/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Renu Desai: పవన్‌కల్యాణ్‌కే నా మద్దతు.. ఆయన డబ్బు మనిషి కాదు: రేణూ దేశాయ్‌ Yadagiri Goud
Renu Desai: పవన్‌కల్యాణ్‌కే నా మద్దతు.. ఆయన డబ్బు మనిషి కాదు: రేణూ దేశాయ్‌

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, డబ్బు మనిషి కాదని ఆయన మాజీ సతీమణి రేణూ దేశాయ్‌ (Renu Desai) పేర్కొన్నారు..

ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్‌ చేశారు. పవన్‌ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. అంతేకాకుండా 'బ్రో' సినిమా శ్యాంబాబు వివాదంపైనా ఆమె మాట్లాడారు..

''మొదటి రోజు నుంచి ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నా. నేను జీవితంలో ముందుకు సాగిపోతున్నా. ఆయన సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకూ ఆయన అరుదైన వ్యక్తి. ఆయన మనీ మైండెడ్‌ కాదు. డబ్బుపై ఆసక్తి లేదు. సమాజం, పేదవాళ్ల సంక్షేమం కోసం పని చేయాలనుకుంటున్నారు.

ఆయనకు పొలిటికల్‌గా ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తుంటా. రాజకీయంగా ఆయన చేస్తున్న సేవను గుర్తించండి. ఆయనొక సక్సెస్‌ఫుల్‌ నటుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఫ్యామిలీని పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే'' అని ఆమె చెప్పారు..

ఇదే వీడియోలో ఆమె శ్యాంబాబు విషయంపై మాట్లాడుతూ.. ''ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తెలిసింది. ఆ వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే, పవన్‌పై సినిమా, వెబ్‌ సిరీస్‌ చేస్తామని ఇటీవల కొంతమంది అన్నారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా పిల్లల తండ్రి నటుడు, రాజకీయనాయకుడు. నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి. '' అని ఆమె అన్నారు..

మణిపూర్ మారణహోమానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

•మానవ హక్కుల వేదిక నాయకులు జి.మోహన్

మణిపూర్ లో మహిళలపై జరిగిన దారుణ అఘాయిత్యాన్ని, లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తూ, నేరస్తులను కఠినంగా శిక్షించాలనీ, మణిపూర్ లో జరుగుతున్న మానవ హక్కుల హాననంపై స్పందిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ మణిపూర్ కుకీ మహిళలపై ఆకృత్యాల వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14న, నల్లగొండలోని స్థానిక (అంబేద్కర్ భవనం)యందు ఉదయం 10 గంటలకు జరిగే సభకు సంబంధించిన కరపత్రంను ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలో పట్టణంలో ని స్థానిక తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కరపత్రం ను ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు గోసుల మోహన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య, బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు మాట్లాడుతూ మణిపూర్ మహిళలపై జరిగిన అమానుషానికి దేశమంతా దిగ్భ్రాంతికి గురైందన్నారు.

మే 4న జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నోరు మెదపకపోవడం సరైనది కాదన్నారు. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, నగ్న ప్రదర్శనలు, గృహ దహనాలు తదితర హింసాత్మక సంఘటనలకు మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్, మోడీ ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఈ సంఘటనలకు అక్కడి పాలకుల స్వార్థపూరిత రాజకీయాలే కారణమని విమర్శించారు. కొండ ప్రాంతాలలో నివసించే ఆదివాసులను ఆ ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టి అక్కడి సంపదను మొత్తం బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని కుట్ర ఇందులో దాగి ఉందన్నారు.

మణిపూర్ లో మహిళలను వివస్త్ర లను చేసి నడి బజార్లో ఊరేగించి, సామూహిక అత్యాచారానికి, హత్యలకు పాల్పడ్డారని, ఎంతోమంది అమాయక ప్రజలను హత్య చేశారని, సభ్య సమాజం తలదించుకునే విధంగా అనేక ఆకృత్యాలు మణిపూర్ లో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ దాష్ఠీకాలకు వ్యతిరేకంగా ఆగస్టు,14,2023 న ఉదయం 10 గంటలకు నల్లగొండలోని స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగే సభకు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, మేధావులు, అధిక సంఖ్యలో పాల్గొనగలరని విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో రైతు కూలీ పోరాట సమితి నాయకులు పలస యాదగిరి, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు: మానుపాటి బిక్షం, PDSU (విజృంభణ) రాష్ట్ర ఉపాధ్యక్షులు, పల్లెబోయిన జానీ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జనార్ధన్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ఫాదర్ అలెగ్జాండర్, అంబేద్కర్, బొలుగూర్ కిరణ్,తదితరులు పాల్గొన్నారు.

మూడు జిల్లాలకు కాంగ్రెస్ డీసీసీ చీఫ్‌ల నియామకం

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచెంది. ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణలోని మూడు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ డీసీసీ చీఫ్‌లను నియమించింది.

ఈ మేరకు మూడు జిల్లాలకు డీసీసీ చీఫ్ లను ఏఐసీసీ ప్రకటించింది.

జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, నిర్మల్ జిల్లాకు శ్రీహరిరావు, భువనగిరి జిల్లాకు సంజీవరెడ్డిలను నియమిస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి :ఆగస్టు 10

తిరుమలలో భక్తుల రద్దీ నేడు గురువారం కూడా కొనసాగుతోంది.

శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

బుధవారం 75594 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.69 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 26,213 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

ఉగ్రవాద సంస్థతో లింకులు.. కరీంనగర్‌లో ఎన్‌ఐఏ దాడులు కలకలం..

కరీంనగర్‌: తెలంగాణలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి.

కరీంనగర్‌ హుస్సేపురాలో గురువారం ఉదయం ఎన్‌ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది..

తబ్రేజ్‌ అనే వ్యక్తికి పీఎఫ్‌ఐ అనే నిషేధిత సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో సోదాలు జరుపుతోంది.

ప్రస్తుతం తబ్రేజ్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. కరీంనగర్‌లో, ఆదిలాబాద్‌లో ఎన్‌ఐఏ దాడులు జరుపుతోంది.

పీఎఫ్‌ఐ టెర్రర్‌ ఆక్టివిటీపై సోదాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

నేడు అవిశ్వాసంపై ఓటింగ్

•ప్రధాని మోడీ హాజరయ్యేనా?

కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు (గురువారం) ఓటింగ్ జరగనుంది.

పార్లమెంట్ కు రాకుండా ఉన్న ప్రధాని మోడీని సభకు రప్పించి, మాట్లాడించడా నికి ఒక సాధనమే ఈ అవిశ్వాస తీర్మానమని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి.

అది నేడు నెరవేరనుంది. అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ నేడు సమాధానం ఇవ్వాల్సి ఉన్నది.

అయితే ఈ తీర్మానంపై జరిగే ఓటింగ్లో నేడు అవిశ్వాసంపై ఓటింగ్..ఎలాగూ ప్రభుత్వమే గెలుస్తుందని అందరికీ తెలుసు.

అయితే ప్రస్తుత లోక్ సభ అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వానికి మద్దతుగా 369, ప్రతిపక్షానికి మద్దతుగా 154, తటస్థంగా 16 మంది మద్దతు ఉంది.

వైయస్సార్ టిపి కాంగ్రెస్‌లో విలీనం కానుందా❓️

కాంగ్రెస్‌ లో షర్మిల పార్టీ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో చేరేందుకు షర్మిల సిద్ధమయ్యారు.

ఎలాంటి షరతులు లేకుండానే విలీనానికి షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను ఆమె తీసుకున్నారు.

విలీనం అయ్యాక పాలేరు నుంచి షర్మిల బరిలోకి దిగనున్నారు. అయితే కాంగ్రెస్, వైఎస్సార్‌టీపీ అధికారికంగా ఇంకా తేదీని ఖరారు చేయలేదు.

గతంలో వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఇడుపులపాయకు సోనియాతో పాటు రాహుల్ గాంధీ వస్తున్నారని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.

అయితే అది ముందుకు సాగలేదు. ఎట్టకేలకు ఈ వారంలో షర్మిల పార్టీకి సంబంధించిన విషయంలో కీలకమైన పరిణామం చోటు చేసుకోబోతోంది. కాగా గతంలో రేవంత్ వర్గం షర్మిల పార్టీని విలీనం చేసే అంశాన్ని వ్యతిరేకించారని, మరికొంతమంది షర్మిల రాకను స్వాగతిస్తున్నామని చెప్పి రకరకాల వార్తలు వచ్చాయి.

ఏదీ ఏమైనప్పటికీ ఈ వారంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశమున్నట్లు సమాచారం...

రాహుల్‌పై 'ఫ్లయింగ్‌ కిస్‌'ఆరోపణ.. స్పీకర్‌కు మహిళా ఎంపీల ఫిర్యాదు!

దిల్లీ: అవిశ్వాసంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul gandhi) అనుచితంగా ప్రవర్తించారంటూ భాజపాకు చెందిన మహిళా ఎంపీలు ఆరోపించారు.

అవిశ్వాసంపై తన ప్రసంగం పూర్తికాగానే రాహుల్ గాంధీ లోక్‌సభ నుంచి బయటకు వెళుతూ వెళుతూ ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) పేర్కొన్నారు. దీనిపై ఆ పార్టీ మహిళా ఎంపీలతో కలిసి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తొలుత రాహుల్‌ మాట్లాడారు. తన ప్రసంగం ముగిసిన కాసేపటికే ఆయన బయటికెళ్లారు. వెళ్తూవెళ్తూనే ఆయన ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు.

రాహుల్‌ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'స్త్రీ వ్యతిరేకి మాత్రమే పార్లమెంట్‌లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. అలాంటి విపరీతాలను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. ఆయన మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈ ప్రవర్తన తెలియజేస్తోంది. ఇది అసభ్యకరమైంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఆయన తన ప్రవర్తనతో మహిళలను అవమానించారని ఆరోపిస్తూ.. భాజపా మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన లేఖపై 20 మంది మహిళా సభ్యులు సంతకాలు చేశారు. స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ ఆయన అసభ్యకరమైన సంజ్ఞ చేశారని అందులో పేర్కొన్నారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి కాంగ్రెస్‌ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై భాజపా ఎంపీ పూనమ్ మహాజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'ప్రెస్‌ గ్యాలరీలో కూర్చున్నవారికి ఆయన వ్యవహరించిన తీరు కనిపించి ఉంటుంది. ఆ ప్రవర్తన సిగ్గుచేటు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎలా ప్రవర్తించాలో తెలిసుండాలి' అని విమర్శించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన ఏ ఒక్కరినో ఉద్దేశించి ఆయన ఆ సంజ్ఞ చేయలేదని పేర్కొన్నాయి..

ViZag: పవన్‌.. ఈ 10ప్రశ్నలకు సమాధానం చెప్పండి: మంత్రి అమర్నాథ్‌

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడో విడత వారాహి యాత్ర ఈనెల 10 నుంచి విశాఖలో జరగనుంది. ఈనేపథ్యంలో వారాహి యాత్ర లక్ష్యంగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తీవ్ర విమర్శలు చేశారు.

విశాఖ సర్క్యూట్‌ హౌస్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్.. జగన్‌ను తిట్టడానికే విశాఖ వస్తున్నారని విమర్శించారు.

''బ్రో సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌ లేవు. పవన్‌ లాగా రీల్‌ హీరో కాదు.. రియల్‌ హీరో జగన్‌. అనకాపల్లిలో సెక్షన్‌ 30 ఎప్పుడూ అమల్లో ఉంటుంది. విసన్న పేటలో 600 ఎకరాలు కబ్జా చేశామని నా మీద ఆరోపణలు చేశారు.. నాకు సెంటు భూమి కూడా లేదు. అత్తారింటికి దారేది అంటే.. విశాఖ, ముంబయి, రష్యా గుర్తుకు వస్తాయి.

విసన్నపేటకు పవన్‌ కల్యాణ్‌ వస్తే నాకు అభ్యంతరం లేదు. విశాఖకు ఈ దసరాకి ముఖ్యమంత్రి కానుక ఇస్తారు'' అని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు. విశాఖ, ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయంపై నిలదీయడానికి ప్యాకేజీ స్టార్‌ వస్తున్నారట అంటూ పవన్‌కి పది ప్రశ్నలు సంధించారు. విశాఖ వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలకు పవన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మంత్రి అమర్నాథ్‌ ప్రశ్నలివే...

ఏం సాధించారని వారాహి యాత్ర చేస్తున్నారు? ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి?

విశాఖలో మీ పార్టీ అభ్యర్థుల పేర్లు చెప్పండి?

175కి 175 స్థానాల్లో పోటీ చేస్తామని పవన్‌ చెప్పాలి?

జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడి పేరు చెప్పాలి?

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించినప్పుడు స్వాగతిస్తున్నామని పవన్‌ చెప్పలేదు. తెదేపా స్టాండే.. జనసేన స్టాండ్‌.

భాజపాతో పొత్తు ఉన్నా విశాఖలో స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను పవన్‌ అడ్డుకోలేదు.

జనసేన పార్టీ భాజపాతో సంసారం, తెదేపాతో సహజీవనం చేస్తోంది.

ప్రత్యేక ప్యాకేజీ పాచిపోయిన లడ్డూ అన్నారు.. ఇప్పుడు లడ్డూలు తీయగా ఉన్నాయా?

ఉద్దానంలో ఆసుపత్రి నిర్మిస్తే కనీసం సీఎం జగన్‌ను అభినందించలేదు?

అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వాలంటీర్లకు పవన్‌ క్షమాపణ చెప్పాలి.

పుంగనూరు ఘటనలో 45 మంది పోలీసు అధికారులకు గాయాలు అయ్యాయి.. పోలీసు కొడుకుని అని చెప్పుకునే పవన్‌ స్పందించాలి

అని మంత్రి అమర్నాథ్‌ డిమాండ్‌ చేశారు..

ChandraBabu: నన్ను చంపడానికి ఎవరు ప్లాన్‌ చేస్తున్నారో తేలాలి: చంద్రబాబు

విజయనగరం: ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అంగళ్లు ఘటనలో తనపై హత్యాయత్నం కేసు నమోదు సహా వివిధ అంశాలపై విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు..

దీనికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. అంగళ్లులో ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి చేశారని.. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తనను చంపడానికి ఎవరు ప్లాన్‌ చేస్తున్నారో ఈ విచారణలో తేలాలన్నారు..

సైకో సీఎం ఆదేశాల ప్రకారమే..

''నాపై హత్యాయత్నం చేసి.. తిరిగి నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇదెక్కడి దుర్మార్గమో నాకు అర్థం కావట్లేదు. ఎన్‌ఎస్‌జీ, మీడియా, ప్రజల సాక్షిగా నాపై దాడి జరిగింది. చాలాసార్లు నాపై దాడికి యత్నించారు.

సైకో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే.. నన్ను ప్రజల మధ్య తిరగనీయకుండా చేయడానినే ఈ కేసులు పెడుతున్నారు. దాడికి కుట్ర పన్నితే.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు..

తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టారు

పుంగనూరులో వైకాపా నేతలు రోడ్డు మీదకు ఎందుకు వచ్చారు? పోలీసులు వారిని ఎందుకు అరెస్టు చేయలేదు. వందలాది తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టారు. ఘటనాస్థలిలో లేని వారిపైనా కేసులు నమోదు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు సైతం అమానుషంగా వ్యవహరించారు. అందుకే అక్రమ కేసులు, దాడి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నాను. అసమర్థనాయకుడు సీఎం అయితే.. వ్యవస్థలు ఇలానే ఉంటాయి'' అని చంద్రబాబు మండిపడ్డారు..