/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz తెలంగాణ గవర్నర్ ములుగు పర్యటనలో అపశ్రతి.. ఏం జరిగిందంటే? Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 19:39

తెలంగాణ గవర్నర్ ములుగు పర్యటనలో అపశ్రతి.. ఏం జరిగిందంటే?

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తొలిసారి రాష్ట్రంలో అధికారిక పర్యాటన చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యాటనలో భాగంగా ఈ రోజు ఆయన ములుగు జిల్లాకు వెళ్లారు. అయితే అక్కడ ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్‌తో అధికారులు ముందస్తుగా భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భద్రతా దళాలను..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ తొలిసారి రాష్ట్రంలో అధికారిక పర్యాటన చేపట్టిన సంగతి తెలిసిందే. పర్యాటనలో భాగంగా ఈ రోజు ఆయన ములుగు జిల్లాకు వెళ్లారు. అయితే అక్కడ ఓ అనుకోని సంఘటన చోటు చేసుకుంది. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రే హౌండ్స్‌తో అధికారులు ముందస్తుగా భారీగా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. అయితే భద్రత నేపథ్యంలో వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అడవిలో విధుల్లో ఉన్న గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ అనే వ్యక్తిని పాము కాటు వేసింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటున కానిస్టేబుల్‌ను ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు నేడు, రేపు.. వరుసగా రెండు రోజుల పాటు యాదాద్రి, వరంగల్, ములుగు జిల్లాల్లో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ పర్యటనలో ఉన్నారు. పుణ్య క్షేత్రాలు, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల సందర్శన అనంతరం లక్నవరం హాలాండ్స్‌లో బస చేస్తారు. గవర్నర్ తొలిసారి పర్యటనకు అధికార యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఆగస్టు 27వ తేదీన గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో 25 మంది ప్రముఖ రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహితలతో గవర్నర్‌ పరస్పరం చర్చల అనంతరం.. వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప, గోవిందరావుపేట మండలంలోని లక్నవరంలో బసచేసి మరుసటి రోజు హనుమకొండకు చేరుకుంటారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 19:39

తెలుగోడు ఒక్కడు లేడు.. ఎందుకంటే!

ప్రోకబడ్డీ లీగ్ సీజన్ 11కు రంగం సిద్దమైంది. అక్టోబర్ 18 నుంచి మళ్లీ కబడ్డీ కూత సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్‌కు సంబంధించిన వేలం పూర్తయింది. స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ. కోట్లు కురిపించాయి. లీగ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 8 మంది కబడ్డీ ఆటగాళ్లు కోట్లు పలికారు.

రెండు రోజుల పాటు సాగిన వేలంలో సచిన్ తన్వార్ అత్యధిక ధర దక్కించుకున్నాడు. ఈ వేలంలో 12 ఫ్రాంచైజీలు మొత్తం 118 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.అయితే తెలుగురాష్ట్రాలకు చెందిన కబడ్డీ ప్లేయర్లకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఒక్క ఆటగాడిని కూడా వేలంలో ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. గతేడాది కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరు కూడా ప్రోకబడ్డీ లీగ్‌లో ప్రాతినిథ్యం వహించలేదు.

ప్రోకబడ్డీ టోర్నీలో హర్యానా ఆటగాళ్లదే పూర్తి ఆధిపత్యం నడుస్తోంది. ఆ రాష్ట్రం నుంచి 106 మంది ఆటగాళ్లు ఈ టోర్నీలో భాగమయ్యారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 39 మంది, తమిళనాడు నుంచి 22 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 21 మంది కబడ్డీ ప్లేయర్లు ఈ ఫ్రాంచైజీ లీగ్‌లో భాగమయ్యారు. తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణ నుంచి ఒక్క ప్లేయర్ కూడా అవకాశం అందుకోలేకపోయారు.

