/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz శ్రీశైల దేవస్థానం ఈవో లవన్నకు జైలు శిక్ష? Yadagiri Goud
శ్రీశైల దేవస్థానం ఈవో లవన్నకు జైలు శిక్ష?

శ్రీశైల దేవస్థానం ఈవో లవన్నకు హైకోర్టు నెలరోజుల జైలు శిక్ష విధించింది.

లవన్న గతంలో కడప మున్సిపల్ కమిషనర్ గా పనిచేసే సమయంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని పద్మావతి బాయికి చెందిన షాపులను, ఇంటి పై భాగంను మునిసిపల్ అధికారులు కూల్చేస్తున్నారంటూ 2020లో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

అయితే కోర్టు ఆదేశాలున్నా తన ఇంటిని కూల్చేశారని ఆమె మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ విచారించిన కోర్టు లవన్నకు జైలుశిక్ష విధించింది.

బాబుతో పవన్ ములాఖత్లో మిలాఖత్ అయ్యారు: జగన్

చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ కళ్యాణ్ పై CM జగన్ ఫైర్ అయ్యారు.

'అవినీతి కేసులో బాబు అరెస్ట్ అయితే ఈయన వెళ్లి ములాఖత్ అయి మిలాఖత్ చేసుకున్నాడు.

పొత్తు పెట్టుకున్నాడు. ఎలాంటి మనుషులు ఉన్నారో ఆలోచన చేయాలి.

ఇంత అడ్డగోలుగా ఎలా దోచేశారు?

ఎవరు జేబులోకి డబ్బులు పోయాయి?

ఆ దోచేసిన వారిని జైల్లో పెట్టకపోతే ఎక్కడ పెట్టాలని ప్రశ్నించాల్సిన వ్యక్తులు.. ములాఖత్లో మిలాఖత్లు అవుతున్నారు' అని విమర్శించారు.

చంద్రబాబు అరెస్టుపై స్పందించిన CM జగన్

చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ స్పందించారు.

'ఇటీవలే అవినీతి కేసులో సాక్ష్యాలు, ఆధారాలతో అరెస్టైన ఒక మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెబుతాను.

ఇన్ని దొంగతనాలు చేసినా చంద్రబాబు అనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగలముఠా సభ్యులు ఉన్నారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడియోతో అడ్డంగా దొరికినా పత్రికలు, టీవీల్లో నిజాలను చూపించరు.

ఆ పని సబబేనని సపోర్ట్ కూడా చేస్తారు' అని విమర్శించారు.

Ponnam Prabhakar: చంద్రబాబు అరెస్ట్‌పై ఎన్నో ఊహాగానాలు

టీడీపీ అధినతే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై (TDP Chief Chandrababu naidu) రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ (Congress Leader Ponnam Prabhakar) అన్నారు..

శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పు చేసారని ఏపీ ప్రభుత్వం (AP Government)ఆరోపిస్తుందని.. ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ (TDP) చెబుతోందన్నారు. తప్పు ఒప్పులను డిసైడ్ చేసేది, నిర్ణయించే అధికారం న్యాయ స్థానాలకు ఉందని తెలిపారు.

కాబట్టి రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని హితవుపలికారు. కరప్షన్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు (Telangana CM KCR), బీఆర్ఎస్ నేతలకు (BRS Leaders) లేదన్నారు. దేశంలో ఎక్కడ జరగని అవినీతి అక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు..

Nara Lokesh: నారా లోకేశ్‌ అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ సమావేశం

దిల్లీ: చంద్రబాబు అరెస్టు అక్రమమని పార్లమెంట్ ఉభయసభల్లో చర్చే ప్రధాన అజెండాగా నేడు దిల్లీలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది..

ఈ మేరకు ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు తెదేపా ఎంపీలు భేటీకానున్నారు..

పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. చంద్రబాబు అరెస్టు, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లేలా వ్యూహ రచన చేయనున్నారు. వివిధ పార్టీల మద్దతుతో చంద్రబాబు అరెస్టు అంశం ఉభయసభల్లో చర్చకు తీసుకెళ్లేలా కసరత్తు చేయనున్నారు. కాగా ఇప్పటివరకూ తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతూ వచ్చేది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉండటంతో తొలిసారి లోకేశ్‌ ఆధ్వర్యంలో జరగనుంది..

Tummala: భారాసకు తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా

హైదరాబాద్‌: భారాసకు తుమ్మల నాగేశ్వరావు (Tummala nageswa rao) రాజీనామా చేశారు. భారాసలో తనకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు..

కాగా ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్న కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మలతోపాటు భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు సైతం కాంగ్రెస్‌లో చేరతారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాల సమాచారం. తుమ్మల గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్‌ కోసం పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో తుమ్మల శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు..

పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు

నగరంలో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. శనివారం ఉదయం పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఐఎస్‌ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో రైడ్స్ జరుగుతున్నాయి.

వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌ఐఎస్ఐ మాడ్యుల్‌లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ క్రమంలో తమిళనాడు సహా హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తోంది.

చెన్నైలో పది ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. తమిళనాడులో 30 చోట్ల, హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఎన్‌ఐఏ సోదాలు కొనసాగిస్తోంది.

ఈ సోదాల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నేడు సోనియా, రాహుల్‌ సమక్షంలో తుమ్మల చేరిక

అసెంబ్లీ ఎన్నికల ముంగిట అధికార బీఆర్‌ఎ్‌సకు పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ గూటికి చేరడం ఖాయమైంది.

శనివారం హైదరాబాద్‌కు వస్తున్న ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీ సమావేశాల ప్రారంభానికి ముందే మధ్యాహ్నం 2 గంటల సమయంలో తుమ్మల కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు పేర్కొన్నాయి.

తుమ్మలను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఆధ్వర్యంలో అధిష్ఠానం గత కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విడివిడిగా తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

తుమ్మలతో సునీల్‌ కనుగోలు సంప్రదింపులు కొలిక్కి రావడంతో.. శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితర నేతలు హైదరాబాద్‌లోని తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆయనను లాంఛనంగా ఆహ్వానించారు.

శనివారం మంచిరోజైనందున సోనియాగాంధీ సమక్షంలో చేరిక కార్యక్రమం పెట్టుకుందామని వారు ప్రతిపాదించినట్లు, ఇందుకు తుమ్మల కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం...

దసరా కానుకగా స్కూల్ పిల్లలకు అల్పాహార పథకం ప్రారంభం: సీఎం కేసీఆర్

తెలంగాణలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకునే స్టూడెంట్స్ కోసం అల్పాహార పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

దసరా కానుకగా అక్టోబర్‌ 24 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ‘విద్యార్థులకు అల్పాహారం’ పథకం విధానాన్ని పరిశీలించి రావాలని ఐఏఎస్ అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్

ఈ మధ్యనే పంపించారు. తమిళనాడు వెళ్లిన అధికారుల బృందం.. అక్కడ పథకం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే విద్యార్థులకు అల్పాహారం పథకం అమలు చేస్తున్నారనే విషయాన్నీ సీఎం కేసీఆర్‌ దృష్టికి ఈ బృందం తీసుకెళ్లింది.

అయితే విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించిన కేసీఆర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకే కాకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్‌ఫాస్ట్‌ను అందజేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి యేటా దాదాపు ₹400 కోట్ల అదనపు భారం పడనున్నది....

ఈ నెల 27న తెలంగాణ టెట్ ఫలితాలు

తెలంగాణ ఉపాధ్యాయ పరీక్ష, టెట్‌,కు తెర పడింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

పేపర్-1 పరీక్షకు 3,18,506 మంది హాజరయ్యారని… పేపర్-2కి 2,51,070 మంది హాజరయ్యారని టెట్ కన్వీనర్ వెల్లడించారు. మొత్తమ్మీద టెట్ కు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. టెట్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్టు తెలిపారు.

కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టెట్ నిర్వహించడం ఇది మూడోసారి. తొలిసారి 2016 మేలో టెట్ నిర్వహించారు. ఆ తర్వాత 2017 జులైలో టెట్ జరపగా,తాజాగా నిన్న టెట్ నిర్వహించింది,

తెలంగాణ ప్రభుత్వం. ఈ సంవత్సరం ఒక్కసారిగా కొలువుల జాతరను ప్రకటించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే మరికొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లకు వెల్లడించనున్నారు.....