/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Renu Desai: పవన్‌ గురించి రెండు సందర్భాల్లోనూ నిజమే చెప్పా: రేణూ దేశాయ్‌ Yadagiri Goud
Renu Desai: పవన్‌ గురించి రెండు సందర్భాల్లోనూ నిజమే చెప్పా: రేణూ దేశాయ్‌

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్ (Pawan kalyan) మాజీ భార్య రేణూ దేశాయ్‌ (Renu Desai) మరోసారి వైరల్ కామెంట్స్‌ చేశారు. ఓ అభిమాని ఆమె విడాకులపై అభ్యంతరకర కామెంట్‌ పోస్టుచేయగా..

రేణూ అతడికి స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు. ''నన్ను నిందించడంలో మీకు ఆనందం ఉంటే అలానే చేయండి. పవన్‌ కల్యాణ్‌ వ్యతిరేకుల నుంచి నిందలు పడటం నా జీవిత లక్ష్యం అనుకుంటా..'' అని రేణూ దేశాయ్‌ రిప్లై ఇచ్చారు..

ఇటీవల ఆమె పవన్‌ కల్యాణ్‌కు మద్దతు ప్రకటిస్తూ వీడియో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు వ్యక్తులు ఆమెను టార్గెట్‌ చేసి మాట్లాడారని రేణూ చెప్పారు.

''విడాకుల గురించి చెప్పినప్పుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానులు నన్ను తీవ్రంగా ద్వేషించారు. ఇప్పుడు దేశ పౌరురాలిగా ఆయనకు మద్దతుగా మాట్లాడుతుంటే అతడి వ్యతిరేకులు నన్ను దుర్భాషలాడుతున్నారు.

తొలుత విడాకుల గురించి మాట్లాడి.. ఆయన వ్యతిరేకుల నుంచి డబ్బు తీసుకున్నానని ఆరోపించారు. ఇప్పుడేమో.. పవన్‌ అనుకూల వ్యక్తుల నుంచి నేను సొమ్ము తీసుకుని ఆయనకు మద్దతిచ్చానని అంటున్నారు.

నా మాజీ భర్త గురించి అప్పుడూ, ఇప్పుడూ రెండు సందర్భాల్లోనూ నేను నిజమే చెప్పాను. తప్పుగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ప్రేమలో పడినందుకు.. నిజాలు మాట్లాడుతున్నందుకు నేను ఇలా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇదే నా విధి రాత అయితే.. ఇలానే తిట్టండి.. ఈ కామెంట్స్‌పై కూడా నన్ను నిందించడం ప్రారంభించండి'' అని రాసుకొచ్చారు..

Tirumala: భక్తులకు కర్రల పంపిణీ.. ట్రోల్స్‌పై స్పందించిన తితిదే ఛైర్మన్‌

తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.

బోనులో చిక్కిన మగ చిరుతకు దాదాపు ఐదేళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మరోవైపు, అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను వారు ఖండించారు.

అటవీశాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని భూమన తెలిపారు. ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ..

''ఎస్వీ జూ పార్కు నుంచి చిరుతలు తెచ్చి వదులుతున్నామంటున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నాం.

చిరుత సంచారంపై నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాం'' అని చెప్పారు..

బి ఆర్ ఎస్ పార్టీకి కలిసొచ్చిన శ్రావణమాసం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వేళ అయింది. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీ య పార్టీలకు ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు పూర్తయ్యాయి. గురువారం నుంచి నిజ శ్రావణ మాసం మొదలవుతున్నది.

శ్రావణంలో శుభముహుర్తం కుదరడంతోనే అభ్యర్థుల ఎంపికకు, ప్రచారానికి ఇక అన్ని పార్టీలు శ్రీకారం చుట్టబోతున్నాయి. ఈ నెల 18న శ్రావణమాసం తొలి శుక్రవారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి విశేషమైన రోజుగా ఎంచుకుంటారు. అభ్యర్థుల ప్రకటన, మ్యానిఫెస్టో విడుదల, ఎన్నికల ప్రచారం వంటివి శ్రావణమాసంలో ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు.

ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రావణమాసంలోనే శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి శ్రావణమాసం కలిసొచ్చింది (2018) బీఆర్‌ఎస్‌ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను శ్రావణంలోనే ప్రకటించింది. ఈసారి కూడా ఆ సెంటిమెంట్‌ కొనసాగే అవకాశం ఉంది.

శ్రావణం త ర్వాత వచ్చే భాద్రపదంలో ప్రథమార్ధం వినాయక చవితి సందడితో ముగుస్తుంది. ద్వితీయా ర్ధం పితృపక్షాలను అంత శుభకరంగా భావించరు.

శ్రావణంలోపే కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో

శ్రావణం ముగిసేలోపు మ్యానిఫెస్టోను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. సెప్టెంబర్‌ 15న సోనియా గాంధీతో చేతుల మీదుగా మ్యానిఫెస్టో విడుదల చేయించాలన్నది టీపీసీసీ యోచన.

ఆ పార్టీ అభ్యర్థుల దరఖాస్తులకు శ్రావణం లోనే శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఆ పార్టీ 38 మంది అభ్యర్థులతో తొలి జాబితాను సిద్ధం చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం వల్ల నష్టం జరిగిందని, ఈసారి అలా జరగకుండా దశల వారీగా జాబితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

బీజేపీ రాష్ట్ర కమిటీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌లో ఒక సీటుకు ఇద్దరు ముగ్గురు అభ్యర్థులుంటే కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం అభ్యర్థుల కొరతతో సతమతమవుతున్నాయి. బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉండగా, కాంగ్రెస్‌కు ఉత్తర తెలంగాణలో చెప్పుకోదగ్గ అభ్యర్థులు కనిపించడం లేదు. సిట్టింగ్‌ ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలోకి దింపాల్సిందిగా రాష్ట్ర బీజేపీని అమిత్‌ షా ఆదేశించారని సమాచారం. ఇప్పటివరకు 40 నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులు ఉన్నారని, మిగతా సెగ్మెంట్ల కోసం అభ్యర్థులను వెతకాల్సిందిగా పార్టీ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది.

బీఆర్‌ఎస్‌ తొలి జాబితా రెడీ?

గత ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగా బీఆర్‌ఎస్‌ పార్టీ 105 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సెప్టెంబర్‌ 7, 2018 శుక్రవారం ప్రకటించింది. ఇప్పటికే 80 నుంచి 87 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్టు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాల సమాచారం.

శ్రావణమాసంలో ఏ క్షణంలో అయినా అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 21న పంచమితో కూడిన శ్రావణ సోమవారాన్ని విశేషమైన రోజుగా భావిస్తారు.

ఆ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటంతో అదేరోజు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం లేకపోలేదు.

అంతేకాదు, శ్రావణంలో శుక్ల దశమి, పౌర్ణమి, కృష్ణపక్షంలో విదియ, తదియ కూడా అభ్యర్థుల ప్రకటనకు, ఇతర రాజకీయ ఎత్తుగడలకు అనువైన రోజులుగా పంచాంగకర్తలు విశ్లేషిస్తున్నారు...

ఇక హైదరాబాద్‌లోనే బోయింగ్‌ హెలికాప్టర్ల తయారీ

భారత సైన్యం కోసం అపాచీ హెలికాప్టర్ల తయారీని బోయింగ్‌ ప్రారంభించింది. అమెరికాలోని అరిజోనాలో బోయింగ్‌కు చెందిన మెసా ఉత్పాదక కేంద్రంలో ఏహెచ్‌64 అపాచీ ఈ-మాడల్‌ హెలికాప్టర్లు సిద్ధమవుతున్నాయి. మొత్తం 6 హెలికాప్టర్లు ఇండియన్‌ ఆర్మీకి డెలివరీ కానున్నాయి.

కాగా, ఈ హెలికాప్టర్ల బాడీ ఫ్యూజ్‌లేజ్‌లు హైదరాబాద్‌లోని టాటా బోయింగ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌,టీబీఏఎల్‌, ప్లాంట్‌లోనే రెడీ అవుతున్నాయి.

ఈ ఏడాది ఆరంభంలోనే తొలి ఏహెచ్‌64 అపాచీ ఈ-మోడల్‌ హెలిక్యాప్టర్‌ ఫ్యూజ్‌లేజ్‌ ఇక్కడి నుంచి అమెరికాకు చేరింది. ఈ క్రమంలోనే అక్కడి ప్లాంట్‌లో హెలికాప్టర్ల తయారీని మొదలుపెట్టినట్టు బోయింగ్‌ తాజాగా ప్రకటించింది.