చివరకు జమ్మూ కశ్మీర్ నుంచి ఇద్దరు ప్లేయర్లు ఎంపికవ్వగా.. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగు టైటాన్స్ కూడా ఒక్క ప్లేయర్‌ను తీసుకోలేదు. లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాల్సిన సొంత ఫ్రాంచైజీ స్థానిక ఆటగాళ్లను పట్టించుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయ క్రీడ అయిన కబడ్డీలో కూడా తెలుగు రాష్ట్రాల ప్రాతినిథ్యం లేకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రీడాకారుల కోసం బాగా ఖర్చు పెడుతున్నాయని చెబుతున్నా.. ఒక్క ప్లేయర్ లేకపోవడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. పల్లె క్రీడ అయిన కబడ్డీకి సరైన ప్రోత్సాహకం లభించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో నైపుణ్యం కలిగిన కబడ్డీ క్రీడాకారులు ఎందరో ఉన్నారని, కానీ వారికి సరైన గైడెన్స్, ప్రోత్సాహకం లేక మధ్యలోనే వదిలేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.స్కూల్ లెవల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సరైన టోర్నీలు నిర్వహించకపోవడం.. కబడ్డీ అసోసియేషన్స్ అన్నీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారడంతో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు సరైన ప్రోత్సాహం లభించడం లేదనే వాదన వినిపిస్తోంది. కబడ్డీని కెరీర్‌గా ఎంచుకున్న కొంతమంది ఆటగాళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే వరకు ఆటలో కొనసాగి తర్వాత వదిలేయడం, మరికొంతమంది ఆర్థిక సమస్యలతో తప్పుకోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రోకబడ్డీ లీగ్‌లో ప్రాతినిథ్యం లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు.. ఛాంపియన్లకు భారీ నగదు ప్రోత్సాహకం అందించే బదులు.. మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చే కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 19:32

క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్.. HDFC, IDFC బ్యాంకుల ప్రకటన.. ఒకటో తేదీ నుంచే అమల్లోకి..!

ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య పెరిగి పోయిందని చెప్పొచ్చు. ఎన్నో అవసరాలకు ఇది ఎమర్జెన్సీ కింద ఉపయోగపడుతుంది. ఇంకా బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు కూడా మంచి మంచి డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్స్‌తో వీటిని ఆఫర్ చేస్తుంది. ఈ క్రమంలోనే కొత్త కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. తాజాగా రెండు దిగ్గజ బ్యాంకులు.. తమ క్రెడిట్ కార్డ్ టర్మ్స్ అండ్ కండీషన్స్ అప్డేట్ చేశాయి. ఈ వివరాలు చూద్దాం.

ప్రజలు రకరకాల పేమెంట్లు చేసేందుకు, ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం పడినప్పుడు.. క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారని చెప్పొచ్చు. కొన్ని రకాల పేమెంట్స్‌పై స్పెషల్ డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్, రివార్డ్ పాయింట్లు వంటివి లభించడం.. ఇంకా బిల్లింగ్ సైకిల్ మధ్య గ్యాప్ ఉండటం ఇందుకు కారణం. పేమెంట్స్‌ను ఈఎంఐల్లో చెల్లించేందుకు వెసులుబాటు ఉండటం కూడా ఒక కారణం. అయితే క్రెడిట్ కార్డులకు సంబంధించి రూల్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాయి. అందుకే రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్స్ వంటి ఆఫర్లు తరచుగా మారుతుంటాయి. దీని గురించి కస్టమర్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఈ మారుతున్న రూల్స్ తెలుసుకోలేకపోతే బెనిఫిట్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇంకా అదనంగా ఛార్జీలు కూడా భరించాల్సి వస్తుంది. ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు రెండు కూడా మ క్రెడిట్ కార్డులకు సంబంధించి టర్మ్స్ & కండీషన్స్ అప్‌డేట్ చేసినట్లు వెల్లడించాయి. ఈ కొత్త రూల్స్ 2024, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి.

HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన క్రెడిట్ కార్డు లాయల్టీ ప్రోగ్రామ్‌ను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులతో ప్రభావితమైన కస్టమర్లకు బ్యాంక్.. ఇ- మెయిల్ ద్వారా సమాచారం అందించింది. ముఖ్యంగా యుటిలిటీ ట్రాన్సాక్షన్స్‌పై (కరెంట్, వాటర్, డిష్, పేపర్, ఇంటర్నెట్ బిల్స్) సంపాదించే రివార్డ్ పాయింట్లపై పరిమితి విధించింది. నెలకు ఇప్పుడు 2 వేల వరకు మాత్రమే గరిష్టంగా పొందొచ్చు.

యుటిలిటీ ట్రాన్సాక్షన్స్ మాదిరిగానే.. కేబుల్ ట్రాన్సాక్షన్స్, టెలికాం ట్రాన్సాక్షన్లపై ఆర్జించే.. రివార్డ్ పాయింట్లను కూడా నెలకు 2 వేల పాయింట్లకు పరిమితం చేసింది. చెక్, క్రెడ్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే ఎడ్యుకేషనల్ పేమెంట్స్‌కు ఇక రివార్డ్ పాయింట్స్ రావు. స్కూల్ లేదా కాలేజ్ వెబ్‌సైట్స్ లేదా POS మెషీన్ల ద్వారా నేరుగా చేసే పేమెంట్స్‌కు మాత్రం రివార్డ్ పాయింట్స్ వస్తాయి.ఈజీ ఈఎంఐ, వాలెట్ లోడింగ్‌కు సంబంధించిన లావాదేవీలపై కస్టమర్లు రివార్డ్ పాయింట్లు పొందలేరు. ట్రాన్సాక్షన్స్ కేటగిరీల్ని నిర్ణయించే మర్చంట్ కేటగిరీ కోడ్‌ను పేమెంట్ నెట్‌వర్క్స్ సెట్ చేస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కాదు.ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు కూడా క్రెడిట్ కార్డు రూల్స్ మార్చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా మినిమం అమౌంట్ డ్యూ, పేమెంట్ డ్యూ డేట్స్‌లో మార్పులు చేసింది. సెప్టెంబర్ స్టేట్మెంట్ నుంచి మినిమం అమౌంట్ డ్యూ, ప్రిన్సిపల్ బ్యాలెన్స్‌లో 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గుతుంది. అయితే ఇక్కడ ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 19:30

వినాయకచవితి వేడుకలు… తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వినాయకచవితి సమీపిస్తుండటంతో నగరంలో వినాయక ప్రతిమలు విభిన్న రూపాల్లో అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. కొన్ని చోట్ల విగ్రహాల విక్రయాలూ జోరందుకున్నాయి. మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలని విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాలకు సంభందించి వివిధ శాఖలతో సమావేశం నిర్వహించామన్నారు. పోలీస్, ఫైర్, హెల్త్, జీహెచ్ఎంసీకి సంబందించిన సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.

ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవం ఎంతో ముఖ్యమైనదన్నారు. వివిధ ఉత్సవ కమిటీకి సంభంధించిన నిర్వాహకులు ఈ సమావేశం లో పాల్గొన్నారని తెలిపారు. వారు గతం లో ఎదురుకున్నా చిన్న చిన్న ఇబ్బందులను మా దృష్టికి తెచ్చారన్నారు. వాటిని పునరావృతం కాకుండా చూడాలని అధికారులను అదేశించామన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్, కరెంట్ ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు.

అందరినీ కలుపుకొని ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. అందరు కూడా సహకరించి ముందుకు వెళతామని వారు తెలియజేశారన్నారు. పొల్యూషన్ నీ దృష్టిలో పెట్టుకుని మట్టి విగ్రహాలు పెట్టేలా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు.

అందరికీ మట్టి విగ్రహాలు అందుబాటులో ఉండేలా చూడాలని అదేశించామన్నారు. మట్టి విగ్రహాల ఉపయోగంపై పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మట్టి విగ్రహాలు వినియోగించి సహకరించాలని ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 19:24

జొన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు.. ఏం జరుగుతోంది?

