/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz YCP Vs Congress : ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చిదంబరం ఆగ్రహం Yadagiri Goud
YCP Vs Congress : ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చిదంబరం ఆగ్రహం

న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం (P Chidambaram) వైకాపా, బీజేడీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023 (GNTC)కు ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు..

ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు బదులుగా తీసుకొస్తున్న ఈ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దతిచ్చారంటే అర్థం చేసుకోవచ్చునని, వైసీపీ, బీజేడీ ఎందుకు మద్దతిస్తున్నాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు..

ఎక్స్ (ట్విటర్) వేదికగా చిదంబరం వైసీపీ, బీజేడీలను తీవ్రంగా దుయ్యబట్టారు. ''ఢిల్లీ సర్వీసుల అథారిటీ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దతిస్తున్నారంటే అర్థం చేసుకోగలం.

కానీ బీజేడీ, వైసీపీ ఈ బిల్లుకు ఎందుకు మద్దతిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు'' అని తెలిపారు. ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం నియమించే ఇద్దరు అధికారులతో కూడిన త్రిసభ్య అథారిటీలో యోగ్యత ఉందని ఈ రెండు పార్టీలు గుర్తించాయా? అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు అధికారులు కోరం అవుతారని, వారిద్దరూ సమావేశాన్ని నిర్వహించి, ముఖ్యమంత్రి భాగస్వామ్యం లేకుండా నిర్ణయం తీసుకోవచ్చునని చెప్తున్న నిబంధన సరైనదేనని ఈ పార్టీలు గుర్తించాయా? ఈ ఇద్దరు అధికారులు ముఖ్యమంత్రిపై పైచేయిగా వ్యవహరించవచ్చుననే నిబంధనలో పస ఉందని భావిస్తున్నాయా? అథారిటీ ఏకగ్రీవ నిర్ణయాన్ని సైతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చవచ్చుననే నిబంధన సరైనదని భావిస్తున్నాయా? అని నిలదీశారు..

జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాడు.

తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని చెప్పారు.

నాదెండ్ల మనోహరను గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం అని తెనాలి నాయకులకు పవన్ సూచించారు.

మొత్తానికి మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయడం ఖాయమైంది.

SB NEWS

తెలంగాణ‌ మద్యం దుకాణాలకు సర్కార్ నోటిఫికేషన్?

ఎన్నికల ఏడాది ముందస్తు మద్యం దుకాణాలకు మహూర్తం ఖరారవుతోంది. వీలైతే ఈ ఏడాది కొంత ముందుగా అంటే ఆగష్టు 4న మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ జారీ చేసేలా ఆబ్కారీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 4నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు ఎక్సైజ్‌ శాఖ యోచిస్తోంది. 20 లేదా 221న లాటరీలను తీసి అదేరోజు దుకాణాలను కేటాయించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.కాగా ప్రతీయేటా నవంబర్‌లో మద్యం దుకాణాలకు వీలుగా ఆబ్కారీ ఏడాది ఆరంభమవుతోంది. అసెంబ్లిd ఎన్నికల కోడ్‌ అక్టోబర్‌లో రానుందనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం కొంత ముందస్తు చర్యలకు సిద్దమవుతోంది.

2021-23 ఏడాదులకు చెందిన కాలపరిమితి నవంబర్‌ 30తో ముగియనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమవుతున్నది. 2023-25 రెండేళ్లకుగానూ ఏ4 లైసెన్సుల గడువు ముగిశాక డిసెంబర్‌ 1నుంచి అమలులోకి రావాల్సి ఉంది. డిసెంబర్‌ 1నుంచి కొత్త రిటైల్‌ మద్యం దుకాణాలు అందుబాటులోకి రావాల్సింది. కానీ డిసెంబర్‌లో ఎన్నికల కారణంగా ముందస్తు నోటిఫికేషన్తో ఈ ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందునుంచే జూలై 1నుంచి కొత్త పాలసీ మొదలవడం సాంప్రదాయంగా ఉండేది. అయితే 2014 తర్వాత తెలంగాణలో మూడు దశల్లో గడువు పెంచడంతో డిసెంబర్‌ 1నుంచి కొత్త దుకాణాల ప్రారంభం జరుగుతూ వచ్చింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 2620 మద్యం దుకాణాలుండగా, గతేడాది దరఖాస్తుల ద్వారానే రూ. 1400కోట్ల రాబడి సమకూరింది. ఇందులో గౌడ్‌లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం మద్యం దుకాణాలను రిజర్వ్‌ చేశారు. గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 దుకాణాలను రిజర్వేషన్‌ ద్వారా కేటాయించారు. మిగిలిన 1864 మద్యం దుకాణాలు ఓపెన్‌ కేటగిరీలో ఉన్నాయి. గతంలో రెండు బ్యాంకు గ్యారంటీలను ఇప్పుడు ఒకేసారి తీసుకోనున్నారు. దరఖాస్తు రుసుముగా రూ. 2లక్షలు వసూలు చేస్తున్నారు.ఖజానా కళకళలాడేలా, వ్యాపారుల ఫ్రెండ్లీగా నూతన మద్యం పాలసీ రూపొందనుంది. జీహెచ్‌ఎంసీలో రాత్రి 11 గంటల వరకు మద్యం విక్రయాలను నిర్వహించుకునేలా సమయాన్ని పెంచిన ప్రభుత్వం అదే ఒరవడితో వ్యాపారులకూ పలు ప్రయోజనాలను వర్తింపజేసింది.

ఏపీ వ్యాపారుల ఆశక్తిని గుర్తించిన ప్రభుత్వం ఆదాయార్జనే లక్ష్యంగా పాలసీలో సిట్టింగ్‌ రూములకు ఎటువంటి ఆనుమతిలకుండా శ్లాబుల పెరుగుదల, రెట్టింపు దరఖాస్తు రుసుముల వంటి కీలక మార్పులతో రెండేళ్లకు ప్రస్తుత మద్యం పాలసీని ప్రకటించింది. వ్యాపారులకు ఊరట కల్గించేలా టెండర్‌తోపాటే సమర్పించే దరావత్తు మొత్తాన్ని (ఈఎండి) రూ. 5 లక్షలనుంచి రూ. 2లక్షలకు తగ్గించడంతోపాటు, లైసెన్సు రుసుములకు గతంలోఉన్న 6 వాయిదాలను 8 వాయిదాలకు పెంచుతూ వ్యాపారులనుంచి పెద్ద మొత్తంలో స్పందన వచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ. లక్ష ఉన్న తిరిగి చెల్లించబడని దరఖాస్తు రుసుమును రూ. 2 లక్షలకు పెంచగా, ఒక్కొక్కరు ఎన్ని దరఖాస్తులైనా సమర్పించేందుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.

గతంలో నాలుగు స్లాబులను 2011 జనాభా ఆధారంగా 6 స్లాబులకు పెంచడంతోపాటు, గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాలకు దుకాణాల పనివేళలు ఉదయం 10నుంచి రాత్రి 11 గంటలవరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతించింది. దరఖాస్తులకు జిల్లా వారీగా ఈనెల 9 తర్వాత కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. లైసెన్సుల జారీనాటికి ఎవరూ రాకుండా మిగిలిపోయిన మద్యం దుకాణాలను టీఎస్‌బిసిఎల్‌ ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీబీసిఎల్‌నుంచి మద్యం కొనుగోళ్లపై వ్యాపారుల టర్నోవర్‌ టాక్స్‌ను 8శాతంగా నిర్ణయించిన ప్రభుత్వం, లైసెన్సు ఫీజుకంటే ఏడాదిలో 7రెట్లు మించిన అమ్మకాలపై 14.5 శాతం అదనపు ప్రివిలేజ్‌ ఫీజును వసూలు చేయనున్నారు. వ్యాపారులకు మద్యం విక్రయాలపై లాభం మార్జిన్‌లను కూడా ప్రకటించారు. ఆర్డినరీ మద్యంపై 27వాతం, మీడియం మద్యంపై 20శాతం, ప్రీమియం, విదేశీ మద్యం, బీర్లపై 20శాతం లాభం మార్జిన్‌ను పాలసీలోనే ప్రకటించారు......

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

తిరుపతి :ఆగస్టు 02

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. సోమవారం నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా లేదు.

నేడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం స్వామివారిని 67,728 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.24 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 21,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

Srinagar: వంతెనపై బాంబు.. నిర్వీర్యం చేసిన దళాలు

జమ్మూకశ్మీర్‌లో పెను ఉగ్రదాడిని భద్రతా దళాలు భగ్నం చేశాయి. శ్రీనగర్‌(Srinagar)-బారాముల్లా (Baramulla) జాతీయ రహదారిపై జంగం ఫ్లైవర్‌ వద్ద సోమవారం ఉదయం పేలుడు పదార్థాలను గుర్తించారు..

దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఆ తర్వాత బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌ను పిలిపించి.. నిర్వీర్యం చేశారు..

ఈ మార్గంలో నిత్యం భద్రతా దళాల కాన్వాయ్‌లు తెల్లవారుజామున ప్రయాణిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకొని పేలుడు పదార్థాలను పెట్టినట్లు భావిస్తున్నారు.

తొలుత ఇక్కడ అనుమానాస్పద వస్తువును గుర్తించడంతో వెంటనే సీఆర్‌పీఎఫ్‌ దళాలు అక్కడికి చేరుకున్నాయి. ఆ వస్తువును ఐఈడీగా అనుమానించి.. జమ్మూకశ్మీర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

వీరితోపాటు సైన్యానికి చెందిన 29వ రాష్ట్రీయరైఫిల్స్‌ బృందాలు అక్కడికి చేరుకొన్నాయి. అనంతరం బాంబుస్క్వాడ్‌ దానిని సురక్షితమైన ప్రదేశానికి తరలించింది. తర్వాత నియంత్రిత విధానంలో ధ్వంసం చేసింది..

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ..

తగ్గుతున్న గోదావరి వరద ప్రవాహం

భద్రాచలం వద్ద నీటిమట్టం 46 అడుగులు

ధవళేశ్వరం వద్ద వరద ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో 15.87లక్షల క్యూసెక్కులు

కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక

పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Jaipur Express Train : జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కాల్పులు.. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ సహా నలుగురు మృతి..

మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్ – ముంబై ఎక్స్‌ప్రెస్ రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు..

వారిలో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణీకులు ఉన్నారు. తెల్లవారు జామున 5గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు జైపూర్ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిగినట్లు తెలిసింది.

అయితే, ఈ కాల్పులు జరిపింది ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) కానిస్టేబుల్ చేతన్ సింగ్‌గా గుర్తించారు.

అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని చెబుతున్నారు..

నేడే ఢిల్లీ బిల్లు, ప్రతిపక్షాలు "సై"- సీఎం జగన్ పైనే బీజేపీ ఆశలు..!!

పార్లమెంట్ లో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కేంద్రం కీలక బిల్లులను సోమవారం సభ ముందుకు తీసుకొస్తోంది. అందులో ఉద్యోగులపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను తగ్గిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టనుంది..

కీలక బిల్లు ప్రతిపాదన:మణిపూర్ అంశం పైన నిరసనలతో హోరెత్తుతున్న పార్లమెంట్ లో ఈ రోజు మరింత ఆసక్తి కర అంశాలు తెర మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే ప్రతిపక్షాలుప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే తేదీని స్పీకర్‌ ఓం బిర్లానిర్ణయించనున్నారు.

ఈ తీర్మానం కూడా ఈవారంలోనే చర్చకు రావచ్చని తెలుస్తోంది. లోక్‌సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉండడంతో ఢిల్లీ బిల్లు ఆమోదం పొందడం సులభమే. రాజ్యసభలో మాత్రం కొంత కష్టపడాల్సి ఉంటుంది. రాజ్యసభ పూర్తి సంఖ్యాబలం 243 కాగా కొన్ని ఖాళీలు ఉండడంతో 238 మంది సభ్యులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు..

వైసీపీ మద్దతు కీలకం:రాజ్యసభలో బీజేపీకి 92 మంది సభ్యులు ఉండగా, ఎన్డీఏ కూటమి పక్షాన 105 మంది ఉన్నారు. అయిదుగురు నామినేటెడ్‌ సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతు తమకే ఉంటుందని బీజేపీ చెబుతోంది. బీఆర్‌ఎస్‌ ఈ బిల్లును వ్యతిరేకించినా ప్రతిపక్షాల సంఖ్యాబలం 108కు మించదని, అందువల్ల ఆమోదంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని రాజ్యసభ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తాజా లెక్కల మేరకు 112 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు తేలుతున్నా బిల్లు ఆమోదం పొందడానికి సరిపోదు. అందువల్ల వైసీపీకి చెందిన 9 మంది సభ్యులు, బీజేడీకి చెందిన 9 మంది సభ్యులపై ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు పార్టీల్లో వైసీపీ ఇప్పటికే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది, బీజేడీ మాత్రం తన వైఖరిని స్పష్టం చేయలేదు. బిజేడీ పరోక్షంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.

సమావేశాల పై ఉత్కంఠ:వైసీపీ, బీజేడీ మద్దతుతో ఢిల్లీ బిల్లు తప్పక ఆమోదం పొందుతుందన్న విశ్వాసంతో మోదీ ప్రభుత్వం ఉన్నది. ఈ బిల్లు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని 90 ఏళ్ల వయస్సున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా వీల్‌ చైర్‌ లో సభకు రానున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందే సమయంలోనే అవిశ్వాసం పైన చర్చకు స్పీకర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ బిల్లును అడ్డుకోవాలని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్ణయించారు. అవిశ్వాసం పైన ఈ నెల 2న లోక్ సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు ఒక్కో సభ్యుడు ఉన్న టీడీపీ, బీఎస్పీ, జేడీఎస్ మద్దతు కూడా తమకే దక్కుతుందని బీజేపీ అంచనా వేస్తోంది..

ఆగస్టులో ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు?

వరుణుడు శాంతించాడు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరిపిచ్చాయి. ఎట్టకేలకు శనివారం సూర్యుడు కనిపించాడు. వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడినట్టు వెల్లడించింది. ఆగస్టు 1వ తేదీన ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల,

రాజన్న సిరిసిల్లా, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ, ఆగస్టు 2న కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వివరించింది.

గడిచిన 24 గంటల్లో స్వల్ప వర్షపాతం

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వానలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో 22.7 మి. మీ, మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరులో 21.4 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 17.1 మి.మీ,

ఖమ్మం జిల్లా వేం సూరులో 14.3 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో 13.4 మి.మీ, వరంగల్‌ జిల్లా చెన్నరావుపేటలో 12.6 మి.మీ, జనగామ జిల్లాలోని జఫర్‌గఢ్‌లో 11.4 మి.మీ, వరంగల్‌ జిల్లాలోని నెక్కొండలో 11.2 మి.మీ, రాయపర్తిలో 9.6 మి.మీ, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో 9.2 మి.మీ. వర్షపాతం నమోదైంది...

Nellore: నర్సాపురం-ధర్మవరం రైలుకు తప్పిన పెను ప్రమాదం..

కావలి: నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట రైల్వేస్టేషన్ల మధ్య పెను ప్రమాదం తప్పింది.

ఆదివారం తెల్లవారుజామున నర్సాపురం నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ఈ ప్రమాదం నుంచి బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. కావలి-బిట్రగుంట మధ్య ఎగువమార్గంలో ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెండు మీటర్ల రైలు పట్టా ముక్కను ట్రాక్‌పై అడ్డుగా పెట్టారు.

ఈ క్రమంలో నర్సాపురం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ అదేమార్గంలో వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ పట్టా ముక్కను రైలు ఢీకొట్టగానే అది దూరంగా పడిపోయింది.

దీంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం..