/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ధరణి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం Mane Praveen
NLG: ధరణి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం
నల్లగొండ: జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, ధరణి గ్రీవెన్స్ లో ఆన్లైన్లో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని మండలాల రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ధరణి సమస్యలను పరిష్కరించుటకు, కంప్యూటర్లలో తప్పులను సరి చేస్తున్నారు. ఎలక్షన్స్ కంటే ముందుగానే ధరణి సమస్యలను పరిష్కరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఆన్లైన్ నేరాల గురించి అవగాహన కల్పించిన రాచకొండ పోలీస్ కళాబృందం
యాదాద్రి జిల్లా: రాచకొండ పోలీస్ కళా బృందం వారిచే, బుధవారం రాజపేట మండలం లోని  పాఠశాల విద్యార్థులకు మరియు కాల్వపల్లి గ్రామంలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు  " ఆన్లైన్ నేరాల గురించి, దొంగతనాల గురించి, అనుమానిత వ్యక్తుల సమాచారం గురించి "  అవగాహన కార్యక్రమాన్ని మాటలతో, పాటలతో, జానపద గేయాలతో ప్రజలకు అర్థమయ్యేలాగా అవగాహన కల్పించారు.
కక్కిరేణి: అనారోగ్యంతో మృతి చెందిన గ్రామపంచాయతీ వర్కర్ చెన్నని రవి
యాదాద్రి జిల్లా: రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బందిగా పనిచేస్తున్న  చెన్నని రవి అనారోగ్యంతో, హాస్పిటల్ లో చూపించుకోలేని ఆర్థిక పరిస్థితిలో బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారికి ఎలాంటి భూములు గాని, ఆస్తిపాస్తులు గాని లేవని అన్నారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు కలరు.  కుమారుడు లేకపోవడంతో పెద్ద కూతురు నందిని తలకొరివి పెట్టడంతో కుటుంబ బంధువులు, గ్రామ ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపించారు. దహన సంస్కారాలకు డబ్బుల్లేకపోవడంతో బంధుమిత్రుల సహాయ సహకారాలతో దహన సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.
గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
నల్లగొండ జిల్లా: 'గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుండి చేపట్టనున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని' కోరుతూ.. బుధవారం మర్రిగూడెం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, కార్మికుడు మరణిస్తే 10 లక్షల ఇన్సూరెన్స్ అమలు చేయాలని,  ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు అమలు చేయాలని, విధి నిర్వహణ లో మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని వివిధ డిమాండ్లతో సమ్మెలోకి వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మర్రిగూడ మండల నాయకులు పోలేపల్లి రాములు, ఆవుల ముత్తయ్య, సిల్వేరు మహేష్, ఐతపాక పద్మ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నీలకంఠం రాములు, మర్రి ఇంద్రమ్మ, యాచారం జంగమ్మ ఈద హేమలత, నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ మండల ఐఎన్ టియుసి అధ్యక్షుడిగా కొండ్రెడ్డి రాములు నియామకం
యాదాద్రి జిల్లా, నారాయణపురం మండల కేంద్రంలో ఐఎన్ టియుసి మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు బడే సాబ్ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. అనంతరం మర్రిగూడ మండల ఐఎన్ టియుసి అధ్యక్షుడిగా కొండ్రెడ్డి రాములు ను నియమిస్తూ, నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ  ఐఎన్ టియుసి ఉపాధ్యక్షులు రహీం, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సైదాచారి, నియోజకవర్గ సహాయ కార్యదర్శి పోతురాజు ఆంజనేయులు, సైదులు, మల్లేష్ యాదవ్, అశోక్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
మాలలకు అన్ని రంగాలలో స్థానం దక్కాలి: మాల జేఏసి నాయకులు
నల్లగొండ జిల్లా స్థాయి మాల మహానాడు చైతన్య సదస్సు బుధవారం దేవరకొండ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ లో, మాలమహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జెఎసి చీఫ్ అడవైజర్ రావుల అంజయ్య, మాల సంఘాల జేఏసీ చైర్మన్ చేరుకు రాoచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, చీఫ్ కోఆర్డినేటర్ మందాల భాస్కర్, లీగల్ సెల్ చెర్మెన్ అడ్వకేట్ వేణుగోపాల్, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో 50 లక్షల మాలల జనాభా ఉన్నా.. వారికి జనాభా దామాష ప్రకారం అన్ని రంగాలలో వాటా దక్కడం లేదన్నారు. రాష్ట్రంలోని మాలలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెల్లే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఉండాలన్నారు.  మాలలకు దక్కాల్సినటువంటి వాటాలు జనాభా ప్రాతిపదికన ఆర్థిక, రాజకీయ, సాంఘిక సంక్షేమ రంగాలలో మాలలకు రావాల్సిందే అని అన్నారు. దళిత బందులో 50% వాటా మాలలకు మాల ఉప కులాలకు తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో ఇవ్వాలని అన్నారు. అదేవిదంగా హైకోర్టు నియామకాల్లో మాలలకు రావాల్సిన పదవులలో కూడా అన్యాయం జరుగుతుందని అన్నారు. కాబట్టి మాలలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. రాజకీయ  పదవులలో మాలలకు అన్యాయం జరుగుతుందని, మాలలకు 3 ఎమ్మెల్సీ పదవులు దక్కాలన్నారు. రాబోయే కాలంలో మాలలకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్ గడ్డం సత్యనారయణ, జేఏసీ కో చైర్మన్ బరిగిల వెంకటస్వామి, జేఏసీ వైస్ చైర్మన్ నాను , బహుజన మేధావి, అంభేద్కరిస్టు యేకుల రాజారావు , జిహెచ్ఎంసి చైర్మన్ ఉత్తం సుమన్,  చిక్కుడు అండాలు, శీలం స్వరూప, జిల్లా అధ్యక్షులు చింతపల్లి బాలకృష్ణ, భూతం అర్జున్, ఆకుల రమేష్, గీత, దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు యేకుల సురేష్, నియోజకవర్గం అధ్యక్షుడు బోయిని చంద్రమౌళి, న్యాయవాది నూనె సురేష్, డివిజన్ కార్యదర్శి మేడ సైదులు, కోరెక్క చెన్నయ్య, పెరుమల్ల వినోద్, కోరే గిరి, వివిధ మండలాల అధ్యక్షులు బత్తుల దివాకర్, నారిమల్ల మల్లేష్, రెడ్డిమల్ల రవి,జి. ఆంజనేయులు, బిరేల్లి మహేందర్, తుప్పరి మదార్, గోరెటి ఆంజనేయులు, గేంటల ధనమ్మ, యేకుల అంబేద్కర్, తదితరులు పాల్గొన్నారు.
జులై 5న నల్లగొండ జిల్లా స్థాయి మాలల ఆత్మీయ చైతన్య సదస్సు
దేవరకొండ: పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గ్రంధాలయంలో, మాలమహానాడు డివిజన్ అధ్యక్షులు యేకుల సురేష్ మరియు నియోజకవర్గ అధ్యక్షులు బోయిని చంద్రమౌళి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యఅతిథిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి పాల్గొని మాట్లాడుతూ.. మొదటి జిల్లాస్థాయి మాల ఆత్మీయ చైతన్య సదస్సు దేవరకొండ పట్టణంలో జులై 5 బుధవారం ఉదయం 10 గంటల కి నిర్వహిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక, రాజకీయ, సామాజిక, సంక్షేమ రంగాలలో మాలలు చైతన్య పరచడమే ఈ సమావేశం ముఖ్యఉద్దేశం అన్నారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కోకన్వీనర్ డాక్టర్ చిక్కుడు గుండాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని మాల సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు. కావున నల్గొండ జిల్లాలోని అన్ని డివిజన్, అన్ని నియోజకవర్గ అన్ని మండల, అన్ని గ్రామాల మాలలందరూ తప్పకుండా పాల్గొనాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమం లో ప్రముఖ అంబేద్కరిస్ట్, బహుజనవాది డాక్టర్ యేకుల రాజారావు, నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు నాగటి జోసెఫ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూతం అర్జున్, దేవరకొండ డివిజన్ సైదులు డివిజన్ ఉపాధ్యక్షులు కోరెక్క  చేన్నయ్య, చలచిమల పర్వతాలు, బత్తుల వినోద్,  రెడ్డి మల్ల, గోకమల్ల ఆంజనేయులు, భయ్యా తిరుమలేష్, మేకల చెన్నయ్య, యేకుల అంబేద్కర్  తదితరులు పాల్గొన్నారు.
దారి తప్పిన డిండి మండలం వృద్ధురాలు
నల్లగొండ జిల్లా, డిండి  మండలం వెంకటాపూర్, తవక్లాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 80 సంవత్సరాల వయస్సు ఉన్న వృద్ధురాలు దారితప్పి.. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వంగూరు మండలం కోనాపూర్ గ్రామానికి వచ్చినట్లు,  కోనాపూర్ గ్రామస్తులు శనివారం తెలిపారు. తనది డిండి  మండలం వెంకటాపూర్, తవక్లాపూర్ గ్రామం అని ఆ వృద్ధురాలు చెబుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మూడు రోజులుగా గ్రామంలో తిరుగుతుందని, ఎవరైనా గుర్తిస్తే కోనాపూర్ కు వచ్చి తీసుకువెళ్లాలని కోనాపూర్ గ్రామస్తులు కోరుతున్నారు.
ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ పాక నగేష్ యాదవ్
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: లెంకలపల్లి గ్రామంలో హరితహారం లో భాగంగా, ఈరోజు ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ యాదయ్య, గ్రామస్తులు నూనె నరసింహ, పెంబళ్ళ మల్లమ్మ, పెంబళ్ళ సోమయ్య, యాదయ్య, నాగమ్మ, గ్రామ పంచాయతీ సిబ్బంది  నరసింహ, జయమ్మ పాల్గొన్నారు.
లెంకలపల్లి: ఈత వనాన్ని సందర్శించిన పల్లె రవికుమార్
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: లెంకలపల్లి గ్రామానికి  తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ఆదివారం విచ్చేసి, గ్రామంలో ఉన్న ఈత చెట్ల వనాన్ని సందర్శించారు. అక్కడ కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో చెరుకు లింగం గౌడ్, అయితగోని వెంకటయ్య, కలిమెర రాములు, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అయితగోని వెంకటయ్య, లెంకపల్లి గ్రామ కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షుడు అయితగోని పాపయ్య, ఉపాధ్యక్షుడు బోడ అంజయ్య, కార్యదర్శి అయితగోని మల్లయ్య, దాసరి చిన్న నరసింహ, కారింగు నరసింహ, బుర్కల లక్ష్మయ్య, అయితగోని రామచంద్రం, కలిమెర బాలయ్య, కలిమెర అంజయ్య, కలిమెర పెద్ద రాములు, పల్లె వెంకటేశం, అయితగోని తిరుపతయ్య,  అయితగోని యాదయ్య, అయితగోని శ్రీకాంత్, బుర్కల చిన్న రామలింగం, తదితరులు పాల్గొన్నారు.