/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత Yadagiri Goud
మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఇదివరకు పంజాబ్‌లో తరచూ మత్తు పదార్థాల గుట్టు రట్టు అయ్యేది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియాలు రెచ్చిపోతున్నాయి.

చాక్లెట్లు అమ్మినట్లుగా డ్రగ్స్ అమ్మేస్తున్నాయి. ఈరోజు ఉదయం తాజాగా హైదరాబాద్... మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు.

వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మొత్తం 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌లను సీజ్ చేశారు......

SB NEWS

కొత్త మండలాలు.. పాత భవనాలు

మండలాలు ఏర్పాటైనా పాత, అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు

కొమరంభీంజిల్లా:జూన్‌19 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రజలకు అధికారులు చేరువలో ఉండి పరి పాలన సౌలభ్యంగా ఉండాలని ప్రభుత్వం కొత్త మండ లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అయిన ఆయాశాఖల కార్యాలయ నిర్వహణ మాత్రం గాల్లోకి వదిలేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన జిల్లాలు ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలు ఇంకా అద్దె భవనాలు, పాత ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగడమే ఇందుకు నిదర్శణం. పాలనా సౌలభ్యం కోసం నూతన మండలాలను ఏర్పాటు చేశామని చెబుతున్న ప్రభుత్వం ఆయాశాఖల కార్యాలయాలకు నూతనభవన నిర్మాణాలు చేపట్టడం లేదు. అద్దె,పాత భవనాల్లోనే పలు కార్యాల యాలు కొనసాగుతున్నాయి. మరి కొన్నింటిని ఇతర శాఖ కార్యాలయాల్లో సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. నూతన జిల్లాలో భాగంగా కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాను 2016లో ఏర్పాటు చేశారు. పూర్వ 12మండలాల నుంచి పెంచికలపేట, చింతలమానేపల్లి, లింగాపూర్‌ మూడు మండలాలను కొత్తగా ఏర్పాటు చేయగా 15మండలాలతో కూడిన నూతనజిల్లా ఆవిష్కృతమైంది. నూతన మండ లాలు ఏర్పాటు చేసినప్పటికీ కార్యాలయాలకు భవనాలు లేకపోవడంతో అటు అధికారులు, సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

నూతనంగా ఏర్పాటు అయిన మూడు మండలాల్లో మండల సర్వసభ్య సమావేశాలతోపాటు ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమాలను ప్రస్తుతం అద్దె భవనాల్లో నిర్వహించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిమూడు నెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశాలను ఇరుకు గదుల్లోనే, స్థానిక రైతువేదికలో నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. కార్యాలయాలకు రోజు వందల సంఖ్యలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. కార్యాలయాల ముందు కనీసం పార్కింగ్‌ స్థలాలు లేకపోవడంతో అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైన మండలాల్లో సొంతభవనాల నిర్మాణంపై దృష్టిసారించి పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నూతనంగా ఏర్పాటైన పెంచికలపేట మండలంలో తహసీల్దార్‌ కార్యాలయం ఆరె సంక్షేమ సంఘ భవనంలో కొనసాగుతోంది. ఎంపీడీవో కార్యాలయం ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో కొనసాగుతుండగా వ్యవసాయశాఖ అధికారులు రైతువేదికలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అటవీ శాఖ కార్యాలయం బీట్‌ఆఫీసర్‌ వసతిగృహంలో కొనసాగుతోంది.

పోలీసుస్టేషన్‌, ఎంఆర్‌సీ భవనం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం భవనాలను నూతనంగా నిర్మించి ఇటీవలే ప్రారంభించారు. మండల ఏర్పాటుకు పూర్వం నుంచి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పశువు వైద్యశాలలు ఉన్నాయి.

తహసీల్దార్‌ కార్యాలయం ప్రభుత్వ పాఠశాలలో కొనసా గుతుండగా ఎంపీడీవో కార్యాలయం జిల్లా పరిషత్‌ పాఠశా లలో కొనసాగుతోంది. వ్యవసాయ అధికారులు స్థానిక రైతు వేదికలో కొనసాగిస్తున్నారు. పోలీసు స్టేషన్‌, కేజీబీవీ పాఠశాల భవనాలు నూతనంగా నిర్మించి ఇటీవలే ప్రారం భించారు. పూర్వం నుంచే ఆస్పత్రి, పశువైద్యశాలలు ఉన్నాయి.

తహసీల్దార్‌ కార్యాలయం పాత జడ్పీఎస్‌ఎస్‌ పాఠ శాలలో, ఎంపీడీవో కార్యాలయం గ్రామపంచాయతీ కార్యా లయంలో కొనసాగుతున్నాయి. అటవీశాఖ కార్యాలయం వీఎస్‌ఎస్‌ కమ్యూనిటీ హాల్‌లో, వ్యవవసాయశాఖ రైతు వేదికలో కొనసాగుతున్నాయి. ఎంఆర్‌సీ భవన నిర్మాణం పూర్తైనా ఇంకా ప్రారంభించలేదు. మండలానికి పూర్వమే పోలీసు స్టేషన్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.

భవన నిర్మాణాలు చేపట్టాలి..

ప్రజల సౌలభ్యం కోసం నూతన మండలాలు ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ ఆరు సంవత్సరాలు గడుస్తున్నా నేటివరకు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల ఊసేలేదు. దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన సొంత భవనాలు నిర్మించి వినియోగంలోకి తేవాలి.........

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల :జూన్ 19

తిరుపతి లో భక్తుల రద్దీ నేడు సోమవారం కూడా కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఆదివారం 86,181 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 30,654 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

కేటీఆర్ అటు ఇటు కాని తేడా? : కొండ మురళి సంచలన వ్యాఖ్యలు

కొండా దంపతులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కొండా మురళి ఘాటు స్పందించారు. శ్రీకృష్ణదేవరాయల వంశీయులం కాబట్టి మీసాలు పెంచుతామని, కేటీఆర్ అటు-ఇటు కాదు కాబట్టి.. ఆయనకు మీసాలు రావని ఎద్దేవాచేశారు. తాను రౌడీనే అయితే అప్పుడు టీఆర్ఎస్లో ఎందుకు చేర్చుకున్నారు? అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు తన పేరు ఉచ్చరించే దమ్ములేదని హెచ్చరించారు. పేదలకు సేవచేస్తే రౌడీ అనుకుంటే తనకు అభ్యంతరం లేదన్నారు. తాను నియోజకవర్గంలో తిరిగితే కేటీఆర్‌కు ఉచ్చపడుతుందన్నారు.

ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నమ్మకద్రోహిని ఆరోపించారు. సిరిసిల్ల పద్మశాలీలంతా కొండా సురేఖ కు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీచేయమన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ గెలిచితీరుతుందని మురళి స్పష్టం చేశారు. చదువురాని దయాకరరావును మంత్రిని చేసి మేధావి అయిన కడియం శ్రీహరిని పక్కకు పెట్టారని దుయ్యబట్టారు. ఛత్తీస్‌గఢ్, కర్ణాటక లో లాగా తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని కొండా మురళి జోస్యం చెప్పారు.

కొండా దంపతులపై విమర్శ

పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై నిలబడడానికి విపక్షాలు భయపడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ధర్మారెడ్డిని చూస్తే మీసాలు తిప్పినోళ్లు భయపడి ఈ రోజు పక్కకు పోతున్నారని, గుండా గిరి, రౌడీయిజం చేస్తే ఎవరూ భయపడరంటూ పరోక్షంగా కొండా దంపతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

నియోజకవర్గాలను మార్చుకుంటూ పోయేవారు పెద్దపెద్ద నాయకులమని అనుకుంటూ ఉంటారని.. అది ప్రజలు గమనిస్తారని తెలిపారు. ప్రజలను కడుపులో పెట్టుకోవాలని, దబాయించి పనులు చేయించుకుంటామని అనుకుంటే ఎవరూ వినరని స్పష్టం చేశారు...

మాణిక్ రావు ఠాక్రే కు టిపిసిసి ఉపాధ్యక్షులు డా:చెరుకు సుధాకర్ పిర్యాదు

శ్రీ మాణిక్‌రావు ఠాక్రే గారు,

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గారికి

నేను డా. చెరుకు సుధాక‌ర్‌, ప్ర‌స్తుతం తెలంగాణ ప్ర‌దేశ్ రాష్ట్ర ఉపాధ్య‌క్షులుగా ఉన్నాను. ఉమ్మ‌డి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, ప్ర‌జా ఉద్య‌మాల్లో, తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో 3 ద‌శాబ్ధాలు పైగా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర స‌మితిలో పొలిట్‌బ్యూరో స‌భ్యుడిగా ఉండి, 2014 త‌రువాత తెలంగాణ ఉద్య‌మ వేదికగా ప‌నిచేసి, 2017లో తెలంగాణ ఇంటి పార్టీగా ఉండి, 2022 ఆగ‌స్టు 5న అఖిల భార‌త కాంగ్రెస్ అధ్య‌క్షులైన మ‌ల్లిఖార్జున ఖార్గే స‌మ‌క్షంలో కాంగ్రెస్ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డి గారి చొరువ‌తో కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ క‌మిటీ హాల్‌లో కాంగ్రెస్‌లో చేరినాను.

ఢిల్లీ నుండి నేరుగా రేవంత్‌రెడ్డి గారితో క‌లిసి మునుగోడు ఉప ఎన్నిక‌ల్లోని ప్ర‌చార స‌భ‌కు చండూర్‌లో హ‌జ‌ర్ అయ్యి మాట్లాడినాను. అదే నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ఎన్నిక‌ల స‌మ‌న్య‌యంలో మ‌ర్రిగూడ మండ‌లంలో ఉండి అన్ని ప్రాంతాల ప్ర‌చారంలో పాల్గొన్నాను.

మునుగోడు కాంగ్రెస్ యం.య‌ల్‌.ఏగా ఉన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఉద్దేశపూర్వ‌క రాజీనామా వెనుక కుట్ర‌ను, కాంగ్రెస్‌ను బ‌ల‌హీనప‌రిచేకుయుక్తుల‌ను వ్య‌తిరేకిస్తూ, బ‌హిరంగంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి గారు, కొంత ప‌రోక్షంగా బిజెపి అభ్య‌ర్ధిని స‌మ‌ర్ధించ‌డంతో వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్ అభ్య‌ర్ది కోసం ప‌ని చేసిన‌ది వాస్త‌వం. నా చేరిక‌ను వ్య‌తిరేకిస్తూ నన్ను, రాష్ట్ర అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి గారిని జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లిఖిర్జున ఖార్గే గారిని, ఇంచార్జి మాణిక్యం ఠాగోర్ గారిని నిందిస్తూ గౌర‌వ భువ‌న‌గిరి పార్ల‌మెంట్ స‌భ్యుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాట్లాడిన తీరు పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లిగించిన‌ది.

మార్చి 3వ తేది, 2023న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి గారు, నా కుమారుడు డా . చెరుకు సుహాస్‌, న‌వ్య హాస్పిట‌ల్‌కు న‌ల్ల‌గొండకు ఫోన్ చేసి అత్యంత జుగుప్సాక‌రంగా తిట్ట‌డం, చంపుతామ‌ని బెదిరించ‌డంతో అన్ని తెలంగాణాలోని, తెలుగులోని ప‌త్రిక‌ల్లో, మీడియాలో ప‌తాకా శీర్ష‌క‌ల్లో రావ‌డం, విప‌రీత‌మైన చ‌ర్చ‌కు, న‌ష్టానికి దారి తీసింది.

2023, మార్చి 6న మీకు జ‌రిగిన ప‌రిణామాలు, తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌కై నేను ఇత‌ర టి.పి.సి.సి స‌భ్యుల‌తో పిర్యాదు చేస‌న‌ప్ప‌టికి ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌పై క‌నీస చ‌ర్చ కూడా జ‌ర‌గ‌క‌పోవ‌డం పార్టీ ప్ర‌తిష్ట‌కు న‌ష్ట‌మ‌నే భావిస్తున్నాను.

ఉద‌య్‌పూర్ కాంగ్రెస్ మేధోమ‌ద‌నం త‌రువాత‌, రాయ్‌పూర్ స‌భ‌ల త‌రువాత సామాజిక న్యాయం, ఇంకా ఇత‌ర విష‌యాల్లో గుణాత్మ‌క‌, ఆచ‌ర‌ణాత్మ‌క మార్పును తెలంగాణ ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. దేశానికి కాంగ్రెస్ అవ‌స‌ర‌మ‌ని, యావ‌త్ పౌర స‌మాజం కూడా సానుకూలంగా స్పందిస్తున్న స‌మ‌యంలో బుజ్జ‌గింత‌లో కాకుండా నిర్ధిష్ట క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు కోమ‌టిరెడ్డి లాంటి నేత‌ల‌పై తీసుకోక‌పోతే రాబోయే రోజుల్లో సానుకూల ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డానికి ఆటంకం క‌లుగుతుంద‌ని గుర్తుచేస్తున్నాం.

ప్రియాంక గాంధీ గారు యువ‌కుల‌కు సంబందించి ఒక డిక్ల‌రేష‌న్‌ను ఈ మ‌ద్య ప్ర‌క‌టించ‌డంతో పాటు తెలంగాణ ఉద్య‌మ‌కారుల కోసం ఒక భ‌రోస‌, భాద్య‌త త‌మ‌ద‌ని మాట్లాడినారు.

న‌ల్ల‌గొండ‌లో నిరుద్యోగ భ‌రోస కోసం జ‌రిగిన కాంగ్రెస్ స‌భ‌లో యువ‌త‌ను కూడ‌గ‌ట్టి క్షేత్ర‌స్థాయిలో స‌నిచేసిన న‌న్ను, ఇంకా దుబ్బాక న‌ర్సంహా రెడ్డి, కొండేటి మ‌ల్ల‌య్య‌, చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి, కైలాష్ నేత‌ను వేదిక మీద పిలువ వ‌ద్ద‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి వొత్తిడి చేసి అవ‌మానానికి గురి చేసినారు.

తెలంగాణ ఉద్య‌మ‌కారుల కోసం జూన్ 2 తెలంగాణ ఆవిర్హావ దినోత్స‌వ వేడుక‌ల కోసం ఒక క‌మిటీని ప్ర‌క‌టించి, దానికి చైర్మ‌న్‌గా నేను ఉండాల‌ని రేవంత్‌రెడ్డి గారు ఆదేశిస్తే, క‌మిటీ స‌భ్యుల‌తో విడుద‌ల‌కు సిద్‌,మైన ప్ర‌క‌ట‌న‌ను ఆపు చేయించి గౌ. చిన్నారెడ్డి గారిని వెంట‌నే ప్ర‌క‌టించినారు. ఈ ర‌క‌మైనా అడ్డంకులు పార్టీ ఇమేజ్‌ను దెబ్బ‌తీస్తుంద‌ని గ‌మ‌నించాలి.