దాదాపు మూడేళ్ల కిందట మీడియాలో ప్రముఖంగా నిలిచింది జొన్వాడ ఫామ్ హౌస్. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు చెందినదిగా కథనాలు రావడమే దీనికి కారణం. అయితే, ఇదే సమయంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడ రేవంత్ రెడ్డి జొన్వాడ ఫాంహౌస్ పై డ్రోన్ ఎగురవేశారు. దీంతో ఆయన మీద కేసు నమోదు చేశారు. జైలుకు కూడా పంపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మరోవైపు రేవంత్ సీఎం అయ్యాక తీసుకొన్న పెద్ద నిర్ణయం హైడ్రా ఏర్పాటు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రిటెక్షన్ అథారిటీ (హైడ్రా)కి సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్ ను కమిషనర్ గా నియమించడం.. ఆ సంస్థ దూకుడుగా అక్రమణ నిర్మాణాలను కూల్చివేయడం అంతా పెద్ద సంచలనం అవుతోంది. ఈ క్రమంలో గత ఆదివారం హైడ్రా గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవల్ లో ఉన్న ప్రముఖుల నిర్మాణాలను పడగొట్టింది. ఇక తదుపరి వంతు జొన్వాడ ఫాంహౌజ్ అనే మాట వినిపించింది.

18వ తేదీన గండిపేట చెరువు ఎఫ్టీఎల్ లోని నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా బుల్డోజర్లు.. తదుపరి జొన్వాడ ఫాంహౌజ్ దిశగా కదులుతున్నాయన్న కథనాలతో ఆ ఫాంహౌజ్ యజమాని ప్రదీప్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా కూల్చే ప్రమాదం ఉందని ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. కూల్చకుండా స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం, హైడ్రా విధి విధానాలను ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని అడిగింది. విచారణ అనంతరం, పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. కూల్చివేత నిబంధనల ప్రకారమే ఉండాలని స్పష్టం చేసింది. జీవో 99 ప్రకారం ముందుకు సాగాలని హైడ్రాకు సూచించింది. కాగా, జొన్వాడ ఫాం హౌజ్ జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించినా 111 జీవో పరిధిలో ఉందనే ఆరోపణలున్నాయి.

జొన్వాడ్ ఫాంహౌజ్ తనది కాదని.. తన మిత్రుడు ప్రదీప్ రెడ్డి నుంచి లీజుకు తీసుకున్నట్లు కేటీఆర్ చెబుతున్నారు. తనకు ఫాం హౌజ్ లేదని స్పష్టం చేశారు. హైడ్రా ఎటువంటి చర్యలు తీసుకున్నా ఇబ్బంది లేదని చెప్పారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంటే కూల్చుకోమని పేర్కొన్నారు. కాగా,జొన్వాడ ఫాంహౌస్‌ వెనుకే సర్వే నెంబర్ 301లో కేటీఆర్ భార్య శైలిమ భూమి కొని పండ్ల తోట వేశారనే ఆరోపణలున్నాయి. ఆ భూమిలోకి ఈ ఫాంహౌస్‌ గేటులో నుంచే వెళ్లాలని... ఫాంహౌస్ నుంచి మరోవైపున ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కు కనెక్ట్ అయ్యేలా మరో రోడ్డు కూడా వేశారని చెబుతారు. అన్నిటికిమించి సర్వే నం.311లో జొన్వాడ ఫాంహౌజ్ ఉంది. రేవంత్ రెడ్డి గతంలో దీనిపై ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు కూడా. ఎన్జీటీ ఓ కమిటీని వేయగా.. అది రంగంలోకి దిగకుండానే హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్‌. ఆ ఫాంహౌజ్ తనది అంటూ ప్రదీప్‌ రెడ్డి కూడా హైకోర్టులో పిల్ వేశారు. అదంతా వదిలేస్తే కేటీఆర్ ఫాంహౌజ్ ను లీజుకు తీసుకోవడం ఏమిటనే ప్రశ్నలు కూడా వచ్చాయి.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని జొన్వాడ ఫాంహౌజ్ కు మంగళవారం సాగునీటి శాఖ అధికారులు చేరుకున్నారు. కొలతలు వేశారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో జొన్వాడ ఫాంహౌజ్ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఏం జరగబోతున్నది అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సినీ హీరో నాగార్జన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసినట్లు ఏ తెల్లవారుజామున హైడ్రా బుల్డోజర్లు జొన్వాడ ఫామ్ హౌజ్ మీదకు వెళ్తే అది పెద్ద సంచలనమే అవుతుంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 19:23

తెలుగు ప్రజలకు ఎయిరిండియా గుడ్‌న్యూస్.. ఇక మాతృభాషలో కస్టమర్ సపోర్ట్!

దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇకపై తెలుగులోనూ కస్టమర్ కేర్ సర్వీసులు అందించనున్నట్లు తెలిపింది. కొత్త 7 ప్రాంతీయ భాషలను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్‌కి చెందిన ఎయిరిండియా తమ ప్రయాణికులకు మెరుగైన సేవలు ఉందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు తమ కస్టమర్ కేర్ సర్వీసులను ప్రాంతీయ భాషలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కస్టమర్ సర్వీసులు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు 7 ప్రాంతీయ భాషల్లో కస్టమర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది ఎయిరిండియా.

7 ప్రాంతీయ భాషల్లో తెలుగుతో పాటు తమిళం, పంజాబీ, కన్నడ, బెంగాళీ, మరాఠీ, మలయాళం ఉన్నాయి. ఈ ప్రాంతీయ భాషల్లోనూ ఇక కస్టమర్ కేర్ సర్వీసులు అందించనుంది ఎయిరిండియా. ఈ ప్రత్యేక అసిస్టెంట్ సర్వీసులు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అలాగే కొత్తగా 5 కాంటాక్ట్ సెంటర్లనూ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తరుచుగా ఎయిరిండియాలో ప్రయాణించే వారితో పాటు ప్రీమియం కస్టమర్లకు ఈ సేవలు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్ ఐవీఆర్ వ్యవస్థ ద్వారా మా కస్టమర్లకు మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా వారి స్థానిక భాష ప్రాధాన్యతను ఆటోమేటిక్‌గా గుర్తించనున్నాం. దీంతో వారు ప్రత్యేకంగా భాషను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. తమ మాతృభాషలోనే అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇది మా విలువైన కస్టమర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.' అని ఎయిరిండియా ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 15:29

కోల్కతా వీధుల్లో మళ్లీ ఉద్రిక్తత- ‘నబన్నా మార్చ్’ పై దీదీ నిఘా!

ఆర్జీ మెడికల్ కాలేజ్లో కోల్కతా వైద్యురాలి హత్యపై నిరసనగా పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన 'నబన్నా అభియాన్'లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోల్కతాలోని సెక్రటేరియట్ (నబన్నా)కు మార్చ్ చేపట్టిన నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. రోడ్డు మీద ఉన్న వారిని చెల్లాచెదురు చేసేందుకు జల ఫిరంగులు ఉపయోగించారు.

నబన్నా మార్చ్కి అనుమతులు ఇవ్వబోమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే తేల్చిచెప్పింది. ర్యాలీలో హింసకు పాల్పడేందుకు పలువురు కుట్ర పన్నుతున్నట్టు ఆరోపించింది. అయినప్పటికీ నిరసనకారులు ముందుకు కదిలితే, వారిని ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసింది. నిరసనకారులు సెక్రటేరియట్కు చేరుకోకుండా చూసేందుకు 6వేలకుపైగా మంది పోలీసులను మోహరించింది. ర్యాలీపై డ్రోన్ నిఘా పెట్టింది. అంతేకాకుండా నిరసనకారులను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసింది.

కానీ మంగళవారం మధ్యాహ్నం నిరసనకారులు నబన్నా మార్చ్ని ప్రారంభించారు. కోల్కతా వైద్యురాలి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, నిరసనకారులు బ్యారికేడ్లను తోసుకుని ముందుకు కదిలారు. వారిపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. వారిని తరిమికొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

మరోవైపు జలఫిరంగులు ఉపయోగించినప్పటికీ, పలువురు నిరసనకారులు వెనుదిరగడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోల్కతా వైద్యురాలి హత్యకు న్యాయం జరగాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలుపుతున్నారు.

