/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz టెక్సాస్‌లో భారీ పేలుడు... మృత్యువాత పడ్డ 18 వేల అవులు TeluguCentralnews
TeluguCentralnews

Apr 14 2023, 12:30

టెక్సాస్‌లో భారీ పేలుడు... మృత్యువాత పడ్డ 18 వేల అవులు

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ ప్రమాదం జరిగింది. డిమ్మిట్‌లోని సౌత్‌ ఫోర్క్‌ డెయిరీ ఫాంలో హఠాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 18,000 ఆవులు మృత్యువాత పడ్డాయి. అందులో పని చేస్తున్న ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన ఆవుల విలువ 36 మిలియన్‌ డాలర్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ ఘటన ఏప్రిల్‌ 10న జరిగినట్లు సమాచారం.

డెయిరీఫాంలోని యంత్రాలు బాగా వేడెక్కడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పేలుడు జరిగిన తర్వాత ఒక్కసారిగా మీథేన్‌ అధికమొత్తంలో విడుదలైందని అందుకే ఆవులు మృతి చెంది ఉంటాయని భావిస్తున్నారు. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది. డెయిరీ ఫాంలో సాధారణంగానే మీథేన్‌ వాయువు వెలువడుతుంది. పేడ ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల దాని ద్వారా మీథేన్‌ బయటికి వస్తుంది.

2013 తర్వాత డెయిరీ ఫాంలలో ఇంతపెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారిని అక్కడి జంతు సంరక్షణశాఖ అధికారులు చెబుతున్నారు.

TeluguCentralnews

Apr 13 2023, 15:33

చరిత్ర సృష్టించిన కోల్‌కతా మెట్రో రైలు హుగ్లీ నది క్రింద విజయవంతంగా ట్రయల్ రన్

 దేశంలో మొట్ట మొదటిసారిగా హుగ్లీ నది క్రింద సొరంగం ద్వారా విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది కోల్‌కతా మెట్రో. ఇది దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

నగరానికి ఇది చారిత్రాత్మక ఘట్టమని ఈ మార్గంలో వచ్చే 7 నెలల పాటు రెగ్యులర్ ట్రయల్ రన్ నిర్వహిస్తామని,

ఆ తరువాత, సాధారణ ప్రజలకు సాధారణ సేవలు ప్రారంభమవుతాయని కోల్‌కతా మెట్రో జనరల్ మేనేజర్ పి.ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.

 హౌరా నుండి ఎస్ప్లానేడ్ వరకు విస్తరించి ఉన్న మార్గం పొడవు సుమారు 4.8 కి.మీ. ఇందులో 520 మీటర్లు హుగ్లీ నది కింద సొరంగం ద్వారా ఉంటుంది. సొరంగం నీటి ఉపరితల మట్టం క్రింద 32 మీటర్లు ఉంది.

TeluguCentralnews

Apr 10 2023, 15:57

గ్రేటర్ నోయిడా షాకింగ్ సంఘటన... తప్పిపోయిన పాప పక్కింట్లో వారి సూట్‌కేస్‌లో శవమై...

గ్రేటర్ నోయిడా లోని సూరజ్‌పూర్ ప్రాంతంలోని దేవ్లా గ్రామంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 

రెండు రోజుల గా కనిపించని 2 సంవత్సారాల పాప పొరుగువారి ఇంట్లో ఉన్న సూట్‌కేస్‌లో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆ ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు.  

వివరాల్లోకి వెళ్ళితే...

దేవ్లాలో అద్దెకు ఉంటున్న శివ కుమార్, అతని భార్య ఇద్దరు పిల్లలలో నివసిస్తున్నారు. శివకుమార్ స్థానిక కర్మాగారం లో పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 7న శివకుమార్ డ్యూటీలో ఉండగా, అతని భార్య పిల్లలిద్దరినీ ఇంట్లో వదిలి మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. చుట్టుపక్కల ఆరా తీసినా ఆమె జాడ కనిపించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ ఫిర్యాదుతో పోలీసులు వెతుకులాట ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది.