గౌ. భ‌ట్టి విక్ర‌మార్క గారు, కాంగ్రెస్ లెజిస్లేచ‌ర్ పార్టీ నాయ‌కులు ఆదిలాబాద్ నుండి న‌ల్ల‌గొండ‌కు వ‌చ్చిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌లో మంచిర్యాల‌, వ‌రంగ‌ల్‌, భువ‌న‌గిరి, దేవ‌ర‌కొండ‌, జి. చెన్నారంలో పాల్గొని, తేది 17న న‌ల్లగొండ క్లాక్ ట‌వ‌ర్‌లో జ‌రిగిన కార్న‌ర్ మీటింగ్‌లో ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల నాయ‌కులు ఎవ‌రు ఉన్నా వేదిక ఖాళీ చేయాల‌ని స్థానిక నాయ‌కుల‌చే అనిపించి, కోమ‌టిరెడ్డి అనుచ‌రులే వేదిక‌పై ఉండాలి, ఇత‌రులు దిగాల‌ని హెచ్చ‌రించ‌డం ఒక్క‌ బ‌హుజ‌న, తెలంగాణ ఉద్య‌మనాయ‌కుడికి జ‌రిగిన అవ‌మాన‌మే కాదు, భ‌విష్య‌త్తులో రాహుల్ గాంధీ గారు నిత్యం చెబుతున్న సోష‌ల్ ఇంజ‌నీరింగ్ తెలంగాణ‌లో, న‌ల్ల‌గొండ‌లో అమ‌ల‌వుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేస్తున్న‌ది. అంతేకాక, ఎవ‌రు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప‌రిమిత‌మైన నాయ‌కులో, ఏ ప్ర‌కారం ప్ర‌స్తుత భువ‌న‌గిరి యం.పి న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుడ‌వుతారో చెప్పాలి. ఆయ‌న న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గం అయితే నేను కూడా అదే నియోజ‌క‌వ‌ర్గం అవుతాను. లేదంటే టి.పి.సి.సి స‌భ్యులు అన్ని నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు అవుతారు.

నిన్న జ‌రిగిన ప‌రిణామాలు అంత‌కు ముందు నిరుద్యోగ భ‌రోసాలో అవ‌మానాలు, కాంగ్రెస్‌లో మా అంద‌రినిఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తున్న‌ది. రాష్ట్రవ్యాప్తంగా ఇట్లా జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌పై మీరు రాష్ట్ర ఇంచార్జ్‌గా చ‌ర్చించ‌వ‌ల‌సి ఉన్న‌ది. ద‌ళితున్ని ముఖ్య‌మంత్రి చేయ‌గ‌లిగే, పీపుల్స్‌మార్చ్‌లో భ‌ట్టితో స‌హా అంద‌రి మౌనం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు రావాల్సిన మైలేజీకి అడ్డంకి కాకూడ‌ద‌ని మీ దృష్టికి తీసుకు వ‌స్తున్నాను.

వంద కార్ల‌లో వ‌చ్చి చెర‌కు సుధాక‌ర్‌ను చంపుతామ‌ని బెదిరించే స్టార్ క్యాంపెయిన‌ర్ పార్టీకి భారం కావొద్ద‌ని, న‌కిరేక‌ల్‌లో, ఇత‌ర ప్రాంతాల్లో అదే ప‌ద్ద‌తి కొన‌సాగిస్తే ఎవ‌రి ఉనికికై వారు ప్ర‌తిచ‌ర్య చేప‌డితే పార్టీకి న‌ష్ట‌మ‌ని గుర్తు చేస్తూ, మీ స్పంద‌న‌కై ఎదురు చూస్తున్నాం.

డా. చెరుకు సుధాక‌ర్‌

టి.పి.సి.సి రాష్ట్ర ఉపాధ్య‌క్షులు

గిరిజన విద్యార్థికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పదివేల రూపాయల చెక్ అందజేత

గిరిజన దినోత్సవ సందర్భంగా

గిరిజన దినోత్సవం సందర్బంగా 7/06/2023 శనివారం సాయంత్రం రవీంద్రభారతి హైదరాబాద్ నందు 10వ తరగతి లో10GP సాధించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల కంగ్టి,

విద్యార్థి అయినటువంటి

 కె. సతీష్ కు పది వేయిల చెక్ ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు అందించారు. 

అలాగే విద్యార్థిని, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రాయ్, Rco కళ్యాణి, దేవేందర్ లను మంత్రి గారు అభినందించారు.

కేసీఆర్, డీజీపీ సార్ వెంటనే చర్యలు తీసుకోండి.. చేతులెత్తి మొక్కిన రాజాసింగ్..

రంజాన్ తర్వాత ముస్లింల ప్రధాన పండుగ బక్రీద్ జూన్-27న ముస్లింలు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజేపీ అంజనీకుమార్‌కు లేఖ రాశారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఆయన హెచ్చరించారు.

మీకు చేతకాకపోతే చెప్పండి..!

ఈ బక్రీద్ సందర్భంగా సంబరాలు చేసుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేకలు, గొర్రెలు కొసుకుని బక్రీద్ సంబరాలు చేసుకుంటే కూడా మాకు ఇబ్బంది లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆవులు, దూడలను కోయరాదు. ఆవులు, దూడలు కోస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఆవులు, దూడల రక్షణకు చర్యలు చేపట్టలేదు. కనీసం ఎక్కడా చెక్ పోస్ట్‌లు కూడా ఏర్పాటు చేయలేదు.

మీకు చేతకాకపోతే చెప్పండి మా ఆవులు దూడలు రక్షించుకునేందుకు మేమే రంగంలోకి దిగుతాం. సీఎం కేసీఆర్‌కు, డీజీపీకి చేతులెత్తి మొక్కుతున్నాను.. వెంటనే చర్యలు తీసుకోండి. మతపరమైన గొడవలు కావద్దనే మేం ఇలా అడుగుతున్నాం. మీరు చర్యలు తీసుకోకపోతే మా టీమ్‌లు రంగంలోకి దిగుతాయి.. జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి’ రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా గోషామహల్ ఎమ్మెల్యే విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ లేఖపై డీజీపీ, కేసీఆర్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

ఇదేం మంచిది కాదు..!

కాగా.. గత నాలుగైదు రోజులుగా గోవుల అక్రమ రవాణా చేయకూడదని, గోవధను ఖండించాలని రాజాసింగ్ వరుస ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నారు. గోవుల అక్రమ రవాణాకు తెలంగాణ పోలీసులే సహకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీస్​ప్రొటెక్షన్‌తో రాష్ట్రంలో వేల ఆవులు కోతకు గురవుతున్నాయని ఆవేదనకు లోనయ్యారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవుల రక్తంతో తడిసిన రాష్ట్రానికి మంచి జరగదన్నారు. ఛత్రపతి శివాజీ స్పూర్తితో గోరక్షకులు నడుం బిగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ ఇటీవలే పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఆ మధ్య గోమాంసం తినేవారి నుంచి అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా విరాళంగా తీసుకోవద్దని కూడా ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ అప్పట్లో పెను సంచలనమే అయ్యాయి........

Heat Wave: వడగాలులతో బెంబేలు.. మూడు రోజుల్లో 98 మంది మృతి

దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిన వడగాల్పుల (Heat Wave) ప్రభావం అధికంగా ఉంది..

ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతలకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత మూడు రోజుల్లోనే వడదెబ్బ కారణంగా అక్కడ 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బలియా జిల్లాలోనే గడిచిన 24 గంటల వ్యవధిలో 34 మంది చనిపోవడం కలవరపెడుతోంది. మరోవైపు బిహార్‌లోనూ 44 మంది వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు..

ఇక బిహార్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. గత మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 44 మంది చనిపోగా.. రాజధాని పట్నాలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. నలందా మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో 19 మంది, పీఎంసీహెచ్‌లో 16 మంది మృత్యువాతపడ్డారు.

మరో తొమ్మిది మరణాలు ఇతర జిల్లాల్లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పట్నా, షేక్‌పురాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత కొనసాగుతున్న దృష్ట్యా అక్కడి విద్యాసంస్థలకు జూన్‌ 24వరకు సెలవులు పొడిగించారు..

పాలమూరు అసెంబ్లీ బరిలో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేందుకు భారీ స్కెచ్..?

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో సాధ్యమైనంత వరకు ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు వీలుగా వ్యూహ రచనలు సాగిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మీ బిడ్డకు కానుకగా ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఇటీవల జడ్చర్ల వేదికగా జరిగిన బహిరంగ సభలో జనానికి విజ్ఞప్తి చేశారు.

ఇదే సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 స్థానాలలో 12 స్థానాలను గెలుచుకోవాలని సూచించగా.. లేదు లేదు 14 స్థానాలను గెలిపించి తీరుతాము అని రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధిక స్థానాలను గెలుచుకుంటేనే పీసీసీ అధ్యక్షునిగా తన బాధ్యతలను సమర్థవంతునిగా నిర్వహించినవాడని అవుతాను అన్న ఆలోచనలతో రేవంత్ రెడ్డి ఉన్నారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తారు అన్న విషయము స్పష్టం అయ్యింది. ప్రస్తుతము ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాలు అన్నింట్లో అధికార బీఆర్ఎస్ పార్టీ బలిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలి అంటే రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైనా ఒక నియోజకవర్గంలో నుండి తప్పనిసరిగా పోటీలో ఉండాలి.

కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లాపై పెద్దగా ప్రభావం ఉండదు. అదే మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రభావం ఉంటుంది అన్న ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి పాలమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఆగస్టు 1 నుంచి 23వరకు ‘గురుకుల’ పరీక్షలు

: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెసిడెన్షియల్‌ గురుకులాల్లోని 9,210 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ట్రిబ్‌) పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి 23వరకు ఆయా పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలను (సీబీఆర్‌టీ) నిర్వహించాలని నిర్ణయించింది.

అయితే.. ఆగస్టులోనే కేంద్ర సర్వీసుల పరీక్షలు ఉన్నాయి. ఇటు టీఎస్‌పీఎస్‌సీ సైతం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో గురుకుల పోస్టులను ఏ తేదీల్లో నిర్వహించాలి, ఎప్పుడు ఏం పరీక్షలు ఉన్నాయి అన్నదానిపై ట్రిబ్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పరీక్ష తేదీలను ప్రకటించడంతో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆగస్టులో కేంద్ర సర్వీసుల పరీక్షల తేదీలు సైతం ఇప్పటికే విడుదల అయ్యాయి. మరోవైపు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామ్‌(ఎస్‌ఎస్‌సి–హెచ్‌ఎస్‌ఎల్‌)ను ఆగస్టు 2 నుంచి 22వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన విడదులైంది.

ఈ పరీక్ష కోసం రాష్ట్రం నుంచి చాలా మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఐబీపీఎస్‌–ఆర్‌ఆర్‌బి పరీక్షలో ఉచిత పరీక్ష శిక్షణను(పీఈటీ) ఆగష్టు 17 నుంచి 22 వరకు నిర్వహించాలని, ప్రిలిమినరీ పరీక్షను అదే నెల 12, 13, 19 తేదీల్లో నిర్వహించాలని ఆ బోర్డు నిర్ణయించింది. ఇక గురుకుల పరీక్షల షెడ్యూల్‌ కూడా వస్తే తమ పరిస్థితి ఏంటోనని అభ్యర్ధులు అందోళనకు లోనవుతున్నారు. నెల రోజుల వ్యవధిలో అత్యంత ముఖ్యమైన పరీక్షలన్నింటినీ ఉంటే తాము అంతిమంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందేమోనంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గురుకుల పోస్టుల పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పులు చేసి తమను ఆదుకోవాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా.. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లోని 9,210 పోస్టులను భర్తీ చేసేందుకు గురుకుల బోర్డు ఈ ఏడాది ఏప్రిల్‌ 5న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ 14 నుంచి మే 25వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఆయా పోస్టుల దరఖాస్తులను స్వీకరించారు. అన్ని పోస్టులకు కలిపి 2,63,045 దరఖాస్తులు వచ్చాయి. ఈక్రమంలో గురుకుల బోర్డు పరీక్ష తేదీలను సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..