కోల్కతా పోలీసు పరిధిలో కనీసం 25 మంది డీసీపీ స్థాయి అధికారులు భద్రతను నిర్వహించడం, నలుగురు ఐజీలు, పలువురు డీఐజీలు, ఎస్పీ స్థాయి అధికారులు హౌరాలో భద్రతా దళాలకు నాయకత్వం వహించడంతో నేటి ర్యాలీని మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత తీవ్రంగా పరిగణించిందో అర్థం చేసుకోవచ్చు. 'నబన్నా అభిజన్' ర్యాలీ సచివాలయం వద్దకు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థి సంస్థ 'పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్', అసమ్మతి గ్రూపు 'సంగ్రామి జౌతా మంచా' ప్లాన్ చేసిన ర్యాలీని మమతా బెనర్జీ ప్రభుత్వం ఇప్పటికే "చట్టవిరుద్ధం, అనధికారికమైనది" అని ప్రకటించింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 15:13

కోల్‌కతా ఘటన మరవకముందే.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం

Maharashtra | రత్నగిరి (Ratnagiri) జిల్లాలో ఓ నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ (Auto Driver) అత్యాచారానికి పాల్పడ్డాడు.

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన (sexually assaulted) తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా వైద్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కోల్‌కతా ఘటన మరవకముందే.. తాజాగా మహారాష్ట్ర (Maharashtra)లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రత్నగిరి (Ratnagiri) జిల్లాలో ఓ నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ (Auto Driver) అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల నర్సింగ్‌ ట్రైనీ విద్యార్థిని కళాశాలను ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. దారి మధ్యలో విద్యార్థినితో డ్రైవర్‌ మాటలు కలిపాడు. తాగేందుకు మంచినీరు అందించాడు. అయితే అప్పటికే ఆ నీటిలో మత్తుమందు కలిపి ఉండటంతో.. అవి తాగిన విద్యార్థిని స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత డ్రైవర్‌ నిర్మానుష్య ప్రదేశానికి యువతిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని గ్రహించింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బాధిత విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కేసులో సత్వర చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తూ గంటల తరబడి రహదారిని దిగ్బంధించారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 15:09

శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ.

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఆదివారం నాడు 84,060 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 34,985 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.01 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీకి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. కిటకిటలాడాయి. ట్రావెలర్స్ బంగళా సర్కిల్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.

4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. రోజూ లక్షమంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తోన్నారు. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలపై ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు.

శ్రీవారి ఆలయం, ఇంజినీరింగ్ పనులు, రెవెన్యూ, పంచాయతీ, రిసెప్షన్, పారిశుధ్యం, అన్నప్రసాదం విభాగాల అధిపతులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రద్దీని నివారించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

భక్తులకు అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా, స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ముందస్తుగా చాలినన్ని లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసి ఉంచాలని చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 27 2024, 15:02

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ ఆర్డర్‌లోని కీలక అంశాలు ఏంటంటే...!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై దాదాపు గంటన్నర పాటు వాదనల అనంత‌రం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల‌తో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. 

ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసినందున‌ నిందితురాలు కారాగారంలో ఉండాల్సిన అవసరం లేదని ఈ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం పేర్కొంది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్‌ ఇచ్చింది. బెయిల్‌ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. 

అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదని కోర్టు ఆదేశించింది. సెక్షన్‌ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్‌ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ సంద‌ర్భంగా గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. దీంతో దాదాపు ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత బయటకు రానున్నారు. ఇక క‌విత‌కు బెయిల్ ల‌భించ‌డంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి.  

కవిత బెయిల్‌ ఆర్డర్‌లోని కీలక అంశాలివే..!

పాస్‌పోర్టును మేజిస్ట్రేట్‌కు సరెండర్‌ చేయాలి 

కేసు ట్రయల్‌కు సహకరించాలి

విదేశాలకు వెళ్లాలంటే త‌ప్ప‌నిస‌రిగా కోర్టు అనుమతి తీసుకోవాలి

విచారణ వాయిదాల సమయంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలి