/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1607609375422531.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1607609375422531.png StreetBuzz టీడీపీ బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి! బిఆర్ఎస్ ను నిందిస్తూ త్వరలో ఎన్.డి.ఏ కూటమిలో రేవంత్ రెడ్డి కలవడం కాయం! జంగిటి శ్రీనివాస్ JANGITI SRINIVAS MUDIRAJ
టీడీపీ బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి! బిఆర్ఎస్ ను నిందిస్తూ త్వరలో ఎన్.డి.ఏ కూటమిలో రేవంత్ రెడ్డి కలవడం కాయం! జంగిటి శ్రీనివాస్

టీడీపీ బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి!

బిఆర్ఎస్ ను నిందిస్తూ త్వరలో ఎన్.డి.ఏ కూటమిలో రేవంత్ రెడ్డి కలవడం కాయం!

స్వంత మార్క్ కోసమే హైడ్రా సృష్టించిన రేవంత్ రెడ్డి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు

సిద్దిపేట టౌన్ న్యూస్

ముఖ్యమంత్రి మంత్రి రేవంత్ రెడ్డి ఎన్.డి.ఏ కూటమిలో విలీనం కావడానికి రేవంత్ రెడ్డి ఉవ్విళూరుతున్నాడని మాజీ వైస్ యంపిపి కీసరి పాపయ్య, బిఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

ఆదివారం నాడు కీసరి పాపయ్య, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, రెడ్డి యదగిరీలు మాట్లాడుతు ఇచ్చిన హామీలను ఎగనామం పెట్టడానికే రేవంత్ రెడ్డి హైడ్రా ఆటలాడుతున్నాడని మూసీ బాధితురాలు బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆమె మృతదేహాన్ని చూడడానికి గాంధీ హాస్పిటల్ కు పోయిన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితరెడ్డిను హాస్పిటల్లోకి పోకుండా పోలీసులు అడ్డుపడడం రేవంత్ రెడ్డి కుట్ర అని వారు అన్నారు.

మాటి మాటికి బిఆర్ఎస్ ను హరీష్ రావులను రేవంత్ రెడ్డి విమర్శించడం చూస్తుంటే ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీని పలుచన చేసి కాంగ్రేస్ ను ఖతం చేసి చంద్రబాబు ఆధ్వర్యంలో బిజెపి పార్టీతో జత కట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని వారు అన్నారు.

బిఆర్ఎస్ పార్టీ ప్రజా తెలంగాణ పోరాటం నుండి పుట్టిందని బిఆర్ఎస్ పార్టీని గాని కేసీఆర్, హరీష్ రావును ప్రజల గుండెల నుండి చేరపలేరని దారి వెంట పోతుంట్టే కాలుకు ముళ్ళు గుచ్చుకున్నట్లు మంచ్చి కలలో చెడు కళ వచ్చినట్లు తెలంగాణ ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డి గద్దెనెక్యారని వారు అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో యూత్ నాయకులు పడిగె ప్రశాంత్, గుజ్జ రాజు, రావుల రాజు, పడిగె లింగంలు ఉన్నారు.

తెలంగాణను మరో రాయలసీమ చేయాలనీ చూస్తున్న రేవంత్ రెడ్డి! వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమనేది మర్చిపోవద్దు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తెలంగాణను మరో రాయలసీమ చేయాలనీ చూస్తున్న రేవంత్ రెడ్డి!

వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమనేది మర్చిపోవద్దు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

చిన్నకోడూర్ న్యూస్

తెలంగాణ రాష్ట్రాన్ని మరో రాయలసీమ చేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నాడని మాజీ వైస్ యంపిపి కీసరి పాపయ్య, బిఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, గుండెల్లి వేణులు అన్నారు.

మంగళవారం నాడు వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఐనాక తెలంగాణ రాష్ట్రం ఆగమ్యగోచరంగా మారిందని ఇచ్చిన హామీలకు దిక్కు మొక్కు లేదని ప్రభుత్వం విద్యాలయాలకు కనీసం చాక్ పీస్ లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ప్రభుత్వం ఏర్పడిన ఎన్మిది నెలల్లో ఎలాంటి పరిస్థితి ఏర్పడితే మిగతా నాలుగేండ్లు రేవంత్ రెడ్డి ఎంచేయగలడని వారు అన్నారు.

ఇచ్చిన హామీలను మరిపించడానికి తెలంగాణ ప్రజలను మాట్లాడకుండా చేయడానికే కాంగ్రెస్ కార్యకర్తలను గుండాలుగా తాయారు చేసి బిఆర్ఎస్ పైన బిఆర్ఎస్ నాయకుల పైన ఇండ్ల పైన దాడులు చేయిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని వారు అన్నారు.

రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారనికి గురికాకతప్పదని అన్నారు.

ప్రజలు మల్ల బిఆర్ఎస్ కావాలని కేసీఆర్, హరీష్ రావు రావాలని కోరుకుంట్టున్నారని బిఆర్ఎస్ తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు

చేపల మృతిపై సమగ్ర విచారణ జరపాలి దుండగులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

చేపల మృతిపై సమగ్ర విచారణ జరపాలి దుండగులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి

 ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

బెజ్జంకి మండల కేంద్రంలో

చేపల మృతికి కారకులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని రాష్ట్రముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో అక్కరవేణి పోచయ్యకు చెందిన చేపల చెరువులపై విష ప్రయోగం వలన చేపలు చనిపోగా విషయం తెలిసిన జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ చేపల చెరువును చేపలు చనిపోయిన వాటిని తన సంఘం సభ్యులతో కలసి పరిశీలించి చేపల రైతు అక్కెరవేన పోచయ్య ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజులపై తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ముదిరాజ్ సంపదలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముదిరాజ్ లా స్వయంకృషితో చేపల చెరువులను నిర్మించుకొని సంపదను సృష్టించి ఆర్థికంగా ఎదిగే ప్రయత్నంలో ముదిరాజ్ లను ఆర్థికంగా మానసికంగా దెబ్బ తిస్తున్నరని అన్నారు. రాష్ట్రంలో అనేక గ్రామాల్లో నేటికీ ముదిరాజులను గ్రామ బహిష్కరణలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించ్చుకోవడం లేదని అన్నారు. ముదిరాజులపై దాడులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చేపల సంపదపై చేసే దాడులపై ప్రభుత్వాలు ప్రత్యేక జీవోలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ హక్కుల సాధన సమితి యువత అధ్యక్షుడు పడిగే ప్రశాంత్ ముదిరాజ్ చిన్నకోడూరు మండల వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య. ముదిరాజ్ హక్కుల సాధన సమితి జిల్లా కన్వీనర్ రావుల రాజు ముదిరాజ్, ముదిరాజ్ హక్కుల సాధన సమిత జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పుప్పాల బాలేష్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ రావుల మొండయ్య ముదిరాజ్, తాటికొండ రాజేందర్ ముదిరాజ్, కొరివి తిరుపతి ముదిరాజ్, రావుల కనకయ్య ముదిరాజ్, రావుల మహేష్ ముదిరాజ్, రావుల ప్రశాంత్ ముదిరాజ్, జెట్టి అర్జున్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, జెట్టి రమేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి నువ్వు చెరిపితే చెరిగేది కాదు కేసీఆర్-హరీష్ రావుల చరిత్ర! కాళేశ్వరం నుండి మల్లన్న సాగర్ వరకు సజీవ సాక్షాలు! జంగిటి శ్రీనివాస్

రేవంత్ రెడ్డి నువ్వు చెరిపితే చెరిగేది కాదు కేసీఆర్-హరీష్ రావుల చరిత్ర!

కాళేశ్వరం నుండి మల్లన్న సాగర్ వరకు సజీవ సాక్షాలు!

తెలంగాణ ప్రజలకు రైతులకు సహసోపేతంగా తక్కువ సమయంలో నీల్లు అంద్దించిన ఘనత కేసీఆర్ హరీష్ రావులదే!

కీసరి పాపయ్య

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 21-09-2024 శనివారం

చిన్నకోడూర్ న్యూస్

దేశంలోనే ఎవరూ చేయని విధంగా సాహసోపేతంతో తక్కువ సమయంలో 135 మీటర్ల ఎత్తు కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి తెలంగాణ రైతులకు ప్రజలకు నీళ్లు అందించిన మహా నాయకులు కేసిఆర్ హరీష్ రావు లని వైస్ ఎంపీపీ కీసర పాపయ్య టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ నముండ్ల రామచంద్రం లు అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కెసిఆర్ హరీష్ రావుల మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని కాలేశ్వరం ప్రాజెక్టు ఉత్తరేణి అది కూలిపోయిందని నిందలు వేయడం సరికాదని కాలేశ్వరం లేకుంటే మల్లన్న సాగర్లోకి నీళ్లు ఎలా వస్తున్నాయని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వక్రబుద్ధిని మార్చుకోవాలని నువ్వు చెరిపే ప్రయత్నం చేస్తే చెరగనిదని సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ కాలేశ్వరం చరిత్రను ఎవరు జరుపలేరని అది సజీవ సాక్షాలుగా ఉంటాయని తెలంగాణ రైతులకు ప్రజలకు పెద్ద అన్నలుగా కేసీఆర్ హరీష్ రావులు నిలిచి రేయింబవులు కష్టించి ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేశారని వారు అన్నారు.

ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు మహిళలకు 2500 రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతుబంధు కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యం రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటుగా బోనస్ ఇవన్నీ ఏమైనాయని ముఖ్యమంత్రిని అడుగుతున్నామని అన్నారు

ఋణమాఫీ కాకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ చోద్యం చూస్తుంది! రైతు సోలిపేట సురేందర్ రెడ్డి మరణానికి రేవంత్ రెడ్డి బాధ్యత

ఋణమాఫీ కాకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ చోద్యం చూస్తుంది!

రైతు సోలిపేట సురేందర్ రెడ్డి మరణానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు

తేది:07-09-2024 శనివారం

చిన్నకోడూర్ న్యూస్

ఆత్మహత్య చేసుకున్న రైతు సోలిపేట సురేందర్ రెడ్డి మరణాకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని మాజీ వైఎస్ యంపిపి కీసరి పాపయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ లు అన్నారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన గాడిదప్పిందని ఇచ్చిన హామీలను సైతం మర్చిపోయి సొంత లాభాలను చూసుకుంటూ రేవంత్ రెడ్డి పబ్బం గడుపుతున్నాడని రుణమాఫీ పూర్తి చేయకపోవడంతో కోటి ఆశలు పెట్టుకున్న రైతులు ఈనాడు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని వారన్నారు.

నమ్మి నాన్నబోతే పుచ్చి బుర్రలైనట్లు రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయిన ప్రజలు ఓట్లేసి గద్దెనెక్కిస్తే రేవు దాటినంక్క తెప్ప తగిలేసినట్లు రేవంత్ రెడ్డి గట్లుందని అన్నారు.

తక్షణమే పూర్తి ఋణమాఫీ చేసి రైతుల ఆదుకోకుంటే మా నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు గారి అనుమతి తీసుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేస్తామని త్వరలోనే రైతులతో సమీక్ష నిర్వహించి కార్యాచరణ చేస్తామని అన్నారు.

కొరివి కృష్ణ స్వామి గారి స్పూర్తితో ముదిరాజ్ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలి! మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

కృష్ణస్వామి గారి స్ఫూర్తితో ముదిరాజ్ సమాజం ఐక్యంగా ముందుకు సాగాలి.

ముదిరాజ్ రిజర్వేషన్ కు సహకరిస్తాం.

ఈ చౌరస్తాను కృష్ణ స్వామి జంక్షన్ గా ప్రకటిస్తున్నాం

సిద్దిపేటలో ముదిరాజ్లకు స్థానిక సంస్థల్లో,రాజకీయంగా పదవులతో గౌరవించుకున్నాం

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల మంది మత్స్యకారులకు నూతన సభ్యత్వం ఇచ్చాం.

ముదిరాజుల రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి బిఆర్ఎస్ సహకరిస్తుంది

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

సిద్దిపేట పట్టణంలో ముస్తాబాద్ రోడ్డులో కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ముదిరాజ్ సమాజ్ సభ్యులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ:

హైదరాబాద్ తొలి మేయర్ గా కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ గారు నగరానికి ఎంతో సేవలు అందించారు.

వారి అడుగుజాడల్లో ముదిరాజ్ సమాజం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.

ముదిరాజ్ సమాజం నుంచి సిద్దిపేటలో సర్పంచులుగా, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లుగా అనేక పదవుల్లో ముదిరాజులను గౌరవించుకున్నాం.

రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించుకున్నాం.

అదేవిధంగా ప్రతి గ్రామంలో ముదిరాజ్ ఆత్మ గౌరవ భవనాలు ఉన్న నియోజకవర్గం సిద్దిపేట ఒకటే.

ముదిరాజ్ రిజర్వేషన్ కు బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది.

మత్స్యకారులకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కొత్త సభ్యత్వ కార్డులను మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.

ముదిరాజులు కృష్ణ స్వామి గారి మార్గంలో ఐక్యంగా ముందుకు సాగాలని, వారి విగ్రహాన్ని చూసినప్పుడు మరింత స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను.

ఈ చౌరస్తాని కృష్ణస్వామి జంక్షన్ గా ఏర్పాటు చేస్తాం.

ఈ కార్యక్రమంలో కెకెఎస్ సేవసమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నగేష్ ముదిరాజ్

తోడేటి సత్యం,

ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కొట్టాల యాదగిరి ముదిరాజ్, పడిగె ప్రశాంత్, మేడికాయల వెంకటేశం, కీసరి పాపయ్య, సీసల శ్రీనివాస్, సుతారి రాజు, పుల్లూర్ సుధాకర్, రామకృష్ణ ముదిరాజ్, బోనాల శ్రీనివాస్, బైరి యాదగిరి, తోట్ల పర్శరాములు కొంతం శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

పాలనపై అవగాహన లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యావు... సుప్రీంకోర్టులో లేని ముదిరాజుల కేసును ఎలా వాదిస్తావు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

పాలనపై అవగాహన లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యావు...

సుప్రీంకోర్టులో లేని ముదిరాజుల కేసును ఎలా వాదిస్తావు!

 

ముదిరాజుల బీసీ ఏ అంశం బీసీ కమిషన్ వద్ద ఉన్నది మీకు తెలియదా?

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ 

చిన్నకోడూరు 

పాలనపై అవగాహన లేక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి ఎలా అయ్యావని రేవంత్ రెడ్డిని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ప్రశ్నించారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏ కి మార్చే అంశం సుప్రీంకోర్టులో ఉందని మంచి లాయర్ ను పెట్టి వాదిస్తానన్నడం,రేవంత్ రెడ్డికి తెలువకన, లేక ముదిరాజులను మోసం చేయడ మా అన్నారు. సుప్రీంకోర్టు గతంలోనే ముదిరాజులను బీసీఏలోకి మార్చాలని బీసీ కమిషన్ కు ఆదేశాలు పంపించిందని అన్నారు. నేటి వరకు బీసీ కమిషన్ దగ్గర ఉన్న ఫైల్ ను కదిలించడం లేదన్నరు. బీసీ కమిషన్ వద్ద ఉన్న ఫైల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా తెప్పించుకొని ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలను ముదిరాజులు నమ్మే ప్రసక్తి లేదన్నారు. మరోసారి నమ్మి మోసపోలేమని, ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చి, బీసీఏలోకి మారుస్తున్నట్లు అసెంబ్లీ తీర్మానం చేస్తేనే ముదిరాజ్ సమాజం రేవంత్ రెడ్డిని నమ్ముతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షుడు కీసరి పాపయ్య ముదిరాజు, పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మిద్దె రవి ముదిరాజు, యువత జిల్లా అధ్యక్షుడు పడిగ లింగం ముదిరాజు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ముదిరాజ్ జేఏసీ నాయకులు! ముదిరాజులను బి.సి "డి" నుండి బి.సి "ఏ" లోకి చేర్చండి! ముఖ్యమంత్రిని కోరిన పోల్కం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ముదిరాజ్ జేఏసీ నాయకులు!

ముదిరాజులను బి.సి "డి" నుండి బి.సి "ఏ" లోకి చేర్చండి!

ముఖ్యమంత్రిని కోరిన పోల్కం లక్ష్మి నారాయణ ముదిరాజ్!

ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పొల్కం లక్ష్మి నారాయణ గారి ఆధ్వర్యంలో ముదిరాజ్ సమస్యల మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది .

ముదిరాజ్ ల 60 సంవత్సరాలు ఆశయం , ముదిరాజ్ ల ప్రధాన సమస్య అయిన బీసీ డి నుండి బీసీ ఎ కి మార్చాలని కోరడం జరిగింది.

ముదిరాజ్ లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా ముదిరాజ్ కార్పొరేషన్ కి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాల్సింది గా విజ్ఞప్తి చేయగా సానుకూలం గా స్పందించారు.60 లక్షల ముదిరాజ్ లు గల ఈ రాష్ట్రం లో ముదిరాజ్ లు రాజకీయం గా వెనబడ్డారని ,రానున్న రోజుల్లో కొత్తగా ఇచ్చే నామినేటేడు మరియు కార్పొరేషన్ చైర్మన్ లు ముదిరాజ్ లకు కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా పరిశీలిస్తాం అని హామీ ఇచ్చారు . ఈ సంద్భంగా ముఖ్యమంత్రి గారిని కలిసిన వారి లో ముదిరాజ్ జేఏసీ చైర్మన్ పోల్కాం లక్ష్మి నారాయణ ముదిరాజ్ గారు,మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు లింగాల పుష్పాల త ముదిరాజ్ గారు, వైస్ చైర్మన్ సుధాకర్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ ముదిరాజ్ ,నీరజ ముదిరాజ్ లు,ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ కలరు.

రైతుల బతుకులు ఆగం జేత్తున్న రేవంత్ రెడ్డి! పొద్దుతిరుగుడు ధాన్యం మార్కెట్లో పోసి నెలలు గడుస్తున్న కొనుగోలు చేయరా? జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

రైతుల బతుకులు ఆగం జేత్తున్న రేవంత్ రెడ్డి!

పొద్దుతిరుగుడు ధాన్యం మార్కెట్లో పోసి నెలలు గడుస్తున్న కొనుగోలు చేయరా?

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంట్టే కొనుగోలు ఆగి ఉండేవి కావు!

రైతులంట్టే కేసీఆర్

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

బిఆర్స్ నాయకులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రైతులకు హామీ ఇస్తూ మద్దతు ధరతోని రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులకు అండగా ఉంటామని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి ఈనాడు రైతు పండించిన పొద్దు తిరుగుడు దాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బిఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

చిన్నకోడూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు బుధవారం నాడు సందర్శించిన ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు యమగండంలా మారిందని గతంలో ఎన్నికలకు ముందు రైతులకు బోనస్ తో పాటుగా ప్రతి గింజలు కొనుగోలు చేస్తామని ప్రగల్బాల్ పలికి ఈనాడు రైతు జీవితాన్ని గాలికి రేవంత్ రెడ్డి మీకు తగిన గుణపాఠం చెప్పదన్నారు ఈ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ఒక్క గింజ కూడా కళ్ళల్లో ఉండేది కాదని గతంలో పాలనలో రైతులకు ఏనాడూ కూడా ఇబ్బంది కలగనీయలేదని సకాలంలో ఎరువులు అందించి వచ్చిన దిగుబడి ప్రతి గింజను కొనుగోలు చేసిన గణత కేసీఆర్ దక్కుతుందని అన్నారు ఆయనతో పాటుగా ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సుంచు రమేష్ బోస్సే ప్రభాకర్ రైతులు ఉన్నారు.

సమాచార హక్కు చట్టం గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాలి! అవినీతిపరుల గుంద్దెల్లో సింహస్వప్నం సమాచార హక్కు చట్టం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

సమాచార హక్కు చట్టం గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాలి!

అవినీతిపరుల గుంద్దెల్లో సింహస్వప్నం సమాచార హక్కు చట్టం!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఆర్.టీ.ఐ పిసి వ్యవస్థాపక అధ్యక్షులు

జిల్లాలోని అంబేద్కర్ భవన్లో సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు, వరంగల్ జిల్లా అధ్యక్షులు కాట కుమారస్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొన్న జాతీయ కమిటీ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అవగాహనలు సమాచార హక్కును విలువైన పౌర హక్కుగా గుర్తించిన నేపథ్యంలో పార్లమెంట్ సమాచార హక్కు చట్టాన్ని 12 /10 /2005 సంవత్సరం నుంచి అమలు చేస్తున్నదని తెలిపారు.

ఈ చట్టంలో పేర్కొనబడిన ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక పౌర సమాచార అధికారి ఈ చట్టం పేర్కొన్న విధులను నిర్వహిస్తూ ఉంటారని ఈ చట్టంలో పేర్కొనబడిన ప్రకారం రికార్డులు దస్తావేజులు మెమోలు ఈ-మెయిల్ అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్కులర్లు, ఉత్తర్వులు, రిజిస్టర్లు, కాంట్రాక్టులు, నివేదిక నమూనాలు, క్రోడీకరించబడిన సమాచార గ్రంథం లిఖితపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిక్షిప్తం చేయబడి ప్రతి అంశం సమాచార అధికారి సెక్షన్- 8 లో ఇచ్చిన నిబంధనలకు లోబడి సమాచారం కాపీలను అర్జీదారునికి అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల కొరకు ఏర్పాటు చేయబడిన వ్యవస్థను జవాబు దారితనంతో అవినీతి రహితంగా పని చేయాలంటే ప్రజలు తమ బాధ్యతను సక్రమంగా పోషించాలని కోరారు.

అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం సక్రమంగా అమలవుతుందని ప్రజలందరికీ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించి వారిని చైతన్య పరిచి సహ చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని సభ్యులను కోరారు. కొన్ని ప్రభుత్వాలు ఈ సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల సహ చట్టం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, నమీండ్ల హరీష్, వీరేందర్ రెడ్డి, డాక్టర్ కీర్తి రెడ్డి, వెంకటేష్ యాదవ్, మల్లె పాక నాగరాజు, తదితరులు పాల్గొన్నారు అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు.