/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్ Yadagiri Goud
పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్

శ్రీహరికోట:జులై 30

ఇటీవల ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో సక్సెస్ అందుకున్న ఇస్రో.. ఇవాళ మరో విజయం సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ నుండి ఆదివారం ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం విజయవంతమైంది.

పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ద్వారా ఏడు ఉపగ్రహాలను సక్సె్స్ ఫుల్‌గా భూ కక్షలోకి ప్రవేశ పెట్టినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. డీఎస్- సార్ ప్రధాన ఉపగ్రహంతో పాటు మరో ఆరు చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు.

పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో సైంటిస్ట్‌లు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శాస్రవేత్తలకు చైర్మన్ సోమనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇస్రోకు ఈ ఏడాది ఇది మూడవ వాణిజ్య ప్రయోగం కాగా.. ఈ పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిన సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..

పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ఏడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వాహననౌక ఉపగ్రహాలను కచ్చితమైన కక్షలోకి ప్రవేశపెట్టిందని వెల్లడించారు. పీఎస్‌ఎల్వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామన్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్వీ ప్రయోగం చేపట్టనున్నామని తెలిపారు....

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుపతి :జులై 30

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సర్వ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 78,115 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 4.19 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

శ్రీవారికి 38,243 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు......

ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం

లక్షెట్టిపేట జులై 29

అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని శనివారం లక్షెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలో ఘనంగా నిర్వహించారు.

స్థానిక ప్రధాన రహదారి గుండా వీధుల్లో అటవీ శాఖ అధికారులు నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ తీశారు.

అనంతరం స్థానిక ఎఫ్ఆర్వో నగావత్ స్వామి మాట్లాడుతూ.. పులులను సంరక్షించడం వల్ల అడవులను కాపాడుకోవచ్చని తెలిపారు.

ప్రతి ఒక్కరూ జంతువుల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డీఎఫ్ఆర్వో అజార్, సెక్షన్, బీట్ ఆఫీసర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు......

ములుగు జిల్లాలో పర్యటించిన:మంత్రి సత్యవతి రాథోడ్

ములుగు జిల్లా:జులై 29

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

శనివారం జిల్లాలోని పస్రా నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్లే దారిలో ఉన్న గుండ్ల వాగు రోడ్డు పునరుద్ధరణ పనులను పరిశీలించారు. అనంతరం గోవిందరావు పేట, ఏటూరు నాగారం మండలాల్లో బాధితులకు ఆహార వస్తువులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో అత్యధిక వర్షాపాతం నమోదు అయిందని తెలిపారు. గుండ్ల వాగు ప్రాజెక్ట్, దయ్యాలవాగు జంపన్న వాగు, ప్రవాహం వలన కొండాయి గ్రామం పూర్తిగా దెబ్బతినగా 8 మంది చనిపోయారని వెల్లడించారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 55 మందిని రక్షించాయని పేర్కొన్నారు. ఆస్తి నష్టం, పంట నష్టాలను అంచనా వేసి తక్షణమే ప్రభుత్వ సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.

గోదావరి నదిలో 14 లక్షల 80 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుందని,రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని సూచించారు . జిల్లా వ్యాప్తంగా వరదలలో 12 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలకుఅండగా ఉంటుందనీ, తక్షణమే ప్రభుత్వం తరఫున సాయం అందిస్తుందని తెలిపారు.

వరద ముంపునకు గురైన అన్ని గ్రామాలలో కరెంటు, మంచినీటి సౌకర్యం, శానిటేషన్, హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆమె వెంట జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్‌కో చైర్మన్ సతీష్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి ప్రత్యేక అధికారి యస్. క్రిష్ణ ఆదిత్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఎస్పీ గౌస్ ఆలామ్, ఐటీడీఏ పీవో అంకిత్, గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్, అధికారులు పాల్గొన్నారు...

Jayasudha: భాజపాలో చేరనున్న సినీనటి జయసుధ?

హైదరాబాద్‌: సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భాజపాలో చేరనున్నట్టు సమాచారం. శనివారం ఆమె కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు..

ఈ సందర్భంగా భాజపాలో ఆమె చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. జయసుధ భాజపాలో చేరితే సికింద్రాబాద్‌ లేదా ముషీరాబాద్‌ నుంచి పోటీ చేసే అవకాశముంటుందని భావిస్తున్నారు.

భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఇటీవల ఆమెతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించగా, అందుకు సుముఖత వ్యక్తం చేశారు.

అయితే, భాజపాలో చేరికపై జయసుధ స్పందించాల్సి ఉంది. గతంలో ఆమె కాంగ్రెస్‌పార్టీ తరఫున సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందిన విషయం తెలిసిందే. కొంత కాలంగా ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు..

Viveka Murder Case: నా వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా రికార్డు చేసింది: అజేయ కల్లం

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన వాంగ్మూలంపై తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం పిటిషన్‌ దాఖలు చేశారు..

సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసిందని అందులో వెల్లడించారు. సీఎం జగన్‌ను భారతి పిలిచారని సీబీఐకి తాను చెప్పలేదని చెప్పారు.

వివేకా హత్య కేసు ఛార్జిషీట్‌ నుంచి తన వాంగ్మూలాన్ని తొలగించాలని కోరారు. తన వాంగ్మూలానికి సంబంధించి మళ్లీ విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్‌లో అజేయ కల్లం పేర్కొన్నారు.

''లోటస్‌పాండ్‌లో ఉండగా ఉదయం 5.30 గంటలకు అటెండర్‌ తలుపు కొట్టారు. వైఎస్‌ భారతి మేడపైకి రమ్మంటున్నారని అటెండర్‌ జగన్‌కు చెప్పారు.

బయటకు వెళ్లి 10 నిమిషాల తర్వాత జగన్‌ మళ్లీ వచ్చారు. బాబాయ్‌ ఇక లేరనే విషయాన్ని జగన్‌ నిలబడే మాకు చెప్పారు'' అని అజేయ కల్లం ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ జూన్‌ 30న కోర్టుకు సమర్పించింది.

తెలంగాణ డ్వాక్రా మహిళ సంఘాల పనితీరు అద్భుతం

తెలంగాణ మహిళా డ్వాక్రా సంఘాల పనితీరు, అనుభవాన్ని ఇతర రాష్ట్రాల మహిళ సంఘాలకు శిక్షణ ఇచ్చి తీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశంసించారు.

ఇటీవ‌ల ల‌డ‌క్ వెళ్లి అక్కడ శిక్షణ ముగించి వ‌చ్చిన హ‌నుమ‌కొండ‌కు చెందిన‌ పేద‌రిక నిర్మూల‌న సంస్థ ఓరుగ‌ల్లు మ‌హా స‌మాఖ్యకు చెందిన 15 మంది మహిళలు శనివారం హన్మకొండ లోని మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సమావేశమయ్యారు.

అక్కడి శిక్షణ ఇచ్చిన తీరును వివరించగా శభాష్‌ అంటూ వారిని మెచ్చుకున్నారు.

దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన మ‌హిళలకు అభినంద‌న‌లు తెలిపారు. ఏండ్లుగా వారు నిర్వహిస్తున్న శిక్షణ ప‌ద్ధతులను అడిగి తెలుసుకున్నారు. వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాకు చెందిన 10 ఉత్తమ ప్రగ‌తి సాధించిన ఆద‌ర్శ సంఘాల‌తో క‌లిపి ఓరుగ‌ల్లు ప‌ర‌స్పర స‌హాయ‌క స‌హ‌కార సంఘాలు మ‌హా స‌మాఖ్యగా ఏర్పడి 18 ఏండ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాదుల ఏర్పాటు ద్వారా పేద‌రిక నిర్మూల‌న, మ‌హిళ‌ల ఆర్థికాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. 2015లో ఈ స‌మాఖ్య తెలంగాణ‌లో ఏకైక జాతీయ స్థాయి మాన‌వ వ‌న‌రుల సంస్థగా జాతీయ గుర్తింపును పొందింది. ఈ సంస్థలోని దాదాపు 460 మంది రిసోర్స్ ప‌ర్సన్స్ త‌గు శిక్షణ పొంది, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో త‌మ అనుభ‌వాల‌ను రంగ‌రించి శిక్షణ ఇస్తున్నారు.

అనంత‌రం మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల‌ను సీఎం కేసీఆర్ బ‌లోపేతం చేశారని వెల్లడించారు. పేద‌రిక నిర్మూల‌న సంస్థ ఆధ్వర్యంలో 4,35,364 స్వయం స‌హాయ‌క సంఘాల‌లో 45,60,518 మంది మ‌హిళ‌లు స‌భ్యులుగా ఉన్నార‌న్నారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున సంఘటిత‌మైన మ‌హిళ‌లు తెలంగాణ‌లో త‌ప్ప ఎక్కడా లేర‌న్నారు.

ఈ కార్యక్రమంలో వ‌రంగ‌ల్ జడ్పీ ఇన్‌చార్జి సీఈవో, వ‌రంగ‌ల్ డీఆర్‌డీవో సంప‌త్ రావు, సెర్ప్‌నకు చెందిన త‌క్కెళ్ళప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, ఓరుగ‌ల్లు మ‌హా స‌మాఖ్య కు చెందిన మ‌హిళ‌లు, రిసోర్స్ ప‌ర్సన్స్‌, సీనియ‌ర్ క‌మ్యూనిటీ రిసోర్స్ ప‌ర్సన్స్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.......

మున్సిపల్ అధికారులకు: మంత్రి కేటీఆర్‌ సూచనలు

పురపాలక శాఖ ఉన్నతాధి కారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై పురపాలక శాఖ అధికారులకు మంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో ముందుకు పోదామని అధికారులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అధికారంలదిరికీ ఇప్పటికే సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు.

ఎట్టి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలన్నారు. పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయని.. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైతే సాగునీటి శాఖతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు వాటిని కొంత ఖాళీ చేయించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తరలించాలని మంత్రి ఆదేశించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలపైన ఎక్కువ దృష్టి సారించాలన్నారు. సహాయ కార్యక్రమాల సమన్వయం కోసం హైదరాబాద్‌తో పాటు ప్రతి జిల్లాలోని కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పట్టణాల్లో ఉన్న రహదారులను వెంటనే మోటరబుల్‌గా తయారు చేయాలని.. దీని కోసం అవసరం అయిన తాత్కాలిక మరమత్తులు చేపట్టాలని తెలిపారు. ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ ని చేపట్టాలన్నారు. పేరుకుపోయిన నీటిని తొలగించేందుకు డీ వాటరింగ్ పంపులను కూడా వినియోగించాలన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీరును అందించాలని ఆదేశించారు. సురక్షిత తాగునీరు సరఫరా కోసం మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని పైపులైన్ల లీకేజీలు వెంటనే మరమ్మతులు చేయడము, తాగునీటి క్లోరినేషన్ వంటి కార్యక్రమాలను వేగంగా చేపట్టాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డీఎంహెచ్‌వోలతో సమన్వయం చేసుకొని అవసరమైన వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

మిగిలిపోయిన శిధిలావస్థలో ఉన్న పురాతన భవనాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో జాగ్రత్తగా సమన్వయం చేసుకొని మరమత్తు కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

వరద బాధిత ప్రజలను ఆదుకోండి అధికారులకు: ఎమ్మెల్సీ కవిత సూచన

నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, వదర బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత జిల్లా అధికారులకు సూచించారు.

శనివారం ఆమె జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో ఫోన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

లోతట్టు ప్రాంతాలు, వరద బాధిత ప్రాంతాలను పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని బీఆర్‌ఎస్‌ క్యాడర్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైన సహాయ, సహకారాల కోసం అధికారులను సంప్రదించాలని కోరారు.

ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, ఆయా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు, సహాయక చర్యలు వంటి అంశాలపై పలు సూచనలు ఇచ్చారు.

వైద్యం ఆహారం విద్యుత్, రోడ్డు సౌకర్యాల పునరుద్ధరణ కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించాలని సూచించారు.

కంట్రోల్ రూమ్ తోపాటు తన కార్యాలయం కూడా నిరంతరం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. సహాయక చర్యలకు సంబంధించి అధికారులు తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలను సీఎం కేసీఆర్ కు తెలియజేస్తానని, అత్యవసరంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని కవిత అన్నారు.......

తెలంగాణలో గెరువిచ్చిన వాన

రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొన్నది.

ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నదని వివరించింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది.

కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది.

రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం అధికంగా ఉన్నదని, మరో అల్పపీడనం ఏర్పడితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి.

మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వానలు పడ్డాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం నుంచి మూడు రోజులపాటు సాధారణ వాతావరణం ఉంటుందని ప్రకటించింది. రాష్ట్రంలో 10 రోజుల ముందు వరకు 54 శాతం లోటు వర్షపాతం నమోదవగా, శుక్రవారం నాటికి 65 అధిక వర్షపాతం రికార్డయ్యింది. గడిచిన 24 గంటల్లో 24 చోట్ల 60 శాతానికి పైగా, రెండు చోట్ల 20 నుంచి 59 శాతం, ఒక చోట సాధారణ, 6 చోట్ల లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది..