/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పార్లమెంట్‌లో కొనసాగుతోన్న వాయిదాల పర్వం.. Yadagiri Goud
పార్లమెంట్‌లో కొనసాగుతోన్న వాయిదాల పర్వం..

దిల్లీ: ఈ వర్షాకాల సమావేశంలో మణిపుర్‌ అంశం పార్లమెంట్‌(Parliament)ను కుదిపేస్తోంది. తాజాగా ఇదే విషయమై విపక్ష ఎంపీల(opposition) నుంచి నిరసన వ్యక్తం కావడంతో రెండు నిమిషాలకే లోక్‌సభ వాయిదా పడింది..

దీనికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్‌ జోషి(Parliamentary Affairs Minister Pralhad Joshi) మీడియాతో మాట్లాడుతూ విపక్షాల వైఖరిని తప్పుపట్టారు.

'వారు పార్లమెంట్‌లో శాంతియుత చర్చకు ముందుకురావడం లేదు. అలాగే బిల్లుల్ని ఆమోదించడానికి సహకరించడం లేదు. వారి నుంచి సూచనలు స్వీకరించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

కానీ వారు మాత్రం ఉన్నట్టుండి అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చారు. వారు మణిపుర్‌కు సంబంధించిన వాస్తవాలు బయటకురావాలని కోరుకుంటే..

దానిపై చర్చించడానికి పార్లమెంట్‌కు మించి మంచి వేదిక లేదు' అని అన్నారు. మరోపక్క రాజ్యసభలోనూ ఇదే అంశంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది.

PSLV C56 Launch: 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈనెల 30వ తేదీ ఉదయం 6.30 గంటలకు సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగాన్ని నిర్వహించనుంది.

ఇప్పటికే నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తి చేసి రాకెట్‌ను మొబైల్‌ సర్వీస్‌ టవర్‌ (ఎంఎస్‌టీ)కు తీసుకువచ్చారు.

అక్కడ ఏడు ఉపగ్రహాలను రాకెట్‌ శిఖరభాగాన అమర్చి.. హీట్‌షీల్డ్‌ క్లోజ్‌ చేసే ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు.

29వ తేదీ ఉదయం 6.30 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆ సమయాన్ని కొద్దిగా మార్చే అవకాశం కూడా ఉంది.

ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 422 కిలోల బరువు కలిగిన ఏడు ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు..

Vijayawada: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ప్రమాణస్వీకారం

విజయవాడ: ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ప్రమాణస్వీకారం చేశారు.

విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు..

ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతో పాటు సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు..

SB NEWS

SB NEWS

భద్రాచలం వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి

భద్రాచలం జిల్లా:జులై 28

భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.

ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొన సాగుతున్నది. నదిలో మరోసారి వరద పెరుగు తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కాగా, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. పేరూరులో ఉదయం 6 గంటలకు నీటిమట్టం 48.44 అడుగులకు పెరిగింది.

దీంతో వెంకటాపురం-భద్రాచలం రహదారి బ్రిడ్జిలపై వరద ప్రవహిస్తున్నది. అదేవిధంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది.

ఈనేపథ్యంలో టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నీటిప్రవాహం పెరగడంతో అధికారులు రామన్న గూడెం పుష్కర ఘాట్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు...

Flood Effect: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వరద.. భారీగా నిలిచిపోయిన వాహనాలు

నందిగామ: హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే..

శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్‌గేట్‌ నుంచి విజయవాడ వైపు సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి..

SB NEWS

SB NEWS

SB NEWS

holidays for schools: భారీ వర్షాలు.. తెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింది..

ఇందుకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలు బుధ, గురువారాలు సెలవు ప్రకటించాయి.

తాజాగా ఆ సెలవులను శుక్రవారం వరకూ పొడిగించారు. మరోవైపు శనివారం మొహర్రం, ఆ తర్వాత ఆదివారం ఇలా విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చినట్లైంది..

జమ్మికుంటలో నీట మునిగిన ఇండ్లు

కరీంనగర్ జిల్లా:జులై 27

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వరద నీటితో మునిగిపోయింది. 6వ వార్డు పరిధిలోకి వచ్చే హౌసింగ్ బోర్డ్ కాలనీ భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి కాలనీ మొత్తం నీట మునగడం రివాజుగా మారింది.

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలోకి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో బుధవారం రాత్రి కాలనీవాసులంతా తమ ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ఉలిక్కిపడ్డారు.

సుమారుగా ఈ కాలనీలో 4 వందల పైగా ఇళ్లు ఉండగా అవన్నీ కూడా నీట మునిగాయి. దీంతో ఇళ్లల్లో ఉన్న ఫ్రిడ్జ్‌లు, టీవీలు, బియ్యం, నిత్యావసర సరుకులను సర్వం కోల్పోవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కాలనీవాసులు తెలిపారు.

వాటితో పాటు కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. వీటితో పాటు పట్టణ పరిధిలోని అంబేద్కర్ కాలనీ, మోత్కులగూడెంలోని కొంత భాగం, నీట మునిగాయి. కాగా జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని దాదాపు అన్ని గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.

ఇల్లందకుంట మండలంలోని మల్యాల గ్రామంలో అత్యధికంగా 37 శాతం వర్షపాతం నమోదు కావడంతో దీని ప్రభావంతో అన్ని గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కాగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పరిస్థితి ఇలా ఉంటే మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏం జరగనుందదోనని జమ్మికుంట పట్టణంతో పాటు ఇల్లందకుంట గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు...

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

L

సున్నిపెంట సర్కిల్‌: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది.

జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 52,856 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది..

జలాశయం నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటల సమయానికి 816.20 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 38.1234 టీఎంసీలుగా నమోదైంది..

SB NEWS

*SB NEWS"

క‌రీంన‌గ‌ర్ లోయ‌ర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తే చాన్స్‌?

క‌రీంన‌గ‌ర్‌జిల్లా :జులై 27

జిల్లా లోని లోయర్ మానేరు డ్యామ్ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు వ‌ర‌ద పోటెత్తుతోంది.

ఉత్తర తెలంగాణాలో అతిభారీ వర్షాల‌తో ఏక్షణంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, నీటిని దిగువకు వదిలే అవకాశం ఉన్నది.

రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు.

గ్రామాలలో దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. పరివాహక ప్రాంతంలోకి పశువులు గాని, గొర్రెలు వెళ్లకుండా చూసుకోవాల‌ని, అలాగే చేపలు పట్టేవారు,

గొర్రెల‌ కాపరులు, రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండాలని ఇరిగేష‌న్ అధికారులు తెలిపారు...,.....

కడెం ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ను గురువారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్ నిర్మల్ జిల్లా కలెక్టర్ కే వరుణ్ రెడ్డి నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలిసి రాష్ట్ర న్యాయ ఆటవి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా కడెం ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం కడెం జలాశయంలో వస్తున్న ఇన్ ఫ్లో వరద నీరు వరద గేట్ల పరిస్థితి పై నీటిపారుదల శాఖ అధికారులకు అడిగి తెలుసుకున్నారు.

కడెం ప్రాజెక్టు వరదగేట్ల పై నుండి ప్రవహిస్తున్న వరద నీరు లోతట్టు గ్రామాల ప్రజల తరలింపు ప్రాజెక్టుకు వరద ముప్పు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు

ఈ సందర్భంగా కడం ప్రాజెక్ట్ పై రాష్ట్ర మంత్రి ఐ.కే. రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుకు చెందిన నాలుగు వరద గేట్లు మోర్రఇంచిన సందర్భంగా ప్రస్తుతం ప్రాజెక్టు చెందిన 14 వరద గేట్ల ద్వారా రెండు లక్షల 40 వేల క్యూసెక్కుల వీటిని గోదావరిలోకి విడుదల కొనసాగుతుంది కడెం ప్రాజెక్టు జలాశయం లో ప్రస్తుతం ఇన్ ఫ్లో నీరు తగుముఖం పడుతుందని ప్రాజెక్టు ఎలాంటి వరద ప్రమాదం ఉండ భొదని తెలిపారు.

కడెం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో వరద నీరు అధికంగా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులకు రాష్ట్ర మంత్రి ఐ కే రెడ్డి సూచించారు ఆయన వెంట కడం ప్రాజెక్టు ఈ ఈ రాథోడ్ విఠల్ డి.ఈ. బోజదాసు నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి కడెం మండల తహశీల్దార్ చిన్నయ్య ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఖానాపూర్ సిఐ రవీందర్ నాయక్ కడెంఎస్సై కే. రాజు స్థానిక ప్రజాప్రతినితులు తదితరులున్నారు...