/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz గ్రేటర్ నోయిడా షాకింగ్ సంఘటన... తప్పిపోయిన పాప పక్కింట్లో వారి సూట్‌కేస్‌లో శవమై... TeluguCentralnews
TeluguCentralnews

Apr 10 2023, 15:57

గ్రేటర్ నోయిడా షాకింగ్ సంఘటన... తప్పిపోయిన పాప పక్కింట్లో వారి సూట్‌కేస్‌లో శవమై...

గ్రేటర్ నోయిడా లోని సూరజ్‌పూర్ ప్రాంతంలోని దేవ్లా గ్రామంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. 

రెండు రోజుల గా కనిపించని 2 సంవత్సారాల పాప పొరుగువారి ఇంట్లో ఉన్న సూట్‌కేస్‌లో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆ ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు.  

వివరాల్లోకి వెళ్ళితే...

దేవ్లాలో అద్దెకు ఉంటున్న శివ కుమార్, అతని భార్య ఇద్దరు పిల్లలలో నివసిస్తున్నారు. శివకుమార్ స్థానిక కర్మాగారం లో పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 7న శివకుమార్ డ్యూటీలో ఉండగా, అతని భార్య పిల్లలిద్దరినీ ఇంట్లో వదిలి మార్కెట్‌కు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. చుట్టుపక్కల ఆరా తీసినా ఆమె జాడ కనిపించకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ ఫిర్యాదుతో పోలీసులు వెతుకులాట ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది.

ఆదివారం మధ్యాహ్నం ఇంటి తాళం వేసి ఉన్న పక్కింటి నుంచి దుర్వాసన రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

 సూరజ్‌పూర్‌కు చెందిన పోలీసుల బృందం ఆ ప్రాంతానికి చేరుకుని ఇంటిని వెతకగా అక్కడ సూట్‌కేస్‌లో తప్పిపోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇల్లు రాఘవేంద్ర అనే వ్యక్తికి చెందినదని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

TeluguCentralnews

Apr 10 2023, 15:14

దేశ వ్యాప్తంగా కరోనా అప్డేట్స్...

 గడిచిన 24 గంటల్లో దేశంలో 5880 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,96,318 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2,20,66,23,527 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 85, 980 మందికి కరోనా పరీక్షలు వేసింది ఆరోగ్య శాఖ.

దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,62,496 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2069 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 94. 99 శాతంగా ఉంది.ఇక దేశంలో 14 గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,30,979 కి చేరింది.

TeluguCentralnews

Apr 10 2023, 11:17

Karnataka: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు తొలి జాబితా విడుదల చేయనున్న BJP

 రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక వేడెక్కుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వ్యూహాలకు పదునుపెడుతున్నాయి అన్ని పార్టీలు. 

ఏప్రిల్ 13న నోటిఫికేషన్, మే 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తమ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించాయి. అధికార బీజేపీ ఈ రోజు తొలి జాబితా రిలీజ్ చేయనుంది.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా.. బీజేపీ నేడు 120 నుంచి 150 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేస్తుందని తెలిసింది. కర్ణాటకలోనే ఉన్న ప్రధాని మోదీ ఆదివారం ఆయన అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జాబితాని ఖరారు చేసినట్లు తెలిసింది. 

ఐతే.. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జ్యోషి, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.

 ఇవాళ్టి జాబితా రిలీజ్‌తో.. కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం

TeluguCentralnews

Apr 10 2023, 08:27

బంగారం - వెండి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధరరూ.55, 940.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ధర రూ.61,010 

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,790.

 

24 క్యారెట్ల బంగారం ధర రూ 60,860 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,390.

 

24 క్యారెట్ల బంగారం ధర రూ.61,520.

హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.55, 790.

24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.60, 860.

 

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,790.

 24 క్యారెట్ల బంగారం ధర 60,860  

 విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,790.

 

24 క్యారెట్ల బంగారం ధర 60,860.  

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 80,200.

TeluguCentralnews

Mar 31 2023, 16:07

అది ఓ వజ్రాల గని.. మీరు తవ్విన డైమండ్స్‌ అన్నీ మీకే..!!

భూమి మనదైనా.. అందులో ఏమైనా బంగారం, వజ్రాలు దొరికితే అది ప్రభుత్వానికే ఇవ్వాలి.. అలాంటిది.. అక్కడ భూమి మనది కాదు.. కానీ వజ్రాలు ఉంటాయి.. మీకు గానీ అవి దొరికాయంటే.. అవి మీకే ఇస్తారట. మధ్య అమెరికాలో ఉన్న అర్కాన్సాస్ నైరుతి భాగంలో క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ అనే ప్రదేశం ఉంది. దేశంలోనే అన్ని రకాల వ్యక్తులకు అనుమతి ఉన్న వజ్రాల గని ఇదే.

911 ఎకరాల స్టేట్ పార్క్‌లో భాగంగా డైమండ్ పిట్ 1972లో ప్రజల కోసం తెరవబడింది. అప్పటి నుంచి, విలువైన రాళ్లను తవ్వడానికి ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు సందర్శిస్తారు. విలువైన రాళ్లు పెద్ద సంఖ్యలో ఉండవు. 1972 నుండి ఇప్పటి వరకు దాదాపు 35,000 రాళ్ళు ఇక్కడ గుర్తించారట.. 1906లో జాన్ హడిల్‌స్టోన్ తన పొలంలోని మట్టిలో రెండు వింత స్ఫటికాలను కనుగొన్నాడు.. అప్పుడే మొదటిసారు వజ్రాలు బయటపడ్డాయి.. తన పొలం లాంప్రోయిట్ ధాతువుతో నిండిన లావా ట్యూబ్ పైన ఉందని తరువాత మాత్రమే అతను గ్రహించాడు. అప్పటి నుంచి భూమి చేతులు మారింది. ఈ భూమిలో లభించే విలువైన రాళ్ల గురించి పట్టణంలోని ప్రతి ఒక్కరికి తెలిసింది.

1800లలో ఆఫ్రికాలో వజ్రాల వేట జరిగినట్లే ఇక్కడ కూడా వజ్రాల వేట జరిగింది. కానీ 1919లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత ఆ ప్రదేశం మూతపడింది. 1950లో పునఃప్రారంభించారు.. ఇదే క్రమంలో… 1972లో పబ్లిక్ స్పేస్‌గా మారింది. ఆ తర్వాత ఇక్కడ తవ్విన పదార్థాలన్నీ తవ్వినవారి సొత్తుగా మారాయి.. వీటిపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఈ గని వజ్రం మాత్రమే కాదు, అమెథిస్ట్ కూడా – గోమేదికం, కాల్సైట్, పెరిడోట్, సుమారు 40 వివిధ విలువైన ఖనిజాలను వీటిని తవ్విన వారికే తీసుకెళ్లేందుకు కూడా అనుమతించారు..

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ లభించిన కొన్ని రత్నాలు ప్రాచుర్యం పొందాయి. వాటిలో యునైటెడ్ స్టేట్స్‌లో ఇప్పటివరకు కనుగొనబడిన రెండు అతిపెద్ద వజ్రాలు ఉన్నాయి, 40.23-క్యారెట్ అంకుల్ సామ్ (1924), 34.25-క్యారెట్ స్టార్ ఆఫ్ ముర్‌ఫ్రీస్‌బోరో (1964), తర్వాత 15.33-క్యారెట్ స్టార్ ఆఫ్ అర్కాన్సాస్ (1956). ), ప్రజాదరణ పొందింది. ఇతర రాళ్లు పరిమాణంలో ఇవి చిన్నవి కానీ విలువలో మాత్రం ఎక్కువే. ఇక్కడకు ఎవరైనా వెళ్లొచ్చట..

TeluguCentralnews

Mar 31 2023, 16:01

ఉత్తర కొరియాలోని అరాచకాలు వెలుగులోకి..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన నియంతృత్వ పాలనతో నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉన్నారు. అదీగాక కిమ్ తన దేశ ప్రజలు, పౌరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాడంటూ.. పలు వార్తలు గుప్పుమంటున్నాయి. వాటిలో నిజానిజాలు ఎంత అనేది అందరి మదిలో తలెత్తిన ప్రశ్న. అయితే ఇప్పుడూ అవన్నీ నిజమేనంటూ దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ బల్లగుద్ది మరీ చెబుతుంది.

అందుకు సంబంధించిన వాటిని సమగ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆధారాలతో సహా ఒక నివేదికను కూడా విడుదల చేసింది.

అందులో ఉత్తర కొరియా ఎంత ఘోరంగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందో వివరించింది. అందుకోసం దక్షణ కొరియా 2017 నుంచి 2020 మధ్యలో తమ మాతృభూమిని వదిలి వచ్చిన దాదాపు 500 మందికి పైగా ఉత్తర కొరియన్ల నుంచి వివరాలను సేకరించినట్లు కూడా తెలిపింది. దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదికలో.. అక్కడ పౌరుల జీవించే హక్కే ప్రమాదంలో ఉన్నట్లు తెలిపింది. పిల్లల దగ్గర నుంచి వికలాంగులు, గర్భిణీల వరకు ఎవరినీ వదిలి పెట్టకుండా ఉరిశిక్షలు అమలు చేసినట్లు తెలిపింది. ప్రజలను బెదిరింపులకు గురి చేసి బలవంతంగా మానవ ప్రయోగాల్లోకి దించినట్లు పేర్కొంది.

నర్సుల చేత బలవంతంగా మరుగుజ్జుల జాబితాను తయారు చేయించి.. వారిపై మానవ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపింది. ఒక ఆరు నెలల గర్భిణి స్త్రీ తన ఇంటిలో దివగంత కిమ్ ఇల్ సంగ్ చిత్రపటం ఎదుట డ్యాన్స్ లు చేసిందన్న కారణంతో ఉరితీశారు. అలాగే దక్షిణ కొరియా మీడియాకు సంబంధించిన ఏదైనా ఆన్ లైన్ లో షేర్ చేసినా.. అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినా.. వారందర్నీ ఉరితీసినట్లు వెల్లడించింది. అలాగే దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియో ఫుటేజీన్ చూస్తు.. నల్లమందు సేవించిన ఆరుగురు యువకులను నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపినట్లు పేర్కొంది.

మనుషులను మానవ ప్రయోగాల కోసం నిద్రమాత్రలు ఇచ్చి మరీ ఆస్పత్రికి తరలించినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా వికలాంగులు, మరగుజ్జుగా ఉన్నవారిపై ఇష్టానుసారంగా మానవ ప్రయోగాలు నిర్వహించారంటూ.. అక్కడ జరిగిన భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సుమారు 450 పేజీల నివేదికను దక్షిణ మంత్రిత్వశాఖ సమర్పించింది.

TeluguCentralnews

Mar 30 2023, 16:09

భారత్‌లో పాక్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతా నిలిపివేత.. 6 నెలల్లో ఇది రెండోసారి

పాకిస్తాన్‌ (Pakistan)కు భారత్‌ (India)లో భారీ షాక్‌ తగిలింది. ఆ దేశ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్‌ ఖాతాను (Twitter Account) ట్విట్టర్‌ ఇండియా నిలిపివేసింది. లీగల్‌ డిమాండ్‌ నేపథ్యంలోనే మార్చి 30వ తేదీ నుంచి ఆ ఖాతాను భారత్‌లో ట్విట్టర్‌ బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సరైన కారణాన్ని ఇప్పటి వరకు ట్విటర్ (Twitter) వెల్లడించలేదు. భారత్‌లో ఉన్నవారు ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించగా.. ‘అకౌంట్‌ విత్‌హెల్డ్‌’ (Account withheld) అని చూపిస్తోంది. భారత్‌లో పాక్‌ ట్విట్టర్‌ ఖాతా నిలిపివేయడం ఆరు నెల్లలోనే ఇది రెండోసారి.

ఈ విషయంపై భారత్, పాకిస్థాన్ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా (government Twitter handle) ను భారతదేశంలో చూడకుండా బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోని నోటీసుల ప్రకారం వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. కంపెనీ మార్గదర్శకాలు, కోర్టు ఆర్డర్ వంటి చెల్లుబాటు అయ్యే చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా… ట్విట్టర్ పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఖాతాను భారత్‌లో బ్లాక్ చేసినట్లు పేర్కొంది. అమెరికా, కెనడా వంటి ఇతర దేశాల్లో పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా పని చేస్తోంది.

TeluguCentralnews

Mar 30 2023, 16:03

AI వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయండి.. ఎలాన్ మస్క్‌ సహా 1000 మంది నిపుణుల బహిరంగ లేఖ

టెక్ వర్గాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అంత ఇంట్రెస్టింగ్​గా అనిపిస్తుందో.. అంతకు మించి ఆందోళన కలిగిస్తోంది. ఏఐ వల్ల భవిష్యత్​లో ఉద్యోగాలు పోవడంతో పాటు మానవాలికే ముప్పు కలగనుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలాన్ మస్క్ వంటి టెక్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని బల్లగుద్ది చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోన్న విషయం.

అత్యాధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ ఎలాన్ మస్క్ సహా వేయి మంది టెక్ నిపుణులు బహిరంగ లేఖ రాసి సంతకం చేశారు. ఇందులో యాపిల్‌ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్‌ వోజ్నియాక్‌ వంటి నిపుణులు కూడా ఉన్నారు. ‘పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌’ పేరిట ఈ లేఖను విడుదల చేశారు. ఈ లేఖను ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ తరఫున విడుదల చేశారు.

మానవ మేధస్సుతో పోటీ పడే జీపీటీ-4 వంటి ఏఐ వ్యవస్థలు సమాజానికి, యావత్‌ మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. సానుకూల ఫలితాలు ఇవ్వగలిగే ఏఐ వ్యవస్థలను మాత్రమే అభివృద్ధి చేయాలని సూచించారు. ఒకవేళ ఏమైనా ప్రతికూల ప్రభావాలు తలెత్తినా.. వాటిని నియంత్రించగలమనే నమ్మకం కుదిరితేనే శక్తిమంతమైన ఏఐల దిశగా అడుగులు వేయాలని హితవు పలికారు.

TeluguCentralnews

Mar 25 2023, 18:14

పాకిస్థాన్ కు బిగ్ షాకిచ్చిన అఫ్గానిస్థాన్‌

ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఎదుగుతున్న అఫ్గానిస్థాన్‌ జట్టు పాకిస్థాన్ కు బిగ్ షాకిచ్చింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య షార్జా వేదికగా మార్చి 25న జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో అఫ్గానిస్థాన్‌ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగులు మాత్రమే చేసింది.  

బాబర్‌ అజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ లేకుండా బరిలోకి దిగిన పాక్‌.. అఫ్గాన్‌ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. దీంతో 92 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్థాన్‌ జట్టు మరో 6 వికెట్లు, 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. అఫ్గానిస్థాన్‌ను మహమ్మద్‌ నబీ (38), నజీబుల్లా జద్రాన్ (17) నిలకడగా ఆడి గెలిపించారు.

పాకిస్థాన్ పై అఫ్గానిస్థాన్‌ కు ఇదే తొలి విజయం కావడం విశేషం. మున్మందు ఇదే జోరును కొనసాగిస్తామని అఫ్గానిస్థాన్‌ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్‌ వెల్లడించాడు.

TeluguCentralnews

Mar 25 2023, 17:36

ఈ ఆలయంలో మహిళా వేషధారణలో పురుషులు పూజలు చేస్తారు.. ఎందుకో తెలుసా?

కేరళ కొల్లాంలోని చవరాలో ఉన్న ప్రసిద్ధ కొట్టన్‌కులంగర దేవి ఆలయంలో చమయవిళక్కు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ ఆచారాలలో భాగంగా చివరి రెండు రోజులలో వేలాది మంది పురుషులు స్త్రీల వేషధారణలో పూజలు చేస్తారు. 19 రోజుల పాటు జరిగే వార్షిక ఆలయ ఉత్సవాల్లో చివరి రెండు రోజులలో పురుషులు స్త్రీల వేషధారణ చేస్తే, స్థానిక దేవుడు సంతోషించి వారి కోరికలను తీరుస్తాడని దీని వెనుక ఉన్న నమ్మకం.

కొన్నేళ్లుగా బంధువులు, స్నేహితులతో వచ్చే మగవారి సంఖ్య పెరిగి 10000 దాటింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కొట్టంకులంగర చమయవిళక్కు అంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వందలాది మంది పురుషులు మహిళ వేషధారణలో శ్రీ కొట్టంకులంగర దుర్గ భగవతి ఆలయంలో దీపార్చన చేశారు. పురుషులు మహిళల వేషధారణలో వచ్చి ఇక్కడ పూజలు చేయడం సంప్రదాయంగా భావిస్తారు. రెండు రోజుల పాటు జరిగే చమయవిళక్కు ఉత్సవాల్లో ట్రాన్స్‌జెండర్లు కూడా భారీగా పాల్గొన్నారు. వారు కూడా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు ప్రతి ఏటా మలయాళి నెల ‘మీనం’ 10 ,11వ తేదీల్లో ఘనంగా జరుపుకుంటారు. 

ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పురుషులు మహిళల వేషధారణలో వచ్చి.. ఐదు ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలు వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారు.

అది ఎలా మొదలైంది..

అత్యంత ప్రాచుర్యం పొందిన కథనం ప్రకారం, ఆవులను మేపుతూ అమ్మాయిల వేషధారణలో ఉన్న అబ్బాయిల బృందం ఈ సంప్రదాయాన్ని ప్రారంభించింది. పూలు, ‘కోటాన్’ (కొబ్బరితో చేసిన వంటకం) సమర్పించారు. ఒకరోజు దేవత ఒక బాలుడి ముందు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత, పురుషులు స్త్రీల వేషధారణతో అమ్మవారిని ఆరాధించే ఆచారం ప్రారంభమైంది. రాయిని దేవతగా భావిస్తారు. ఏళ్ల తరబడి రాయి పరిమాణం పెరుగుతోందనే నమ్మకం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆచారం అత్యంత ప్రాచుర్యం పొందింది, ఈ పండుగ వివిధ మతాల ప్రజలను ఆకర్షిస్తుంది. వారిలో పెద్ద సంఖ్యలో కేరళ నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు.

మరో కథ కూడా ఉంది.

ఓ రోజు కొందరు పిల్లలు ఆవులు మేపడానికి అడవి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారికి ఒక కొబ్బరికాయ కనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని.. బండ రాయితో పగలగొట్టే ప్రయత్నం చేశారు. అకస్మాత్తుగా రాయిలోంచి రక్తం కారింది. దీంతో ఆ పిల్లలు భయపడి.. వాళ్ల తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. అనంతరం వారు జ్యోతిషులను సంప్రదించారు. ఆ రాయిలో వనదుర్గ శక్తి దాగుందని వెంటనే అక్కడ ఆలయం నిర్మించాలని జ్యోతిషులు చెప్పారు. దీంతో స్థానికులు గుడి కట్టి.. ప్రతీఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన షెల్డన్ అనే యువకుడు మాట్లాడుతూ.. “నేను ఈ ఆచారం గురించి కొన్నేళ్లుగా వింటున్నాను. నేను రావాలనుకున్నాను. చివరకు ఈ సంవత్సరం వచ్చాను.” స్త్రీ వేషధారణ తర్వాత, నేను కొంతకాలంగా అనుకున్నది సాధించినట్లు అనిపించిందని తెలిపాడు. ఆచారంలో పాల్గొనడానికి అత్యంత అనుకూలమైన సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సంప్రదాయ చీరలు ధరించిన పురుషులు సాయంత్రం దీపాలు మోసుకుంటూ పెద్ద సంఖ్యలో కనిపిస్తారు.

మగవాళ్ళు ఆడవాళ్ళు లేదా అమ్మాయిల వేషం వేసుకోవడానికి దీపాలను తీసుకువెళ్లాలి. అద్దెకు దొరుకుతుంది, కానీ వారు తమ సొంత దుస్తులను తీసుకురావాలి. ఎవరికైనా సహాయం కావాలంటే, బ్యూటీషియన్లు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు. ఆదివారంతో పండుగ ముగియడంతో వేలాది మంది ప్రజలు ఆశలు, ఆనందంతో తిరిగి వెళ్తారు.