలోని తాజ్‌కృష్ణలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. కాళేశ్వరం సరిపోలేదని.. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు కేసీఆర్‌ కుటుంబం పాల్పడిందని విమర్శించారు..

''మద్యం కేసులో భాజపా, భారాస నాటకాలాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు కుమార్తెను జైలుకు పంపేందుకు కేసీఆర్‌ సిద్ధమయ్యారు. కవిత అరెస్టుతో సానుభూతి పొందాలని చూస్తున్నారు. కేసీఆర్‌.. కిషన్‌ రెడ్డి వేర్వేరు కాదు. కేసీఆర్‌ అనుచరుడు కిషన్‌రెడ్డి.

భాజపా పెద్దలు అతడిని అధ్యక్షుడిగా ఎందుకు చేశారో కిషన్‌రెడ్డికి తెలుసా? సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నప్పుడే పోటాపోటీగా దినోత్సవాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ సభను అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఇవాళ్టి వరకు ఈడీ, సీబీఐ కాదు.. ఈగ కూడా వాలలేదు. మోదీ, అమిత్‌ షా, నడ్డా విమర్శలు చేస్తారు కానీ.. ఒక్క కేసు కూడా పెట్టలేదు. కేసీఆర్‌ అవినీతిపై భాజపా ఎందుకు విచారణకు ఆదేశించలేదు'' అని రేవంత్‌ ప్రశ్నించారు..

Amit shah: పటేల్‌ 'ఆపరేషన్‌ పోలో'తో నిజాం మెడలు వంచారు: అమిత్‌షా

హైదరాబాద్‌: నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ విముక్తికి అమరులైన వీరులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు..

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు.

ఈ వేడుకల్లో అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద అమిత్‌షా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత భద్రతా బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

పటేల్‌ లేకపోతే అంత త్వరగా విముక్తి లభించేది కాదు

ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడారు. ''హైదరాబాద్‌ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నా. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలి. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చొరవతో హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి కలిగింది. ఈ క్రమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నా నివాళులర్పిస్తున్నా. 'ఆపరేషన్‌ పోలో' పేరుతో నిజాం మెడలు పటేల్‌ వంచారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారు. పటేల్‌ లేకపోతే తెలంగాణకు అంత త్వరగా విముక్తి లభించేది కాదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదు'' అని అమిత్‌షా అన్నారు. భారాస ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు లేకుండానే ఆయన తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం. అనంతరం పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అమిత్‌షా పంపిణీ చేశారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు!

సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రహోంమంత్రి అమిత్ షా,హాజరయి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా వార్ మెమోరియల్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా సశస్త్ర సీమ బల్‌ను వర్చువల్‌గా అమిత్‌షా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి,మాట్లాడుతూ విమోచనం కోసం గొంతెత్తిన పార్టీ బీజేపీయేనని అన్నారు. నిజాంకు వ్యతిరేక పోరాట చరిత్రను కాంగ్రెస్‌ సమాధి చేసిందని, భూమి కోసం.. భుక్తి కోసం ఎందరో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను కాంగ్రెస్ గుర్తించలేదని విమర్శించారు.

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపలేదని, కాంగ్రెస్‌ బాటలోనే ఇప్పుడు బీఆర్ఎస్ నడుస్తోందని ఆరోపించారు. విమోచన దినోత్సవాలు జరపకుండా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..