/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఏపీలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 18:04

ఏపీలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

కాగా, జేసీబీలు, పొక్లెనర్లతో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మట్టి పెళ్లలు ఇంకాపడుతున్నాయి. మట్టిపెళ్లలు పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో జేసీబీలు, పొక్లెనర్లను సిబ్బంది వెనక్కు తీసుకెళ్లారు. సమీపంలోని ఇళ్లల్లో ఉన్న స్థానికులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. భారీగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కొండ చరియలు మరింతగా పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అలాగే క్రీస్తురాజపురంలో రెండు ఇళ్లపై కొండచరియలు పడ్డాయి. సున్నపుబట్టీల దగ్గర కొండచరియలు పడి రెండు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇళ్లల్లో చిక్కుక్కున్న వారిని భయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటువైపు ఎవరు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేశారు.

జల దిగ్బందంలో మైలవరం పట్టణం ఉండిపోయింది. పలు కాలనీలు నీట మునిగాయి. మైలవరం ఎర్ర చెరువుకు గండి, తారక రామనగర్‌‌‌‌లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. మైలవరం ప్రధాన సెంటర్‌‌లో మోకాళ్ల లోతులో వర్షపు నీరు ప్రవహిస్తోంది. మైలవరంలో ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. చండ్రగూడెం శివారు జంగాలపల్లిలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. కొండ వాగు ఉధృతికి మైలవరం - పొందుగల గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బుడమేరు వరద అంతకు అంత పెరుగుతోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 17:59

చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులిచ్చిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు

హైడ్రా బుల్డోజర్ చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారి పైకి మళ్లిన విషయం తెలిసిందే. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసి మరీ 50 మందికి పైగా అధికారులను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.

హైడ్రా బుల్డోజర్ చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారి పైకి మళ్లిన విషయం తెలిసిందే. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసి మరీ 50 మందికి పైగా అధికారులను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మొత్తానికి అధికారుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా సైబరాబాద్ ఈవోడబ్ల్యూ వింగ్ అధికారులు ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశారు. వారిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు చెందిన అధికారులు ఉన్నారు. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధామ్స్.. బాచుపల్లి ఎంఆర్ఓ‌పై కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే మేడ్చల్ మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్ హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజకుమార్ పై కేసు నమోదైంది. హైడ్రా సిఫారసుల మేరకు ఆయా అధికారులపై కేసులు నమోదు చేయడం జరిగింది. హైదరాబాదులో చెరువుల్లో కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లో కేసులను సీపీ అవినాష్ మహంతి నమోదు చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు అయ్యాయి. అదనపు సిబ్బందితో హైడ్రా మరింత స్ట్రాంగ్‌గా తయారైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకూ అన్ని హైడ్రా డైరెక్షన్‌లోనే జరగనున్నాయి. త్వరలోనే హైడ్రా పోలీసు స్టేషన్ సైతం ఏర్పాటు కానుంది. గతంలో ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో నోటీసులు ఇప్పించగా.. ఇకపై హైడ్రా పేరుతోనే నోటీసులు జారీ కానున్నాయి. ముందుగా చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారందరినీ హిట్ లిస్ట్‌లో చేర్చి మరీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే 50 మంది అధికారుల చిట్టాను సిద్ధం చేసిన హైడ్రా అధికారులు ఇప్పుడు ఆరుగురిపై ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

మరోవైపు మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్‌పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. మ్యాప్స్ కంపెనీ సుధాకర్ రెడ్డితో పాటు పలువురిపై అధికారులు కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫార్సు మేరకు అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఎర్రగుంట చెరువులో ఆక్రమణలు చేసి బహుళ అంతస్థు భవనాలను మ్యాప్స్ నిర్మించింది. ఈర్ల చెరువులో బహుళ అంతస్థుల భవనాలు నిర్మించిన ముగ్గురు బిల్డర్స్‌పై కేసులు నమోదయ్యాయి. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులుపై రెవెన్యూ అధికారులు కేసు నమోదు చేశారు. ఈర్ల చెరువులో అక్రమంగా బహుళ అంతస్తులను ముగ్గురు బిల్డర్స్ నిర్మించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 17:53

తెలంగాణలో కొత్త జూ పార్క్.. వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు, ఎక్కడంటే..?

