/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలంగాణ యువతకు స్టేట్ పోలీస్ కీలక హెచ్చరిక Yadagiri Goud
తెలంగాణ యువతకు స్టేట్ పోలీస్ కీలక హెచ్చరిక

ప్రైవేట్ వాహనాలకు సైరన్లు వాడటం చట్ట రీత్యా నేరమని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇవాళ ట్వీట్ చేసింది.

రాష్ట్రంలో కొందరు యువకులు తమ వాహనాలకు సైరన్లు బిగించి అదొక ఘనకార్యంగా భావిస్తారని, సైరన్ల వాహనాలతో పోలీసులకు పట్టుబడ్డప్పుడు అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడరని హెచ్చరించింది.

సమాజం పట్ల బాధ్యతగల తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపింది.

మైనర్లకు కార్లు, బైక్‌లు ఇవ్వడం నేరంతో పాటు తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తున్నదని పేర్కొంది.

మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు అతనికే కాదు.. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడి కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉందని గుర్తించాలని సూచించింది.......

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రమాదవశాత్తు తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పొగలు రావడం కలకలం సృష్టించింది.

ఈ ఘటనలో ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌కు ట్రైన్ ఆదివారం అర్ధరాత్రి చేరుకుంది.

ఈ క్రమంలో ట్రైన్‌లో పొగలు చెలరేగాయి. రైలులోని S-3 బోగీ నుండి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

భోగిలో పొగలు రావడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది, డ్రైవర్ వెంటనే రైలును బెల్లంపల్లి స్టేషన్‌లో నిలిపివేసి మరమ్మతులు చేశారు. ట్రైన్ బ్రేక్ జామ్ వల్ల భోగిలో పొగలు వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.

వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో బోగీలోని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరమ్మతుల అనంతరం రైలు బెల్లంపల్లి నుంచి ఈరోజు ఉదయం బయలుదేరింది....

ఉప్పల్‌లో చేనేత భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన

జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా సోమవారం ఉదయం ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాన చేశారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణతో కలిసి చేనేత భవన్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.

500 గజాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు.

అదేవిధంగా చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయాదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించనున్నారు...

కొనసాగుతున్న గద్దర్ అంతిమయాత్ర

హైదరాబాద్ :ఆగస్టు 07

ప్రజా యుద్ధనౌక, విప్లవ వాగ్గేయకారుడు గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభం అయింది.

ప్రత్యేక వాహనాన్ని పూలతో అలంకరించి గద్దర్ అమర్ రహే అనే భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అశేష జనవాహని నడుమ విప్లవ జోహార్లతో గద్దర్‌కు ప్రజలు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు.

గద్దర్ అంతిమయాత్ర దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ను ప్రత్యామ్నాయ మార్గాల గుండా తరలిస్తున్నారు.

కాగా గద్దర్ పార్ధీవదేహాన్ని ఎల్బీ స్టేడియం నుంచి అమరవీరుల స్థూపానికి తీసుకెవెళ్లనున్నారు. అనంతరం ఇంటి వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది.

అల్వాల్‌లోని మహాభోది స్కూల్ గ్రౌండ్ లో గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో సీఎ కేసీఆర్ పాల్గొంటారు. చివరి సారిగా గద్దర్ ను చూసేందుకు ఆయన అభిమానులు తరలివస్తున్నారు...

తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్న :మంత్రి హరీష్ రావు దంపతులు

తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు.

ఇవాళ‌ తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న రాత్రి కాలినడకన తిరుమల‌ చేరుకున్న హ‌రీశ్‌రావుకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

సోమవారం ఉదయం ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి హరీష్ రావుకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.

అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. నేటితో తను 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు పొందడానికి తిరుమ‌ల వచ్చినట్లు తెలిపారు.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ..!

Rahul Gandhi: పరువు నష్టం కేసుతో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి.. తిరిగి సభ్యత్వం దక్కుతుందా..? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది..

స్పీకర్ ఓం బిర్లా నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.

అయితే రాహుల్ న్యాయపోరాటంతో సుప్రీంకోర్టు గుజరాత్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. శిక్ష అమలుపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

దీంతో రాహుల్ గాంధీ సభ్యత్వ పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయింది. అయితే సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారా..? మరింత సమయం తీసుకుంటారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

Jammu and Kashmir : పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం.ఉగ్రవాది హతం

Jammu and Kashmir : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్రవాదులు భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఉగ్ర దాడులు చేసేందుకు చేసిన యత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు..

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

(Army foils infiltration bid in Poonch) సోమవారం సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఓ పాక్ ఉగ్రవాది హతం అయ్యాడు..

పూంచ్ జిల్లాలోని దేగ్వార్ సెక్టార్‌లో అప్రమత్తమైన భద్రతా బలగాలు సోమవారం తెల్లవారుజామున చీకటి ముసుగులో ఇటువైపుకి చొరబడేందుకు ప్రయత్నించిన కొందరు ఉగ్రవాదుల కదలికలను గమనించి ఎదురుకాల్పులు జరిపారు.

పాకిస్థాన్ వైపు నుంచి నియంత్రణ రేఖలోకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భారత సైనికులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఎదురుకాల్పులు జరిపారు..

