/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz హత్యాచార ఘటనపై వైద్యుల నిరసన.. దేశ వ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 17 2024, 13:50

హత్యాచార ఘటనపై వైద్యుల నిరసన.. దేశ వ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు

Doctors strike | కోల్‌కతా (Kolkata)లోని ఆర్‌జీ కార్‌ దవాఖానలో (R G Kar Medical College) ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య (rape - murder) ఘటనను నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు.

కోల్‌కతా (Kolkata)లోని ఆర్‌జీ కార్‌ దవాఖానలో (R G Kar Medical College) ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య (rape – murder) ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఘటనను నిరసిస్తూ గత ఎనిమిది రోజులుగా వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళన (Doctors strike ) చేపడుతున్నారు. విధులను బహిష్కరించి బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనను నిరసిస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (Indian Medical Association) పిలుపు మేరకు ఇవాళ 24 గంటల పాటు వైద్యులు సమ్మెకు దిగారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 17 2024, 13:45

సాహసమే ఊపిరిగా..

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) 19వ గేటుకు స్టాప్‌లాగ్‌ బిగించేందుకు ఇంజనీయర్లు, కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా సాహసం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్టాప్‌లాగ్‌ బిగించేందుకు అనేక అడ్డంకులు ఎదురయినా ఫస్ట్‌ ఎలిమెంట్‌ను స్పిల్‌వే మీదకు భద్రంగా చేర్చారు.

తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) 19వ గేటుకు స్టాప్‌లాగ్‌ బిగించేందుకు ఇంజనీయర్లు, కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా సాహసం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్టాప్‌లాగ్‌ బిగించేందుకు అనేక అడ్డంకులు ఎదురయినా ఫస్ట్‌ ఎలిమెంట్‌ను స్పిల్‌వే మీదకు భద్రంగా చేర్చారు. ఓ పక్క డ్యాం గేట్లద్వారా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తగా తయారు చేసిన స్టాప్‌లాగ్‌(Stoplog) బిగించేందుకు గోడకు ఉండే ఒక లాక్‌ అడ్డు వచ్చింది. దాన్ని తొలగిస్తే గేట్లు గోడలు దెబ్బతినిపోతాయి. ఇందుకు ఇంజనీయర్లు కొత్త ఆలోచన చేశారు.

స్టాప్‌లాగ్‌ను పైనుండి గేటు గాడిలో అమర్చాలని నిర్ణయించుకున్నారు. గేటుకు ఉండే కౌంటర్‌ వెయిట్‌ను కిందకు దించేశారు. పైన ఉండే హోస్టుప్లాట్‌ఫారం తొలగించారు. ఈరెండు తొలగించేందుకు రాత్రి వరకూ సమయం పట్టింది. ఇక రాత్రి స్టాప్‌లాగ్‌ను దించేందుకు పనులను ప్రారంబించారు. ఒక వైపు తేలిక పాటి జల్లులు కురుస్తున్నాయి. అయినా ఇంజనీయర్లు(Engineers) ఏమాత్రం పట్టు సడలించుకోకుండా పనులు చేశారు.

హోస్టుప్లాట్‌ ఫారం బరువు 32 టన్నులు ఉండగా, కౌంటర్‌ వెయిట్‌ గేటు తూకం 40 టన్నులు ఉంది. ఈ రెండూ కిందకు దించేశారు. నూతనంగా తయారు చేసిన స్టాప్‌లాగ్‌ ఒక్కక్కటి 12 నుండి 13 టన్నులు బరువు ఉంటుంది. శుక్రవారం రాత్రి ఎంత సమయం అయినా స్టాప్‌లాక్‌ బిగించాలనే పట్టుదలతో ఇంజనీయర్లు కృషిచేశారు. ఎట్టకేలకు రాత్రి పదిగంటలకు విజయం సాధించారు. ఫస్ట్‌ ఎలిమెంట్‌ను దాని స్థానంలోకి చేర్చారు.

ఇంకా నాలుగు భాగాలను గేట్‌ స్థానంలో బిగించాల్సి ఉంది. ఆ దిశగా పనులు సాగుతున్నాయి. సీడబ్ల్యుసీ అధికారులు, ఏపీ, కర్ణాటక మంత్రులు, ముఖ్యమంత్రులు జరుగుతున్న పనుల గురించి ఆరాతీస్తున్నారు. పనులు చేసే సమయంలో ఊహించని ప్రమాదం సంభవిస్తే చికిత్స చేయడం కోసం వైద్యులు, అంబులెన్సులను అక్కడే మొహరించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 16 2024, 12:22

ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన అలీఖాన్‌, కోదండరామ్

తెలంగాణలో కొత్తగా శాసనమండలి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో యథాతథ స్థితి స్టేటస్కో కొనసాగించా లని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే 2023 సెప్టెంబర్ 19న అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాటిని తిరస్కరించారు. 

అప్పటి గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల పరంగా ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు గవర్నర్ చేసిన ప్రకటనను వారు సవాలు చేశారు. 

దీంతో ప్రొఫెసర్ కోదండ రామ్, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారా నికి బ్రేక్ పడటంతో ఈరోజు ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలుగా అలీఖాన్‌, కోదండరామ్‌ ప్రమాణస్వీకారం చేశారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 14 2024, 15:35

గురుకుల విద్యార్థిని'కి అండగా.. సీఎం రేవంత్ రెడ్డి

గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన కొయ్యాడ కార్తీక అనే విద్యార్థినికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు.

గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన కొయ్యాడ కార్తీక అనే విద్యార్థినికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. కాగా ములుగు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న కార్తీక, ఆగస్టు 9 న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి పడిపోయింది. దాంతో విద్యార్థిని నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత వెంటనే గురుకుల సిబ్బంది కార్తీకను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ కు తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం(ఆగస్టు 13) నాడు కార్తీక కు ఆపరేషన్ నిర్వహించింది. ప్రస్తుతం ఐసీయూలో కార్తీక కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. అయితే కార్తీకకు కావాల్సిన వైద్యం ఖర్చులను ప్రభుత్వమే భరించనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. సీఎంవో ఓఎస్డీ శ్రీనివాసులు నిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడి కార్తీక కోలుకునేంతవరకు వైద్యం అందించాలని చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 14 2024, 15:33

కంటోన్మెంట్‌లో కొత్త నిబంధనలు !

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో భూగర్భజలాల పరిరక్షణ, సద్వినియోగంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోనున్నది. ఈ మేరకు రూపొందించిన నిబంధనలను ఆమోదిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఎస్‌ఆర్‌ఓ 126(ఈ) పేరిట గెజిట్‌ విడుదల చేసింది.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో భూగర్భజలాల పరిరక్షణ, సద్వినియోగంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోనున్నది. ఈ మేరకు రూపొందించిన నిబంధనలను ఆమోదిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఎస్‌ఆర్‌ఓ 126(ఈ) పేరిట గెజిట్‌ విడుదల చేసింది. ఫలితంగా కంటోన్మెంట్‌లో భూగర్భ జలాల వినియోగంపై రెగ్యులర్‌గా ఆడిట్‌ చేయనున్నారు. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని బోర్‌వెల్స్‌కు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు (డిగ్గింగ్‌ అండ్‌ యూజ్‌ ఆఫ్‌ బోర్‌వెల్స్‌ రెగ్యులేషన్స్‌ 2024) నిబంధనలు రూపొందించారు.

దీనిపై అభ్యంతరాలను తెలపాల్సిందిగా గత ఫిబ్రవరి 23న కంటోన్మెంట్‌ బోర్డు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి 5వ తేదీ వరకు అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని నూతన నిబంధనలను రూపొందించింది. తాజాగా వీటిని ఆమోదిస్తూ కేంద్రప్రభుత్వం సోమవారం గెజిట్‌ విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం కంటోన్మెంట్‌ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న బోర్‌వెల్స్‌పై సమగ్ర సర్వే చేయనున్నారు. వినియోగంలో ఉన్న బోర్‌వెల్స్‌ సంఖ్య, వాటిని ఎప్పుడు వేశారు, ఎంత లోతులో వేశారు.. తదితర సమాచారాన్ని సేకరిస్తారు.

భూగర్భ జలాల లభ్యతపై కేంద్ర జలశక్తి, రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సర్వే చేస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి సరఫరా, నీటి లభ్యతపై కూడా సమగ్ర అధ్యయనం చేస్తారు. గృహ అవసరాలకు, ఆర్మీ, పోలీసు, వ్యవసాయ, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు వినియోగించే బోర్‌వెల్స్‌(Borewells)ను క్రమబద్ధీకరణ నుంచి మినహాయిస్తారు. మిగతా బోర్‌వెల్స్‌ను నెల రోజుల వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవలసి ఉంటుంది. నూతనంగా వేసే బోర్‌వెల్స్‌ను కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. వాణిజ్య అవసరాలకు, పరిశ్రమలకు రోజుకు 50 లీటర్ల కంటే ఎక్కువ నీటిని తోడితే ప్రతి కిలోలీటర్‌కూ 10 రూపాయల చొప్పున చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది

కాలనీల్లో బోర్‌వెల్స్‌ వేయాలంటే మూడు వేల రూపాయలు, బస్తీల్లో వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. భూగర్భజలాలను కంటోన్మెంట్‌ బోర్డు అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటారు. బోర్‌వెల్స్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. కాగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)లో బోర్‌వెల్స్‌ నియంత్రణ, క్రమబద్ధీకరణకు ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 21:28

గ్రేటర్‌లో కొనసాగుతున్న ఆపరేషన్ ‘హైడ్రా’

గ్రేటర్‌లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. మంగళవారం నాడు జీహెచ్ఎంసీలో చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు.

గ్రేటర్‌లో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతోంది. మంగళవారం నాడు జీహెచ్ఎంసీలో చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉప్పల్ నల్లచెరువులో కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. చెరువు పర్యవేక్షణకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు

ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి సోమవారం కమిషనర్ రంగనాథ్‌ను కలసి ఉప్పల్ నల్ల చెరువులో జరుగుతున్న కబ్జాల గురించి వివరించిన విషయం తెలిసిందే. దీంతో రంగనాథ్ మంగళవారం ఉప్పల్లోని ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న, పరమేశ్వర్ రెడ్డి వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి నల్లచెరువును పరిశీలించారు. నల్ల చెరువులో కబ్జాలను, ఆక్రమణలు పూర్తిగా తొలగించడంతో పాటు చెరువు పరిరక్షణ కోసం హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. చెరువులను, నాలాలను, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కబ్జాలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.

మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్‌ హుడా లేఔట్‌ ఘటన నేఫథ్యంలో మంగళవారం నాడు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టుందన్నారు. అందుకే తనపై కేసు పెట్టారని దానం తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు.. కానీ తాను మాత్రం లోకల్ అని పేర్కొన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఔట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.

అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. హైడ్రా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందగిరి హిల్స్ గురుబ్రహ్మ నగర్‌లో పేదల గుడిసెలు కూల్చివేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. పార్క్ స్థలం అని చెప్పి ఈవీడీఎం వాళ్లు పెద్ద ప్రహరీ గోడ కడుతున్నారని.. బస్తీ వాసులకు దారి లేకుండా ప్రహరీ గోడ ఎలా కడతారు? అని ప్రశ్నించారు. గోడ కట్టొద్దన్నందుకే ఈవీడీఎం అధికారులు తనపై కేసు పెట్టారని దానం తెలిపారు. హైదరాబాద్‌ను హైడ్రా అధికారులకేమీ రాసివ్వలేదని.. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తనపై 190 కేసులు ఉన్నాయని.. కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 21:22

రూ. 1015కే విమాన ప్రయాణం.. మరో 15 శాతం డిస్కౌంట్.. ఇండిగో బంపరాఫర్.. గొప్ప ఛాన్స్!

జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే సగటు మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తులో రేట్లు ఉంటాయని వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసమే.. ప్రముఖ దేశీయ ఎయిర్‌లైన్స్ ఇండిగో బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. రూ. 1015 కనీస ధరతోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ వివరాలు చూద్దాం.

మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేశారా? రేట్లు ఎక్కువగా ఉన్నాయని వెనుకడుగు వేస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. దిగ్గజ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా విమానం ఎక్కాలని ఉండి.. రేట్లు ఎక్కువగా ఉన్నాయని విరమించుకునే లాంటి వారి కోసం కొన్ని ప్రత్యేక రోజుల్లో విమానయాన సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇప్పుడు ఇలానే ఇండిపెండెన్స్ డే (స్వాతంత్ర్య దినోత్సవం) పురస్కరించుకొని.. ఇండిగో ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. ఇది 2024, ఆగస్ట్ 13 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటుందని ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ X లో పోస్ట్ చేసింది. ఇక ఈ ఆఫర్లో ఫ్లైట్ టికెట్లు కనీసం రూ. 1015 నుంచే ప్రారంభం అవుతాయని.. ఇంకా ఎంపిక చేసిన 6E యాడ్- ఆన్స్‌పై 15 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ప్రకటించింది.

ఈ సేల్ వివరాల్ని ఇప్పుడు చూద్దాం. ఇందులో భాగంగా రూ. 1015 తో ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ ప్రారంభం అవుతుండగా.. యాడ్ ఆన్స్ అంటే సీట్ ప్రిఫరెన్స్, అధిక బ్యాగేజీ వంటివి బుక్ చేసుకుంటే మరో 15 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఇండిగో వెబ్, యాప్ బుకింగ్స్‌పై ఆఫర్ అమలవుతుంది. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్.. ఈ ఫ్రీడమ్ సేల్‌కు సంబంధించిన టర్మ్స్ అండ్ కండీషన్స్ విడుదల చేసింది.

ఆగస్ట్ 13- 15 నుంచి వరకు సేల్ అందుబాటులో ఉండగా.. 2024, ఆగస్ట్ 22 నుంచి 2025, మార్చి 31 వరకు విమాన ప్రయాణాల కోసం డిస్కౌంట్లోనే టికెట్స్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. రూ. 1015 అనేది వన్- వే దేశీయ ప్రయాణాల కోసం. ఇక ఇంటర్నేషనల్ రూట్లలో కనీస ఫ్లైట్ టికెట్ ధర రూ. 3715 తో ప్రారంభం అవుతుంది.

ఇక విమానం బయల్దేరే వారం రోజుల ముందు నుంచి మాత్రమే ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆగస్ట్ 22 కంటే ముందు ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో ఉండవు. ఈ ధరలకు అదనంగా ఇతర టాక్సులు, ఛార్జీలు వంటివి ఉండొచ్చు. వన్- వే, రౌండ్ ట్రిప్ బుకింగ్స్‌కు మాత్రమే డిస్కౌంట్ వస్తుంది. మల్టీ సిటీ బుకింగ్స్‌కు ఇది లేదు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 19:37

ఎల్లుండి కీలక ఘట్టం.. మూడో దశ రుణమాఫీపై ప్రభుత్వం ప్రకటన

రూ. 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీపై ప్రభుత్వ కీలక ప్రకటన చేసింది.

రాష్ట్ర రైతాంగాన్ని రుణ విముక్తులను చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట ప్రకారం రుణమాఫీ ప్రక్రియను కొనసాగిస్తున్నది. ఇప్పటికే రూ. లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం.. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు పంద్రాగస్టున మూడో విడత రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నట్లు సీఎంవో మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. విదేశీ పర్యటన నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలంలో పర్యటించబోతున్నారని ఆ సందర్భంగానే మూడో విడత రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తారని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఆగస్ట్ 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు నెల రోజుల ముందే ఈ పథకాన్ని అమలు చేసి చూపించారని తెలిపింది.

32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జులై 15వ తేదీన రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం.. మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టిందని, జులై 18వ తేదీన మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమున్న 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేసిందని తెలిపింది. ఆ తర్వాత జులై 30వ తేదీన అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసిందని ఇందులో ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6190.01 కోట్లు జమ చేసిందని వెల్లడించింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొంది.

మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ కోసం లబ్ధిదారులైన రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయబోతున్నట్లు పేర్కొంది. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుందని సీఎంవో తెలిపింది. ఇక రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాల్లో ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించిందని పేర్కొంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 19:35

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేసిన ఏపీ సర్కారు

తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం మంగళవారం రిలీవ్‌ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది.

మొత్తం 122 మంది తెలంగాణా స్థానికత కలిగిన నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

తెలంగాణా ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను రిలీవ్ చేసే ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్‌లోని చివరి ర్యాంక్‌లో మాత్రమే చేరుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 13 2024, 13:47

చంద్రబాబు సంచలన నిర్ణయం.. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఈ ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టం కాదని, అయినప్పటికీ హుందా రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.చంద్రబాబు నిర్ణయంపై కూటమి నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని కొనియాడారు. కాగా, ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. 

కాగా, ఈ ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్టణం, యలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 60 శాతానికిపైగా వైసీపీ నుంచి గెలిచినవారే.

అభ్యర్థిని పోటీకి నిలిపితే గెలిపిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు ముందుకొచ్చినప్పటికీ అంత ప్రయాస అవసరం లేదని చంద్రబాబు భావించారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదని చంద్రబాబు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇదిలావుంచితే, ఈ స్థానం నుంచి వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.