/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Amit shah: పటేల్‌ 'ఆపరేషన్‌ పోలో'తో నిజాం మెడలు వంచారు: అమిత్‌షా Yadagiri Goud
Amit shah: పటేల్‌ 'ఆపరేషన్‌ పోలో'తో నిజాం మెడలు వంచారు: అమిత్‌షా

హైదరాబాద్‌: నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. హైదరాబాద్‌ విముక్తికి అమరులైన వీరులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు..

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు.

ఈ వేడుకల్లో అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత అమరవీరుల స్తూపం వద్ద అమిత్‌షా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత భద్రతా బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

పటేల్‌ లేకపోతే అంత త్వరగా విముక్తి లభించేది కాదు

ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడారు. ''హైదరాబాద్‌ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నా. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలి. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చొరవతో హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి కలిగింది. ఈ క్రమంలో ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, నరసింహారావుకు నా నివాళులర్పిస్తున్నా. 'ఆపరేషన్‌ పోలో' పేరుతో నిజాం మెడలు పటేల్‌ వంచారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారు. పటేల్‌ లేకపోతే తెలంగాణకు అంత త్వరగా విముక్తి లభించేది కాదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదు'' అని అమిత్‌షా అన్నారు. భారాస ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు లేకుండానే ఆయన తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం. అనంతరం పలువురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను అమిత్‌షా పంపిణీ చేశారు.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు!

సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రహోంమంత్రి అమిత్ షా,హాజరయి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా వార్ మెమోరియల్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అలాగే సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా సశస్త్ర సీమ బల్‌ను వర్చువల్‌గా అమిత్‌షా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి,మాట్లాడుతూ విమోచనం కోసం గొంతెత్తిన పార్టీ బీజేపీయేనని అన్నారు. నిజాంకు వ్యతిరేక పోరాట చరిత్రను కాంగ్రెస్‌ సమాధి చేసిందని, భూమి కోసం.. భుక్తి కోసం ఎందరో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. తెలంగాణ పోరాటయోధుల త్యాగాలను కాంగ్రెస్ గుర్తించలేదని విమర్శించారు.

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపలేదని, కాంగ్రెస్‌ బాటలోనే ఇప్పుడు బీఆర్ఎస్ నడుస్తోందని ఆరోపించారు. విమోచన దినోత్సవాలు జరపకుండా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు..

నేడే తుది పోరు.. టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌నున్న భార‌త్, శ్రీలంక

ఆసియా కప్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. సూపర్ 4 లో సత్తాచాటిన భారత్, శ్రీలంక జట్లు ఇప్పుడు ఫైనల్ కు చేరుకున్నాయి.

నేడు ఆదివారం భారత్, శ్రీలంక మధ్య ఫైన‌ల్ మ్యాచ్ జరగనుంది.

కాగా, డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలో దిగిన శ్రీలంక, మరోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తుండగా.. భారత్ కూడా టైటిల్ గెలిచి సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో వర్షం పడే సూచనలు ఎక్కువగా ఉన్నట్లు శ్రీలంక వాతావరణ సంస్థ ప్రకటించింది.ఒకవేళ అదే జరిగితే..?

శ్రీలంకలోని కొలంబో వాతావరణ నివేదిక ప్రకారం.. ఒకవేళ వర్షం కారణం సెప్టెంబరు 17న జరిగే మ్యాచ్ కు ఆటంకం వాటిల్లితే ఆ తర్వాతి రోజు అనగా సెప్టెంబరు 18న రిజర్వ్ డేని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది.

భారత్ జట్టు: రోహిత్ శర్మ కెప్టెన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కీపర్ కీపర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ వికెట్ కీపర్, సదీర సమర విక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక కెప్టెన్,దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా... ఆటను కొనసాగించే టీం సభ్యులు

పీవీ సింధుతో భేటీపై రాజకీయ వ్యూహం ఉందా❓️

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను హైదరాబాద్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కలిశారు.

పీవీ సింధు వెంట ఆమె తండ్రితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. మర్యాదపూర్వకంగానే అమిత్ షాను పీవీ సింధు కలిసినట్లు తెలుస్తోంది. పీవీ సింధుతో భేటీపై అమిత్ షా ట్వీట్ చేశారు.

పీవీ సింధు అద్బుతమైన క్రీడాకారిణి అని, తన అసాధారణమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేశారని ప్రశంసించారు.

పీవీ సింధు చేసిన కృషి, అంకితభావం యువతకు స్పూర్తిగా నిలుస్తుందని అమిత్ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఎన్నికల క్రమంలో అమిత్ షాతో పీవీ సింధు భేటీ చర్చనీయాంశంగా మారింది.

పీవీ సింధుతో భేటీ వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ఆమె ఏమైనా ప్రచారం చేస్తుందా? అనే చర్చ జరుగుతోంది...

విపక్ష కూటమిలోకి ఐఎన్ఎల్డీ ముహూర్తం ఖరారు

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్,ఇండి-కూటమి,లోకి త్వరలో మరో కొత్త పార్టీ చేరనుంది.

సెప్టెంబర్ 25న మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ జయంతి సందర్భంగా హర్యానాలోని కైతాల్‌లో ఇండియన్ నేషనల్ లోక్‌ దళ్,ఐఎన్‌ఎల్డీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఇండి కూటమిలోని పార్టీల నేతలందరినీ ఆ సభకు ఆహ్వానించింది. విపక్షాల ఐక్యతను చాటే వేదికగా ఈ సభను మార్చి, అదే వేదికపై ఇండి కూటమిలో చేరే విషయంపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.

దేవీ లాల్ గౌరవార్థం జరు గుతున్న ఈ భారీ సభకు వివిధ విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్టు ఆ పార్టీ నేత అభయ్ చౌతాలా తెలిపారు. చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో అభయ్ చౌతాలా, జేడీయూ,నేత కేసీ త్యాగి సంయుక్తంగా మాట్లాడుతూ..

భారతీయ జనతా పార్టీ బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని తాము కూడా కోరుకుంటున్నామని, త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కలుస్తానని ప్రకటించారు.

తాము తలపెట్టిన బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా సోనియా గాంధీ, మల్లి కార్జున ఖర్గేలకు ఇప్పటికే ఆహ్వానం పంపామని తెలిపారు. అయితే వారు హాజరవుతున్నారా లేదా అన్న విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు.

కూటమిలో ఉన్న 95% పార్టీలు తమ సభకు హాజరవుతామన్నారని చౌతాలా తెలిపారు. కొన్ని పార్టీల అధి నేతలు నేరుగా హాజరవుతుండగా, మరి కొందరు తమ ప్రతినిధులను పంపిస్తున్నారని అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ సమయంలో విదేశాల్లో ఉంటానని చెప్పారని, ఆమె కూడా హాజరైతే బావుండని తాము కోరుకుంటున్నట్టు చౌతాలా అన్నారు..

నేడు శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

నేడు ఆదివారం తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది,

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పన జరగనుంది. ఈరోజు రాత్రి 7 గంటల స‌మ‌యంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పన జ‌రుగుతుంద‌ని టీటీడీ అధికారులు వెల్ల‌డించారు.

సెప్టెంబ‌ర్ 26వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. కాగా, సెప్టెంబ‌ర్ 22న గరుడ సేవ నిర్వ‌హించ‌నున్నారు. ఉత్స‌వాల నేప‌థ్యంలో తిరుమల కొండపై ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

Parliament: రేపటి నుంచే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..

రేపుటి ( సోమవారం ) నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగనుండగా ఒక రోజు ముందుగా నేడు (ఆదివారం) అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో కేంద్ర ప్రభుత్వం భేటీ కానుంది..

ఈ సెషన్స్ గురించి వారికి వివరించి, అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఐదు రోజుల సమావేశాల్లో మొదటిరోజు రాజ్యాంగ సభ మొదలుకొని 75 ఏళ్ల పార్లమెంట్‌ ప్రస్తానంపై ప్రత్యేక చర్చ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది..

ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ది అడ్వొకేట్స్‌(సవరణ)బిల్లు-2023, ది ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ ఆఫ్‌ పీరియాడికల్స్‌ బిల్లు-2023, ది పోస్టాఫీస్‌ బిల్లు-2023లను ఈ సెషన్‌లో లోక్‌సభలో కేంద్ర సర్కార్ ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన మార్పులతో గత సెషన్స్ లో రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లును ఈసారి చర్చకు తీసుకురానుంది. అయితే, అనూహ్యంగా మరికొన్ని అంశాలను సైతం సభ ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయన్న చర్చ సర్వత్రా జోరుగా కొనసాగుతుంది..

నవదీప్ ను ఈ నెల 19 వరకు అరెస్టు చెయ్యొద్దు: హై కోర్టు*

తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.నవదీప్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఈనెల 19 వరకు నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసుల ప్రకటనపై సినీ నటుడు నవదీప్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

నేను డ్రగ్స్ కన్జ్యూమర్ కాదు. డ్రగ్స్ తీసుకున్న అనటానికి ఎలాంటి మెడికల్ ఆధారాలు లేవు. ప్రాథమిక దర్యాప్తు జరపకుండానే నేను పరారీలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు.

నా గురించి మీడియాలో తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారు. నేను మానసిక ఒత్తిడికి గురి అవుతున్నాను. పోలీసుల స్టేట్‌మెంట్ నా కెరియర్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఈ కేసులో ఎలాంటి కస్టోడియల్ దర్యాప్తు అవసరం లేదు. నేను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు.అని నవదీప్ తెలిపారు.

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన ప్రారంభమైన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం.

ఎంపి గల్లా జయదేవ్ నివాసంలో భేటి అయిన ఎంపిలు

పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ.

పార్లమెంట్ సమావేశాల్లో రాబోయే బిల్లులు, టిడిపి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.

కనీస ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాల పై చర్చ..

శ్రీశైల దేవస్థానం ఈవో లవన్నకు జైలు శిక్ష?

శ్రీశైల దేవస్థానం ఈవో లవన్నకు హైకోర్టు నెలరోజుల జైలు శిక్ష విధించింది.

లవన్న గతంలో కడప మున్సిపల్ కమిషనర్ గా పనిచేసే సమయంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని పద్మావతి బాయికి చెందిన షాపులను, ఇంటి పై భాగంను మునిసిపల్ అధికారులు కూల్చేస్తున్నారంటూ 2020లో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

అయితే కోర్టు ఆదేశాలున్నా తన ఇంటిని కూల్చేశారని ఆమె మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ విచారించిన కోర్టు లవన్నకు జైలుశిక్ష విధించింది.