ఆదివారం మధ్యాహ్నం ఇంటి తాళం వేసి ఉన్న పక్కింటి నుంచి దుర్వాసన రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

 సూరజ్‌పూర్‌కు చెందిన పోలీసుల బృందం ఆ ప్రాంతానికి చేరుకుని ఇంటిని వెతకగా అక్కడ సూట్‌కేస్‌లో తప్పిపోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇల్లు రాఘవేంద్ర అనే వ్యక్తికి చెందినదని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

TeluguCentralnews

Apr 10 2023, 15:14

దేశ వ్యాప్తంగా కరోనా అప్డేట్స్...

 గడిచిన 24 గంటల్లో దేశంలో 5880 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,96,318 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,23,527 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 85, 980 మందికి కరోనా పరీక్షలు వేసింది ఆరోగ్య శాఖ.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,62,496 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2069 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 94. 99 శాతంగా ఉంది.ఇక దేశంలో 14 గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,979 కి చేరింది.

TeluguCentralnews

Apr 10 2023, 11:17

Karnataka: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు తొలి జాబితా విడుదల చేయనున్న BJP

 రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక వేడెక్కుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వ్యూహాలకు పదునుపెడుతున్నాయి అన్ని పార్టీలు. 

ఏప్రిల్ 13న నోటిఫికేషన్, మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించాయి. అధికార బీజేపీ ఈ రోజు తొలి జాబితా రిలీజ్ చేయనుంది.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా.. బీజేపీ నేడు 120 నుంచి 150 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుందని తెలిసింది. కర్ణాటకలోనే ఉన్న ప్రధాని మోదీ ఆదివారం ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జాబితాని ఖరారు చేసినట్లు తెలిసింది. 

ఐతే.. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జ్యోషి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.

 ఇవాళ్టి జాబితా రిలీజ్‌తో.. కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం

TeluguCentralnews

Apr 10 2023, 08:27

బంగారం - వెండి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధరరూ.55, 940.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ.61,010 

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,790.

 

24 క్యారెట్ల బంగారం ధర రూ 60,860 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,390.

 

24 క్యారెట్ల బంగారం ధర రూ.61,520.

హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.55, 790.

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.60, 860.

 

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,790.

 24 క్యారెట్ల బంగారం ధర 60,860  

 విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,790.

 

24 క్యారెట్ల బంగారం ధర 60,860.  

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 80,200.

TeluguCentralnews

Mar 31 2023, 16:07

అది ఓ వజ్రాల గని.. మీరు తవ్విన డైమండ్స్‌ అన్నీ మీకే..!!

భూమి మనదైనా.. అందులో ఏమైనా బంగారం, వజ్రాలు దొరికితే అది ప్రభుత్వానికే ఇవ్వాలి.. అలాంటిది.. అక్కడ భూమి మనది కాదు.. కానీ వజ్రాలు ఉంటాయి.. మీకు గానీ అవి దొరికాయంటే.. అవి మీకే ఇస్తారట. మధ్య అమెరికాలో ఉన్న అర్కాన్సాస్ నైరుతి భాగంలో క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ అనే ప్రదేశం ఉంది. దేశంలోనే అన్ని రకాల వ్యక్తులకు అనుమతి ఉన్న వజ్రాల గని ఇదే.

911 ఎకరాల స్టేట్ పార్క్‌లో భాగంగా డైమండ్ పిట్ 1972లో ప్రజల కోసం తెరవబడింది. అప్పటి నుంచి, విలువైన రాళ్లను తవ్వడానికి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు సందర్శిస్తారు. విలువైన రాళ్లు పెద్ద సంఖ్యలో ఉండవు. 1972 నుండి ఇప్పటి వరకు దాదాపు 35,000 రాళ్ళు ఇక్కడ గుర్తించారట.. 1906లో జాన్ హడిల్‌స్టోన్ తన పొలంలోని మట్టిలో రెండు వింత స్ఫటికాలను కనుగొన్నాడు.. అప్పుడే మొదటిసారు వజ్రాలు బయటపడ్డాయి.. తన పొలం లాంప్రోయిట్ ధాతువుతో నిండిన లావా ట్యూబ్ పైన ఉందని తరువాత మాత్రమే అతను గ్రహించాడు. అప్పటి నుంచి భూమి చేతులు మారింది. ఈ భూమిలో లభించే విలువైన రాళ్ల గురించి పట్టణంలోని ప్రతి ఒక్కరికి తెలిసింది.

1800లలో ఆఫ్రికాలో వజ్రాల వేట జరిగినట్లే ఇక్కడ కూడా వజ్రాల వేట జరిగింది. కానీ 1919లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత ఆ ప్రదేశం మూతపడింది. 1950లో పునఃప్రారంభించారు.. ఇదే క్రమంలో… 1972లో పబ్లిక్ స్పేస్‌గా మారింది. ఆ తర్వాత ఇక్కడ తవ్విన పదార్థాలన్నీ తవ్వినవారి సొత్తుగా మారాయి.. వీటిపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ గని వజ్రం మాత్రమే కాదు, అమెథిస్ట్ కూడా – గోమేదికం, కాల్సైట్, పెరిడోట్, సుమారు 40 వివిధ విలువైన ఖనిజాలను వీటిని తవ్విన వారికే తీసుకెళ్లేందుకు కూడా అనుమతించారు..

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ లభించిన కొన్ని రత్నాలు ప్రాచుర్యం పొందాయి. వాటిలో యునైటెడ్ స్టేట్స్‌లో ఇప్పటివరకు కనుగొనబడిన రెండు అతిపెద్ద వజ్రాలు ఉన్నాయి, 40.23-క్యారెట్ అంకుల్ సామ్ (1924), 34.25-క్యారెట్ స్టార్ ఆఫ్ ముర్‌ఫ్రీస్‌బోరో (1964), తర్వాత 15.33-క్యారెట్ స్టార్ ఆఫ్ అర్కాన్సాస్ (1956). ), ప్రజాదరణ పొందింది. ఇతర రాళ్లు పరిమాణంలో ఇవి చిన్నవి కానీ విలువలో మాత్రం ఎక్కువే. ఇక్కడకు ఎవరైనా వెళ్లొచ్చట..

TeluguCentralnews

Mar 31 2023, 16:01

ఉత్తర కొరియాలోని అరాచకాలు వెలుగులోకి..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉన్నారు. అదీగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాడంటూ.. పలు వార్తలు గుప్పుమంటున్నాయి. వాటిలో నిజానిజాలు ఎంత అనేది అందరి మదిలో తలెత్తిన ప్రశ్న. అయితే ఇప్పుడూ అవన్నీ నిజమేనంటూ దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ బల్లగుద్ది మరీ చెబుతుంది.

అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా ఒక నివేదికను కూడా విడుదల చేసింది.

అందులో ఉత్తర కొరియా ఎంత ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందో వివరించింది. అందుకోసం దక్షణ కొరియా 2017 నుంచి 2020 మధ్యలో తమ మాతృభూమిని వదిలి వచ్చిన దాదాపు 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదికలో.. అక్కడ పౌరుల జీవించే హక్కే ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల దగ్గర నుంచి వికలాంగులు, గర్భిణీల వరకు ఎవరినీ వదిలి పెట్టకుండా ఉరిశిక్షలు అమలు చేసినట్లు తెలిపింది. ప్రజలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మానవ ప్రయోగాల్లోకి దించినట్లు పేర్కొంది.

నర్సుల చేత బలవంతంగా మరుగుజ్జుల జాబితాను తయారు చేయించి.. వారిపై మానవ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపింది. ఒక ఆరు నెలల గర్భిణి స్త్రీ తన ఇంటిలో దివగంత కిమ్ ఇల్ సంగ్ చిత్రపటం ఎదుట డ్యాన్స్ లు చేసిందన్న కారణంతో ఉరితీశారు. అలాగే దక్షిణ కొరియా మీడియాకు సంబంధించిన ఏదైనా ఆన్ లైన్ లో షేర్ చేసినా.. అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినా.. వారందర్నీ ఉరితీసినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో ఫుటేజీన్ చూస్తు.. నల్లమందు సేవించిన ఆరుగురు యువకులను నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపినట్లు పేర్కొంది.

మనుషులను మానవ ప్రయోగాల కోసం నిద్రమాత్రలు ఇచ్చి మరీ ఆస్పత్రికి తరలించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా వికలాంగులు, మరగుజ్జుగా ఉన్నవారిపై ఇష్టానుసారంగా మానవ ప్రయోగాలు నిర్వహించారంటూ.. అక్కడ జరిగిన భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సుమారు 450 పేజీల నివేదికను దక్షిణ మంత్రిత్వశాఖ సమర్పించింది.

TeluguCentralnews

Mar 30 2023, 16:09

భారత్‌లో పాక్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతా నిలిపివేత.. 6 నెలల్లో ఇది రెండోసారి

పాకిస్తాన్‌ (Pakistan)కు భారత్‌ (India)లో భారీ షాక్‌ తగిలింది. ఆ దేశ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను (Twitter Account) ట్విట్టర్‌ ఇండియా నిలిపివేసింది. లీగల్‌ డిమాండ్‌ నేపథ్యంలోనే మార్చి 30వ తేదీ నుంచి ఆ ఖాతాను భారత్‌లో ట్విట్టర్‌ బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సరైన కారణాన్ని ఇప్పటి వరకు ట్విటర్ (Twitter) వెల్లడించలేదు. భారత్‌లో ఉన్నవారు ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించగా.. ‘అకౌంట్‌ విత్‌హెల్డ్‌’ (Account withheld) అని చూపిస్తోంది. భారత్‌లో పాక్‌ ట్విట్టర్‌ ఖాతా నిలిపివేయడం ఆరు నెల్లలోనే ఇది రెండోసారి.

ఈ విషయంపై భారత్, పాకిస్థాన్ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా (government Twitter handle) ను భారతదేశంలో చూడకుండా బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోని నోటీసుల ప్రకారం వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. కంపెనీ మార్గదర్శకాలు, కోర్టు ఆర్డర్ వంటి చెల్లుబాటు అయ్యే చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా… ట్విట్టర్ పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసినట్లు పేర్కొంది. అమెరికా, కెనడా వంటి ఇతర దేశాల్లో పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా పని చేస్తోంది.

TeluguCentralnews

Mar 30 2023, 16:03

AI వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయండి.. ఎలాన్ మస్క్‌ సహా 1000 మంది నిపుణుల బహిరంగ లేఖ

టెక్ వర్గాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంత ఇంట్రెస్టింగ్​గా అనిపిస్తుందో.. అంతకు మించి ఆందోళన కలిగిస్తోంది. ఏఐ వల్ల భవిష్యత్​లో ఉద్యోగాలు పోవడంతో పాటు మానవాలికే ముప్పు కలగనుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ వంటి టెక్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని బల్లగుద్ది చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోన్న విషయం.

అత్యాధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ ఎలాన్ మస్క్ సహా వేయి మంది టెక్ నిపుణులు బహిరంగ లేఖ రాసి సంతకం చేశారు. ఇందులో యాపిల్‌ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్‌ వోజ్నియాక్‌ వంటి నిపుణులు కూడా ఉన్నారు. ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట ఈ లేఖను విడుదల చేశారు. ఈ లేఖను ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ తరఫున విడుదల చేశారు.

మానవ మేధస్సుతో పోటీ పడే జీపీటీ-4 వంటి ఏఐ వ్యవస్థలు సమాజానికి, యావత్‌ మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. సానుకూల ఫలితాలు ఇవ్వగలిగే ఏఐ వ్యవస్థలను మాత్రమే అభివృద్ధి చేయాలని సూచించారు. ఒకవేళ ఏమైనా ప్రతికూల ప్రభావాలు తలెత్తినా.. వాటిని నియంత్రించగలమనే నమ్మకం కుదిరితేనే శక్తిమంతమైన ఏఐల దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు.