/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz నూతన రెవెన్యూ డివిజన్ గా చండూర్.. ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం Mane Praveen
నూతన రెవెన్యూ డివిజన్ గా చండూర్.. ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

TS: నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గంలోని చండూర్ ను నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రజల వద్ద నుండి అభ్యంతరాలు, సూచనలు నేటి నుండి 15 రోజులపాటు స్వీకరించినట్లు తెలిపారు. రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ కు తెలుపవచ్చని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఉండగా.. నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చండూర్ ను నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో, జిల్లాలో నాలుగో రెవెన్యూ డివిజన్ గా చండూరు ఏర్పాటు కానున్నది. నల్లగొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలాలను మరియు దేవరకొండ డివిజన్ పరిధిలోని నాంపల్లి, మర్రిగూడ మండలాలను కలుపుకొని నూతన రెవెన్యూ డివిజన్ గా చండూరు ఏర్పాటు కానున్నది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం చండూర్ ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై డివిజన్ పరిధిలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

మర్రిగూడ: భూ నిర్వాసితుల నిరసన
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం : ఏడేళ్లు కావస్తున్నా నేటికీ పరిహారం అందలేదని చర్లగూడెం భూ నిర్వాసితులు సోమవారం  ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, జిల్లా మంత్రి  ఇకనైనా స్పందించి తమకు నష్టపరిహారం ఇప్పించి తమను ఆదుకోవాలన్నారు. మంగళవారం కూడా ధర్నా కొనసాగిస్తామని, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు  తమ ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో వల్లభ కేశవ గౌడ్, నాగిల్ల మారయ్య, సంక బుడ్డి మల్లేష్, సంక బుడ్డి శ్రీను, సంక బుడ్డి శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల యందు 2023 - 24 విద్యా సంవత్సరానికి గాను, ఖాళీగా ఉన్న అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ తెలిపారు. సంబంధిత సబ్జెక్ట్  పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55% మార్కులు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీ లో 50% మార్కులు ఉన్నవారు అర్హులు. నెట్ / సెట్ / పిహెచ్డి మరియు బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

ఖాళీల వివరాలు:
బీబీఏ (జనరల్)-01
బిబిఏ (ఈ కామర్స్)-02

ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను కళాశాలలో అందజేయుటకు చివరి తేదీ 07.09.23. దరఖాస్తుదారులు దరఖాస్తుకు తమ యొక్క విద్యార్హతల సర్టిఫికెట్లను జత చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 8న ఉదయం గం. 10: 30 లకు ఎన్జీ కళాశాలలో, ఇంటర్వ్యూకు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కాగలరని తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.
దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూసుకుంట్ల
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సోమవారం శ్రీశ్రీశ్రీ మదివాళమంచిదేవుడు - సీతాళమ్మ - ఈదమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన  కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, తదితరులు ఉన్నారు.
TS: రేపు 11 రీజియన్ కేంద్రాల్లో టీఎస్ఆర్టీసీ లక్కీ డ్రా
హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన లక్కీ డ్రా ను ఈ నెల 5న టిఎస్ఆర్టిసి నిర్వహించనుంది. రాష్ట్రంలోని 11 రీజియన్ కేంద్రాల్లో లక్కీ డ్రా ను నిర్వహించి.. ప్రతి రీజియన్ కు ముగ్గురి చొప్పున 33 మంది విజేతలను ఎంపిక చేయనుంది. ఈ లక్కీ డ్రా కు జిల్లా స్థాయి మహిళా అధికారులను ముఖ్య అతిథులు గా ఆహ్వానించడం జరుగుతుందని టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించి, గెలుపొందిన వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకోసం రీజియన్ కు రూ.50 వేల  చొప్పున 11 రీజియన్ లకు రూ.5.50 లక్షలను కేటాయించింది. ఒక్కో రీజియన్ లో ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు ఇవ్వాలని సంస్థ తాజాగా నిర్ణయించింది. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆగస్టు ౩౦, 31 తేదిల్లో సంస్థ ప్రకటించిన లక్కీ డ్రా కు మహిళా ప్రయాణికుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో తాము ప్రయాణించిన టికెట్ వెనకాల పేరు, మొబైల్ నంబర్ ను రాసి వేశారు.

రేపు నిర్వహించే ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 33 మందికి హైదరాబాద్ ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఈ నెల 8న  బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. విజేతలకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించి వారిని ఘనంగా సంస్థ సత్కరించనుంది.
జైకేసారం గ్రామానికి రానున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల
రేపు అనగా ఈనెల 4 వ తేదీ సోమవారం నాడు ఉదయం 6 గంటలకు  మునుగోడు  ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో పర్యటించి,  పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కొవ్వూరి రంజిత్ కుటుంబానికి అండగా ఉంటాం: బీఎస్పీ నాయకురాలు ప్రియదర్శిని


నల్లగొండ జిల్లా, కట్టంగూర్ మండలం, అయిటిపాముల గ్రామానికి చెందిన దివంగత బీఎస్పి నాయకులు కొవ్వూరి రంజిత్ దశదిన కర్మ కార్యమానికి నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జి ప్రియదర్శిని మేడి ఆదివారం హాజరైనారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

TS: సిర్పూర్ గడ్డపై నీలి జెండా ఎగరాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేసి, రాబోయే ఎన్నికల్లో సిర్పూర్ గడ్డపై నీలి జెండా ఎగరవేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  అన్నారు. సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు,  ఆదివారం  హైదరాబాద్ లో బీఎస్పీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నూతనంగా పార్టీలో జాయిన్ అయిన వారికి పార్టీ కండువాలు కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు శక్తి వంచన లేకుండా అహర్నిశలు పార్టీ కోసం పనిచేయాలన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలను బీఎస్పీ పార్టీలో చేరే విధంగా కృషి చేయాలన్నారు. బహుజన రాజ్య స్థాపన కోసం పేద ప్రజలు బీఎస్పీలో చేరి పాలకులుగా మారాలన్నారు. రాబోయే ఎన్నికలలో బీఎస్పీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రమించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బిఎస్పీ లో చేరిన వారిలో తన్నీరు పోషం, హబీబ్, యూసుఫ్ ఖాన్, ఇందిర, ఎండి మహబూబ్, శేఖర్, విజయ్, సాబేర్, రమేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర  కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, ముస్తఫీజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Mane Praveen

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి పంటచేలు మునిగిపోవడం జరిగింది. సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతులు క

NLG: లెంకలపల్లి లో భారీ వర్షానికి మునిగిపోయిన వరిచేను
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి పంటచేలు మునిగిపోవడం జరిగింది. సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.
NLG: బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన చైతన్య సైకిల్ యాత్ర వాల్ పోస్టర్ రిలీజ్
నల్లగొండ జిల్లా, పెద్దవూర మండల కేంద్రంలో బిఎస్పి ఆధ్వర్యంలో  మహనీయుల విగ్రహాల వద్ద, శనివారం బహుజన చైతన్య సైకిల్ యాత్ర వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.

కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమల్ల వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ..  అక్టోబర్ 1 ఆదివారం నాడు హాలియా పట్టణ కేంద్రంలో జరగబోయే 'బహుజన సింహగర్జన' సభను విజయవంతం చేయడం కోసం  పెద్దవూర మండలంలో సోమవారం నుండి  అన్ని  గ్రామాలలో "బహుజన చైతన్య సైకిల్ యాత్ర' ద్వారా అన్ని గ్రామాలలో అన్ని వర్గాల ప్రజలను చైతన్యం చేసి వచ్చే సాధారణ ఎన్నికలలో బహుజనుల సత్తా చూపిస్తామని అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటేశ్వర్లు, పెద్దవూర మండల అధ్యక్షుడు కుక్కముడి ముత్యాలు, పెద్దవూర మండల ప్రధానకార్యదర్శి ఆదిమల్ల సత్యనారాయణ, మంద ఏలియా, సంగారం గ్రామ శాఖ అధ్యక్షుడు తరి రవికుమార్, తరి శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.