/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రేపు రాజమండ్రికి జనసేనాని.. Yadagiri Goud
రేపు రాజమండ్రికి జనసేనాని..

టీడీపి అధినేత చంద్రబాబుగారు తో జనసేన్ అధ్యక్షుడు పవన్ ములాఖాత్..

జైలులో కలవనున్న ఇద్దరు అగ్రనేతలు..

చంద్రబాబుకు మడ్డతు తెలిపి, దైర్యం చెప్పనున్న జనసేనాని

ప్రత్యేక విమానంలో రాజమండ్రీ కి పవన్..

జైలు అధికారులు ఇచ్చే సమయంలో సెంట్రల్ జైల్లో ములాఖాత్..

చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా పవన్ కలిసే అవకాశాలు..

నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు : రజినీకాంత్

చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకి రక్ష..

లోకేష్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్...

తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు..

అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు..

నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు..

తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజాసేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు..

కెసిఆర్ సార్ అమ్మ నాన్న లేని అనాథలం మాకూడ దళిత బంధు ఇవ్వండి

దళితుల కొరకు కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం తమకి కేటాయించాలని వంగూరి దివ్య వంగూరి సంధ్య అనే ఇద్దరు అక్కచెల్లెళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరం పంపారు

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన వంగూరి సంధ్య (20) మరియు వంగూరి దివ్య (19) SC(మాదిగ) అనే ఇద్దరు అనాథ అక్క చెల్లెలు 20 సంవత్సరాల లోపు వయసు వారే. ఒకరేమో ఇంటర్ పూర్తి చేసినారు.మరొకరు డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నరు. వాళ్లు 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తల్లి వంగూరి రేణుక రొమ్ము క్యాన్సర్ తో చనిపోయింది. దాని తరవాత కొద్ది కాలానికే తండ్రి వంగూరి కిష్టయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు.

ఆయన అలన పాలన ఈ ఇద్దరు పిల్లలే చూసుకుంటూ ఇద్దరు చదువుకుంటూ కులిపనులు పనులు చేస్తూనే ఇంతకాలం తండ్రిని సాదుకుంటు వచ్చారు. నెల రోజుల క్రితం(06 ఆగస్ట్ 2023) నాడు తండ్రి కూడా చనిపోయాడు. ఇలా తాము ఇంత చిన్న వయసులోనే తల్లిదడ్రులిద్దరూ చనిపోవటం ఆ పిల్లలు తట్టుకోలేకపోతున్నారు.చివరికి తండ్రి అంత్యక్రియలు కూడా సొంత ఖర్చులతో జరపాలేని పేదరికం లో ఉన్న ఆ అక్క చెల్లెలకి మానవత్వం ఉన్న కొంత మంది అండగా నిలిచి కొంత ఆర్థిక సహకారం అందించటం తో తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇప్పుడు తమకి ఎవరు లేక ఒంటరిగా మిగిలిపోయామని బోరున విలపిస్తున్నారు.తమకి అస్తి పాస్తులు కూడా ఏమీ లేవని తమ మంచి చెడూ చూసుకునే వారు కూడా ఎవరూ లేకపోవడంతో అమ్మ నాన్న లేని ఇద్దరు అనాథలు అయిన ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ తమకు కేసిఆర్ ఏ పెద్దదిక్కు కావాలని తమ కాళ్లపై తాము నిలబడి బ్రతకడానికి,స్వయం ఉపాధినీ ఎంచుకొని తమ జీవనం కొనసాగించటానికి రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఎదుగుదల కొరకు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని తమకు ఒక యూనిట్ నీ కేటాయించి కెసీఆర్ గారే తమకు అండగా నిలవాలని కోరుకుంటూ బుధవారం రోజు తమ బాధని పోస్ట్ కార్డు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉత్తరం పంపారు.

ఎంతో మందికి దళిత బంధు పథకం ద్వారా సహాయపడి వారి బతుకుల్లో మార్పులు తీసుకొచ్చిన కెసిఆర్ అమ్మ నాన్న లేని తమకి కూడా దళిత బంధు పథకం ఇచ్చి అమ్మ నాన్న అన్ని తానే అయ్యి తమ బతుకుల్లో మార్పులు తీసుకురావాలని తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గారు కూడా స్పందించి తమ చెల్లెల లాగా అనుకొని మాపై మానవత్వం చూపి మాకు అన్నలాగ ఉండాలని ఆ పిల్లలు వేడుకుంటున్నారు.

ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి జన్మదిన వేడుకలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, విద్యార్థుల నిరుద్యోగుల ఆరాధ్య దైవం,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు టైగర్ ఆర్ కృష్ణన్న గారి పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు మరియు ఆస్పత్రి సిబ్బందికి పండ్లు పంపిణీ కార్యక్రమం భారీగా చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనారిటీ నిరుపేద ప్రజల కోసం 50 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింపజేసి ప్రభుత్వంపై పోరాడిన గొప్ప నాయకుడు ఆర్ కృష్ణన్న అని కొనియాడారు. అదేవిధంగా బలహీన వర్గాల పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ఇంజనీరింగ్, మెడిసిన్ చదువులను ఫ్రీగా చదువుకోవడం కొరకు ప్రభుత్వంపై అనేక దపాలుగా పోరాటాలు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పెట్టించిన గొప్ప చరిత్ర ఆర్ కృష్ణ అన్నది అన్నారు.

అంతేకాకుండా నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వాలపై అనేక పోరాటాలు చేసి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయించిన చరిత్ర గల నాయకుడు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేరని అన్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల హక్కుల కోసం ప్రభుత్వాలపై పోరాటాలు చేసి రెండు వేలకు పైగా జీవోలు తెప్పించిన ఘన చరిత్ర ఆర్.కృష్ణన్నదని అలాంటి నాయకుడు ఇంకా ముందు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయనకు ఆయుష్ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్యా యాదవ్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగుల నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, పుల్లెంల యాదగిరి గౌడ్ ,బీసీ విద్యార్థి సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు మండల యాదగిరి యాదవ్, చింటూ యాదవ్, రాజు, హరికృష్ణ, జై పాలు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు టికెట్లపై రాయితీలు కూడా ప్రకటిస్తోంది.

ఈ క్రమంలో ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో శుభ వార్త అందించింది. బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు బస్సుల్లో ప్రయాణికులు టికెట్ కోసం ఆన్‌లైన్ పేమెంట్ చేసే అవకాశం కల్పించనుంది. ఇందుకోసం ఐ టిమ్స్ పరికారాలను బస్సుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

తొలుత పైలట్ ప్రాజెక్టుగా బండ్లగూడ డిపో పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్ అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, మెట్రో బస్సుల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. యూపీఐ యాప్‌లతో పాటు డెబిట్, కార్డుల ద్వారా టికెట్ కోసం పేమెంట్ చేయవచ్చు. బస్సుల్లో టికెట్ తీసుకునేటప్పుడు చిల్లర సమస్య ఏర్పడుతుంది.

కండక్టర్ దగ్గర చిల్లర లేకపోవడంతో ప్రయాణికులతో ఇబ్బంది అవుతుంది. దీని వల్ల కండక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి.

ఈ క్రమంలో చిల్లర సమస్య లేకుండా చేసేందుకు ఆన్‌లైన్ నగదు లావాదేవీలను ప్రోత్సహించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

ఎప్పటి నుంచో దీని గురించి చర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు బస్సుల్లో అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే టికెట్ రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ సౌకర్యం గతంలో అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు అదే విధానం బస్సుల్లో కూడా తీసుకురానుంది.....

కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేద్దాం

•టిపిసిసి ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ మెంబర్ డాక్టర్ బైకాని లింగం యాదవ్

మునుగోడు: టిపిసిసి ఆధ్వర్యంలో ఈనెల 17న తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని టిపిసిసి అధికార ప్రతినిధి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్ డాక్టర్ బైకాని లింగం యాదవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బుధవారం డాక్టర్ లింగం యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా విజయభేరి బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలంతా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని రానున్న సెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్నారు.

విజయభేరి బహిరంగ సభకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ హాజరవుతున్నారని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు బహుమానంగా ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. విజయభేరి బహిరంగ సభలో తెలంగాణలోని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేయాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు భరోసా కల్పించేందుకు డిక్లరేషన్ ను ప్రకటించడం జరుగుతుందన్నారు.

గందరగోళంలో ఉపాధ్యాయ బదిలీలు

స్కూల్‌ అసిస్టెంట్‌ ఎస్‌ఏ, నుంచి ప్రధానోపాధ్యాయుడు హెచ్‌ఎం,గా పదోన్నతి కల్పించే విషయంలో సీనియారిటీ తారుమారవుతోందని పలువురు టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో తప్పులు దొర్లుతున్నాయని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరిలో బదిలీల కోసం 78 వేల మంది అప్లై చేసుకున్నారు. ఫిబ్రవరి 1న కాకుండా సెప్టెంబర్‌ 1కి కటాఫ్‌ పెంచడంతో మరో ఏడు వేలు వచ్చాయి. పదోన్నతుల ప్రక్రియను ఎంఈవోలు, డీఈవోల పరిధిలో నిర్వహిస్తూ, వాళ్లే సీనియారిటీని రూపొందిస్తున్నారు.

జాబితాల్లో పొరపాట్లు

జోనల్ విధానం ప్రధాన సమస్య కాగా, సీనియారిటీ జాబితాలో పొరపాట్లు దొర్లుతున్నాయని పలువురు టీచర్ల ద్వారా డీఈవోలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. మల్టీజోన్ల పరిధిలో మాదిరి సీనియారిటీ జాబితాలను విడుదల చేయడంతో ఈ గందరగోళం నెలకొన్నట్లు టీచర్లు చెబుతున్నారు.

రెండు మల్టీజోన్ల పరిధిలో 1,974 హెచ్‌ఎం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. మూడేళ్ల సర్వీస్‌లోపు ఉన్న వారు దాదాపు వెయ్యి మందికిపైగా ఉన్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల సీనియారిటీ ఉంటే బదిలీకి అవకాశం ఉండదు. కానీ ప్రమోషన్‌కు ఈ నిబంధన వర్తించదు. ప్రమోషన్‌ వచ్చాక మల్టీజోనల్‌ పరిధిలో ఉండే జిల్లాలోని పోస్టు ఎంత దూరం ఉన్నా వారువెళ్లి జాయిన్ కావాల్సిందే. ఈ కారణంగా సర్వీసు తక్కువగా ఉన్నా దాదాపు 800 మంది వరకు పదోన్నతిని తిరస్కరించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు పాత చోటే పోస్టు ఇస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రిటైర్‌ మెంట్ వయసులో హెచ్‌ఎం ప్రమోషన్‌ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగా 1,974 పోస్టులు పూర్తిస్థాయిలో ప్రమోషన్లతో భర్తీ అయ్యే అవకాశం లేదు.

జోనల్‌ సమస్య

2022లో జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు మల్టీజోనల్‌ పరిధిలోకి వస్తారు. రెండు జోన్‌లుగా విభజించి, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్‌తో పాటు కామారెడ్డి:సిద్దిపేటను మల్టీజోన్‌–1లో చేర్చారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉమ్మడి జిల్లాలతో పాటు సంగారెడ్డిని మల్టీజోన్‌–2 పరిధిలోకి తెచ్చారు.

జోనల్‌ వ్యవస్థ లేనప్పుడు జిల్లా సీనియారిటీ ప్రాతిపదికగానే పదోన్నతులు కల్పించారు. అక్కడి పోస్టులు, ఖాళీలకు అనుగుణంగా ప్రమోషన్లు ఇచ్చారు. ఈ కారణంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ సర్వీసు ఉన్నవారికి పదోన్నతులు రాలేదు. కొన్ని జిల్లాల్లో తక్కువ సర్వీసు ఉన్నా హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు వచ్చాయి. ఇప్పుడు మల్టీజోన్‌ వారీగా సీనియారిటీని నమోదు చేయాలంటే పెద్ద సమస్య అవుతుంది....

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామివారి దర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

మంగళవారం స్వామివారిని 70,055 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.32 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

కాగా.. ఈ నెల 17 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అంకురార్పణ చేయనుంది...

కిమ్స్‌లో తొమ్మిదేండ్ల బాలికకు అరుదైన శాస్త్ర చికిత్స

పుట్టుకతోనే విపరీతమైన గూనితోపాటు వెన్నెముకపై అసాధారణమైన పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఛత్తీస్‌గఢ్‌ బాలిక (9)కు సికింద్రాబాద్‌ కిమ్స్‌ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కల్పించారు. వైద్య పరిభాషలో ‘కోజెనిటల్‌ డోర్సల్‌ కైఫోసిస్‌’గా పిలిచే ఈ సమస్యను సుదీర్ఘ శస్త్రచికిత్సతో విజయవంతంగా పరిష్కరించారు.

వెన్నెముకలోని ఎముకలు అసంపూర్తిగా ఏర్పడటంతో ఈ సమస్య తలెత్తినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని, ఎంతో సంక్లిష్టమైన ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆ బాలికకు పక్షవాతం వచ్చే ముప్పు ఉన్నదని వైద్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్ట్‌ల అభిప్రాయాలను తీసుకుని దాదాపు 6 గంటలపాటు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ శస్త్రచికిత్సలో భాగంగా ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరో మానిటరింగ్‌తోపాటు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా రోగి త్వరగా కోలుకోగలిగేలా చేసినట్టు తెలిపారు...

SBI లో 2 వేల పీవో పోస్టులు

దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎస్‌బీఐలో డిగ్రీ అర్హతతో పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దీని ద్వారా 2 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.

వీటిలో ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్‌-200, జనరల్‌- 810 ఖాళీలు ఉన్నాయి. పీహెచ్‌సీ కోటాలో వీఐ-20, హెచ్‌ఐ-36, ఎల్‌డీ-20, డీ అండ్‌ ఈఈ-36 పోస్టులను కేటాయించారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

ప్రారంభ వేతనం రూ.41,960,నాలుగు అడ్వాన్స్‌ ఇంక్రిమెంట్స్‌తో ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయనున్నవారు, మెడికల్‌, ఇంజినీరింగ్‌, సీఏ, కాస్ట్‌ అకౌంటెంట్‌ తదితర డిగ్రీలు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు 2023, ఏప్రిల్‌ 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 27లోగా దరఖాస్తు చేసుకోవాలి.