/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు Yadagiri Goud
అయోధ్య లో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ రామ నవమి వేడుకలు

శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మ భూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది.

ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తొలి శ్రీరామన వమి కావడంతో అధికారు లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు 40 లక్షల మంది వేడుకలకు హజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీరామ మందిర్ ఆలయ ట్రస్టు ఏడు వరుస ల్లో భక్తులను దర్శనానికి అనుమంతించాలని నిర్ణయించింది.

శ్రీరామనవమి వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నయా ఘాట్ జోన్, నాగేశ్వర నాథ్ జోన్, హనుమాన్ గర్హి టెంపుల్ జోన్, కనక్ భవన్ టెంపుల్ జోన్ సహా ఇతర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పా ట్లు చేపడుతున్నారు.

భక్తులక సౌకర్యార్ధం 24 గంటల పాటు పని చేసే విధంగా కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో అధికారులను నియమించనున్నారు. రామజన్మభూమి మార్గంలో అదనంగా 80 సీసీ కెమెరా లు,. 50 చోట్ల వాటర్ కూలర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు.

నేడు సంగారెడ్డి జిల్లా లో కెసిఆర్ భారీ బహిరంగ సభ

ఇవాళ సంగారెడ్డి జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్య టించనున్నారు. సుల్తాన్‌ పూర్‌లోని బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

ఈ సభలో కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ అభ్యర్థులను గెలిపిం చాలని కోరనున్నారు.

దీంతో సుల్తాన్‌పూర్‌ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేసింది.

మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని అందోల్‌, నారాయణఖేడ్‌, జహీరా బాద్‌ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరు కానున్నారు.

యువత, రైతులు, మహి ళలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేపట్టింది...

నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచా రాన్ని పార్టీలు వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఈరోజు ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు..

ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహంపై కార్య కర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్‌ బహిరంగసభలో కేటీఆర్‌ పాల్గొననున్నారు.

Streetbuzz News

SB NEWS

చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వర్షం కురిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్

పరుగుల సునామీ పారిన ఉత్కంఠ పోరులో సన్‌రైజ ర్స్,హైదరాబాద్ విజయం సాధించింది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 25 పరగుల తేడాతో గెలుపొందింది.

సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియం జరి గిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 288 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.

ట్రావిస్ హెడ్ 102 (41 బంతుల్లో 9×4, 8×6) సెంచరీతో విజృంభించగా అతనికి తోడు హెన్రీచ్ క్లాసెన్ 67 -31 బంతుల్లో 2×4, 7×6-,ఎయిడెన్ మార్క్మ్ 32,17 బంతుల్లో 2×4, 2×6,అబ్దుల్ సమద్ 37 (10 బంతుల్లో 4×4, 3×6, మెరుపులు మెరిపిం చడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ దిగిన బెంగళూరు ధీటైన జవాబు నే ఇచ్చింది. విరాట్ కోహ్లీ (42), డూప్లెసిస్(62)లు శుభారంభాన్ని అందించినా మిగతా బ్యాటర్లు రాణించ కపోయారు. మిడిలార్డర్‌లో వచ్చిన దినేశ్ కార్తీక్(83) కాసేపు మెరినా ఫలితం దక్కిలేదు.

దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి 262 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ మరో ఆల్‌టైమ్ రికార్డ్‌ను నమోదు చేసింది. టి20 క్రికెట్ చరిత్ర లోనే అత్యంత భారీ స్కోర్ రికార్డ్ తన పేరిటే ఉండగా దానిని బద్దలు కొట్టింది...

ఎన్నికల్లో ధన వర్షం రోజుకు రూ.100కోట్లు సీజ్!

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అన్ని చర్యలు తీసుకుంటోంది..

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి నిత్యం సగటున రూ.100 కోట్ల విలువైన నగదు ఇతర తాయిలాలను అధికారులు సీజ్‌ చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న తనిఖీల్లో ఇప్పటి వరకు మొత్తంగా రూ.4650 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది..

2019తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని తెలిపింది. అంతేకాకుండా లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో ఎన్నడూ తాయిలాలను సీజ్‌ చేయలేదని పేర్కొంది. ఎన్నికల్లో ధనప్రవాహం, ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తనిఖీలు ముమ్మరం చేస్తామని చెప్పింది.

దేశవ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, నిఘా బృందాలతో సహా సరిహద్దు చెక్‌పోస్టులు నిరంతరం పనిచేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. మాదకద్రవ్యాల రవాణాతోపాటు నగదు, మద్యం, తాయిలాల పంపిణీని అడ్డుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.

ఇదిలాఉంటే, ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న లెక్కింపు ఉంటుంది..

సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..

ఏప్రిల్‌ 29 తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్‌ ఛాలెంజ్‌ పిటిషన్‌పై విచారిస్తామన్న కోర్టు..

కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీకి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు..

ఏప్రిల్ 24 వరకు ఈడీ రిప్లై దాఖలు చేయాలని ఆదేశాలు..

తదుపరి విచారణ ఏప్రిల్ 29కి వాయిదా.

Streetbuzz News

మహాలక్ష్మి మహిళలకు 500లకు గ్యాస్..అకౌంట్లో డబ్బులు

తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకంపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది.

18.86 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించు కున్నారని.. ఏప్రిల్ 13 నాటికి కొందరు రెండో రాయితీ సిలిండర్ కూడా పొందారని తెలిపింది.

మొత్తంగా 21.29 లక్షల మందికి రూ.59.97 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలి పింది. కాగా రాష్ట్ర వ్యాప్తం గా 39.33 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు రూ.500కు సిలిండర్ పథకానికి అర్హులుగా గుర్తించారు...

Streetbuzz News

SB NEWS

బైజూస్‌ ఇండియా సీఈఓ రాజీనామా?

ఆర్థిక కష్టాలతో సతమ తమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌లో సంక్షోభం మరింత ముది రినట్లు కనిపిస్తోంది. సంస్థ భారతీయ విభాగం సీఈఓ అర్జున్‌ మోహన్‌ సోమవారం రాజీనామా చేశారు.

దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలను వ్యవ స్థాపకుడు బైజూ రవీంద్రన్‌ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ తెలిపింది.

రవీంద్రన్‌కు అత్యంత నమ్మకస్థుడిగా అర్జున్‌ మోహన్‌కు సంస్థలో పేరుంది. రవీంద్రన్‌ క్యాట్‌ కోచింగ్‌ ఇస్తున్న తొలినాళ్లలో అర్జున్‌ ఆయనకు స్టూడెం ట్‌. ఆయన సీఈఓ బాధ్యత లు చేపట్టి ఆరు నెలలే అవు తోంది.

సంస్థ పునర్‌వ్యవస్థీకరణ కీలక దశలో ఉన్న తరు ణంలో రాజీనామా చేయడం గమనార్హం. కానీ, సంస్థకు సలహాదారుడిగా మాత్రం ఆయన కొనసాగనున్నట్లు సమాచారం....

Streetbuzz News

ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్

కొన్నిసార్లు ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధం, కొన్నిసార్లు ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం మరియు ఇప్పుడు ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత తరువాత, ప్రపంచం మొత్తం యుద్ధ భయంతో భయపడుతోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు మరియు డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై భారీ దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. రాబోయే 24-48 గంటల్లో ఎప్పుడైనా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయవచ్చని నమ్ముతారు. కాగా, యుద్ధం మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్ ప్రముఖ నేత ఖమేనీ అమెరికాకు సవాలు విసిరారు. అటువంటి పరిస్థితిలో, ఇజ్రాయెల్ దాడి చేస్తే, విధ్వంసక ప్రతీకారం నుండి ఇరాన్ వెనక్కి తగ్గదని స్పష్టమైంది. అటువంటి పరిస్థితిలో, యుద్ధం మరొక వైపు ప్రారంభమవుతుంది.

శనివారం, ఇరాన్ 300 కంటే ఎక్కువ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు మరియు డ్రోన్‌లతో ఇజ్రాయెల్‌పై పెద్ద దాడిని ప్రారంభించిందని మీకు తెలియజేద్దాం. అయితే, వీటిలో 99 శాతం వాయు రక్షణ వ్యవస్థ సహాయంతో ఇజ్రాయెల్ గాలిలో కాల్చివేసింది. ఇరాన్ దాడిని ఆపడంలో ఇజ్రాయెల్‌కు పొరుగున ఉన్న ముస్లిం దేశం జోర్డాన్‌తో పాటు అమెరికా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్ కూడా సాయపడ్డాయి. ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఉంది. ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ తదుపరి దశ ఏమిటో ఇజ్రాయెల్ యొక్క ప్రముఖ రాజకీయ నాయకులు ఆదివారం చర్చిస్తూనే ఉన్నారు.

ఇజ్రాయెల్ ఎప్పుడు మరియు ఎలా దాడి చేస్తుంది?

ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడిని భగ్నం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ ఆదివారం సమావేశమైంది. ఈ సమావేశంలో పీఎం నెతన్యాహు, రక్షణ మంత్రి గాలంట్, కేబినెట్ మంత్రి బెన్నీ గంజ్ ఇరాన్‌కు తగిన సమాధానం ఇస్తారని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ సభ్యుడు మరియు పోర్ట్‌ఫోలియో లేని మంత్రి బెన్నీ గాంట్జ్ ప్రచారం ఇంకా ముగియలేదని జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వెంటనే స్పందించదని వీడియో ప్రకటనలో పేర్కొంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రాంతీయ కూటమిని ఏర్పాటు చేస్తామని, సరైన సమయంలో ఈ దాడికి మూల్యం చెల్లించుకుంటామని గాంట్జ్ చెప్పారు. దాడిని విఫలమవ్వడాన్ని ఇజ్రాయెల్ తన జాతీయ భద్రత కోసం సద్వినియోగం చేసుకోవాల్సిన వ్యూహాత్మక విజయంగా గాంట్జ్ అభివర్ణించారు.

వార్ క్యాబినెట్ దాడి మరియు రక్షణ కోసం దాని ప్రణాళికను ఖరారు చేసిందని మీకు తెలియజేద్దాం. అయితే, ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో స్పష్టంగా తెలియదా? అతను నేరుగా దాడి చేస్తాడా లేదా మరేదైనా ఉపాయాన్ని అనుసరిస్తాడా? మరోవైపు ఇజ్రాయెల్ ప్రతీకార దాడిపై ఇరాన్ అప్రమత్తమైంది.

అమెరికా హెచ్చరించింది

అమెరికా నిరాకరించినప్పటికీ, ఇరాన్ దాడికి ప్రతిస్పందించాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుందని మీకు తెలియజేద్దాం. నిజానికి ఇరాన్ దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు. ఈ సమయంలో, బిడెన్ ఇజ్రాయెల్‌కు ఇరాన్‌పై తదుపరి చర్యకు మద్దతు ఇవ్వబోమని హెచ్చరించాడు. అధ్యక్షుడు బిడెన్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుకు స్పష్టమైన సందేశాన్ని పంపారు. ఇరాన్ దాడి విఫలమైంది. ఇజ్రాయెల్ గెలిచింది. అందువల్ల, ఇరాన్ గడ్డపై నేరుగా సైనిక దాడి చేయడం ద్వారా దీనిని మరింత తీవ్రతరం చేయవలసిన అవసరం లేదు.

మధ్యప్రాచ్యంలో యుద్ధ ధ్వని

ఇజ్రాయెల్ ముందు ఉన్న ఇబ్బంది ఏమిటంటే, ఒక వైపు దాని అతిపెద్ద మిత్రదేశమైన అమెరికా శాంతి కోసం విజ్ఞప్తి చేస్తోంది, మరోవైపు ఇరాన్‌పై గట్టిగా దాడి చేయాలని పట్టుబట్టే ఇజ్రాయెల్ భద్రతా స్థాపనలో చాలా మంది కరడుగట్టినవారు ఉన్నారు. నెతన్యాహు సంకీర్ణ భాగస్వామి, భద్రతా మంత్రి ఇటామర్ బెన్ జివిర్, ఇరాన్‌పై దాడి చేయడంలో జాప్యం బోలు పాశ్చాత్య ఆలోచనగా పేర్కొన్నారు. ఇరాన్‌కు ఇజ్రాయెల్ సమాధానం ఇస్తుందని టెల్ అవీవ్ నేతల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. దీని అర్థం ఇజ్రాయెల్ తదుపరి చర్య మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ప్రారంభిస్తుంది.

MLC Kavith: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. మళ్లీ కస్టడీ పొడిగింపు

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) మరో షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)..

లిక్కర్ స్కామ్ కేసులో కవితను మూడు రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించారు. ఈ మూడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో.. ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాదులు, కవిత తరఫున న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది.

సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని.. విచారణకు ఆమె సహకరించలేదని సీబీఐ ఆరోపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కవితను 9 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించింది. దీని ప్రకారం.. కవిత ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు..