/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz RS Praveen Kumar: పోలీసుల గృహనిర్బంధంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ Yadagiri Goud
RS Praveen Kumar: పోలీసుల గృహనిర్బంధంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ గన్ పార్క్ వద్ద ఇవాళ ఆయన సత్యాగ్రహ దీక్షను తలపెట్టారు..

ఈ క్రమంలో ప్రవీణ్‌ కుమార్‌ను కలిసి దీక్ష వివరాలు అడిగిన పోలీసులు.. అనంతరం ఇంట్లోనే నిలువరించారు.

పార్టీ నేతలు, కార్యకర్తలను ఇంట్లోకి అనుమతించడం లేదు. దీంతో ఇంట్లోనే తన దీక్షను కొనసాగిస్తానని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని వెల్లడించారు..

గ్రూప్‌-2 పరీక్ష వాయిదాపై 14న నిర్ణయం

గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలన్న వినతులపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు టీఎస్‌పీఎస్సీ నివేదించింది.

ఈ నెల 29, 30న జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ డీ మహేశ్‌ సహా 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ పీ మాధవీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు.

ఇదే నెలలో గ్రూప్‌-2 సహా వేర్వేరు పోటీ పరీక్షలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గిరిధర్‌రావు, నర్సింగ్‌ చెప్పారు. ఈ దశలో గ్రూప్‌-2ను వాయిదా వేయాలని పిటిషనర్‌ వినతిపత్రం ఇచ్చినా కమిషన్‌ స్పందించలేదని తెలిపారు.

ఇప్పటికే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది రాంగోపాల్‌రావు కోర్టుకు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారని, ఆయా కేంద్రాలకు ప్రభుత్వం సెలవులు కూడా ప్రకటించిందని వివరించారు...

మత్తు లో దారుణం.. ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి

గంజాయి మత్తులో ఓ యువకుడు ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసిన ఘటన

గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది.

స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బాలుడు

శుక్రవారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు.

అటుగా వచ్చిన నాగిశెట్టి పవన్‌ సంజయ్‌ (20) గంజాయి మత్తులో బాలుడిని గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలుడి కేకలు విన్న స్థానికులు యువకుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.

శనివారం తిరుమలలో భక్తుల రద్దీ బాగానే ఉంది

శనివారం తిరుమలలో భక్తుల రద్దీ బాగానే ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శుక్రవారం 72,158 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.08 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

నేడు స్వామివారికి 30,735 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా? లేనట్లేనా ❓️

వాయిదా వేయాలంటూ టీఎస్‌పీఎస్సీ ముట్టడికి అభ్యర్థుల యత్నం

గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్షలు జరుగుతాయన్న అభిప్రాయాన్ని టీఎస్ పీఎస్సీ అధికారులు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరీక్షలను వాయిదా వేస్తే.. మళ్లీ ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు.

గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న అభ్యర్థనపై టీఎ్‌సపీఎస్సీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా.. రాబోయే రోజుల్లో అనేక ఇతర పరీక్షలు ఉండటంతోపాటు దసరా సెలవులు, అనంతరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వంటి వాటితో ఈ పరీక్షలను ఇక నిర్వహించడం కష్టమన్న వాదన ఉంది. ఒకవేళ, వాయిదా వేయాలంటే తిరిగి అసెంబ్లీ ఎన్నికల తర్వాతే పరీక్షల నిర్వహణ సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో సుమారు 783 ఖాళీ గ్రూపు-2 పోస్టుల భర్తీ కోసం డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం సుమారు 5.51 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పరీక్షలను ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్టు టీఎస్ పీఎస్సీ ఫిబ్రవరిలో ప్రకటించింది.

ఈ మేరకు మిగిలిన పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా రూపొందించింది. ఇందులో భాగంగా, ఈ నెల్లోనే గురుకులాల్లో భర్తీ చేసే కొన్ని పోస్టుల పరీక్షలు కూడా ఉన్నాయి. దాంతో గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టీఎ్‌సపీఎస్సీ అధికారులకు వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. తాజాగా టీఎ్‌సపీఎస్సీని ముట్టడించారు.

టీఎస్‌ పీఎస్సీ ముట్టడి యత్నం.. ఉద్రిక్తత

గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేయాలంటూ వివిధ జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చిన అభ్యర్థులు కదం తొక్కారు. గురువారం ఉదయాన్నే అకస్మాత్తుగా టీఎ్‌సపీఎస్సీని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

కానీ, భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. నాలుగు వైపుల నుంచి దూసుకొచ్చిన అభ్యర్థులను విడతలవారీగా నిలువరించి ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, అభ్యర్థుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అనంతరం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లి అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు.

గ్రూపు-2 పరీక్షలు మూడు నెలల వాయిదా వేయాలని, సిలబస్‌ భారాన్ని తగ్గించాలని నినాదాలు చేశారు. ఏడేళ్లుగా గ్రూపు-2 పరీక్షలు గుర్తుకురాలేదని, ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వం హడావిడిగా వరుసగా పలు పోటీ పరీక్షలు నిర్వహిస్తోందని, దీనివల్ల ప్రిపరేషన్‌కు ఇబ్బందిగా ఉందని.. తక్షణమే గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.

టీఎస్ పీఎస్సీ చైర్మన్‌ వచ్చి స్పష్టమైన హమీ ఇచ్చేవరకు కదిలేది లేదన్నారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ వారికి మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మూడు నెలలు గ్రూపు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. గ్రూప్‌ 2 పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికితే కాంగ్రెస్‌ నాయకులను అరెస్ట్‌ చేసి పాలకులు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రియాజ్‌ను మఫ్టీ పోలీసులు అతని కోచింగ్‌ సెంటర్‌లో అరెస్ట్‌ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారని, NSUI అధ్యక్షుడు వెంకట్‌ను అరెస్ట్‌ చేశారని, విద్యార్థుల పక్షాన ప్రజాస్వామిక పోరాటం చేస్తున్న నాయకులను అరెస్టులు చేయడం అక్రమమని విమర్శించారు. విద్యార్థుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు......

వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి రంగనాధ్ స్వయంగా వాహనల తనిఖీ

వ‌రంగ‌ల్ జిల్లా:ఆగస్టు 11

ఐపిఎస్ అధికారి ఎ.వి.రంగనాధ్ ప్రజా పోలీసింగ్ కి కేరాఫ్ అడ్రస్ అంటే అతిశయోక్తి కాదు. నిత్యం సామాన్యులకు అండగా..సామాన్యుల్లో ఒకడిగా ఉండటానికి ఇష్టపడే ఈ అధికారి ప్రజలకోసం..ప్రజల మధ్యనే పోలీసులు అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు .

తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన స్పెషల్ వెహికిల్ చెకింగ్ కార్యక్రమంలో తానే స్వయంగా పాల్గొంటూ అధికారులు.. సిబ్బందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

సాధారణంగా పోలీసుల వాహనాల తనిఖీ అంటే ఒక రోడ్డుపై ఓ ఇద్దరు ముగ్గురు సిబ్బంది వాహనాలు నిలుపుతూ..చలాన్లు విధిస్తూ వాహనాలను నియంత్రించడం పరిపాటి. కాని వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో వాహన తనిఖీల్లో ఎస్ఐ స్థాయి అధికారి నుండి కమిషనర్ స్థాయి అధికారి వరకూ స్వయంగా పాల్గొంటూ నకిలీ పత్రాలతో తిరుగుతున్న వాహనాలే టార్గెట్ గా నిర్వహిస్తున్న డ్రైవ్ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని పోలీసులకు ఆదర్శనీయంగా నిలుస్తోంది.

గత రెండ్రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ రంగనాధ్ స్వయంగా పాల్గొంటూ వాహనాల పత్రాలు

తనిఖీ చేయడంతో పాటు రహదారి భద్రత..ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు.

కమిషనర్ స్థాయి సీనియర్ ఐపిఎస్ అధికారి స్వయంగా రోడ్డెక్కి తనిఖీలలో పాల్గొనడంతో వరంగల్ పోలీసులు పూర్తి స్థాయి అప్రమత్తతో విధులు నిర్వహించడమే కాకుండా ..వాహన తని‎ఖీల సందర్భంలో తగిన రక్షణ చర్యలు పాటిస్తూ..రోడ్లపై బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసింగ్ లో వచ్చిన మార్పులు..పోలీసు అధికారులు..సిబ్బంది ప్రజలతో మమేకమవుతున్న తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది....

కేంద్రానికి కాకపోతే బైడెన్‌కి చెప్పుకోండి.. ఎవరికి భయం?: పవన్‌కి మంత్రి అమర్‌నాథ్‌ కౌంటర్‌

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు..

వారాహి యాత్రలో భాగంగా విశాఖలో పర్యటించిన పవన్‌.. స్టీల్‌ప్లాంట్‌ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.

విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

సీఎం జగన్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

''కేంద్రానికి చెబితే ఎవరికి భయం? మేం చేసిన తప్పేంటి? ఎవరికో చెబితే భయపడే ప్రభుత్వం జగన్‌ది కాదని తెలుసుకోవాలి. కేంద్రానికి కాకపోతే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి చెప్పుకోండి'' అని అమర్‌నాథ్‌ వ్యాఖ్యానించారు..

50 ఏళ్ల తర్వాత.. జాబిల్లిపైకి దూసుకెళ్లిన రష్యా రాకెట్‌..

దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రుడిపైకి రష్యా తన రాకెట్ను ప్రయోగించింది. ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌ విడుదల చేసిన చిత్రాల ప్రకారం..

మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతం నుంచి ఇవాళ వేకువజామున 2.10 గంటలకు 'లునా – 25' రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

కేవలం ఐదు రోజుల్లోనే ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఆ తర్వాత జాబిల్లిపై ఎవరూ చేరని దక్షిణ ధ్రువంలో.. మరో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ను ల్యాండ్‌ చేసేలా రష్యా ప్రణాళికలు రచిస్తోంది.

దీని ద్వారా చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి, జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు, అక్కడి వనరుల జాడను గుర్తించేందుకు ఏడాది పాటు ఇది పనిచేయనున్నట్లు రోస్‌కాస్మోస్‌ వెల్లడించింది.

1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగం ఇదే. ఇప్పటివరకు ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై 'చంద్రయాన్-3' ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న ఇస్రోకు.. 'లునా -25' ప్రయోగంతో రష్యా పోటీ ఇస్తోంది.

Cm Jagan: నేడు అమలాపురంలో సీఎం జగన్ పర్యటన.. సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల

సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. 9.48 లక్షల డ్వాక్రా గ్రూపులకు దాదాపు రూ. 1358.78 కోట్లను మహిళల ఖాతాల్లో ఏపీ సీఎం జమ చేయనున్నారు.

దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05, 13, 365 మంది మహిళలకు ఈ లబ్ది పొందుతారు.

అనంతరం జనుపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా, వైఎఎస్ఆర్ సున్నావడ్డీ నిధులు ఇవాళ విడుదల చేయడం వరుసగా ఇది నాలుగో ఏడాది కావడం విశేషం..

ఈ క్రమంలో బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.

రాష్ట్రంలోని మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా.. వారి జీవనోపాధి మెరుగుపడేలా బహుళజాతి దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి జగన్‌ సర్కార్ బాటలు వేసింది..

పశువుగా ప్రవర్తించిన మనిషి

మంచిర్యాల జిల్లా:ఆగస్టు 11

జిల్లా లోని షెట్‌పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

గురువారం సాయంత్రం బాపు అనే వ్యక్తిని కొయ్యకు రెఁడుచేతులు కట్టివేసి రాంరెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా చితకబాదాడు.

తన చేనులో పశువులు పడి పంటను మేశాయని దానికి కారణం బాపు అని గ్రహించి, ఆగ్రహంతో ఊగిపోయాడు.

బాపుని కొయ్యకు కొట్టేసి పొలం యజమాని చితకబాదాడు. స్థానికులు వచ్చి నచ్చజెప్పడంతో బాధితుడిని యజమాని వదిలేశాడు.

బాధితుడు కోటపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....