ఈ మేరకు బోయింగ్‌ ఇండియా అధ్యక్షుడు సలీల్‌ గుప్టే తెలియజేశారు. 2020లో బోయింగ్‌.. 22 ఈ-మోడల్‌ అపాచీ హెలిక్యాప్టర్లను ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు అందజేసింది. దీంతో ఇండియన్‌ ఆర్మీ కోసం 6 ఏహెచ్‌64 అపాచీ ఈ-మోడల్‌ హెలిక్యాప్టర్ల కాంట్రాక్టును దక్కించుకున్నది.

వచ్చే ఏడాదిలోగా వీటిని అంచాలన్నది డీల్‌. ఏహెచ్‌64ఈ.. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన దాడుల హెలిక్యాప్టర్‌గా పేరొందినట్టు ఈ సందర్భంగా బోయింగ్‌ మెసా ప్లాంట్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, అటాక్‌ హెలిక్యాప్టర్‌ ప్రోగ్రామ్స్‌ విభాగం ఉపాధ్యక్షుడు క్రిస్టినా ఉఫా తెలిపారు.

ఏహెచ్‌64 అపాచీ ఈ-మాడల్‌.. ట్విన్‌-టర్బోషాఫ్ట్‌ అటాక్‌ హెలికాప్టర్‌

ఇందులో అత్యాధునిక రాడార్‌ వ్యవస్థ ఉంటుంది

తక్కువ ఎత్తులోనూ సమర్థంగా పనిచేయగలదు

280kmph గరిష్ఠ ఎత్తులోప్రయాణించే వేగం

అందుబాటులో 16 యాంటి-ట్యాంక్‌ ఏజీఎం-114 హెల్‌ఫైర్‌, స్ట్రింగర్‌ మిస్సైల్స్‌, హైడ్రా-70 అన్‌గైడెడ్‌ మిస్సైల్స్‌

శత్రువులపై బుల్లెట్ల దాడి కోసం 1,200 రౌండ్ల సామర్థ్యంతో 30-ఎంఎం చైన్‌ గన్‌. నిమిషానికి 600-650 రౌండ్లు ఫైర్‌ చేయవచ్చు...

మూడు రోజుల్లో చిక్కిన రెండో చిరుత

నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోన్‌లో మరో చిరుత చిక్కింది. గతంలో బాలిక పై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత చిక్కడం గమనార్హం.

చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం అనుమానాస్పద ప్రదేశాల్లో బోన్‌లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చిరుతను బంధించేందుకు మూడు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు.

మోకాలి మిట్ట, లక్షీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోనులను ఏర్పాటు చేయడం జరిగింది. 50 రోజుల వ్యవధిలో మూడు చిరుతలను అధికారులు బంధించడం గమనార్హం.

తిరుమలలో చిన్నారి లక్షితను చిరుత చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

బాలికను చంపేసిన రెండు రోజుల్లోనే ఆ చిరుతను అటవీ అధికారులు పట్టుకున్నారు.

తిరుమల కాలిబాట మార్గానికి సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే బోనులో చిరుత దొరికింది. బోనులో పడిన చిరుత ఆడదిగా అటవీ అధికారులు గుర్తించారు.

ఇప్పుడు ఆ చిరుత చిక్కిన ప్రదేశానికి దగ్గరలోనే మరో చిరుత చిక్కడం గమనార్హం....

మరోసారి ఆశీర్వదించండి.. కరీంనగర్ జిల్లాను గొప్పగా అభివృద్ధి చేసి చూపిస్తా – మంత్రి గంగుల

ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా… అభివృద్ది చేస్తున్నానమని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా కరీంనగర్ జిల్లాను అభివృద్ది చేసి చూపిస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో బుదవారం పర్యటించిన మంత్రి గంగుల కమలాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

మొదట చింతకుంట రేణుక ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్న మంత్రి గంగుల… అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌడసంఘం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు… సిసి రోడ్డు నిర్మాణానికి మరో 5 లక్షలు… మొత్తం 15 లక్షల రూపాయలు కెటాయించారు. గౌడన్నల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం… సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు మంత్రి గంగుల. గౌడన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామి ఇచ్చారు.

అక్కడి నుండి శాంతి నగర్ కు చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్ కు… స్థానిక ఎంపిటిసి భూక్యా తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో… బంజార మహిళలు ఘన స్వాగతం పలికారు. వారితో డప్పుచఫ్ఫుళ్ల మధ్య సంత్ సేవాలాల్ ఆలయం వద్దకు చేరుకుని 10 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న సంత్ సేవాలాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.

అక్కడి నుండి సంత్ సేవాలాల్ ఆలయానికి చేరుకున్న మంత్రి గంగుల… మేరిమా యాడి పతాకావిష్కరణ చేసి… భోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మేరి మా యాడి ని దర్శించుకుని… ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం… సంత్ సేవా లాల్ ను దర్శించుకున్నారు. సంత్ సేవాలాల్ ఆలయ అభివృద్ధి కోసం గతంలోనే 5 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు మంత్రి గంగుల. బంజారా బిడ్డలకు దైవభక్తి ఎక్కువని… మేరీ మా యాడి కృపా కటాక్షాలతో సమస్త జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

అన్ని మతాలను గౌరవించుకుందామన్న మంత్రి గంగుల… సంత్ సేవాలాల్ ఆలయ అభివృద్ది కోసం సహాయసహకారాలు అందిస్తానని హామి ఇచ్చారు. పెళ్లి కానీ యువతులకు త్వరగా పెళ్లి కావాలని జరుపుకునేదే తీజ్ పండుగ అని… బంజార బిడ్డలకు తీజ్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

సమైక్య పాలనలో శాంతినగర్ మురికికూపంగా ఉండి… అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిందని… కానీ… స్వయంపాలనలో శాంతినగర్ అభివృద్ధి చెంది దాదాపుగా కరీంనగర్లో కలిసిపోయిందన్నారు. ఎమ్మెల్యేగా… మంత్రిగా శాంతినగర్ అభివృద్ధి కోసం కృషి చేశానన్న మంత్రి గంగుల… మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటించారు.

అనంతరం చింతకుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చేరుకున్న మంత్రి గంగుల… మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా సుమారు 31. 80 లక్షలతో చేపట్టిన కాంపౌండ్ వాల్, టాయిలెట్లు… ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

అనంతరం… 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో ఎంపిపి పిల్లి శ్రీలత మహేష్, జడ్పీటిసి పిట్టల కరుణ- రవిందర్… ఏఎంసి చైర్మెన్ రెడ్డవేన మధు, ఎంపిటిసి భూక్యా తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.......

Hyderabad: విదేశాలకు టికెట్లు బుక్‌ చేస్తామని రూ.లక్షల్లో మోసం..

హైదరాబాద్: అమెరికా, యూకే, కెనడా దేశాలకు వెళ్లే విద్యార్థులకు టికెట్స్ బుక్ చేస్తామని చెప్పి ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. లక్షల్లో డబ్బులు వసూలు చేసి ట్రావెల్ ఏజెంట్ పరారయ్యాడు..

వివరాల్లోకి వెళ్తే.. కుతుబుద్దీన్ అనే ట్రావెల్‌ ఏజెంట్‌ అబిడ్స్‌లోని.. ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్‌లో సీటీఎస్‌ కార్పొరేట్ సొల్యూషన్స్‌ పేరుతో గత కొంతకాలంగా ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు.

అమెరికా, యూకే, కెనడా.. ఇలా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టికెట్స్ బుక్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. లక్షన్నర నుంచి 2 లక్షల వరకు వసూలు చేశాడు.

ఈ నెల 15, 16వ తేదీల్లో అమెరికా వెళ్లేందుకు టికెట్లు బుక్‌ చేసుకోవాలని దాదాపు 40 మంది ఏజెన్సీని సంప్రదించారు. వారిలో 30 మంది నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఏజెంట్‌ కుతుబుద్దీన్‌.. బోర్డు తిప్పి పరారయ్యాడు..

టికెట్లకు సంబంధించిన వివరాలు రాకపోవడంతో బాధితులు ట్రావెల్ ఏజెన్సీ వద్దకు వెళ్లారు. అయితే, గత రెండు రోజులుగా ఏజెన్సీ ఓపెన్ చేయలేదని చుట్టుపక్కల వారు తెలిపారు.

దీంతో మోసపోయామని గ్రహించి బాధితులు అబిడ్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అబిడ్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఏజెన్సీపై ఇప్పటికే పలు చీటింగ్‌ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు..

Nara Lokesh: ఎలాంటి భవిష్యత్తు కావాలో యువత తేల్చుకోవాలి: లోకేశ్‌

మంగళగిరి: ఎలాంటి భవిష్యత్తు కావాలో యువత తేల్చుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

యువగళం పాదయాత్రలో భాగంగా మంగళగిరిలోని డాన్ బోస్కో స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు, యువతతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయి. తెదేపా హయాంలో యువతకు 6 లక్షలకుపైగా ఉద్యోగాలిచ్చాం.

కానీ, ఇప్పటి సీఎం గంజాయికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు. ఫాక్స్ కాన్ వంటి కంపెనీలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తున్నారు..

మనం గొప్పగా చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు కామెడీగా మారింది. యువత సమస్యలు పరిష్కరించేందుకే యువగళం చేపట్టా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసులు పెడుతున్నారు. పోరాటానికి భయమెందుకు.. తగ్గేదే లేదు. చిన్న జీతంతో సరిపెట్టుకుంటారా.. రూ.50వేల జీతం తీసుకుంటారా? 3 రాజధానులు కావాలా? అమరావతి రాజధాని కావాలా?మీరే తేల్చుకోవాలి.

తెదేపా అధికారంలోకి వచ్చాక 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 32వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక రాష్ట్రంలో పెండింగ్‌ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ఏపీపీఎస్సీని ప్రక్షాలన చేసి.. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యాప్రణాళికలో మార్పులు తెస్తాం. సామాజిక బాధ్యత, నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తాం'' అని లోకేశ్‌ వెల్లడించారు..

Pawan Kalyan: ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద.. కాపాడుకోవాలి: పవన్‌

విశాఖ: భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల వద్ద జరిగిన ప్రకృతి విధ్వంసాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇవాళ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

''ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద. వాటిని రక్షించుకునే అవగాహన మనకు లేదు.

దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు కేవలం 292 ఎకరాలే మిగిలాయి. ఎర్రమట్టి దిబ్బల రక్షణపై పర్యావరణ శాఖ దృష్టికి తీసుకెళ్తాం.

జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్‌ జోన్‌ ఏర్పాటు చేయాలి. రక్షణ కంచె ఏర్పాటు చేయాలి.

దీనిపై వైకాపా ప్రభుత్వం స్పందించకపోతే.. ఎర్రమట్టి దిబ్బల రక్షణ కోసం గ్రీన్‌ ట్రైబ్యునల్‌ వరకు వెళ్తాం. ఉత్తరాంధ్రలో ప్రకృతి విధ్వంసం, దోపిడీ ఆగాలి'' అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు..

SB NEWS

SB NEWS

Chandrayaan-3: చివరి కక్ష్యలోకి చంద్రయాన్‌-3.. ఇక జాబిల్లిపై అడుగే తరువాయి

బెంగళూరు: జాబిల్లి (Moon)పై పరిశోధనలకు రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 (Chandrayaan-3) లక్ష్యం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది మరింత చేరువైంది..

బుధవారం జాబిల్లి చివరి కక్ష్యలోకి ప్రవేశించింది.

చంద్రయాన్‌-3 (Chandrayaan-3) కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని (Orbit Reduction Maneuvre) నేడు మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో (ISRO) ప్రకటించింది. నేటి విన్యాసంతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలు పూర్తయ్యాయి.

జాబిల్లి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య. తాజా విన్యాసంతో వ్యోమనౌక కక్ష్యను 153 km x 163 kmలకు తగ్గించినట్లు ఇస్రో వెల్లడించింది. దీంతో ఈ అంతరిక్ష నౌక.. ఇప్పుడు చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి చేరింది..

ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన దశలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక, ఆగస్టు 17న వ్యోమనౌకలోకి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయే ప్రక్రియను చేపడతారు.

అది సజావుగా జరిగితే ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోయి సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో (ISRO) వెల్లడించింది.

'చంద్రయాన్‌-3 (Chandrayaan-3)'ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్టు 1న 'ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య'లోకి ప్రవేశపెట్టారు. అక్కడినుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు..