/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz లెంకలపల్లి: ఈత వనాన్ని సందర్శించిన పల్లె రవికుమార్ Mane Praveen
లెంకలపల్లి: ఈత వనాన్ని సందర్శించిన పల్లె రవికుమార్
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: లెంకలపల్లి గ్రామానికి  తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ఆదివారం విచ్చేసి, గ్రామంలో ఉన్న ఈత చెట్ల వనాన్ని సందర్శించారు. అక్కడ కావలసిన మౌలిక వసతులు కల్పిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో చెరుకు లింగం గౌడ్, అయితగోని వెంకటయ్య, కలిమెర రాములు, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అయితగోని వెంకటయ్య, లెంకపల్లి గ్రామ కల్లుగీత కార్మికుల సంఘం అధ్యక్షుడు అయితగోని పాపయ్య, ఉపాధ్యక్షుడు బోడ అంజయ్య, కార్యదర్శి అయితగోని మల్లయ్య, దాసరి చిన్న నరసింహ, కారింగు నరసింహ, బుర్కల లక్ష్మయ్య, అయితగోని రామచంద్రం, కలిమెర బాలయ్య, కలిమెర అంజయ్య, కలిమెర పెద్ద రాములు, పల్లె వెంకటేశం, అయితగోని తిరుపతయ్య,  అయితగోని యాదయ్య, అయితగోని శ్రీకాంత్, బుర్కల చిన్న రామలింగం, తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి: బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, మర్రిగూడ: మండల కేంద్రంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని నిరుపేదలందరికీ గృహలక్ష్మి పథకం క్రింద ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం కింద మూడు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి, నేటికీ అమలు చేయలేదని అన్నారు. అర్హులైన నిరుపేద లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని,  గ్రామీణ ప్రాంతంలో ఇల్లు నిర్మించుకునే పేదలందరికీ ఐదు లక్షల రూపాయలు,  పట్టణ ప్రాంతంలో పది లక్షల రూపాయలు ఇవ్వాలని వారన్నారు.
అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు  కేటాయించకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ప్రజా సంఘాల నాయకులు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూతల వెంకటయ్య, రైతు సంఘం మండల అధ్యక్షులు కొట్టం యాదయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నీలకంఠం రాములు, సొప్పరి హనుమంతు, నందిపాటి సుగుణమ్మ, కాసుల విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
దేవరకొండలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే
నల్లగొండ జిల్లా, దేవరకొండ: నేడు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రాములు నాయక్ ను,  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ ప్రజలకు అందిస్తున్న సేవలు విలువైనవని, అనారోగ్య పరిస్థితులలో పునర్జన్మ ప్రసాదించే దైవంతో డాక్టర్లు సమానమని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి వెంకటయ్య, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న,  మాజీ కౌన్సిలర్ సుగుణయ్య, రాజు, హరి తదితరులు పాల్గొన్నారు.
అనాధ ఆశ్రమంలో ఘనంగా పగడాల ఫౌండేషన్ చైర్మన్ ముత్తు పుట్టినరోజు వేడుకలు
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మాల్ పట్టణం లోని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు, తన పుట్టినరోజు సందర్భంగా.. ఈరోజు వారి కార్యాలయం ముందు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముత్తు మాట్లాడుతూ.. పేదలకు వైద్య సహాయం అందించి సహాయ పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా పలువురు రక్తదానం చేశారు. మండలంలోని గ్రామ భారతి అనాధాశ్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముత్తు, తన పుట్టినరోజు వేడుకలను అనాధ బాలల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాలురు లకు తినిపించారు.
అనాధ ఆశ్రమంలో ఘనంగా పగడాల ఫౌండేషన్ చైర్మన్ 'ముత్తు' పుట్టినరోజు వేడుకలు
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం: మాల్ పట్టణంలోని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు తన పుట్టినరోజు సందర్భంగా.. ఈరోజు వారి కార్యాలయం ముందు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ముత్తు మాట్లాడుతూ.. పేదలకు వైద్య సహాయం అందించి సహాయ పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా పలువురు రక్తదానం చేశారు. మండలంలోని గ్రామ భారతి అనాధాశ్రమంలో ఫౌండేషన్ చైర్మన్ ముత్తు, తన పుట్టినరోజు వేడుకలను అనాధ బాలల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బాలురు లకు తినిపించారు.
బాల కార్మికులను గుర్తిస్తే 1098 కు సమాచారం అందించండి: ఎస్పీ
నల్లగొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో  జూలై 1 నుండి నెల రోజుల వరకు నిర్వహించే, ఆపరేషన్ ముస్కాన్-IX కార్యక్రమానికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అధికారులతో  జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. నిరాదరణకు గురైన, తప్పిపోయిన, వెట్టి చాకిరికి గురౌవుతున్న బాలబాలికలను  గుర్తించి వారిని సంరక్షించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఆపరేషన్ ముష్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని  అన్నారు.  ఈ జూలై 1వ తేదీ నుండి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నెల రోజులుగా  ఆపరేషన్ ముస్కాన్-IX కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో మూడు సబ్ డివిజన్లో  పోలీస్, లేబర్, చైల్డ్ కేర్, రెవెన్యూ, హెల్త్, ఐసిడిఎస్, శిశు సంక్షేమం అధికారులతో సమన్వయంగా కలిసి బృందంగా ఏర్పడి, తప్పి పోయిన బాల బాలికలను గుర్తించుట, పరిశ్రమలు, బ్రిక్స్ తయారీ, హోటల్స్, లాడ్జ్, మినరల్ వాటర్ సప్లై, దుకాణాలు, ధాబాలు  ఇలా ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకిరీకి గురైతే అలాంటి వారిని గుర్తించి సంభందిత యాజమాన్యాలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా బాలల యొక్క స్వేచ్ఛకు, వికాసానికి భంగం కలిగించిన, వెట్టి చాకిరీ చేయించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ అపూర్వరావు హెచ్చరించారు.
      
నిరాదరణకు గురైన, తప్పిపోయిన పిల్లలు, వెట్టి చాకిరీకి గురవుతున్న పిల్లలు ఉన్నచో పోలీసులకు, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరినారు. ఇలాంటి పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందిని అన్నారు. ఎక్కడైనా బాలకార్మికులను చూసినప్పుడు, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని  తెలిపారు.
    
ఈ సమావేశంలో డిడబ్ల్యుఓ కృష్ణవేణి,
డిసిపివో గణేష్, సి డబ్ల్యూ సి చైర్మన్ కృష్ణ , నల్గొండ , మిర్యాలగూడ, దేవరకొండ  లేబర్ ఆఫీసర్లు, చైల్డ్ లైన్ ఆంజనేయులు , ఏహెచ్టియు ఎస్ఐ గోపాల్ రావు మరియు మిగతా టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
మాల్: ముత్తు పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ పట్టణంలోని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా, ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు ఇప్పటికే ఎన్నో కుటుంబాలను తన సేవా దృక్పథంతో ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. పగడాల ముత్తు జన్మదినం సందర్భంగా జులై 1న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ ఆఫీస్  వద్ద జులై 1న ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కర్మన్ ఘట్ జీవన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఐఐఐటీ లక్నో లో పీజీ సీట్ సాధించిన ఎన్జీ కళాశాల విద్యార్థి
నల్గొండ: పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థి శ్రీకాంత్ కు, జాతీయ స్థాయిలో  ఎమ్మెస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ సబ్జెక్టు పీజీలో, ఐఐటి జాయింట్  అడ్మిషన్ టెస్ట్-2023 పరీక్ష ద్వారా జాతీయస్థాయిలో మెరిట్ ద్వారా ఉత్తమ స్కోర్ వల్ల, త్రిబుల్ ఐటీ లక్నో లో సీట్ వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ గన్ శ్యామ్ తెలిపారు. ఈ సందర్భంగా  ఐఐటీ సీటు సాధించిన శ్రీకాంత్ ను కళాశాల ప్రిన్సిపాల్ ఘన శ్యామ్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్, కళాశాల అధ్యాపకులు నరసింహ, దీపిక, దుర్గాప్రసాద్, , మల్లేష్, వెంకటరమణ, మధుకర్, సూపరింటెండెంట్  కోటేశ్వరరావు , విద్యార్థికి జాతీయస్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో సీట్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేసి అభినందించారు.
నల్లగొండ, మిర్యాలగూడ లలో ఆగనున్న పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు
నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు, పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను నల్గొండ రైల్వే స్టేషన్ లలో నిలుపుటకు రైల్వే బోర్డ్ జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం... నర్సాపూర్ - లింగంపల్లి ఎక్స్ ప్రెస్, చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్ ప్రెస్, విశాఖ ఎక్స్ ప్రెస్, నాగర్ సోయిల్ - నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లకు నల్గొండలో స్టాప్ ఉన్నట్లు  తెలిపారు.

మిర్యాలగూడలో... చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్ ప్రెస్స్, తిరుపతి - లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్ ప్రెస్, భువనేశ్వరి - సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ ప్రెస్, నాగర్ సోల్ - నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లకు స్టాప్ ఉన్నట్లు తెలిపారు.
ఐసెట్ 2023లో సత్తా చాటిన ఎన్జీ కళాశాల విద్యార్థులు
నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసిన ఎన్సిసి  విద్యార్థి రావుల అనురాగ్ ఐసెట్ 2023 లో 261 ర్యాంకు సాధించారు. అదేవిధంగా ఎన్జీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన మరో విద్యార్థి బొల్లెద్దు వర్షిత్ కుమార్ 500 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఘన శ్యామ్ మరియు అధ్యాపకులు, కళాశాల లైబ్రేరియన్ దుర్గాప్రసాద్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.