/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1557146104237493.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1557146104237493.png StreetBuzz TSPSC : పేపర్ లీక్ లో ట్విస్ట్.. 46 మంది అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్ TS breaking
TSPSC : పేపర్ లీక్ లో ట్విస్ట్.. 46 మంది అమ్మాయిలతో న్యూడ్ వీడియో కాల్స్

TSPSC ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ప్రవీణ్ విషయంలో రోజుకొక కొత్తకోణం వెలుగులోకి వస్తుంది.

 అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ వీడియోలు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 46 మంది మహిళలతో ప్రవీణ్ న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. వీళ్లకి కూడా పేపర్ లీక్ చేసిట్లుగా పోలీసులు గుర్తించారు.

మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్ తో పాటు రేణుక సెలవుల విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్దారం ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా రేణుక వ్యవహరిస్తున్నారు.

 ఈ ఏడాది 12 సెలవులు పెట్టినట్లు గుర్తించారు.. ఈ నెల 4,5 తేదీల్లో తమ బంధువు మృతి చెందాడని సెలవు పెట్టింది.. ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేణుక సర్టిఫికెట్ల విషయంలోనూ అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు రేణుక సెలవులు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరోవైపు పేపర్ లీక్ కు సూత్రధారిగా రాజశేఖర్ ను పోలీసులు తేల్చారు. ప్రవీణ్ ద్వారా పేపర్ ను బయటికి రాజశేఖర్ తెప్పించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీలో సిస్టం అడ్మినిస్ట్రేటర్ గా రాజశేఖర్ వ్యవహరిస్తున్నాడు.. టెక్నికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటేషన్ పై వచ్చాడు. ప్రవీణ్, రాజశేఖర్ కలిసి పేపర్ ను బయటకు తెచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. సిస్టం పాస్వర్డ్ ఐడీ ఇచ్చినందుకు రాజశేఖర్ కు ప్రవీణ్ భారీగా డబ్బులు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

H3N2 వైరస్‌ కిడ్నీలపై ప్రభావం చూపుతుందట.. జాగ్రత్తలు తప్పనిసరి

దేశంలో ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్‌ కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఆంధ్రాలో తూర్పుగోదావరి జిల్లాలో వైరస్‌ ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి.. ఇప్పుడు తెలిసిన ఒక విషయం ఏంటంటే.. ఈ వైరస్‌ కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందట.. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోవిడ్-19 తరువాత హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లుయెంజా కేసులు దేశంలో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఇన్‌ఫ్లుయెంజా వల్ల ఇద్దరు చనిపోయారు. ఇది తేలికపాటి వ్యాధి అని గుర్తించినా, అనారోగ్యంగా ఉన్న వారికి తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుంది. హెచ్‌3ఎన్‌2 ఇతర ఇన్‌ఫ్లుయెంజా వ్యాధులతో పోలిస్తే ఎక్కువ తీవ్రత కలిగిన ఇన్‌ఫ్లుయెంజా. ఆసుపత్రిలో చికిత్స అవసరం అవుతుంది. చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వల్ల ఈ హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి ఆగిపోతుంది.

ఈ వైరస్ శిశువులు, చిన్నారుల్లో పెరిగిపోతోంది. చాలా కేసుల్లో ఐసీయూ చికిత్స కూడా కావాల్సి వస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో శ్వాస ఆడకపోవడం, దగ్గు, జ్వరం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు నివేదికలు అందుతున్నాయి.

కిడ్నీలపై ప్రభావం చూపుతుందా..?

హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా కిడ్నీలపై పెను ప్రభావం చూపుతుంది.. ముఖ్యంగా వృద్దుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యాలైన డయాబెటిస్, హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ‘ఫ్లూ వైరస్‌గా పేరున్న ఇన్‌ఫ్లుయెంజా కిడ్నీలపై విభిన్న దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఇన్‌ఫ్లుయెంజా వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన వారిలో కిడ్నీ ఫెయిలయ్యే ముప్పు ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.. 30 శాతం కేసుల్లో ఇలా జరిగేందుకు ఆస్కారం ఉంది.

వయస్సు పైబడిన పేషెంట్లలో, ముఖ్యంగా దీర్ఘకాలికంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కార్డియాక్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు కలిగి ఉన్న వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంది. కిడ్నీ మార్పిడి పేషెంట్లు, డయాలిసిస్ చేయించుకుంటున్న పేషెంట్లలో ఈ ముప్పు ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీరిలో సెకండరీ బ్యాక్టీరియల్ న్యూమోనియా, విభిన్న అవయవాల్లో సంక్లిష్టతలు చోటు చేసుకుంటాయి. గుండె కూడా పనిచేయకుండా పోవచ్చు. సాధారణ ప్రజల కంటే వీరు ఎక్కువగా మరణాల బారిన పడే అవకాశం ఉంది.

సేవ పేరుతో కోట్లు మాయం.. అందుకే ఐటీ రైడ్స్‌

బాలవికాస స్వచ్చంద సేవా సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సింగా రెడ్డి శౌరెడ్డి, అయన భార్య సునీతా రెడ్డి, వ్యవస్థాపక డైరెక్టర్ థెరిసా కలిసి క్రింద సంస్థకు వచ్చిన కోట్లాది రూపాయల FCRA నిధులను దారిమళ్లించి సొంతంగా వాడుకున్నారని, భూములు ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలపై ఇన్ కం ట్యాక్స్ దృష్టిపెట్టింది.

 ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తోంది.

హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన కార్యాలయంతో పాటు కీసరలో 28 ఎకరాలలో నిర్మించిన భారీ భవన సముదాయాలు, సోమాజిగూడ లోని హైదరాబాద్ కార్యాలయం, డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు. 

పేద కుటుంబంలో పుట్టి డ్రైవర్ గా జీవితాన్ని ప్రారంభించిన శౌరెడ్డి బాలవికాస సంస్థ ను ఏర్పాటు చేసి సేవ పేరుతో విదేశీయుల ను నమ్మించి వారి నుండి పెద్దమొత్తంలో డొనేషన్ల రూపంలో నిధులు రాబడుతూ కోట్లకు పడగనెత్తినట్లుగా ఆరోపణలున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు సంస్థ ద్వారా యాభై మిలియన్ అమెరికన్ డాల్లర్లను ( నాలుగు వందల కోట్లకు పైగా )కూడబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఎన్ని వందలకోట్లు దారి మళ్ళించాడనే విషయం తేలాల్సి ఉంది.

గర్ల్స్‌ హాస్టల్‌లో విద్యార్థులపై ఎలుకల దాడి.. ఆవరణలో పాములు, కుక్కల స్వైరవిహారం.. పలువురికి గాయాలు

దేశానికి, ప్రపంచానికి ఎంతోమంది మేధావులను అందించిన వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్‌ దుస్థితి అధ్వాన్నంగా మారింది. ఎలుకలు ఏకంగా హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొరికి గాయాలపాలు చేస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ D బ్లాక్‌లో వెంటిలేటర్స్ నుంచి హాస్టల్ గదిలోకి ప్రవేశించిన ఎలుకలు ముగ్గురు విద్యార్థుల కాళ్ళు, చేతులు కొరికాయి. చెత్తాచెదారంతో పాటు ఆహార పదార్థాలు పోగవడంతో ఎలుకలు, తేళ్లు, పాములు హాస్టళ్ల ఆవరణలో తిష్ట వేశాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లో పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ తో పాటు,న్యూ పీజీ హాస్టల్, పోతన, గణపతిదేవా, అంబేద్కర్‌, జగ్ జీవన్ ఫార్మసీ హాస్టల్ తో కలిపి ఎనిమిది హాస్టళ్లు ఉన్నాయి.. ఇందులో మూడు వేల మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. ఎలుకల బెడదతో ప్రశాంతంగా పడుకోలేకపోతున్నారు విద్యార్థులు

విషపు పురుగులు, కుక్కల బెడద కూడా ఉందని గర్ల్స్‌ హాస్టల్‌ విద్యార్థులు వాపోతున్నారు. బాయ్స్ హాస్టళ్లలో కూడా ఇదే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై ఎన్నిసార్లు కంప్లయింట్‌ చేసినా వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఎలుకలు, విషపు పురుగుల స్వైర విహారంతో హాస్టల్‌ విద్యార్థుల బతుకు దినదినగండంలా మారింది. ప్రాణాలు పణంగా పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

చదువుకుందామని వచ్చినవాళ్లను ఎలుకలు కొరుకుతున్నాయి. రాత్రిళ్లు పాములు భయపెడుతున్నాయి. ఇక రాత్రీపగలు తేడా లేకుండా కుక్కలు హడలెత్తిస్తున్నాయి. దేశానికి, ప్రపంచానికి మేధావులను అందించిన ఓరుగల్లు కాకతీయ వర్సిటీ హాస్టళ్లలో ఇప్పుడు హాహాకారాలు వినిపిస్తున్నాయి.

ఫుట్ బాల్ ఆడిన రేవంత్.. “కేసీఆర్ ఖేల్ ఖతం”

రాజకీయాలు, పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉంటే రేవంత్ రెడ్డి కాసేపు సరదాగా ఫుట్ బాల్ గేమ్ ఆడారు. హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం ఆ పాదయాత్ర నిజామాబాద్ జిల్లాలో సాగుతుంది. ఈ సందర్భంగా 29వ రోజు యాత్రలో భాగంగా నగరంలోని ఓ ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఆయన పలువురు యువతీ, యువకులతో ఓట ఆడారు. అంతేకాదు.. యువతతో పాటు పోటాపోటీగా పరుగులు పెట్టిన రేవంత్ రెడ్డి గోల్ కూడా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.. అంతేకాదు.. దీనికి కేసీఆర్ ఖేల్ ఖతం అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.

మరోవైపు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి స్పందించారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఆయన యాత్ర ఈ రోజు నిజామాబాద్ జిల్లా మోపాల్ మీదుగా సాగుతుంది. గతంలోనూ ఏఎల్ఎం, ఎంసెట్ వంటి పరీక్షలు ప్రశ్నాపత్రాలు లీకైనట్లు తెలిపారు. కేసీఆర్ సర్కార్ వచ్చినప్పటి నుంచి 30లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వహించిన పోటీ పరీక్షలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

సిట్టింగ్ జడ్జితో అయితేనే పారదర్శకంగా విచారణ జరుగుతుందని రేవంత్ రెడ్డి కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం వెనుక పెద్దల హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పెద్దలు ఉండటం వల్లే టీఎస్పీఎస్సీ ఇంత వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆయన అన్నారు. పోలీసులైనా ఈ వ్యవహారాన్ని సుమోటాగా స్పీకరించాలి కదా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ టీఎస్పీఎస్సీ చుట్టునే తిరుగుతున్నాయని ఆయన అన్నారు.

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని మోసపోయిన ఇంటర్ స్టూడెంట్

గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ఓ ఇంటర్ విద్యార్థి మోసపోయాడు. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన వినయ్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి గూగుల్ మ్యాప్ సహాయంతో ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నాడు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించబోతున్న వినయ్ హాల్ టికెట్ ను పరిశీలించిన అధికారులు.. అతనిది వేరే ఎగ్జామ్ సెంటర్ అని చెప్పడంతో అవాక్కయ్యాడు. తనకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి కాకుండా వేరే సెంటర్ కు వెళ్లిన ఆ విద్యార్థి అసలు ఎగ్జామ్ సెంటర్ కు పరిగెత్తాడు. కానీ అప్పటికే 27 నిమిషాలు ఆలస్యం కావడంతో పరీక్షా హాలులోకి సిబ్బంది అనుమతించలేదు. దీంతో వినయ్ కన్నీళ్లతో వెనుదిరిగాడు.

 ఈ ఘటన ఎన్.ఎస్.పి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రంలో జరిగింది. ముందు రోజే వెళ్ళి పరీక్షా కేంద్రం తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి నష్టాలే జరుగుతాయని పలువురు హెచ్చరిస్తున్నారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీయట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో పలు ప్రాంతాల్లో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అధికారులు అనుమతి నిరాకరించారు.

మహిళా బిల్లుపై మోడీ సర్కార్ ఫెయిల్ : ఎమ్మెల్సీ కవిత

మహిళా బిల్లుపై మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టారు. దానికి కొనసాగింపుగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కవిత స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో ఒత్తిడి తెస్తామని తేల్చి చెప్పారు. రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే దాకా పోరాటం చేస్తామన్న ఆమె.. కేంద్రంలోనూ బీజేపీ ఫెయిలైందన్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ కూడా కలిసిరావాలని కోరినట్టు కవిత తెలిపారు. ప్రధాని మోడీని ఎవరు ప్రశ్నించినా ఇదే తరహా దాడులు జరుగుతాయన్నారు. మొదటగా వ్యాపార సంస్థలపై టార్గెట్ చేశారని, ఆ తర్వాత వాటిని నియంత్రించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. 

అంతకుముందుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత ఎదురుదెబ్బ తగిలింది. విచారణపై తాత్కాలిక స్టే ఇవ్వాలని ఆమె పిటిషన్ వేయగా.. కోర్టు ఆ పిటిషన్ ను తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆమె మార్చి 16న విచారణకు హాజరుకానున్నారు. ఇక కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఈడీ విచారణకు హాజరు కాగా.. రామచంద్ర పిళ్లై కస్టడీ రేపటితో (మార్చి16తో) ముగియనుంది.

TS : ఈ రోజు నుంచే ఇంటర్‌ పరీక్షలు..

తెలంగాణలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ)-2023 మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్‌బీఐఈ) వెల్లడించిన విషయం తెలిసిందే. నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 

ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.45 గంటల లోపు పరీక్ష కేంద్రంలోకి రావాల్సి ఉంటుంది. 9 గంటల తర్వాత లోపలికి అనుమతించరు. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

 ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9,47,699 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారంతా పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. విద్యాధికారులు ఈ పరీక్షల కోసం 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

అంతేకాదు… 61 సెల్ఫ్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. పరీక్షల కోసం 75 ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లను నియమించారు.

మరో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య... కారణం...?

 బేగంపేటలోని గర్ల్స్ డిగ్రీ కాలేజీలో బీకామ్ సెకండియర్‌ చదువుతున్న పావని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది.

ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యువతి.. సడెన్‌గా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. 

చదువుపై శ్రద్ద పెట్టలేకపోతున్నానని.. ఆ డిప్రెషన్‌తోనే చనిపోతున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.

సూసైడ్‌ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

 

నేటి బంగారం - వెండి ధరలు

నిన్న ధరలు కాస్త పెరగగా, ఈ రోజు స్వల్పంగా తగ్గాయి.

ఇక బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే...

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంపై రూ. 100 తగ్గి రూ. 55, 530 గా నమోదయింది. 

 అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారంపై రూ. 100 తగ్గి రూ. 50, 900 గా నమోదయింది. 

 వెండి ధ‌ర‌లు మాత్రం కేజీ పై రూ. 100 తగ్గి, రూ. 67, 400 గా నమోదు అయింది.