హైదరాబాద్ నగరంలో ఇప్పటికే నెహ్రూ జూ పార్క్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 300 ఎకరాలకు పైగా విస్తరించిన ఉన్న ఈ జూలో పులులు, సింహాలతో పాటు వందల అరుదైన వన్యప్రాణులు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. అయితే తెలంగాణలో త్వరలోనే కొతత్ జూ పార్క్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1000 ఎకరాల్లో జూ పార్క్ నిర్మించాలని ఆదేశించారు.

తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం కొత్త పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు. ఎకో టూరిజం, హెల్త్ టూరిజం, టెంపుల్ టూరిజంలకు విడివిడిగా పాలసీలను రూపొందించాలన్నారు. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా సచివాలయంలో పర్యాటక రంగ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. తెలంగాణలో ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంభించాలని సూచించారు.

కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని, కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో జూ పార్క్ సందర్శకులను ఆకట్టుకుంటుండగా.. నగరం వెలుపల దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జామ్ నగర్‌లో ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన ప్రకృతి అటవీ సంపద, అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలన్నారు. బెంగుళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 17:38

తెలంగాణ పీసీసీ చీఫ్ ఫిక్స్.. నేడే ప్రకటన!

టీపీసీసీ చీఫ్ పదవిపై గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఈరోజు తేలిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది.

టీపీసీసీ చీఫ్ (TPCC Chief) పదవిపై గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎవరనేది ఈరోజు తేలిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్ (Congress) అధిష్టానం తెలంగాణ పీసీసీ చీఫ్ పేరును ఖారారు చేసినట్లు తెలుస్తోంది. దాన్ని అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌లపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది. మూడు రాష్ట్రాలను పీసీసీ చీఫ్‌లను ఏఐసీసీ ప్రకటించనుంది.

ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. అలాగే పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్‌గా దీపాదాస్ మున్సీ, కేరళ పీసీసీ అధ్యక్షుడుగా కేసీ వేణుగోపాల్ పేరు ఖరారైంది. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ స్థానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బగెల్ ఉండనున్నారు. మూడు రాష్ట్రాలకు ఖరారైన నూతన పీసీసీ చీఫ్‌ల పేర్లను నేడో, రేపో కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది.

కాగా... తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌ గౌడ్ పేరును హైకమాండ్ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహేష్ గౌడ్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. బొమ్మ మహేష్ గౌడ్.. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. తొలిసారిగా 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. కానీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహేష్ గౌడ్ పోటీ చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు కానీ ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో మహేష్ గౌడ్ ఫేట్ మారిపోయింది. ఈ ఏడాది జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ఇప్పుడు టీపీసీసీ చీఫ్‌గా పదవిని అలంకరించబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి పార్టీని ఏ తరుణంలోనూ వదిలిపెట్టలేదు. పైగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. ఇంత కాలానికి ఆయన కష్టానికి ప్రతిఫలం దక్కబోతోందని కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో.. ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అలా సామాజిక సమీకరణాలు అన్నీ మహేష్‌కు కలిసొచ్చినట్టుగా సమాచారం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 14:13

కోహ్లీ, రోహిత్ శర్మలకు పాకిస్థాన్ మాజీ స్టార్ ఆటగాడి కీలక విజ్ఞప్తి

ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎక్కడికి వెళ్లినా విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఏ దేశానికి వెళ్లి ఆడినా వీరిద్దరికీ ఫ్యాన్స్ మద్దతు ఇస్తుంటారు. అయితే క్రికెట్ ఆడే ప్రధాన దేశాల్లో ఒకటైన పాకిస్థాన్‌లో వీరిద్దరూ ఒక్కసారి కూడా పర్యటించలేదు. 2012-13లో పాకిస్థాన్ చివరిసారిగా భారత్‌లో పర్యటించింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఇక భారత్ 2006లో చివరిసారిగా పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లింది. అప్పటికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. దీంతో వీరిద్దరు స్టార్ క్రికెటర్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాకిస్థాన్‌లో ఆడలేదు.

ఇక ఛాంపియన్స్ ట్రోఫీ-2025‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా భారత జట్టు పాల్గొనడంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ స్టార్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్ అయ్యే ముందు రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీలు ఒకసారి పాకిస్థాన్‌ సందర్శనకు రావాలని కోరాడు. పాకిస్థాన్‌లో వీరిద్దరికి లభించే ప్రేమ, అభిమానాలు అన్నింటినీ మించిపోతాయని అక్మల్ వ్యాఖ్యానించాడు.

ప్రపంచ క్రికెట్‌లో వీరిద్దరూ స్టార్‌ ఆటగాళ్లని, క్రికెట్ ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పర్యటిస్తున్నారని అక్మల్ అన్నాడు. ‘‘ప్రతి క్రికెట్ ఫ్యాన్ వారిని అభిమానిస్తుంటారు. వారి అద్భుతమైన బ్యాటింగ్, మ్యాచ్‌లను గెలిపించే ప్రదర్శనల కారణంగా ఇద్దరికీ పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. పాకిస్థాన్‌లో వారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మిగతా అన్ని చోట్లా చూసిన దానిని మించిపోతుంది’’ అని అక్మల్ వ్యాఖ్యానించాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు కోహ్లీ ఒక ఆదర్శవంతమైన క్రికెటర్ అని, పాకిస్థాన్‌లో అతడికి అపూర్వమైన ఆదరణ లభిస్తుందని అక్మల్ పేర్కొన్నాడు. ‘‘ప్రపంచంలో చాలా మందికి విరాట్ కోహ్లీ రోల్ మోడల్. రోహిత్ శర్మప్రపంచ కప్ గెలిచిన జట్టు కెప్టెన్. జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్. ఈ ఆటగాళ్లు పాకిస్థాన్‌లో పర్యటిస్తే ఇక్కడ అందరికీ ప్రత్యేకంగా ఉంటుంది. విరాట్ అండర్-19 రోజులలో పాక్‌కు వచ్చాడు. కానీ అప్పుడు అతడికి అంత ఆదరణ లేదు’’ అని అక్మల్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లీ అండర్-19 క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్థాన్‌లో పర్యటించాడు. అయితే అప్పటికి కోహ్లీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 14:01

శంషాబాద్ లో ల్యాండ్ అయిన ఆకాశ తిమింగలం

ఆకాశ తిమింగలంగా పేరున్న ఎయిర్ బస్ సరకుల రవాణా ఎయిర్ క్రాఫ్ట్ తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి వచ్చింది. గురువారం అర్థరాత్రి ల్యాండ్ అయిన ఈ విమానం శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లిపోయింది. ఇంత భారీ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో మొదటిసారి ల్యాండ్ కావటంపై ఆసక్తి వ్యక్తమైంది. 56.16 మీటర్ల పొడవు.. 17.25 మీటర్ల ఎత్తుతో పాటు.. రెక్కలు 44.84 మీటర్లు ఉంటాయి.

ఈ భారీ విమానంలో ఏకంగా 40 టన్నుల (ఒక టన్నువెయ్యి కేజీలు)సరకుల్ని రవాణా చేసే సామర్థ్యం దీని సొంతం. ఇంధనం లేకుండా ఈ భారీ విమనం బరువు 133.8 టన్నులు కాగా.. ల్యాండింగ్ బరువు 140 టన్నులు. టేకాఫ్ బరువు 155 టన్నులు. ఇందులో ఒకసారి 23,860 లీటర్ల ఇంధనాన్ని నింపొచ్చు. ఒకసారి ఇంధనాన్ని నింపిన తర్వాత నాన్ స్టాప్ గా 1650కి.మీ. దూరం ప్రయాణించే సత్తా దీని సొంతం.

ఇక.. దీని ఎత్తు విషయానికి వస్తే.. లో డబుల్ క్రాస్ సెక్షన్ ఎత్తు 71. మీటర్లుకాగా.. లో డబుల్ క్రాస్ సెక్షన్ వెడల్పు 7.1 మీటర్లుగా చెబుతున్నారు. ఇంతకు ఈ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎందుకు వచ్చిందన్న ప్రశ్న వేస్తే.. ఆసక్తికర సమాధానం వస్తుంది. నిజానికి ఈ ఎయిర్ బస్ విమానం మస్కట్ లో బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం ఇది థాయ్ లాండ్ లో సరకుల్ని లోడింగ్ కోసం వెళ్లాల్సి ఉంది.

అయితే.. మధ్యలో ఈ విమానం ఇంధనం నింపుకోవటంతో పాటు.. క్రూ సిబ్బంది విశ్రాంతి తీసుకోవాల్సి రావటంతో విమానాన్ని దారి మళ్లించి శంషాబాద్ కు తీసుకొచ్చారు. శంషాబాద్ లో ల్యాండింగ్ చేసిన తర్వాత 15 గంటల పాటు ఇది ఎయిర్ పోర్టులోనే ఉంది. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వేళలో థాయ్ లాండ్ కు బయలుదేరింది. ఈ బాహుబలి లోహ విహంగం 2022 డిసెంబరులోనూ.. 2023 ఆగస్టులోనే వచ్చింది. తాజాగా మరోసారి ఆగస్టు నెలలోనే శంషాబాద్ కు రావటం ఆసక్తికరం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 13:46

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. శనివారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణలో శని, ఆదివారాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావ‌ర‌ణ‌ కేంద్రం హెచ్చరించింది. శనివారం ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

అలాగే నిర్మల్‌, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రానికి వర్షసూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని గ్రేటర్‌ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 08:38

కొత్త పోరాటానికి సమంత సిద్దం - రేవంత్ కు అప్పీల్..!!

ప్రముఖ సినీ నటి సమంత మరో పోరాటానికి సిద్దం అవుతుననారు. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు..సమస్యల పైన ఇచ్చిన నివేదికను వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్ కు అప్పీల్ చేసారు. మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితేవడంలో హేమ కమిటీ పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్‌ హీరోయిన్ సమంత ప్రశంసించారు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం స్పందన ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

సినీ నటి సమంత ఇనస్టాలో చేసిన పోస్టు సంచలనంగా మారుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ నివేదిక పైన సమంత స్పందించారు. హేమీ కమిటీ నివేదిక పని తీరును ప్రశంసించారు. ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌) సంస్థనూ ఆమె అభినందించారు. ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటుపడుతోందని అభినందించారు.

ఇదే తరహాలో తెలుగు సినీ ఇండస్ట్రీ నివేదిక పైన సమంత పోరాటానికి సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. సమంత చేసిన పోస్టులో.." 'తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలమైన మేము హేమ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాము. దీనికి మార్గం వేసిన కేరళ డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌) యొక్క నిరంతర ప్రయత్నాలను అభినందిస్తున్నాము. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళల కోసం 2019లో సృష్టించబడిన సపోర్ట్ గ్రూప్ అయిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్‌‌ కూడా ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ గ్రూప్‌ స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.

దీనికి కొనసాగింపుగా..."‌ తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి రూపొందించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని ఇందుమూలంగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము..'' అని సమంత చేసిన పోస్టింగ్ వైరల్ అవుతోంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలు అంశాల పైన వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా సమంత చేసిన అప్పీల్ పైన ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 08:32

టర్మ్‌ పాలసీలకు జీఎస్‌టీ మినహాయింపు?

బీమా కంపెనీలు అందించే టర్మ్‌ పాలసీలపై ప్రభుత్వం త్వరలో తీపికబురు చెప్పబోతున్నట్టు సమాచారం. ఈ పాలసీల ను జీఎ్‌సటీ నుంచి మినహాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 9న జరిగే

బీమా కంపెనీలు అందించే టర్మ్‌ పాలసీలపై ప్రభుత్వం త్వరలో తీపికబురు చెప్పబోతున్నట్టు సమాచారం. ఈ పాలసీల ను జీఎ్‌సటీ నుంచి మినహాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

వచ్చే నెల 9న జరిగే జీఎ్‌సటీ మండలి సమావేశం లో ఈ విషయం అధికారికంగా ప్రకటిస్తారని అధికార వర్గాలు చెప్పాయి. ఇతర బీమా పాలసీల్లానే ఈ పాలసీలపైనా ప్రస్తుతం 18 శాతం జీఎ్‌సటీ విధిస్తున్నారు. పన్ను మినహాయింపు లభిస్తే ఈ పాలసీలకు మరింత ఆదరణ లభించనుంది.

10 నుంచి 30 సంవత్సరాల కాలపరిమితి ఉండే ఈ పాలసీల గడువులో.. పాలసీదారుడు మరణిస్తే.. అతడి కుటుంబానికి బీమా కంపెనీ ద్వారా పాలసీలో పేర్కొన్నంత మేరకు ఆర్థిక రక్షణ లభిస్తుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఆమోదిస్తే ఏటా రూ.200 కోట్ల మేర జీఎ్‌సటీ ఆదాయం మాత్రమే నష్టపోతుందని అంచనా.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 31 2024, 08:29

జోరు తగ్గిన ఆర్థికం

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో జోరు తగ్గింది. దేశంలో స్థూల వస్తూత్పత్తిలో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతానికి పరిమితమైంది. ఇది 15 నెలల లేదా ఐదు త్రైమాసికాల కనిష్ఠ స్థాయి.

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో జోరు తగ్గింది. దేశంలో స్థూల వస్తూత్పత్తిలో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1)లో 6.7 శాతానికి పరిమితమైంది. ఇది 15 నెలల లేదా ఐదు త్రైమాసికాల కనిష్ఠ స్థాయి. వ్యవసాయ, సేవల రంగాలు ప్రదర్శించిన నిరాశావహమైన పనితీరు ఇందుకు కారణం. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు దిగజారినప్పటికీ ప్రపంచంలో త్వరితగతిన వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్‌ నిలబెట్టుకుంది. మన పోటీ ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ఇదే త్రైమాసికంలో 4.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతంలో జీడీపీ వృద్ధి రేటులో కనిష్ఠ స్థాయి 6.2 శాతం 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైంది. 

స్థిర ధరల ప్రకారం క్యూ1లో జీడీపీ పరిమాణం రూ.43.64 లక్షల కోట్లున్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ రూ.40.91 లక్షల కోట్లుగా (6.7% వృద్ధి) ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం ఇది రూ.77.31 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో 9.7 వృద్ధితో జీడీపీ పరిమాణం రూ.70.50 లక్షల కోట్లుగా ఉంది. మరిన్ని వివరాలు..

వ్యవసాయ రంగంలో స్థూల విలువ జోడింపులో (జీవీఏ) వృద్ధి 3.7% నుంచి 2 శాతానికి దిగజారింది. ఆర్థిక, రియల్‌ ఎస్టేట్‌, వృత్తి సర్వీసుల్లో జీవీఏ 12.6% నుంచి 7.1 శాతానికి తగ్గింది.

వాణిజ్య, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవల రంగం 9.7% నుంచి 5.7 శాతానికి మందగించింది.

తయారీ రంగం జీవీఏ మాత్రం 5% నుంచి 7 శాతానికి పెరిగింది. గనులు, క్వారీ రంగాల్లో జీవీఏ 7% నుంచి 7.2 శాతానికి, విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసుల్లో జీవీఏ 3.2% నుంచి 10.4 శాతానికి దూసుకుపోయింది. నిర్మాణ రంగంలో వృద్ధి 8.6% నుంచి 10.5 శాతానికి పెరిగింది.