/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఉద్యోగుల పెన్షన్ విద్రోహ దినం, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఉద్యోగులు Mane Praveen
NLG: ఉద్యోగుల పెన్షన్ విద్రోహ దినం, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఉద్యోగులు
నల్లగొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది శుక్రవారం నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలియజేశారు. వారు మాట్లాడుతూ.. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం 2004 సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అమలులోకి  వచ్చిందని, ఈ రోజున ఉద్యోగులు పెన్షన్ విద్రోహ దినంగా పాటించడం జరుగుతుందని తెలిపారు. నాగార్జున కళాశాలలోని అధ్యాపక మరియు అధ్యాప కేతర సిబ్బంది  సిపిఎస్ విధానాన్ని నిరసిస్తూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు  ధరించి నిరసన వ్యక్తం చేశారు

నూతన పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగులు తమ జీవిత కాలం చేసిన సేవలకు పెన్షన్ లేకపోవడం అత్యంత బాధాకరం. ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసిన కాంట్రిబ్యూషన్ నిధిని స్టాక్ మార్కెట్లో పెట్టడం వలన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నూతన పెన్షన్ విధానం రద్దుచేసి, పాత పెన్షన్ విధానం అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
NLG: ఐద్వా సభ్యత్వం చేస్తున్న భూతం అరుణ కుమారి ఐద్వా పట్టణ కార్యదర్శి
నల్లగొండ: ఐద్వా ఆధ్వర్యంలో పట్టణంలోని అబ్బాసియా కాలనీలో శుక్రవారం ఐద్వా సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి మాట్లాడుతూ.. నిత్యం మహిళలపై హత్యలు, అత్యాచారాలు దాడుల పెరుగుతున్నాయి. రోజు మహిళలకు ఎక్కడో అక్కడ అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళలకు అండగా ఉంటూ, ఈ సభ్యత్వం పేరుతో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. గతంలో రేషన్ షాపులో 14 రకాల సరుకులు ఇవ్వాలని, వార్డు వార్డు సర్వే చేయడం జరిగింది. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఐద్వా ముందుంటుందని అన్నారు. ఈ సంస్థ స్థాపించి 42 సంవత్సరాలు అయినప్పటికీ ఐద్వా మహిళల వెన్నంటే ఉంటూ ప్రజల సమస్యలు అలాగే మహిళల సమస్యలపై పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కమిటీ సభ్యులు నిష్రత్, ఉన్నీసా, జానకమ్మ, నర్సమ్మ, సుజాత, సుగుణమ్మ, లక్ష్మమ్మ, లికిత తదితరులు పాల్గొన్నారు.
'చలో హైదరాబాద్ సెప్టెంబర్ 5న లేబర్ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయాలి'
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: గతంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికులకు ప్రకటించిన మోటార్ సైకిల్ ను, కార్మికులకు అందించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు సెప్టెంబర్ ఐదున చలో లేబర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగింది. లేబర్ కార్డు ఉన్న కార్మికుడికి సొంత ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు, అంగవైకల్యం చెందిన కార్మికులకు నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలని, ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన మోటార్ సైకిల్ స్కూటీలను వెంటనే ఇవ్వాలి. ఎల్ఓ కార్యాలలో పెండింగ్ క్లైములు వెంటనే పరిష్కరించి నిధులు విడుదల చేయాలని, పైరవీకారుల వ్యవస్థను అరికట్టాలి అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అట్లాగే నిర్మాణరంగంలో వాడే ముడి సరుకుల ధరలు మరియు కార్మికులు నిత్యం వాడే నిత్యవసర వస్తువులను తగ్గించాలని, రాష్ట్ర వెల్పర్ బోర్డు అడ్వైజర్ కమిటీని ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించాలి.

కార్డుకు అప్లై చేసుకునే ముందు వేలిముద్ర పద్ధతిని మార్పు చేసి ఐరిష్ పద్ధతిని పెట్టాలి. రాష్ట్రంలో 25 లక్షల కార్మికులు ఉంటే తొమ్మిది సంవత్సరాలు గడిచిన 15 లక్షలమందికి మాత్రమే చట్టబద్ధత కల్పించారు. మిగతా పది లక్షల కార్మికులకు ఎలాంటి భద్రత లేకుండా అన్యాయం చేశారు. అందుకు భవన నిర్మాణ కార్మికులంతా సెప్టెంబర్ 5న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు గ్యార యాదయ్య, బుసరాజు లక్ష్మణ్, పగడాల అంజయ్య, నూకల యాదయ్య, కుందేలు అభిలాష్, కురంపల్లి యాదమ్మ తదితరులు పాల్గొన్నారు
"నాగం భేరి" మాస పత్రికను విడుదల చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్

నల్లగొండ: బిజెపి నాయకులు డా. నాగం వర్షిత్ రెడ్డి.. భారతీయ జనతా పార్టీని ప్రజల వద్దకు చేరే విధంగా, నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరాలు, వివిధ సేవా కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, పల్లెల్లో చేసిన విస్తృత పర్యటన వివరాలను పొందుపరిచి ప్రచురించిన "నాగం బేరి" మాసపత్రికను జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ చేతుల మీదుగా గురువారం, బిజెపి జిల్లా కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, జిల్లా ఇంఛార్జి ప్రదీప్ , జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, ముత్యాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.

ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు: అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే ఆప్యాయత, మమతానురాగాలు వెలకట్టలేనివని, వారి అన్యోన్యమైన అనుబంధానికి శుభసూచికగా నిలిచే రాఖీ పౌర్ణమి, ఒక కుటుంబంలోనే కాక యావత్‌ సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తుందని బిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

నేడు రాఖీ పండుగ సందర్బంగా హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్లు ఎమ్మెల్యే ను కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరికీ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్షా బంధన్‌ ఒక వేడుక మాత్రమే కాదని, మన కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని చాటుతుందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ఇలాంటి పర్వదినాలు జరుపుకోవడం మన సంస్కతి గొప్పతనమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ప్రజా ప్రతినిధులు, నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

మర్రిగూడ మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా: జడ్పిటిసి

మర్రిగూడ: అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణంతో గ్రామ వీధులలో నీరు నిలవకుండా, ప్రజలకు వ్యాధులు దరిచేరకుండా ఉంటుందని, నల్గొండ జిల్లా ఫైనాన్స్ కమిటీ మెంబర్, జెడ్ పి టి సి పాశం సురేందర్ రెడ్డి అన్నారు.గురువారం మండలానికి చెందిన కుదాబక్షుపల్లి గ్రామంలో జెడ్పి నిధుల నుండి ఆయన సహకారంతో మంజూరైన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని భవిష్యత్తు లో, మరిన్ని నిధులను తీసుకువచ్చి అభివృద్ది పథంలో నడిపిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గ్రామం మరియు మండలాల అభివృద్ది కి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుధాకర్, ఉపసర్పంచ్ మైలారపు పార్వతమ్మ, పార్టీ మండల ఉపాధ్యక్షులు పందుల పాండు, కారింగు నరసింహ, శేఖర్, తదితులున్నారు.
లెంకలపల్లి: గ్రామ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్

అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు ల ఆత్మీయత అనురాగాలకు ప్రతీకైనా రాఖీ పండుగ సందర్భంగా, నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలంలోని లెంకలపల్లి గ్రామ ప్రజలకు, గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ గురువారం రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోదర సోదరీమణుల ఆత్మీయ బంధాన్ని చాటే పండుగ రక్షాబంధన్ అని తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగను ఆనందంతో జరుపుకోవాలని అన్నారు.

రక్షాబంధన్ శుభాకాంక్షలు: పెండెం ధనుంజయ్

మునుగోడు: సోదరీ సోదరుడు మధ్య అనుబంధానికి ప్రతీకైనా రాఖీ పండుగ సందర్భంగా.. మునుగోడు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పెండెం ధనుంజయ్ నేత గురువారం, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహోదరత్వానికి ప్రతీకగా జీవితాంతం అండగా ఉండాలని ఆడబిడ్డలు కోరుకుంటారు. రక్షాబంధన్ భారతీయ సాంప్రదాయ ఔన్నత్యానికి నిదర్శనం అని తెలిపారు

.

అక్రమ అరెస్టులతో బహుజన రాజ్యాన్ని ఆపలేరు: బీఎస్పీ నకిరికల్ నియోజకవర్గ ఇన్చార్జ్

ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చలో సూర్యాపేట పిలుపు మేరకు, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మరియు నకిరేకల్ నియోజకవర్గ నాయకులు సూర్యాపేట కు తరలి వెళ్లగా మార్గ మధ్యలో పోలీస్ లు అరెస్టు చేసి అర్వపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. బీసీ బిడ్డ అయిన వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసులు బనాయిస్తూ వేధించడం చాలా సిగ్గుచేటని, బీసీలతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా వారిని అణచివేయడంలో భాగంగానే ఈ అరెస్టులకు తెర లేపినారని ఆమె భావిస్తున్నట్లు తెలిపారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం వట్టే జానయ్య యాదవ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేనిపక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజనులు అంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. అక్రమ అరెస్టులతో బహుజన రాజ్యాన్ని ఆపలేరని అన్నారు. నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గం ఉపాధ్యక్షులు పావిరాల నర్సింహా యాదవ్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, రామన్నపేట మండల అధ్యక్షులు మేడి సంతోష్, కేతాపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, రామన్నపేట మండల ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, చిట్యాల మండల కోశాధికారి మునుగోటి సత్తయ్య, చిట్యాల అడ్వైజర్ జిట్ట నర్సింహా రాజ్, అన్నమళ్ళ సైదులు తదితరులు ఉన్నారు.

అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం: బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్
తిరుమలగిరి సాగర్: బహుజన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ పై ఒక్క రాత్రిలోనే అక్రమంగా  71 కేసులను నమోదు చేయించారని ఆరోపిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బహుజన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ కు మద్దతుగా చలో సూర్యాపేట పిలుపునిచ్చిన నేపథ్యంలో తిరుమలగిరి మండల పోలీస్ అధికారులు బీఎస్పీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా నియోజవర్గ బీఎస్పీ ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లడుతూ.. తక్షణమే ఒట్టే జానయ్య యాదవ్ పై అక్రమంగా నమోదు చేసిన 71 కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు.  బీఎస్పీ తిరుమలగిరి మండల అధ్యక్షుడు అంగోత్ శివ నాయక్, బోడ రవి, తదితరులు ఉన్నారు.