/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz 90కి పైగా స్థానాలు గెలుస్తాం... సీఎం కేసీఆర్ Miryala Kiran Kumar
90కి పైగా స్థానాలు గెలుస్తాం... సీఎం కేసీఆర్

90కి పైగా గెలుస్తాం

అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 90కి పైగా స్థానాలు గెలుస్తామని, ఖమ్మం జిల్లా పరిధిలో ఆరేడు సీట్లు గెలవడం ఖాయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు.

బుధవారం ఆయన ఖమ్మం జిల్లా నేతలతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. వారిని కార్యోన్ముఖులను చేశారు.

ఖమ్మంలో మెజార్టీ సీట్లు మనవే

జిల్లాలో 6-7 సీట్లలో విజయం

పెండింగ్‌ హామీలన్నీ పూర్తి చేశాం

ఏమేం పథకాలు, కార్యక్రమాలు చేశామో ప్రజలకు వివరించాలి

ఖమ్మం నేతలతో సీఎం కేసీఆర్‌

 రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 90కి పైగా స్థానాలు గెలుస్తామని, ఖమ్మం జిల్లా పరిధిలో ఆరేడు సీట్లు గెలవడం ఖాయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా నేతలతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. వారిని కార్యోన్ముఖులను చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు ఒకే సీటు వచ్చిందని, అయినా రాష్ట్రవ్యాప్తంగా 83 సీట్లు సాధించామని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 90కి పైగా సీట్లు వస్తాయని చెప్పారు. ఖమ్మం జిల్లా కాకుండానే రాష్ట్రవ్యాప్తంగా 85 సీట్ల వరకు వచ్చేలా ఉన్నాయని వివరించారు.

ఖమ్మంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 6-7 సీట్లు ఖాయమని పేర్కొన్నారు. జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలను నెరవేర్చామని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించామని, రుణమాఫీ పూర్తి చేశామని, రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేశామని, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇస్తున్నామని, ఇలా ప్రజలకు సంబంధించిన పెండింగ్‌ అంశాలన్నీ పూర్తి చేశామని వివరించారు. ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి లేకుండా చేశామని తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, దళితబంధు, బీసీబంధు వంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు ఏమేం చేశామో వివరించి చెప్పి ఓట్లు అడగాలని దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా నేతలంతా ఎన్నికలకు పకడ్బందీగా సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, సండ్రవెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

రేషన్ కార్డు లేని వారికి గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలి

రేషన్ కార్డు లేని వారికి గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలి

కొత్తపల్లి శివకుమార్ సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా జిల్లా ప్రధాన కార్యదర్శి

      రేషన్ కార్డు లేని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ఏవో కు  వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం పేదల కోసం పెట్టడం దానికి మూడు లక్షల కేటాయించడం అభినందనీయం.

కానీ రేషన్ కార్డు ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని ఆంక్షలు పెట్టడం సరైన విధానం కాదని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేటి వరకు రేషన్ కార్డు కోసం కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారనీ కానీ ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదనీ దీనివల్ల చాలామంది పేదలు నేటి వరకు రేషన్ కార్డు లేక అవస్థలు పడుతున్నారనీ తెలిపారు కాబట్టి అర్హులైన పేదలకు వారి ఇతర ఆధారాలను పరిగణలోకి తీసుకొని  అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డు లేకున్నా మూడు లక్షల రూపాయల గృహ లక్ష్మీ పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమం పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి అఖిల్, ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి రామోజీ, పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షులు చంద్రకళ జిల్లా నాయకులు సూరం రేణుక జయమ్మ పార్టీ జిల్లా నాయకులు నాగన్న ఈరబాబు శ్రీదేవి అనూష లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

రైతుబీమా పథకానికి ఐదేండ్లు పూర్తి.. ..

రైతుబీమా పథకానికి ఐదేండ్లు పూర్తి.. 

ఇప్పటి వరకు రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం

రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్నదాతల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేసి రైతుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు.

రైతుబీమా పథకానికి నేటితో ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్నదాతల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేసి రైతుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. రైతుబీమా పథకానికి నేటితో ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018, ఆగస్టు 15న ప్రారంభించిన రైతు బీమా పథకం నేటితో ఐదేండ్లు పూర్తి చేసుకున్నదని హరీశ్‌రావు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అర్హులైన రైతులందరి తరపున ప్రభుత్వమే ఎల్ఐసి (LIC)కి ప్రీమియం చెల్లిస్తూ, ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తూ తెలంగాణ సర్కార్ బాసటగా నిలుస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు.

పథకం ప్రారంభించిన తొలి ఏడాది 2018-19లో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగిందన్నారు. 2018 రూ.602 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తే, నేడు రూ. 1477 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల తరుపున ప్రభుత్వం రూ. 6861 కోట్లు ప్రీమియం రూపంలో చెల్లించగా, వివిధ కారణాలతో ప్రాణం కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం అందించిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

గుంట భూమి ఉన్నా చాలు, రైతుగా గుర్తించి, ఆ రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించే అద్భుతమైన రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రైతుల గురించే కాదు, రైతుల కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హరీశ్‌రావు.

బీసీ టైగర్ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి వెంటనే విడుదల చేయాలి:బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ

బీసీ టైగర్ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారి వెంటనే విడుదల చేయాల చేయాలి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలంగాణలో బీసీ సమస్యలపై ఆందోళన చేస్తున్న సందర్భంగా వారిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడ అప్రాజస్వామయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే వారిని విడుదల చేయాలని లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

కృష్ణయ్య గారితో పాటుత ధర్నా చేస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ నీలం వెంకటేష్ రాజ్ కుమార్ భూపేష్ సాగర్ జిల్లేపల్లి అంజి వేములపల్లి రామకృష్ణ అనంతయ్య ఉద్యమ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప‌దేండ్ల కింద‌టి తెలంగాణను త‌లుచుకుంటే.. ఇప్ప‌టికీ దు:ఖం తన్నుకొస్తది: సీఎం కేసీఆర్

ప‌దేండ్ల కింద‌టి తెలంగాణను త‌లుచుకుంటే.. ఇప్ప‌టికీ దు:ఖం తన్నుకొస్తది సీఎం కేసీఆర్

దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. గోల్కొండ కోట‌పై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేసిన అనంత‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.

సమైక్య పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలూ విధ్వంసమైపోయాయని కేసీఆర్ పేర్కొన్నారు. నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ముకాస్తూ చేవచచ్చి చేష్టలుడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజాఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని తెలిపారు.

తెలంగాణ పున‌ర్నిర్మాణం ఒక పవిత్ర యజ్ఞం

పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దు:ఖం తన్నుకొస్తది అని కేసీఆర్ అన్నారు. ఎటుచూసినా పడావుపడ్డ పొలాలు, పూడుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దుబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకు పోయినా సుక్క నీరు కానరాని బోర్లు, ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరంటు షాక్‌కో, పాము కాటుకో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడుగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకుమీద ఆశ చచ్చి ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు, యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు, ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, మొరం తేలిన వాకిళ్లు, ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులు ఉండే అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించింద‌ని సీఎం తెలిపారు. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమధనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించిందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది

ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఎరిగిన ప్రభుత్వం కనుక, దానికి అనుగుణంగా అన్నిరంగాలనూ ప్రక్షాళన చేసిందని కేసీఆర్ తెలిపారు. అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించింది. అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో, అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. “తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది” అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచింది అని కేసీఆర్ పేర్కొన్నారు.

పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్న తెలంగాణ

నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్ ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది అని కేసీఆర్ తెలిపారు. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. తరలివస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతున్నది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇపుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. దశాబ్దకాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నది. ఈ అద్భుతమైన పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా తెలంగాణ ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని ఇదే రీతిన అందించాలని హృదయ పూర్వకంగా మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

త‌లస‌రి ఆదాయం, త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో నంబర్ 1

ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం గానీ, ఒక రాష్ట్రం గానీ సాధించిన ప్రగతికి ప్రమాణంగా చూసే ప్రబల సూచికలు.. త‌లస‌రి ఆదాయం, త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం అని కేసీఆర్ చెప్పారు. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసింది. సంపద పెంచింది. ప్రజలకు పంచింది. దేశంలో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను అధిగమించి నూతన రాష్ట్రం తెలంగాణ రూ. 3 లక్షల 12 వేల 398 తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు అయిన 1,255 యూనిట్లను అధిగమించింది. దేశ సగటు కంటే 70 శాతం అత్యధికంగా 2,126 యూనిట్ల సగటు వినియోగంతో తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వ‌న్‌గా నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.

వెలుగు జిలుగుల తెలంగాణ

విద్యుత్తు రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ అని కేసీఆర్ పేర్కొన్నారు. అనతికాలంలోనే అన్నిరంగాలకూ 24 గంటలపాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. విద్యుత్తు రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి అన్నిరంగాలనూ ప్రభావితం చేసింది. రాష్ట్రం ప్రగతిపథంలో పయనించేందుకు నిరంతర విద్యుత్తు చోదకశక్తిగా పనిచేసింది అని కేసీఆర్ తెలిపారు.

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర 77వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి గారు జండా ఎగరవేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారు యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నాసు ప్రసన్న రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ గారు బీసీ సంఘం జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, బీసీ సంఘం మహిళా మండల అధ్యక్షురాలు శంకర్ దుర్గ, కల్లూరు సత్యం గౌడ్ కూరెళ్ళ విజయ చారి, బక్కతట్ల వెంకన్న పున్న పాండు క్రాంతి , వలకీర్తి శ్రీనివాస్ రావిరాల వెంకట్, మల్లెబోయిన సతీష్ యాదవ్ ,రుద్ర లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, , చొల్లేటి రవీంద్ర చారి , చిలుకూరి శ్రీను వనం లలిత కే చంద్రశేఖర్ గౌడ్ మూడ సైదులు గంజి రాజేందర్ ముషం శేఖర్ మొదలగు వారు పాల్గొన్నారు.

నల్గొండ 17వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్గొండ 17వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా నల్గొండ ఆర్జాలబావిలో జాతీయ జెండాను ఆవిష్కరించి నల్గొండ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిందని, అలాంటి స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు దేశభక్తి అలవర్చుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, కౌన్సిలర్సు, వార్డు ఆర్పి, శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఫ్లాష్.... ఫ్లాష్... కాంగ్రెస్ పార్టీకి షాక్... తిప్పర్తి మండలంలోని తానేదార్పల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ తన అనుచరులతో కలిసి BRS లో చేరిక

ఫ్లాష్....కాంగ్రెస్ పార్టీకి షాక్..

 

తిప్పర్తి మండలం తానేదార్ పల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కొండ్ర జానయ్య... తన అనుచరులతో కలిసి ... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షం లో.... కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బిఆరెస్ పార్టీలో చేరారు.. వీరంత కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి కార్యకర్తలు, గత శాసనసభ్యునికి విరంతా ముఖ్య అనుచరులు కావడం విశేషం... వీరి చేరికతో... మండలం లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లయింది...

 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొండ్ర జానయ్య, మండారి యాదయ్య, దాసరి వెంకన్న జెరిపోతుల జానయ్య, కొత్తపల్లి పిచ్చయ్య, కారే సైదులు, మేకల సైదులు...

పార్టీలో చేరినవారిలో.. కొండ్ర సుధాకర్, సుంకరబోయిన బిక్షం, సైదులు,లోకాని నవీన్ సతీష్ సురేష్ నరేష్..తదితరులు ఉన్నారు

చరిత్ర మరువని యోధుడు కామ్రేడ్ బూరుగు అంజన్న: CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు డేవిడ్ కుమార్

ఈదులూరు

 చరిత్ర మరువని యోధుడు కామ్రేడ్ బూరుగు అంజన్న 

 CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు డేవిడ్ కుమార్

 తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ బూరుగు అంజన్న 20వ వర్ధంతి సందర్భంగా సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈదులూరు గ్రామంలో జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈసందర్భంగా సీపీఐ (ఎం-ఎల్ ) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్ ఎర్రజెండా ఎగురవేసి అంజన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం గ్రామ సర్పంచ్ ఐతగొని నారాయణ పూల మాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు డేవిడ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ అంజన్న భూమి,భుక్తి,విముక్తి పోరాటంలో నిజాం నవాబు, రజాకార్ల కు వ్యతిరేకంగా మట్టిమానుషులను తట్టిలేపి ఉక్కుమనుషులుగా మార్చి,బాంచెన్ దొరా నికాల్మొక్త అన్నా చేతులతోనే బందూకులు పట్టించి పొరాటలవైపు నడిపించాడని అంజన్న చరిత్ర మరువలేనిదని అన్నారు.ఎర్రజెండా వెలుగులో దున్నేవానికే భూమి నినాదంతో జరిగిన నక్సల్భరీ ఉద్యమవైపు నిలబడి రైతు కూలీలను ఐక్యం చేశాడని అన్నారు.కామ్రేడ్ అంజన్న 40 సంవత్సరాలు గ్రామ సర్పంచిగా ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని తెలిపారు.కామ్రేడ్ బూరుగు అంజన్న ఎంతోమంది విప్లవకారులకు ఆదర్శంగా నిలిచాడని,జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని కొనియాడారు. అంజన్న స్పూర్తితో నేటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని అన్నారు.ప్రజలపై పన్నుల భారాన్ని మోపి,కార్పొరేట్ శక్తులకు ప్రజాసొమ్మును ధారాదత్తం చేస్తున్న మోడీ,కేసీఆర్ పాలకులకు బుద్దిచెప్పడమే కామ్రేడ్ అంజన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐతగొని నారాయణ, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సాగర్,రైతు-కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి,పుట్ట సత్యం, పివైఎల్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, బి.వి చారి,గ్రామ పార్టీ కార్యదర్శి బూరుగు సత్తయ్య,ఎమ్.ఆర్.పి.ఎస్ నాయకులు భరత్,బింగి నర్సయ్య,వీరంజనేయులు,బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చింతల అంజయ్య, POW జిల్లా అధ్యక్షుడు బూరుగు లక్ష్మక్క,దణ్డంపెళ్లి చంద్రయ్య, గుడుకుంట్ల వేoకటయ్య,తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 4,5 తేదీలలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలు

సెప్టెంబర్ 4,5 తేదీలలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలు

 --- కరపత్ర ఆవిష్కరణ

  తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలు పోరాటాల పురిటి గడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 4,5 తేదీలలో నిర్వహిస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ తెలిపారు

         

సోమవారం ఎస్పిటి మార్కెట్ ట్రస్ట్ భవన్లో మహాసభల కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది*. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేటి తెలంగాణ రాష్ట్రంలో చేనేత వస్త్ర పరిశ్రమ మరియు చేనేత కార్మికుల సమస్యలపై గత 70 సంవత్సరాలుగా గల్లీ నుండి ఢిల్లీ దాకా అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించామని అన్నారు. ఆనాటి బిజెపి ప్రభుత్వం చేనేత పరిశ్రమను చావు దెబ్బ తీసేందుకు సత్యం కమిటీ సిఫారసులు తీసుకొని వస్తే ఆ సత్యం కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మిక సంఘాల మరియు చేనేత సహకార సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐక్య ఉద్యమాలను, ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. చేనేత సహకార సంఘాలకు మరియు చేనేత కార్మికులకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని 2008లో ఐక్య కార్యచరణ ఏర్పాటు చేసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి నాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి ని కలిసి రుణమాఫీ చేయాలని పోరాడి కార్మికుల రుణమాఫీ చేయించిన చరిత్ర చేనేత కార్మిక సంఘానిదని ఆయన అన్నారు. చేనేత వస్త్ర పరిశ్రమకు ఉపయోగకరంగా ఉన్న జాతీయ చేనేత బోర్డుని, మహాత్మా గాంధీ బునకర్ భీమా యోజన, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీం, హౌస్ కం వర్క్ షెడ్లాంటి కేంద్ర పథకాలను రద్దు చేసినందుకు చేనేత పరిశ్రమ పైన జిఎస్టి విధించిన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చేనేత పరిశ్రమ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనమందరం ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఆసన్నమైందని అన్నారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిపించకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా సభ్యులకు పని కల్పించలేని పరిస్థితికి నెట్టబడిన విధానాలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. చేనేత మగ్గాలకు జియో టాక్ వేయకపోవడం వలన చేనేత సంఘాలు, ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను టెస్కో కొనుగోలు చేసి డబ్బులు చెల్లించక మరియు సంఘాలలో ఉన్న వస్త్రాలను ఖరీదు చేయకపోవడం వలన వస్త్ర నిలువలు పేరుకుపోయాయని, టెస్కో చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించకపోవడం వలన సంఘాలు అప్పుల కూరుక పోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో చేనేత సహకార సంఘాలు మరియు సహకారేతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు మరియు చేనేత వస్త్ర పరిశ్రమ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం నలగొండ పట్టణంలో సెప్టెంబర్ 4,5 తేదీలలో జరుగుతున్న చేనేత కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

  

ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో  చేనేత రంగంలో ప్రముఖ నాయకులు మిరియాల సోమయ్య ,రాపోలు దత్త గణేష్, జిల్లా బిక్షం ,మిర్యాల యాదగిరి, కర్నాటి యాదగిరి, జిల్లా గణేష్, దుడుగు లక్ష్మీనారాయణ, చిలుకూరు లక్ష్మీనర్సు, మిరియాల రంగయ్య ,తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీరంగం, నామిని ప్రభాకర్ ,రాపోలు వెంకన్న,ఏలే శ్రీనివాస్, బొల్లు రవి తదితరులు పాల్గొన్నారు.