బుడమేరు గండ్ల పూడ్చివేత వేళ బిగ్ అలర్ట్..!!
విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లు ఇంకా టెన్షన్ పెంచుతున్నాయి. బుడమేరు వరద కొనసాగుతోంది. నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారిపై రెండు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. బుడమేరుకు మూడు గండ్లు పడటంతో ప్రభుత్వం సైన్యం సహకారంతో పూడ్చివేత పనులు కొనసాగిస్తోంది. అక్కడే మకాం వేసిన మంత్రి రామానాయుడు ఈ సాయంత్రానికి పూడ్చివేత పనులు పూర్తవుతాయని వెల్లడించారు.
బుడమేరు ప్రవాహం పైన ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంతించినట్లు కనిపిస్తున్నా...పూర్తిగా ముప్పు తొలిగిపోలేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇంకా 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు పడవల ద్వారానే ఆహారం... ఇతర సహాయ కార్యక్రమాలను అధికారులు అందిస్తున్నారు. వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు దూరమయ్యాయి. విజయవాడ నగరంలో శుక్రవారం రెండు అడుగుల మేర వరద నీరు పెరగటంతో స్థానికులు మరోసారి ఆందోళన చెందారు.
విజయవాడను ముంచేసిన బుడమేరు గండ్ల పూడ్చివేత పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మూడు గండ్లు పడటంతో వాటిని పూడ్చేందుకు నాలుగు రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోంది.
మంత్రి రామానాయుడు అక్కడే మకాం వేసారు. బుడమేరు మూడో గండి పుడ్చివేత 90 శాతం పూర్తి అయ్యిందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇంకో రెండు మూడు గంటల్లో గండ్లు పూడ్చివేత పనులు పూర్తి అవుతాయన్నారు. మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటిని అరికడతామని మంత్రి తెలిపారు.
Sep 07 2024, 12:29