/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Kadapa: నకిలీ వేలిముద్రలతో బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీ.. ఐదుగురు సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్ Yadagiri Goud
Kadapa: నకిలీ వేలిముద్రలతో బ్యాంక్‌ అకౌంట్‌ ఖాళీ.. ఐదుగురు సైబర్‌ నేరగాళ్లు అరెస్ట్

కడప: నకిలీ వేలిముద్రల ఆధారంగా ఖాతాదారులకు తెలియకుండానే వారి ఖాతా నుంచి నగదును డ్రా చేస్తున్న ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్టు చేశారు..

అరెస్టు అయిన వారిని వైఎస్‌ఆర్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ మీడియా ఎదుట హాజరు పరిచారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..

ఈ ఐదుగురిపై దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. వారిపై 412 ఫిర్యాదులు రాగా.. 416 మంది బాధితులను గుర్తించారు.

కడప చిన్నచౌక్‌కు చెందిన శంకరయ్య ఖాతా నుంచి రూ.5,500 నగదును అతడికి తెలియకుండా సైబర్‌ నేరగాళ్లు కాజేశారు. తనకి ఓటీపీ రాలేదని.. ఎలాంటి లింక్‌లు కూడా క్లిక్‌ చేయలేదని శంకరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విచారించగా నకిలీ వేలిముద్రల ద్వారా నగదును డ్రా చేసినట్టు విచారణలో తేలింది.

దీంతో నిందితుల వివరాలను పోలీసులు సేకరించి ఐదుగురు అంతర్ జిల్లా సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. ఇప్పటివరకు నిందితులు 12 ఖాతాల ద్వారా రూ.5.9 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు..

TSPSC పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది.

ఈ కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌కు సహకరించిన ఆరోపణల నేపథ్యంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తాజా మూడు అరెస్ట్‌లతో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 99కి చేరింది.

ఈ కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన సిట్.. నిందితుల ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్‌ల త్వరలోనే 100 దాటనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఈ పేపర్ లీక్ కేసులో ఏ2గా ఉన్న టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు రాజశేఖర్ రెడ్డికి బెయిల్ తిరస్కరించింది........

SB NEWS

డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీపై కేటీఆర్ సమీక్ష

పేద ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న డబుల్ బెడ్‌ రూం ఇండ్లకు సంబంధించి మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు.

వారంలో తొలివిడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీపై మంత్రి కేటీఆర్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారంరోజుల్లో తొలివిడత ఇండ్ల పంపీణీ పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చిందని కేటీఆర్ తెలిపారు.

70 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని అధికారుల తెలిపారని.. 70 వేల ఇండ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామన్నారు. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రా రెడ్డి మహమూద్ అలీ మల్లారెడ్డి పద్మారావు జీహెచ్ఎంసీ అధికారులు హాజరయ్యారు.

కాగా.. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటివల పలు కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అదే కోవలో పూర్తి చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది...

హైదరాబాదుకు నలుమూలల మెట్రో సేవలు విస్తరిస్తాం: సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ న‌లుమూల‌ల‌కు మెట్రోను విస్త‌రించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌చ్చే మూడు, నాలుగేండ్ల‌లో ఈ ప‌నులు పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని సీఎం పేర్కొన్నారు.

గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగురవేసిన అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు.

విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ. 67 వేల 149 కోట్ల వ్యయంతో వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ధి ప‌థ‌కం ఎస్ఆర్‌డీపీ అమలు చేస్తున్నద‌ని కేసీఆర్ తెలిపారు.

ఎస్ఆర్‌డీపీ కింద 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఆర్వోబీల అభివృద్ధిని చేపట్టింది. వీటిలో చాలాభాగం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

రూ. 275 కోట్లతో 22 లింక్ రోడ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం పూర్తిచేసింది. పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరం నలువైపులకూ మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం రూ. 69 వేల కోట్లకు పైగా వ్యయపరచి ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న అన్ని జంక్షన్ల నుంచి పైదరాబాద్‌ను అనుసంధానం చేస్తూ, నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకొనే విధంగా మెట్రో రైలును విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది.

వచ్చే మూడు, నాలుగేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యం నిర్దేశించింది. కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్‌లో 415 కిలోమీటర్లకు మెట్రో సౌకర్యం విస్తరిస్తుంద‌ని కేసీఆర్ తెలిపారు...

SBI Report: 2047 నాటికి ₹15 లక్షలకు తలసరి ఆదాయం: ఎస్‌బీఐ రీసెర్చ్‌

దిల్లీ: శత స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకునే నాటికి దేశంలో తలసరి ఆదాయం (per capita income) గణనీయంగా పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి (SBI report) పేర్కొంది..

2047 నాటికి తలసరి ఆదాయం ఇప్పుడున్న (2022-23 ఆర్థిక సంవత్సరం) రూ.2 లక్షల నుంచి రూ.14.9 లక్షలకు పెరగనుందని పేర్కొంది. అంటే దాదాపు ఏడున్నర రెట్లు పెరగనుందని ఎస్‌బీఐ రీసెర్చి ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.

అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుంచి 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు.

2047 లక్ష్యాలు చేరుకోవాలంటే వచ్చే ఐదేళ్లూ చాలా కీలకమని మోదీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశమనేది స్వప్నం కాకూడదని.. 140 కోట్ల పౌరుల ప్రతిజ్ఞ కావాలని ఆకాక్షించారు..

SB NEWS

SB NEWS

Bihar : సీఎం నితీశ్ కుమార్ సభలో భద్రతా లోపం.. యువకుడిని అడ్డుకున్న సిబ్బంది..

పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. భద్రతా వలయాన్ని దాటుకుని నితీశ్ వైపునకు పరుగులు తీయబోయాడు..

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అక్కడికక్కడే అడ్డుకోగలిగారు. ఆ యువకుడి పేరు కూడా నితీశ్ కుమార్ కావడం విశేషం.

స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోకి నితీశ్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు పరుగు పరుగున దూసుకొచ్చాడు.

ఆయన చేతిలో ఓ పోస్టర్ ఉంది. తన తండ్రి బిహార్ మిలిటరీ పోలీస్ ఉద్యోగి అని, ఆయన ఐదేళ్ల క్రితం విధి నిర్వహణలో ఉండగానే మరణించారని, తనకు కారుణ్య ప్రాతిపదికపై ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని ఆ పోస్టర్లో రాశారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో యువకుడు నితీశ్ కుమార్ సీఎం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి, ఆ యువకుడిని అడ్డుకుని, అక్కడి నుంచి పంపించేశారు.

ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు పాట్నా జిల్లా యంత్రాంగం ఆదేశించింది. పాట్నా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ మాట్లాడుతూ, సీఎం సభలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడి పేరు నితీశ్ కుమార్ అని గుర్తించినట్లు తెలిపారు. ఆయన తండ్రి పేరు రాజేశ్వర్ పాశ్వాన్ అని తెలిపారు.

ముంగేర్ జిల్లాకు చెందిన రాజేశ్ బిహార్ మిలిటరీ పోలీస్ ఉద్యోగి అని, ఆయన ఐదేళ్ల క్రితం విధి నిర్వహణలో ఉండగా మరణించారని తెలిపారు. తన తండ్రి విధి నిర్వహణలో మరణించినందువల్ల తనకు ప్రభుత్వోద్యోగం పొందే అర్హత ఉందని నితీశ్ కుమార్ (26) చెప్తున్నారని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి నితీశ్‌ను కలవాలని వచ్చినట్లు తెలిపారని చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు..

Vivah Muhurat in 2023 : బ్యాచ్‎లర్స్‎కి మాత్రమే.. ఆగస్ట్ టు డిసెంబర్‎లో పెళ్లికి ముహూర్తాలు ఇవే..!

హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వివాహమనే వేడుకలో రెండు కుటుంబాలకు చెందిన వధూవరులు ఒక్కటయ్యే వేళ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారత దేశంలో పెళ్లికి సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో పలు రకాల ఆచారాలు పాటిస్తారు. కొన్ని చోట్ల ఐదు రోజుల పెళ్లి, మరికొన్ని చోట్ల మూడు రోజుల పెళ్లిళ్లు జరుపుకుంటారు.

మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసీ ఏకంగా పదహారు రోజుల పాటు పండుగలా పెళ్లి చేసుకుంటారు. అందుకే భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది..

ఆగస్ట్ – 19, 20 ,22, 24, 26, 29, 30, 31

సెప్టెంబర్- 1, 2, 3, 6, 7, 8

అక్టోబర్ – 18, 19, 20 ,21, 22, 24 ,25, 26, 27 ,31

నవంబర్ – 1 ,2 ,8, 16 ,17, 18 ,19, 22 ,23, 24, 25, 28 ,29

డిసెంబర్ – 3 ,5 ,6, 7, 8 ,14, 15, 16 ,17 ,19, 20 ,21, 24, 31

SB NEWS

SB NEWS

SB NEWS

SB NEWS

PM Modi: ఏకధాటిగా 90 నిమిషాలు.. ప్రసంగంలో మోదీ సరికొత్త రికార్డ్‌

దిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా చారిత్రక ఎర్రకోట (Red Fort) నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్రమోదీ (PM Modi) నిలిచారు..

మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. 90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన.. పంద్రాగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు.

ఇప్పటివరకు 10 సార్లు మోదీ ప్రసంగించగా.. సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం..

2014లో ప్రధానమంత్రిగా ఎర్రకోట నుంచి మోదీ తొలి ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఆ ఏడాది 65 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు.

ఆ తర్వాత వరుసగా 88 నిమిషాలు (2015), 94 నిమిషాలు (2016), 56 నిమిషాలు (2017), 83 నిమిషాలు (2018), 92 నిమిషాలు (2019), 90 నిమిషాలు (2020), 88 నిమిషాలు (2021), 83 నిమిషాలు (2022) ప్రసంగించారు.

ఈ ఏడాది కూడా 90 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. మొత్తంగా ప్రధాని సగటు ప్రసంగం నిడివి 82 నిమిషాలు కాగా.. ఇప్పటివరకు ఏ ప్రధాని సగటుగా ఇంత సమయం ప్రసంగించలేదు..

Independence Day : ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా పదో సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాలకు శ్రీకారం చుట్టారు..

అంతకుముందు ప్రధాని మోదీ .. ఎర్రకోట దగ్గర త్రివిధ దళాల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు.

ప్రధాని మోదీ ప్రసంగం :

"ప్రపంచంలో మనది పెద్ద ప్రజాస్వామ్య దేశం. మనం విశ్వంలో నంబర్ 1గా ఉన్నాం. ఇంత విశాల దేశం.. 140 కోట్ల మంది జనాభాగా ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ఎన్నో సమస్యలున్నాయి. కేంద్ర, రాష్ట్రాలు కలిసి.. సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. మణిపూర్‌లో, మరికొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. కొంతమంది జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి.

ఐతే.. కొన్ని రోజులుగా మళ్లీ శాంతి కనిపిస్తోంది. మణిపూర్ ప్రజలతో ఈ దేశం ఉంది. శాంతితోనే సమాధానం లభిస్తుంది. కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి.. శాంతిని నెలకొల్పుతాం.

అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీ సమాధి దగ్గర ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :ఆగస్టు 15

తిరుమలలో భక్తుల రద్దీ నేడు మంగళవారం పెరిగింది. స్వామివారి దర్శనం కోసం నేడు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 74,617 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.67 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

32,752 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

SB NEWS

*