/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz టీపీసీసీ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ తొలగించిన ప్రభుత్వం Yadagiri Goud
టీపీసీసీ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ తొలగించిన ప్రభుత్వం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సర్కారు షాక్ ఇచ్చింది. రేవంత్ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది.

నిన్నటి నుంచి సెక్యూరిటీ లేకుండానే రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు.

ఇటీవల 4+4 భద్రతను 2+2కు ప్రభుత్వం కుదించింది.

ఇప్పుడు పూర్తిగా భద్రతను ప్రభుత్వం తొలగించడం హాట్ టాపిక్ గా మారింది.

2 నెలల క్రితం తనకు భద్రత కల్పించాలని రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.

ఎలాంటి కారణాలు లేకుండానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్ మెన్లను తొలగించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి......

TSRTC: ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ బిల్లుపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై న్యాయ సలహా కోరారు.

ఈమేరకు ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపారు..

గతంలో వెనక్కి పంపిన బిల్లులపై చేసిన సిఫార్సుల గురించి కూడా గవర్నర్‌ అడిగారు.

తన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? నిర్ధారించాలన్నారు.

న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

దురుద్దేశంతో చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలకు గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు..

Moon Mission: చంద్రుడిని ముందుగా చేరేదెవరు..? చంద్రయాన్‌-3 Vs లూనా25పై ఉత్కంఠ!

చంద్రుడిపై పరిశోధనలు చేపట్టేందుకు (Moon Mission) ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన 'చంద్రయాన్‌-3' (Chandrayaan-3)..

తాజాగా కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌ (Vikram, Pragyan).. కొన్ని రోజుల్లో చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు సిద్ధమైంది.

ఇదే సమయంలో రష్యా ప్రయోగించిన లూనా-25 (Luna) కూడా జాబిల్లి దక్షిణ ధ్రువం వైపు అడుగులు వేస్తోంది. ఇలా.. భారత్‌, రష్యాలు వేర్వేరుగా ప్రవేశపెట్టిన ల్యాండర్లలో ఏది ముందు చంద్రుడిపై దిగనుందనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రెండూ స్వల్ప వ్యవధి తేడాతోనే జాబిల్లిపై దిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. సురక్షితంగా దిగడమే ప్రధాన అంశమని నిపుణులు పేర్కొంటున్నారు..

భారత్‌కు 40.. రష్యాకు 11 రోజులే..

జులై 14న ప్రయాణాన్ని మొదలుపెట్టిన చంద్రయాన్‌-3.. చంద్రుడికి చేరువయ్యేందుకు మొత్తంగా 40 రోజులకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. మరోవైపు.. దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత చంద్రుడిపై పరిశోధనల కోసం ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన లూనా-25.. 11 రోజుల్లోనే జాబిల్లిని చేరుకోనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఆగస్టు 23న చంద్రయాన్‌-3ను సురక్షితంగా దించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తుండగా.. లూనా-25 మాత్రం ఆగస్టు 21- 23వ తేదీల్లోనే దిగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇస్రో ఇప్పటికే స్పష్టతనిచ్చినప్పటికీ.. రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ మాత్రం కచ్చితంగా ఏ సమయంలో దిగుతుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. వీలైతే ఈ రెండూ ఒకేరోజు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది..

సామర్థ్యంలోనూ భారీ తేడాలు..

తక్కువ బరువుతోపాటు భారీ ఇంధన సామర్థ్యం.. లూనా-25 వేగంగా చంద్రుడి దగ్గరకు చేరేందుకు దోహదపడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లూనా-25 మొత్తం బరువు 1750 కిలోలు కాగా.. చంద్రయాన్‌- 3 మాత్రం 3900 కిలోలు. ఇందులో పేలోడ్‌ బరువు సుమారు 1800 కిలోలు (ల్యాండర్‌, రోవర్‌లు కలిపి) కాగా, లూనా-25 పేలోడ్‌ కేవలం 31 కేజీలు మాత్రమే. చంద్రయాన్‌-3 కంటే తక్కువ ద్రవ్యరాశి ఉన్నందువల్లే లూనా-25 స్వల్ప సమయంలో వెళ్లేందుకు సాధ్యమవుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు లూనా-25కి ఇంధన నిల్వ సామర్థ్యం భారీగా ఉండటం వల్ల చంద్రుడిపైకి నేరుగా వెళ్లేందుకు దోహదపడుతోందని.. చంద్రయాన్‌-3లో ఇంధన సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసార్లు కక్ష్యలో తిరుగుతూ వెళ్లాల్సి వచ్చిందని ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌ వెల్లడించారు.

అందుకే దీన్ని ప్రయోగించిన 22 రోజుల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిందని అన్నారు.

సూర్యకాంతే కీలకం..

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ఈ మిషన్‌లు చంద్రుడిపై దిగే సమయాన్ని సూర్యకాంతి ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. దక్షిణ ధ్రువంపై దిగే సమయంలో అక్కడ వెలుగు ఉండాలన్నారు. చంద్రుడిపై ఆగస్టు 23 నుంచి పగలు మొదలవుతుంది. ఇలా స్వల్ప సమయం తేడాతో భారత్‌, రష్యాలు ప్రయోగించిన వ్యోమనౌకలు చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మిషన్‌లు విజయవంతంగా జాబిల్లిపై దిగితే.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 మొత్తంగా 14 రోజులు పనిచేయనుండగా.. లూనా-25 మాత్రం ఏడాది పాటు పరిశోధనలు జరపనుంది..

భారతీయ విద్యార్థులకు అమెరికా ఆంక్షలు ఐదేళ్ల పాటు నిషేధం

ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిరిగి భారత్‌కు పంపారు.

దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తిరిగి భారత్‌కు పంపారు. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం విద్యార్థులు అమెరికా వెళ్లగా.. సరైన పత్రాలు లేవంటూ అనుమతి నిరాకరించారు.

వీసా ప్రక్రియలను పూర్తి చేసినాప్పటికీ.. ఆయా విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్లు పొందినా కూడా మెయిల్స్‌, సోషల్‌ మీడియా అకౌంట్లను తనిఖీ చేసిన అనంతరం అధికారులు తిరిగి వారిని భారత్‌కు పంపారు.

అట్లాంట, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగోలో విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. భారతీయ విద్యార్థులను తిరిగి ఎయిర్‌ ఇండియా విమానంలో భారత్‌కు పంపారు.

ఆయా విద్యార్థులు అమెరికాలో ప్రవేశించకుండా ఐదేళ్లపాటు పాటు నిషేధం విధించారు.

సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతోనే విద్యార్థులను తిప్పిపంపినట్లుగా తెలుస్తుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సైతం ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు...

నిమ్స్‌ను సందర్శించిన నెదర్లాండ్స్ ప్రతినిధుల బృందం

నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్, క్యాన్సర్, యూరాలజీ విభాగాలను నెదర్లాండ్ బృందం సందర్శించింది.

ఇందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్ కూడా ఉన్నారు. నిమ్స్‌లో అందిస్తున్న చికిత్సలను అధ్యయనం చేసేందుకు ఈ బృందం పర్యటించింది.

నెదర్లాండ్స్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ జాన్ కైపెర్స్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణలో నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్ట గురించి అనేక విషయాలు విన్నానని తెలిపారు.

స్వయంగా చూసేందుకు నిమ్స్‌కి వచ్చానన్నారు.

ఇక్కడ వివిధ విభాగాల పనితీరు గురించి అధ్యయనం చేసేందుకు నిమ్స్‌కి వచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో వైద్య సేవలు బాగున్నాయని, అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని ప్రశంసించారు....

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్‌.. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన తెల్లం వెంకట్రావు

ఖమ్మం జిల్లా:ఆగస్టు 17

మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చారు. నిన్న మొన్నటి వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన ఆయన.. అంతర్గత విబేధాలతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు.

మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, బీఆర్‌ఎస్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు సమక్షంలో హైదరాబాద్‌లో తన అనుచరులతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి కూడా పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ స్వభావం తెలుసుకోవడానికి తెల్లం వెంకట్రావుకు నెలకంటే ఎక్కువ సమయం పట్టలేదని అన్నారు.

వెంకట్రావ్‌ నేపథ్యం ఇదీ..

తెల్లం వెంకట్రావు 2014లో మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు.

ఆయన అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ భద్రాచలం భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కొన్నినెలల నుంచి పొంగులేటితో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాటి నుంచి అక్కడి నేతల వ్యవహారశైలితో తెల్లం ఇబ్బందిపడ్డారని తెలుస్తున్నది. తన రాజకీయ భవిష్యత్తుపై పొంగులేటి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, పార్టీ వ్యవహారాల్లో తనకు స్థానం కల్పించకపోవడం, పార్టీ ఒంటెద్దుపోకడలు అనుసరించడం వంటి కారణాలతో తెల్లం వెంకట్రావు పార్టీని వీడుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌లో చేరిన కొద్దిరోజుల్లోనే పొంగులేటి ముఖ్యఅనుచరుడు పార్టీని వీడడం ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశమైంది. తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడడం పొంగులేటికి అపప్రదం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు....

KA Paul: మోదీ, కేసీఆర్, రాహుల్‌ను ఢీ కొట్టే శక్తి నాకే ఉంది

సంగారెడ్డి: బీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఒప్పందం ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ''తొమ్మిదేళ్లలో ఏనాడూ జగ్గారెడ్డిని నేను శపించలేదు..

జగ్గారెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నా. సదాశివపేటలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టా. చారిటీ సిటీని చూసి దేశ, విదేశీ ప్రతినిధులు చూసి ఆశ్చర్యపోయారు. ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డికి డబ్బులు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో గొడవ చేయించి నా చారిటీ మూయించారు.

జగ్గారెడ్డిని ఇప్పటి వరకు క్షమించాను.. ఇక నుంచీ క్షమించను. వెయ్యి కోట్లు ఇచ్చిన బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరుతావా? అభివృద్ధి చేసే నా పార్టీలో చేరతావా?, కేసీఆర్...

గద్దర్ బతికి ఉన్నప్పుడు ఏనాడూ పట్టించుకోలేదు. గద్దర్ చచ్చిపోతే అన్ని పార్టీల నాయకులు కుక్కల్లాగా వాలిపోయారు. మంత్రి మల్లారెడ్డి భూములు కబ్జా చేస్తున్నారు. కేటీఆర్ (KTR) గూగుల్‌ని కనిపెట్టినట్లు బిల్డప్ ఇస్తున్నారు..

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నా రేవంత్‌కి పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్‌కి అసలు ఓటు బ్యాంకే లేదు.

ఆర్ఎస్ఎస్ (RSS) వల్లే రేవంత్‌ని టీ పీసీసీ చీఫ్‌ని చేశారు. మోదీ, కేసీఆర్, రాహుల్‌ని ఢీ కొట్టే శక్తి కేఏ పాల్‌కే ఉంది. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న చాలా మంది మంత్రులు నాతో టచ్‌లో ఉన్నారు. నేను గెలిస్తేనే తెలంగాణ బాగుపడుతుందని మంత్రులు చెప్పారు.'' అని కేఏ పాల్ వ్యాఖ్యానించారు..

INS Vindhyagiri : తీర రక్షణకు 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి'.. ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

కోల్‌కతా : భారత నౌకాదళంలో సేవలందించనున్న సరికొత్త యుద్ధనౌక 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి'ని (INS Vindhyagiri) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ప్రారంభించారు..

పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోల్‌కతాలోని హుగ్లీ నది ఒడ్డునున్న గార్డెన్ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ అండ్ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ను (జీఆర్‌ఎస్‌ఈ) సందర్శించారు. ఈ సందర్భంగా అధునాతన స్టెల్త్ యుద్ధ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.

'వింధ్యగిరి' కర్ణాటక రాష్ట్రంలోని ఓ పర్వత శ్రేణి పేరు. 'ప్రాజెక్ట్‌ 17ఎ'లో భాగంగా రూపొందించిన ఆరో యుద్ధనౌక ఇది. ఇదే పేరుతో గతంలో ఉన్న యుద్ధనౌక 31 ఏళ్లపాటు సేవలందించింది. 2012 దాకా అది పలు క్లిష్టతరమైన ఆపరేషన్లలో పాల్గొని సత్తా చాటింది..

భారత అమ్ములపొదిలోకి చేరనున్న అత్యాధునిక నౌక 'ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి'లో సరికొత్త గ్యాడ్జెట్‌లను అమర్చనున్నారు. దీనిని నౌకాదళానికి అప్పగించే ముందు విస్తృత స్థాయిలో.. వివిధ రకాలుగా పరీక్షించి చూస్తామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా.. 'పీ17ఎ' నౌకలన్నీ గైడెడ్‌ మిస్సైల్‌ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఒక్కో నౌక పొడవు 149 మీటర్లు ఉంటుంది. 6,670 బరువుతో.. ఇవి 28 నాట్స్‌ వేగంతో ప్రయాణించగలవని ఓ అధికారి తెలిపారు.

ఇవి శివాలిక్‌ క్లాస్‌ ప్రాజెక్ట్ 17 యుద్ధనౌకల కంటే మెరుగైనవని చెప్పారు. అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్‌ఫామ్‌ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు వీటిలో పొందుపరిచినట్లు వెల్లడించారు. భూమి, ఆకాశం, నీటి లోపల నుంచి ఎదురయ్యే సవాళ్లకు ఇవి దీటుగా బదులిస్తాయని రక్షణశాఖ తెలిపింది..

తెలంగాణ రాష్ట్రంలోరెండు రోజులు వర్షాలు

ఖమ్మం జిల్లా :ఆగస్టు 17

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి వర్షం కురుస్తున్నది. కొత్తగూడెం, సుజాతానగర్‌, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, చండ్రగొండ, ఇల్లందు, పాల్వంచ, ములకలపల్లి, బూర్గంపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది.

ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.

ఇక రాష్ట్రంలో గురువారం శుక్రవారం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది.

బంగాళాఖాతం సముద్ర మట్టం నుంచి 4.5 నుంచి 7.6 మి.మీ. ఎత్తు మధ్యలో ఆవర్తనం ఉన్నది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి ఈ నెల 18 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

దీని ప్రభావంతో 18, 19 తేదీల్లో ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

20న కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది...

CP Anand : హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ ఆనంద్..

హైదరాబాద్ : హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేతపై హైదరాబాద్ సీపీ ఆనంద్ సంచలన విషయాలు వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్‌ కేసులో డేవిడ్ హుకా అనే నైజేరియన్‌ని అరెస్ట్ చేశామన్నారు..

8 ఏళ్ళ క్రితం బెంగళూరుకు వచ్చారని.. ఇండియాకి వచ్చాక పాస్టర్‌గా అవతరమెత్తి డేవిడ్ హుకా తన పేరును మార్చుకున్నాడని తెలిపారు. ఫేక్ వీసా, ఫేక్ ఐడీతో సిమ్ కార్డులు తీసుకుంటున్నాడన్నారు.

ఇంటర్నేషనల్ సిమ్ కార్డులు వాడి పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారని పేర్కొన్నారు. ఆల్ ఇండియా నైజేరియన్ స్టూడెంట్ కమ్యూనిటీ అసోషియేషన్‌ను ఏర్పాటు చేశాడని అన్నారు.

డ్రగ్స్ , గంజాయి కేసులో నైజేరియన్స్ అరెస్ట్ అయితే వారికి బెయిల్ ఇప్పించడం.. వారిని వారి దేశాలకి పంపించడం వంటి విషయాల్లో డేవిడ్ హుకా బాధ్యత తీసుకుంటున్నాడని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.

ఇతని కోసం బెంగళూరులో మకాం వేసి పట్టుకున్నామన్నారు. డేవిడ్ హుకా నుంచి 264 MD పిల్స్ ని సీజ్ చేశామన్నారు. రూ.4 కోట్లు ఆస్తులు జప్తు చేయబోతున్నామని సీపీ ఆనంద్ వెల్లడించారు..

కాగా.. నేటి ఉదయం హైదరాబాద్‌లో భారీగా గంజాయిని లంగర్ హౌస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి రూపాయలు విలువైన గంజాయిని సీజ్ చేశారు. ఆరుగురు గంజాయి సప్లయర్లను అరెస్ట్ చేశారు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ చేశారు. పక్కా సమాచారంతో గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో నైజీరియన్స్ డ్రగ్ సప్లై చేస్తున్నారు. 11 లక్షల విలువైన డ్రగ్స్‌ను నార్కోటిక్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ సీజ్ చేసింది. ఈ కేసులో ఒక నైజీరియన్ అరెస్ట్ అయ్యారు..