/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Jayasudha: భాజపాలో చేరనున్న సినీనటి జయసుధ? Yadagiri Goud
Jayasudha: భాజపాలో చేరనున్న సినీనటి జయసుధ?

హైదరాబాద్‌: సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ భాజపాలో చేరనున్నట్టు సమాచారం. శనివారం ఆమె కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి తాజా రాజకీయాలపై చర్చించారు..

ఈ సందర్భంగా భాజపాలో ఆమె చేరికపై చర్చించినట్టు తెలుస్తోంది. జయసుధ భాజపాలో చేరితే సికింద్రాబాద్‌ లేదా ముషీరాబాద్‌ నుంచి పోటీ చేసే అవకాశముంటుందని భావిస్తున్నారు.

భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఇటీవల ఆమెతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించగా, అందుకు సుముఖత వ్యక్తం చేశారు.

అయితే, భాజపాలో చేరికపై జయసుధ స్పందించాల్సి ఉంది. గతంలో ఆమె కాంగ్రెస్‌పార్టీ తరఫున సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందిన విషయం తెలిసిందే. కొంత కాలంగా ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు..

Viveka Murder Case: నా వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా రికార్డు చేసింది: అజేయ కల్లం

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన వాంగ్మూలంపై తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం పిటిషన్‌ దాఖలు చేశారు..

సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసిందని అందులో వెల్లడించారు. సీఎం జగన్‌ను భారతి పిలిచారని సీబీఐకి తాను చెప్పలేదని చెప్పారు.

వివేకా హత్య కేసు ఛార్జిషీట్‌ నుంచి తన వాంగ్మూలాన్ని తొలగించాలని కోరారు. తన వాంగ్మూలానికి సంబంధించి మళ్లీ విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్‌లో అజేయ కల్లం పేర్కొన్నారు.

''లోటస్‌పాండ్‌లో ఉండగా ఉదయం 5.30 గంటలకు అటెండర్‌ తలుపు కొట్టారు. వైఎస్‌ భారతి మేడపైకి రమ్మంటున్నారని అటెండర్‌ జగన్‌కు చెప్పారు.

బయటకు వెళ్లి 10 నిమిషాల తర్వాత జగన్‌ మళ్లీ వచ్చారు. బాబాయ్‌ ఇక లేరనే విషయాన్ని జగన్‌ నిలబడే మాకు చెప్పారు'' అని అజేయ కల్లం ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ జూన్‌ 30న కోర్టుకు సమర్పించింది.

తెలంగాణ డ్వాక్రా మహిళ సంఘాల పనితీరు అద్భుతం

తెలంగాణ మహిళా డ్వాక్రా సంఘాల పనితీరు, అనుభవాన్ని ఇతర రాష్ట్రాల మహిళ సంఘాలకు శిక్షణ ఇచ్చి తీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశంసించారు.

ఇటీవ‌ల ల‌డ‌క్ వెళ్లి అక్కడ శిక్షణ ముగించి వ‌చ్చిన హ‌నుమ‌కొండ‌కు చెందిన‌ పేద‌రిక నిర్మూల‌న సంస్థ ఓరుగ‌ల్లు మ‌హా స‌మాఖ్యకు చెందిన 15 మంది మహిళలు శనివారం హన్మకొండ లోని మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సమావేశమయ్యారు.

అక్కడి శిక్షణ ఇచ్చిన తీరును వివరించగా శభాష్‌ అంటూ వారిని మెచ్చుకున్నారు.

దేశానికే ఆద‌ర్శంగా నిలిచిన మ‌హిళలకు అభినంద‌న‌లు తెలిపారు. ఏండ్లుగా వారు నిర్వహిస్తున్న శిక్షణ ప‌ద్ధతులను అడిగి తెలుసుకున్నారు. వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాకు చెందిన 10 ఉత్తమ ప్రగ‌తి సాధించిన ఆద‌ర్శ సంఘాల‌తో క‌లిపి ఓరుగ‌ల్లు ప‌ర‌స్పర స‌హాయ‌క స‌హ‌కార సంఘాలు మ‌హా స‌మాఖ్యగా ఏర్పడి 18 ఏండ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాదుల ఏర్పాటు ద్వారా పేద‌రిక నిర్మూల‌న, మ‌హిళ‌ల ఆర్థికాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. 2015లో ఈ స‌మాఖ్య తెలంగాణ‌లో ఏకైక జాతీయ స్థాయి మాన‌వ వ‌న‌రుల సంస్థగా జాతీయ గుర్తింపును పొందింది. ఈ సంస్థలోని దాదాపు 460 మంది రిసోర్స్ ప‌ర్సన్స్ త‌గు శిక్షణ పొంది, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో త‌మ అనుభ‌వాల‌ను రంగ‌రించి శిక్షణ ఇస్తున్నారు.

అనంత‌రం మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల‌ను సీఎం కేసీఆర్ బ‌లోపేతం చేశారని వెల్లడించారు. పేద‌రిక నిర్మూల‌న సంస్థ ఆధ్వర్యంలో 4,35,364 స్వయం స‌హాయ‌క సంఘాల‌లో 45,60,518 మంది మ‌హిళ‌లు స‌భ్యులుగా ఉన్నార‌న్నారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున సంఘటిత‌మైన మ‌హిళ‌లు తెలంగాణ‌లో త‌ప్ప ఎక్కడా లేర‌న్నారు.

ఈ కార్యక్రమంలో వ‌రంగ‌ల్ జడ్పీ ఇన్‌చార్జి సీఈవో, వ‌రంగ‌ల్ డీఆర్‌డీవో సంప‌త్ రావు, సెర్ప్‌నకు చెందిన త‌క్కెళ్ళప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, ఓరుగ‌ల్లు మ‌హా స‌మాఖ్య కు చెందిన మ‌హిళ‌లు, రిసోర్స్ ప‌ర్సన్స్‌, సీనియ‌ర్ క‌మ్యూనిటీ రిసోర్స్ ప‌ర్సన్స్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.......

మున్సిపల్ అధికారులకు: మంత్రి కేటీఆర్‌ సూచనలు

పురపాలక శాఖ ఉన్నతాధి కారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై పురపాలక శాఖ అధికారులకు మంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో ముందుకు పోదామని అధికారులకు పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అధికారంలదిరికీ ఇప్పటికే సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు.

ఎట్టి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలన్నారు. పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయని.. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైతే సాగునీటి శాఖతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు వాటిని కొంత ఖాళీ చేయించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తరలించాలని మంత్రి ఆదేశించారు.

వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలపైన ఎక్కువ దృష్టి సారించాలన్నారు. సహాయ కార్యక్రమాల సమన్వయం కోసం హైదరాబాద్‌తో పాటు ప్రతి జిల్లాలోని కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పట్టణాల్లో ఉన్న రహదారులను వెంటనే మోటరబుల్‌గా తయారు చేయాలని.. దీని కోసం అవసరం అయిన తాత్కాలిక మరమత్తులు చేపట్టాలని తెలిపారు. ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ ని చేపట్టాలన్నారు. పేరుకుపోయిన నీటిని తొలగించేందుకు డీ వాటరింగ్ పంపులను కూడా వినియోగించాలన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీరును అందించాలని ఆదేశించారు. సురక్షిత తాగునీరు సరఫరా కోసం మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని పైపులైన్ల లీకేజీలు వెంటనే మరమ్మతులు చేయడము, తాగునీటి క్లోరినేషన్ వంటి కార్యక్రమాలను వేగంగా చేపట్టాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డీఎంహెచ్‌వోలతో సమన్వయం చేసుకొని అవసరమైన వైద్య ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

మిగిలిపోయిన శిధిలావస్థలో ఉన్న పురాతన భవనాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో జాగ్రత్తగా సమన్వయం చేసుకొని మరమత్తు కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

వరద బాధిత ప్రజలను ఆదుకోండి అధికారులకు: ఎమ్మెల్సీ కవిత సూచన

నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, వదర బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత జిల్లా అధికారులకు సూచించారు.

శనివారం ఆమె జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో ఫోన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

లోతట్టు ప్రాంతాలు, వరద బాధిత ప్రాంతాలను పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని బీఆర్‌ఎస్‌ క్యాడర్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైన సహాయ, సహకారాల కోసం అధికారులను సంప్రదించాలని కోరారు.

ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల, ఆయా లోతట్టు ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు, సహాయక చర్యలు వంటి అంశాలపై పలు సూచనలు ఇచ్చారు.

వైద్యం ఆహారం విద్యుత్, రోడ్డు సౌకర్యాల పునరుద్ధరణ కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించాలని సూచించారు.

కంట్రోల్ రూమ్ తోపాటు తన కార్యాలయం కూడా నిరంతరం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. సహాయక చర్యలకు సంబంధించి అధికారులు తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలను సీఎం కేసీఆర్ కు తెలియజేస్తానని, అత్యవసరంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని కవిత అన్నారు.......

తెలంగాణలో గెరువిచ్చిన వాన

రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయానికల్లా అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొన్నది.

ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నదని వివరించింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది.

కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది.

రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం అధికంగా ఉన్నదని, మరో అల్పపీడనం ఏర్పడితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో మూడు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి.

మిగతా ప్రాంతాల్లో కూడా భారీ వానలు పడ్డాయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శనివారం నుంచి మూడు రోజులపాటు సాధారణ వాతావరణం ఉంటుందని ప్రకటించింది. రాష్ట్రంలో 10 రోజుల ముందు వరకు 54 శాతం లోటు వర్షపాతం నమోదవగా, శుక్రవారం నాటికి 65 అధిక వర్షపాతం రికార్డయ్యింది. గడిచిన 24 గంటల్లో 24 చోట్ల 60 శాతానికి పైగా, రెండు చోట్ల 20 నుంచి 59 శాతం, ఒక చోట సాధారణ, 6 చోట్ల లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది..

కాంగ్రెస్ బిజెపి పార్టీలతో తెలంగాణలో ఒరిగేది ఏమీ లేదు: మంత్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లా :జులై 29

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలని ఆ పార్టీలతో తెలంగాణలో ఒరిగేది ఏమీ లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకు‌పడ్డారు.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి పనులకు హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..

బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు, వేలాది మంది రైతుల చావుకు కారణమైందని అన్నారు. మూడు గంటల కరెంటు చాలని తెలంగాణ ప్రజల శాపంగా కాంగ్రెస్ పార్టీ మారిందన్నారు.

మూడు పంటలు పండాలనే సీఎం కేసీఆర్‌ను కడుపులో పెట్టుకుని చూసుకుందామన్నారు. ఎవరూ తెలంగాణ ప్రజా సంక్షేమంపై ముందు చూపుతో వ్యవహరిస్తున్నారో.. ప్రజలు మీరే ఆలోచన చేయాలన్నారు.

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడు కాంగ్రెస్ చీఫ్ పార్టీ రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిలు తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారన్నారు. సద్దితిన్న రేవు తలవాలని సీఎం కేసీఆర్‌ను నిండు మనస్సుతో దీవించాలని కోరారు.

ఓవైపు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సమైక్యాంధ్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ సమైక్యాంధ్ర సీఎం చంద్రబాబు గురువని ఆయన చెప్పినట్లు వింటున్నారంటూ.. వీరిద్దరితో మన తెలంగాణ బతుకులు ఆగమైతయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ సీఎంలైన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహులను అడ్డు పెట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కుదువ బెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు...

సబ్బితం వాటర్ ఫాల్స్ పర్యాటక స్థలాన్ని సందర్శించిన: సి పి రెమా రాజేశ్వరి

పెద్దపెల్లి జిల్లా లోని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్బితం వాటర్ ఫాల్స్ పర్యాటక స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి శనివారం రోజు సందర్శించారు.

ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.చనిపోయిన మానుపాటి వెంకటేష్ ప్రమాదం గల కారణాలు అదికారులను అడిగి తెలుసుకొన్నారు. వెంకటేష్ బాడీ బయటకు తీయడానికి సహకరించిన మాదాసు శ్రీనివాస్, ఆకుల గట్టయ్య లను ఆమె అభినందించారు.

వారిని సత్కారించి అభినందించాలని అధికారులను ఆదేశించారు. రెమా రాజేశ్వరి ఆ ప్రాంత స్థానికులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ ప్రాంత యువకులు,

ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. వాటర్ ఫాల్స్ వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉందని, ప్రజలను సందర్శనకు అనుమతి ఇవ్వడం లేదని ఆహ్లాదం కోసం వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు.

సీపీ వెంట పెద్దపెల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్., పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ ,గోదావరిఖని ఏసిపి తులా శ్రీనివాసరావు, పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్, మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, బసంత్ నగర్ ఎస్సై వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు......

కరీంనగర్‌ జిల్లాలో ఈటల పర్యటన.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై నిప్పులు

కరీంనగర్ జిల్లా :జులై 29

జిల్లాలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, మండలాల్లో శనివారం రోజు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు.

వర్షాలకు తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్టులను ఈటల పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, అంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగిన బాధితులను పరమార్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...

ఇండ్లు నీట మునిగిన బాధితుల పట్ల ప్రభుత్వ స్పందన కరువని విమర్శించారు.

బాధితులను ఫంక్షన్ హాల్లో పెట్టి అన్నం పెట్టారని.. పరిహారానికి మాత్రం దిక్కు లేదన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేలు ఆందజేయాలని డిమాండ్ చేశారు. తెగిన రోడ్లు, చెరువులు, కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేపట్టాలన్నారు.

చెరువుల కింద ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయన్నారు. ప్రభుత్వం మాటలు గొప్పగా ఉంటాయని.. కానీ చేతల్లో మాత్రం ఏమీ చెయ్యరని ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈనెల 31న క్యాబినెట్‌ సమావేశం

రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈనెల 31న చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నారు.

రాష్ట్ర క్యాబినెట్‌లో దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చించనున్నారు. అందులో భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు,

ప్రభుత్వ చర్యలపై, వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ, అనుసరించాల్సి ప్రత్యామ్నాయ విధానాలపై సమీక్షిస్తారు. ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టంపై అంచనాలను సిద్ధంచేసి,

యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై ప్రణాళికలను రూపొందించనున్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.

దీంతోపాటు ఆగస్టు 3 నుంచి జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ, అందులో చర్చించాల్సిన అంశాలను క్యాబినెట్‌లో నిర్ణయించనున్నారు...