/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..నేడు చర్చ ప్రారంభం.. Yadagiri Goud
మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం..నేడు చర్చ ప్రారంభం..

న్యూఢిల్లీ:పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఎన్డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభం కానుంది..

మణిపుర్ హింసపై పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అనర్హత నుంచి ఉపశమనం పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఆ పార్టీ తరఫున చర్చను ప్రారంభించనున్నారు.

బుధ, గురు వారాల్లోనూ అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న (గురువారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీర్మానంపై మాట్లాడనున్నారు. ఆగస్టు 11న వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టింది..

గతవారం దీన్ని స్పీకర్ ఓంబిర్లా ఆమోదించారు. మణిపుర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోడీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే, సభలో మణిపుర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

తద్వారా ప్రధానితో మాట్లాడించవచ్చని భావిస్తున్నాయి. పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్.. సభ్యులకు సమయాన్ని కేటాయించనున్నారు. అధికార పార్టీ ఎంపీలు మాట్లాడిన తర్వాత విపక్ష సభ్యులకు సమయం ఇస్తారు..

Tirumala: తితిదే పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం..

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సమావేశం ముగిసింది. తిరుమలలోని అన్నమయ్య భవవ్‌లో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డు ఆమోదం తెలిపింది..

ఈ మేరకు పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.

పాలకమండలి ఆమోదించిన అంశాలివే..

రూ.4 కోట్లతో అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం నుంచి మోకాలిమిట్ట వరకు భక్తుల సౌకర్యార్థం షేడ్లు ఏర్పాటు.

రూ.2.5 కోట్లతో పీఏసీలో భక్తుల కోసం మరమ్మతు పనులు.

రూ.24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు.

రూ.4.5 కోట్లతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికీకరణ.

రూ.23.50 కోట్ల వ్యయంతో తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లేక్స్ నిర్మాణం.

శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణానికి రూ. 3 కోట్లు కేటాయింపు.

రూ.3.10 కోట్ల వ్యయంతో మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులకు ఆమోదం.

రూ. 9.85 కోట్లతో వకుళమాత ఆలయం వద్ద అభివృద్ధి పనులుకు నిధుల కేటాయింపు.

రూ.2.60 కోట్లతో తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు.

శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్లు కేటాయింపు.

ఎస్‌వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ధి పనులకు రూ. 11.5 కోట్లు కేటాయింపు.

రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు రూ.2.20 కోట్లు కేటాయింపు.

ఎస్‌వీ సంగీత కళాశాల అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు కేటాయింపు.

తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.25 కోట్లు కేటాయింపు.

గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ని తితిదే ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు పొడిగిస్తూ ఆమోదం.

తితిదే ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలుకు కంచె ఏర్పాటుకు రూ. 1.25 కోట్లు కేటాయిస్తూ ఆమోదం.

ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యి

ప్లాంట్ ఏర్పాటుకు రూ. 5 కోట్లు కేటాయింపు.

తెలంగాణ యువతకు స్టేట్ పోలీస్ కీలక హెచ్చరిక

ప్రైవేట్ వాహనాలకు సైరన్లు వాడటం చట్ట రీత్యా నేరమని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇవాళ ట్వీట్ చేసింది.

రాష్ట్రంలో కొందరు యువకులు తమ వాహనాలకు సైరన్లు బిగించి అదొక ఘనకార్యంగా భావిస్తారని, సైరన్ల వాహనాలతో పోలీసులకు పట్టుబడ్డప్పుడు అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడరని హెచ్చరించింది.

సమాజం పట్ల బాధ్యతగల తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపింది.

మైనర్లకు కార్లు, బైక్‌లు ఇవ్వడం నేరంతో పాటు తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తున్నదని పేర్కొంది.

మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు అతనికే కాదు.. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడి కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉందని గుర్తించాలని సూచించింది.......

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రమాదవశాత్తు తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పొగలు రావడం కలకలం సృష్టించింది.

ఈ ఘటనలో ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌కు ట్రైన్ ఆదివారం అర్ధరాత్రి చేరుకుంది.

ఈ క్రమంలో ట్రైన్‌లో పొగలు చెలరేగాయి. రైలులోని S-3 బోగీ నుండి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

భోగిలో పొగలు రావడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది, డ్రైవర్ వెంటనే రైలును బెల్లంపల్లి స్టేషన్‌లో నిలిపివేసి మరమ్మతులు చేశారు. ట్రైన్ బ్రేక్ జామ్ వల్ల భోగిలో పొగలు వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.

వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో బోగీలోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరమ్మతుల అనంతరం రైలు బెల్లంపల్లి నుంచి ఈరోజు ఉదయం బయలుదేరింది....

ఉప్పల్‌లో చేనేత భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా సోమవారం ఉదయం ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాన చేశారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణతో కలిసి చేనేత భవన్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

500 గజాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు.

అదేవిధంగా చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయాదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించనున్నారు...

కొనసాగుతున్న గద్దర్ అంతిమయాత్ర

హైదరాబాద్ :ఆగస్టు 07

ప్రజా యుద్ధనౌక, విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభం అయింది.

ప్రత్యేక వాహనాన్ని పూలతో అలంకరించి గద్దర్ అమర్ రహే అనే భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అశేష జనవాహని నడుమ విప్లవ జోహార్లతో గద్దర్‌కు ప్రజలు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు.

గద్దర్ అంతిమయాత్ర దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాల గుండా తరలిస్తున్నారు.

కాగా గద్దర్ పార్ధీవదేహాన్ని ఎల్బీ స్టేడియం నుంచి అమరవీరుల స్థూపానికి తీసుకెవెళ్లనున్నారు. అనంతరం ఇంటి వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది.

అల్వాల్‌లోని మహాభోది స్కూల్ గ్రౌండ్ లో గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో సీఎ కేసీఆర్ పాల్గొంటారు. చివరి సారిగా గద్దర్ ను చూసేందుకు ఆయన అభిమానులు తరలివస్తున్నారు...

తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్న :మంత్రి హరీష్ రావు దంపతులు

తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు.

ఇవాళ‌ తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న రాత్రి కాలినడకన తిరుమల‌ చేరుకున్న హ‌రీశ్‌రావుకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

సోమవారం ఉదయం ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి హరీష్ రావుకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నేటితో తను 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుమ‌ల వచ్చినట్లు తెలిపారు.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ..!

Rahul Gandhi: పరువు నష్టం కేసుతో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి.. తిరిగి సభ్యత్వం దక్కుతుందా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది..

స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.

అయితే రాహుల్ న్యాయపోరాటంతో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. శిక్ష అమలుపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

దీంతో రాహుల్ గాంధీ సభ్యత్వ పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయింది. అయితే సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారా..? మరింత సమయం తీసుకుంటారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

Jammu and Kashmir : పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం.ఉగ్రవాది హతం

Jammu and Kashmir : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్రవాదులు భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఉగ్ర దాడులు చేసేందుకు చేసిన యత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు..

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

(Army foils infiltration bid in Poonch) సోమవారం సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఓ పాక్ ఉగ్రవాది హతం అయ్యాడు..

పూంచ్ జిల్లాలోని దేగ్వార్ సెక్టార్‌లో అప్రమత్తమైన భద్రతా బలగాలు సోమవారం తెల్లవారుజామున చీకటి ముసుగులో ఇటువైపుకి చొరబడేందుకు ప్రయత్నించిన కొందరు ఉగ్రవాదుల కదలికలను గమనించి ఎదురుకాల్పులు జరిపారు.

పాకిస్థాన్ వైపు నుంచి నియంత్రణ రేఖలోకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భారత సైనికులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఎదురుకాల్పులు జరిపారు..

హుజూర్‌నగర్‌లో 5 కొత్త గ్రామ పంచాయతీల ఎంపిక

సూర్యాపేట జిల్లా:ఆగస్టు 07

హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొత్తగా ఐదు గ్రామపంచాయతీలను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలంలోని గానుగ బండ గ్రామపంచాయతీ నుండి కొండాయి గూడెం,

నేరేడుచర్ల మండలం నుంచి పత్తేపురం గ్రామపంచాయతీలో కొనసాగిన జానల దిన్న , కల్లూరు గ్రామపంచాయతీలో కొనసాగిన లాల్ లక్ష్మీపురం మేళ్లచెరువు మండలంలోని కప్పల కుంట గ్రామపంచాయతీలో కొనసాగిన దుబ్బ తండా ,

అలాగే హేమ్ల తండా గ్రామపంచాయతీలో కొనసాగిన జగ్గు తండాలో ఇక నుండి గ్రామపంచాయతీలుగా కొనసాగనున్నాయి.

ఈ గ్రామ పంచాయతీలో ఏర్పాటు కృషి చేసిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి సహకరించిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజల కృతజ్ఞతలు తెలుపుకున్నారు....