హుజూర్‌నగర్‌లో 5 కొత్త గ్రామ పంచాయతీల ఎంపిక

సూర్యాపేట జిల్లా:ఆగస్టు 07

హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొత్తగా ఐదు గ్రామపంచాయతీలను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలంలోని గానుగ బండ గ్రామపంచాయతీ నుండి కొండాయి గూడెం,

నేరేడుచర్ల మండలం నుంచి పత్తేపురం గ్రామపంచాయతీలో కొనసాగిన జానల దిన్న , కల్లూరు గ్రామపంచాయతీలో కొనసాగిన లాల్ లక్ష్మీపురం మేళ్లచెరువు మండలంలోని కప్పల కుంట గ్రామపంచాయతీలో కొనసాగిన దుబ్బ తండా ,

అలాగే హేమ్ల తండా గ్రామపంచాయతీలో కొనసాగిన జగ్గు తండాలో ఇక నుండి గ్రామపంచాయతీలుగా కొనసాగనున్నాయి.

ఈ గ్రామ పంచాయతీలో ఏర్పాటు కృషి చేసిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి సహకరించిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజల కృతజ్ఞతలు తెలుపుకున్నారు....

గద్దర్ అంత్యక్రియల విషయంలో చెలరేగిన వివాదం

హైదరాబాద్:ఆగస్టు 07

ప్రజా యుద్ధ నౌక గద్దర్ నిన్న అస్తమించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగుతోంది.

గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమేనంటూ యాంటి టెర్రరిజం ఫోరం (ATF) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గద్దర్‌కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం నక్సలైట్ మావోయిజం వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసుల, పౌరుల త్యాగాలను అవమానించడమేనని ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ పేర్కొన్నారు.

గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి అని తెలిపారు . ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగాగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందన్నారు. నక్సలిజం సాధారణ పౌరులతో పాటు జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందని శశిధర్ వెల్లడించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి ఒక వ్యక్తికి నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో.. శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను.. ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందన్నారు...

త్వరలోనే పీఆర్సీ.. ఆలోగా ఐఆర్‌పై నిర్ణయం

హైదరాబాద్ :ఆగస్టు 07

అతి త్వరలోనే వేతన సవరణ కమిషన్‌ PRCను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు.

ఆలోపు మధ్యంతర భృతి (ఐఆర్‌)పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక వనరులు సమకూరగానే దేశం ఆశ్చర్యపోయేలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేలు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలు అందుకుంటున్నారని గుర్తుచేశారు. ఉద్యోగస్తులంతా తమ పిల్లలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం శాసనసభలో ‘తెలంగాణ సాధన- సాధించిన ప్రగతి’పై జరిగిన లఘుచర్చలో ఆయన మాట్లాడారు.

సింగరేణి ఉద్యోగుల కు దసరా కానుకగా రూ.1000 కోట్ల బోనస్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసరా పింఛన్లను కూడా అవసరాన్ని బట్టి పెంచుతామని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఇటీవల ఖమ్మం సభలో పెన్షన్లు రూ.4 వేలు ఇస్తామందని, వారు 4 వేలు ఇస్తే మేం రూ.5 వేలు అనలేమా? అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల మేనిఫెస్టో లో గంపెడు అస్త్రాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తామని చెప్పారు. అవసరమైతే పెన్షన్లు పెంచుతామని, తాము చేయగలిందే చెబుతామని అన్నారు. కాళేశ్వరం పై కాంగ్రెస్‌ అడ్డగోలుగా మాట్లాడుతోందని కేసీఆర్‌ మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం తెచ్చి, భుజాన వేసుకొని అభివృద్ధి చేసినందుకే నాకు పిండ ప్రదానం చేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు.

ప్రజలే తగిన తీర్పు చెబుతారు’ అంటూ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం లేకపోతే తుంగతుర్తికి నీళ్లు వచ్చేవా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నుంచి కోదాడ దాకా నీళ్లు పారుతున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు చలవేనన్నారు. రైతుల బతుకు విలువ కాంగ్రె్‌సకు తెలియదని.. కాళేశ్వరం వల్లే గోదావరి సజీవంగా మారిందని చెప్పారు.

250 కిలోమీటర్ల పొడవున్న గోదావరిలో 9 ఏళ్ల క్రితం వరకు దుమ్ము రేగితే నేడు 100 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయన్నారు. కాళేశ్వరంపై ఓ వెకిలి, పిచ్చి పేపరు వాడు రాస్తాడని, నిలువెల్లా విషం చిమ్ముతున్నారని మీడియాపై తన అక్కసు వెళ్లగక్కారు.

కాళేశ్వరం దండగ అని మన రాష్ట్రం కాని వాడు చెబుతాడని పరోక్షంగా జేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా కాళేశ్వరమేనన్నారు. ఎస్పారెస్పీని నీల్గబెట్టింది బంగారు కాంగ్రెస్సేనని.. ప్రస్తుతం ఎస్పారెస్పీకీ కాళేశ్వరం నీళ్లతో పునరుజ్జీవం తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ ప్రాంతంలో 68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండితే ప్రస్తుతం 3 కోట్ల టన్నుల దిగుబడులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ వస్తే రైతుబంద్‌కు రాంరాం, కరెంట్‌ గోల్‌మాల్‌, దళితబంధు బంద్‌ అవుతుందని చెప్పారు. పస్తుతం భూ రికార్డులను మార్చడం సీఎం చేత కూడా కాదని చెప్పారు...