/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Fire Accident : ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. వంద మంది పేషంట్ల తరలింపు Yadagiri Goud
Fire Accident : ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. వంద మంది పేషంట్ల తరలింపు

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌(Ahmedabad)లోని ఓ ఆస్పత్రిలో భారీగా మంటలు(Fire Accident) చెలరేగాయి. దీంతో వంద మందికిపైగా పేషంట్లను అక్కడి నుంచి తరలించారు..

ఘటనాస్థలికి చేరుకున్న 25 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అహ్మదాబాద్‌లోని షాయిబాగ్‌ ప్రాంతంలో ఉన్న 'రాజస్థాన్‌ ఆస్పత్రి' బేస్‌మెంట్‌లో ఆదివారం తెల్లవారుజాము 4.30 గంటలకు మంటలు వచ్చాయి.

సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు త్రీవంగా శ్రమిస్తున్నారు.

ముందు జాగ్రత్త చర్యగా పై అంతస్తుల్లో ఉన్న పేషంట్లను ఆస్పత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఆస్పత్రిని ఓ ఛారిటబుల్‌ ట్రస్టు నిర్వహిస్తోంది..

హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం

ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ పైకి దూసుకెళ్లింది.

కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. కారులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయట పడ్డారు. కారును వదిలి వేసి అక్కడి నుంచి పరారయ్యారు.

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ మార్గ్ లో హుస్సేన్ సాగర్ కు రక్షణ గోడ నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో కారు ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు...

భద్రాచలంలో కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నది.

ఆదివారం ఉదయం గోదావరి నీటిమట్టం 54.9 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

నదిలో పెద్దఎత్తున నీరు వరస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

ఇప్పటికే పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి ఉధృతికి తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ ప్రధాన రహదారిపైకి నీరు చేరింది.

దీంతో రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి....

టీఎఫ్‌సీసీ ఎన్నికలు ప్రారంభం

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ టీఎఫ్‌సీసీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్.. ఇలా దాదాపు మొత్తం సభ్యులు 3000 మంది సభ్యులు ఉన్నారు.

నిర్మాతలే దాదాపు 1600 మంది ఉన్నారు. ఈ రోజు దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది.

సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి.

ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు....

ఆగస్టు 1న మహారాష్ట్రలో సీఎం కెసిఆర్ పర్యటన

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 1వ తేదీన మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం వెళ్తున్న ఆయన సాయంత్రానికే తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.

మహారాష్ట్ర దళిత నేత అన్నా బావ్ సాటే జయంతి ఉత్సవాల్లో పాల్గొనే నిమిత్తం వెళ్తున్న ఆయన కొల్లాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకోనున్నారు.

ఆ తర్వాత సాహు మహరాష్ట్ర మనుమడిని ఆయన నివాసానికి వెళ్ళి కలవనున్నారు. దళిత నేత జయంతి ఉత్సవాల్లో కేసీఆర్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నేతలు కూడా హాజరుకానున్నారు. రాజకీయంగా ఆ రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ అన్ని సందర్భాలనూ పొలిటికల్‌గా వాడుకుంటున్నారు.

ఇటీవల ఆ రాష్ట్రం నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు పదుల సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరుతున్నారు.

తెలంగాణ భవన్ వేదికగా మాత్రమే కాకుండా ప్రగతి భవన్‌లోనూ పలువురు నేతలను కేసీఆర్ చేర్చుకుంటున్నారు. ఇలాంటి పొలిటికల్ పరిస్థితుల్లో మహారాష్ట్రలో దళిత నేత అన్నా బావ్ సాటే జయంతి ఉత్సవాల్లో పాల్గొని రాజకీయంగానూ అనుకూలంగా మల్చుకోనున్నారు...

పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్

శ్రీహరికోట:జులై 30

ఇటీవల ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో సక్సెస్ అందుకున్న ఇస్రో.. ఇవాళ మరో విజయం సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుండి ఆదివారం ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం విజయవంతమైంది.

పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ద్వారా ఏడు ఉపగ్రహాలను సక్సె్స్ ఫుల్‌గా భూ కక్షలోకి ప్రవేశ పెట్టినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. డీఎస్- సార్ ప్రధాన ఉపగ్రహంతో పాటు మరో ఆరు చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో సైంటిస్ట్‌లు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శాస్రవేత్తలకు చైర్మన్ సోమనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇస్రోకు ఈ ఏడాది ఇది మూడవ వాణిజ్య ప్రయోగం కాగా.. ఈ పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిన సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..

పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ఏడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వాహననౌక ఉపగ్రహాలను కచ్చితమైన కక్షలోకి ప్రవేశపెట్టిందని వెల్లడించారు. పీఎస్‌ఎల్వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామన్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్వీ ప్రయోగం చేపట్టనున్నామని తెలిపారు....

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుపతి :జులై 30

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సర్వ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 78,115 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 4.19 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

శ్రీవారికి 38,243 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు......

ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం

లక్షెట్టిపేట జులై 29

అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని శనివారం లక్షెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలో ఘనంగా నిర్వహించారు.

స్థానిక ప్రధాన రహదారి గుండా వీధుల్లో అటవీ శాఖ అధికారులు నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ తీశారు.

అనంతరం స్థానిక ఎఫ్ఆర్వో నగావత్ స్వామి మాట్లాడుతూ.. పులులను సంరక్షించడం వల్ల అడవులను కాపాడుకోవచ్చని తెలిపారు.

ప్రతి ఒక్కరూ జంతువుల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డీఎఫ్ఆర్వో అజార్, సెక్షన్, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు......

ములుగు జిల్లాలో పర్యటించిన:మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు జిల్లా:జులై 29

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

శనివారం జిల్లాలోని పస్రా నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్లే దారిలో ఉన్న గుండ్ల వాగు రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించారు. అనంతరం గోవిందరావు పేట, ఏటూరు నాగారం మండలాల్లో బాధితులకు ఆహార వస్తువులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో అత్యధిక వర్షాపాతం నమోదు అయిందని తెలిపారు. గుండ్ల వాగు ప్రాజెక్ట్, దయ్యాలవాగు జంపన్న వాగు, ప్రవాహం వలన కొండాయి గ్రామం పూర్తిగా దెబ్బతినగా 8 మంది చనిపోయారని వెల్లడించారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 55 మందిని రక్షించాయని పేర్కొన్నారు. ఆస్తి నష్టం, పంట నష్టాలను అంచనా వేసి తక్షణమే ప్రభుత్వ సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.

గోదావరి నదిలో 14 లక్షల 80 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని,రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని సూచించారు . జిల్లా వ్యాప్తంగా వరదలలో 12 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలకుఅండగా ఉంటుందనీ, తక్షణమే ప్రభుత్వం తరఫున సాయం అందిస్తుందని తెలిపారు.

వరద ముంపునకు గురైన అన్ని గ్రామాలలో కరెంటు, మంచినీటి సౌకర్యం, శానిటేషన్, హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆమె వెంట జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్‌కో చైర్మన్ సతీష్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి ప్రత్యేక అధికారి యస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఎస్పీ గౌస్ ఆలామ్, ఐటీడీఏ పీవో అంకిత్, గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్, అధికారులు పాల్గొన్నారు...

Jayasudha: భాజపాలో చేరనున్న సినీనటి జయసుధ?

హైదరాబాద్‌: సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భాజపాలో చేరనున్నట్టు సమాచారం. శనివారం ఆమె కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు..

ఈ సందర్భంగా భాజపాలో ఆమె చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. జయసుధ భాజపాలో చేరితే సికింద్రాబాద్‌ లేదా ముషీరాబాద్‌ నుంచి పోటీ చేసే అవకాశముంటుందని భావిస్తున్నారు.

భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఇటీవల ఆమెతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించగా, అందుకు సుముఖత వ్యక్తం చేశారు.

అయితే, భాజపాలో చేరికపై జయసుధ స్పందించాల్సి ఉంది. గతంలో ఆమె కాంగ్రెస్‌పార్టీ తరఫున సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందిన విషయం తెలిసిందే. కొంత కాలంగా ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు..