/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పాలమూరు పై ప్రగల్భాలు తప్పా పైసా లేదు Yadagiri Goud
పాలమూరు పై ప్రగల్భాలు తప్పా పైసా లేదు

•కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరుపై లేదు

•కిసాన్ కాంగ్రెస్ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి

రాష్ట అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో దక్షిణ తెలంగాణ అయినా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తూ పాలమూరు - రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 12 లక్షల ఎకరాల నీరందించే ప్రాజెక్టుకు పైసా ఇవ్వలేదని చల్లా శ్రీకాంత్ రెడ్డి మండి పడ్డారు.

జిల్లాలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులయిన కోయిల్ సాగర్, నెట్టెంపాడు, జూరాల, ఆర్టీఎస్. కల్వకుర్తి, రాజీవ్ భీమా ఎత్తిపోతలకు సైతం బడ్జెట్ లో అరకొరగా కేటాయించారు. ఈ బడ్జెట్ లో నిధులు ఇవ్వకుండా నిర్మాణం పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణ పై వివక్షత చూపిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది,ఆశిస్తున్నా స్థాయిలో నిధులు విడుదల చేయాలేదు. పాలమూరు ప్రాజెక్టును ఉద్దరిస్తానని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ప్రాజెక్టులలో తుమ్మలు మొలుస్తున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 80 శాతం పనులను పూర్తి చేసినా..మిగిలిన 20 శాతం పనులను కేసీఆర్ పూర్తి చేయలేకపోయారు. కాళేశ్వరంపై ఉన్న ప్రేమ పాలమూరు పై లేక పోవడంతోనే రైతులకు నష్టం జరుగుతుంది.

జిల్లాకు నిధులు కేటాయింపులో కొసరి కొసరి విడుదల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు అవుతున్నప్పటికి ఆయకట్టు రైతుల జీవితాలు బీడు పొలంలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యవసాయ దారులు సతమతమవుతున్నా రు.

ఇప్పటికీ తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టినా నేటికీ మహబూబ్ నగర్, రంగా రెడ్డి జిల్లాకు తీరని నష్టమే చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికి పాలమూరు ప్రాజెక్టు కు కేంద్రం జాతీయ హోదా కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా రెండు ప్రభుత్వాలు మాయ,మోసపు మాటలు చెప్పుతూన్నాయి. ఈ బడ్జెట్ పేద, రైతు, మధ్య తరగతి ప్రజలను తీవ్రంగా అసంతృప్తికి, నిరుత్సాహానికి గురి చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించకతప్పదని స్పష్టం చేశారు.

మార్చి 30న భద్రాద్రి రామయ్య కళ్యాణం

హైదరాబాద్‌ : భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది.

మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు శ్రీరామనవమి తిరు కల్యాణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మార్చి 31న నిర్వహించేందుకు వైదిక కమిటీ ఖరారు చేసింది. మార్చి 31న పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ బడ్జెట్‌.. అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలే: బండి సంజయ్‌

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Budget 2023) అంతా డొల్ల బడ్జెట్‌ అని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) ఎద్దేవా చేశారు. ఇది ఎలక్షన్‌ స్టంట్‌ను తలపిస్తోందని విమర్శించారు. అంతా శుష్క వాగ్దానాలు శూన్య హస్తాలేనని పేర్కొంటూ ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్‌ను రూపొందించారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా మొండి చేయి చూపేలా ఉందన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదన్నారు.

ప్రతిపాదిత బడ్జెట్‌లో 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయని కేసీఆర్ ప్రభుత్వ తీరును చూస్తుంటే.. ‘మాటలు కోటలు దాటుతున్నయ్.. చేతలు గడప దాటడం లేదు’అనే సామెతకు అద్దం పడుతోందన్నారు. యావత్ దళిత సమాజాన్ని మోసం చేసేదిగా బడ్జెట్‌ ఉందన్నారు. ఈసారి కూడా బీసీ విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కు కాబోతున్నట్లు అర్థమవుతుందని దుయ్యబట్టారు.

విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు చూస్తుంటే మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపేలా బడ్జెట్ కేటాయింపులు ఉండడం దారుణమన్నారు. డిస్కంలను మరింత సంక్షోభంలో నెట్టేలా కేటాయింపులు ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి చెల్లిస్తున్న రూ.2.63 లక్షల సొమ్మును తన ఖాతాలో వేసుకోవడానికి బడ్జెట్‌లో నిధులను చూపినట్లు అర్థమవుతోందన్నారు. రూ.2,90,396 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం మాత్రం రూ.1.31 లక్షల కోట్లుగానే చూపిందని.. మిగిలిన రూ.1.60 లక్షల కోట్లు ఎక్కడి నుంచి సమకూరుస్తారో చెప్పకపోవడం సిగ్గు చేటన్నారు. కేంద్రం గ్రాంట్లు, పన్నుల వాటా రూపేణా ఈ బడ్జెట్‌లో రూ.62 వేల కోట్లకు పైగా చెల్లిస్తోందని.. ఇవిపోగా మిగిలిన ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం మద్యం, భూముల అమ్మకంతోపాటు అప్పుల ద్వారా, ప్రజలపై భారం మోపడం ద్వారా మాత్రమే సమకూర్చుకునేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ డొల్ల బడ్జెట్‌ను భాజపా పక్షాన ప్రజల్లో ఎండగడతామని సంజయ్‌ అన్నారు.

4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా 6 బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గిస్తూ.. సుస్థిర ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యతమిస్తూ ప్రారంభించిన ఈ మెుబిలిటీ వీక్‌లో భాగంగా జరిగిన ఈవీ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ మేరకు రంగారెడ్డిలోని మోమిన్‌పేట్‌ మండలం ఎంకతాలలో మెుబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. కార్యక్రమంలో ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

మెుబిలిటీ వ్యాలీ ప్రారంభించిన అనంతరం సుస్థిరతపై పలు చర్చా కార్యక్రమాల్లో ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మెుబిలిటీ సదస్సులో భాగంగా బాష్‌ వంటి పలు దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఈవీ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్స్ ఉన్నాయని.. త్వరలోనే మరో 4 మొబిలిటీ క్లస్టర్స్ ఏర్పాటుకు పిలుపునిస్తామని చెప్పారు. రాష్ట్రంలో స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలకు ఎంతో మద్దతు ఇస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు.

అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తా: రేణుకా చౌదరి

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌ రావు ఠాక్రే (Manikrao Thakre) ఆహ్వానం మేరకే ఆయన్ను కలిశానని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) అన్నారు. ఠాక్రేతోపాటు తాను కూడా హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్రలో పాల్గొంటానని చెప్పారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాకు ఆహ్వానిస్తామని చెప్పారు. పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఓట్ల కోసం ఎలా వస్తారో చూస్తామన్నారు.

ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పిన ఆమె.. పార్లమెంట్‌ ఎన్నికలు వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఏపీలోని గుడివాడ నుంచి కూడా పోటీ చేయాలంటూ కొందరు ఆహ్వానిస్తున్నారని, అవసరమైతే రెండు చోట్లా పోటీ చేస్తానని రేణుకా చౌదరి అన్నారు.

ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయండి

అనంతపురం జిల్లా స్పందనలో జిల్లా కలెక్టర్ ను కోరిన సాకే హరి

అనేక ఏళ్లుగా భర్తీకి నోచుకోని ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ఎస్సీ,ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు.సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారికి జే,ఏ,సీ అధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

అనంతరం సాకే హరి మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు ప్రభుత్వం,అధికారుల నిర్లక్ష్య కారణంగా మరుగున పడ్డాయన్నారు.ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులు వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారాని ఎదురుచూస్తున్నారని వాపోయారు.సుప్రీమ్ కోర్టు సైతం భర్తీ చేయాలని లేదంటే సరైన వివరణ ఇవ్వని వారిపై కేసులు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ద్వార 10వేలు పైచిలుకు ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.పాలనే ముగుస్తున్న పట్టించుకోలేదన్నారు.

అడిగిన వారిని అరెస్టులు,కేసులతో భయపెడుతున్నారు. ముఖ్యంగా విశ్వ విద్యాలయాల్లో పేరుకుపోయిన బ్యాక్ లాగ్ పోస్టులు అధికారుల కుట్రలతోనే అగాయని,ఎస్సీ,ఎస్టీలకు ఉద్యోగాలు వస్తే అభివృద్ధి చెందుతారనే కక్ష కట్టి సాధిస్తున్నారు.ఇప్పటికైనా అన్ని ప్రభుత్వ రంగాల్లో ఖాళీగున్న బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ బాధితులను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో జే,ఏ,సీ నాయకులు మన్నల శివయ్య.రేకల కుంట రామాంజనేయులు.ముత్యాలమ్మ.రామకృష్ణ.గణేష్ నాయక్.కొర్రపాడు నాగేంద్ర.చెన్న కేశవ.కందుకూరు రాము.గోపాల్ పాల్గొన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాయలసీమ హక్కులలో భాగంగా అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి నిధులను కేటాయించాలి

•PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాయదుర్గం డివిజన్ కార్యదర్శి : మల్లెల ప్రసాద్

 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో రాయలసీమ హక్కుల లో భాగంగా అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి నిధులను కేటాయించాలని మీడియా సమావేశం లో PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాయదుర్గం డివిజన్ కార్యదర్శి:మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ* ఆంధ్రప్రదేశ్ 2014 విభజన చట్టంలోని రాయలసీమ హక్కుగా వచ్చినటువంటి అనంతపూర్ సెంట్రల్ యూనివర్సిటీకి 2016 నవంబర్ లో డీపీర్ లో చెప్పిన విదంగా తక్షణ కర్తవ్యం గా మొత్తం 902 కోట్లకు పైగా నిధులను కేటాయింపు అవసరమని ఈ నిధులను దశల వారీగా కేటాయిస్తామని డీపీర్ ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది.

దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని జంతలూరు గ్రామం దగ్గర రైతుల నుంచి 495 ఎకరాలు యూనివర్సిటీ కోసం కేటాయించడం జరిగింది. ఇందులో నూతన భవనాలను నిర్మించుటకు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రహరీ గోడల నిర్మించడానికి 9 కోట్లకు పైగా నిధులను కేటాయిస్తామని చెప్పి ఇంతవరకు దానిని కూడా పూర్తి చేసిన పాపాన పోలేదు.

కనుక, రేపటి నుంచి జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో నూతన భవనాలను నిర్మించుటకు బడ్జెట్లో నిధులు కేటాయించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రస్తుత మరియు భవిష్యత్తు యూనివర్సిటీ విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న అద్దె భవనాలలో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇతర రాష్ట్రాల నుంచి చదువు కొరకు వచ్చినటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు.నిజానికి,టీచింగ్ స్టాప్ 49 మంది,నాన్ టీచింగ్ స్టాప్ 51 మంది అవసరం ఉన్నా ఇంతవరకు భర్తీ చేయలేదు.2016 నవంబర్ కేంద్రం సమర్పించిన డీపీర్ లో చెప్పిన విధంగా 2023 కంతా పూర్తిగా భవనాలు నిర్మించి, నూతన భవనాల్లో అడ్మిషన్లు చేపట్టి, బోధన తరగతులు ప్రారంభం అవ్వాలి.

కానీ, ఇప్పటి వరకు అసలు రెగ్యులర్ రిజిస్టార్ ని కూడా నియమించ లేదంటే రాయలసీమ పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. కనుక, పి డి ఎస్ యు,గా ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని కండస్తున్నాము, రానున్న కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి నూతన భవనాన్ని పూర్తి చేయాలి, పూర్తిస్థాయిలో స్టాప్ ని రిక్రూట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము నిధులు కేటాయింపు జరగనియెడల కచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను కలుపుకొని , PDSU ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘo గా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అనీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం.

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది మంత్రి హరీష్ రావు పని తీరు

•ఏ.ఐ.పి.ఎస్.యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్

ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రం లో గల ఏ ఐ పి ఎస్ యు విద్యార్థి సంఘము ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ గారు మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు కేవలం ఫోటోలకు ఫోజులిచ్చి ఫొటోస్ దిగగానే సరిపోదని, సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో పేషంట్లు ఎన్ని ఇబ్బందులు ఎదురుకుంటున్నారో తెలుసుకోవాలని ఆయన అన్నారు.

నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్ లో 66%మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా లేకపోతే మీరు అసెంబ్లీ లో చెప్పుకోవడానికి ఈ దొంగ మాటలు ఎందుకు చెప్తున్నారో ప్రజలకు తెలియ జేయాలనీ ఆయన అన్నారు. మీకు కనుక దమ్ముంటే నాతో ఒక్కసారి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి రండి నేను అక్కడ జరుగుతున్న అన్యాయం ని చూపిస్తానని ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ గారు మంత్రి హరీష్ రావు గారిపై సవాల్ విసరడం జరిగింది. మీకు పేద ప్రజల పై సవతి తల్లి ప్రేమ ఉందని రాష్ట్ర ప్రజలందరికి తెలుసు కానీ, సిద్దిపేట లో కూడ మీరు మెడికల్ మాఫియా కి సపోర్ట్ చేయడం చాలా సిగ్గు చేటని ఆయన అన్నారు. మీరు నిజంగా వైద్య శాఖ మంత్రి అయితే మీకు తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలపై ప్రేమ ఉంటే ఈ దొంగ రాజకీయాలు మాని మాతో ఒకసారి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి రమ్మని కరకండిగా ఆయన మంత్రిని కడిగేసారు.

ఏదైనా ఎమర్జెన్సీ కేస్ ఉంటే సదువు రాని దద్దమ్మ లతో టెస్టులు చేయించి ఎవరిని ఆగం చేద్దామని మీ ప్రభుత్వం చూస్తుందని ఆయన అన్నారు. లంచాలు తీసుకొని సదువు సంధ్య లేని దద్దమ్మలకి అవుట్ సోర్సింగ్ జాబ్ లు ఇచ్చి పేద ప్రజలని ఇబ్బంది పెట్టె బదలు ఉద్యోగ నోటిఫికేషన్ లు జారీ చేయొచ్చు కదా హరీష్ రావ్ అని ఏ ఐ పి ఎస్ యు రాష్ట్ర నాయకులు కొండ ప్రశాంత్ గారు మండిపడ్డారు. ఇప్పటికైనా లంచాలు తినడం మానేసి చిత్త శుద్ధితో మీ పని మీరు సక్రమంగా చేయాలనీ ఆయన ఆదేశించారు. ఇప్పటికి లంచాలు మింగిన కాడికి చాలు మేము గనక ఒక్క ఆర్ టీ ఐ వేసి సమాచారం లాగితే నువ్వు ఉండవు ని మంత్రి పదవి ఉండదని ఆయన అన్నాడు. ని మంత్రి పదవి మేము పెట్టిన బిక్ష అని ఆయన అన్నాడు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లో 2 గంటలపాటు పవర్ సప్లై ఉండదా డీజిల్ కు పైసల్ తక్కువ పడ్డాయా అని ఆయన గోంతేత్తి గర్జించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఏ ఐ పి ఎస్ యు సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఒగ్గు రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాయి కుమార్, శివ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Ponguleti: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీఆర్ఎస్‌కు మాజీ ఎంపీ పొంగులేటి సవాల్

తన అనుచరులు కొందరిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని..

దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనను కొద్దిరోజుల క్ర్తం వరకు పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించారని ఆయన గుర్తు చేశారు. వారి గెలుపు కోసం నన్ను ప్రాధేయపడ్డారని అన్నారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని ఎవరో అంటున్నారట అని వ్యాఖ్యానించిన పొంగులేటి.. అలాంటప్పుడు డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన ఫోటో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తనను నమ్ముకున్న అభిమానుల అభీష్టం మేరకే పార్టీ మార్పు ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. .

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరగణంపై ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదేశాలతో బహిష్కరణ వేటు వేస్తున్నట్లు ఆ పార్టీ వైరా మండల, పట్టణ అధ్యక్షులు ప్రకటించారు. ఆ మేరకు వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, వైరా పట్టణ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్. వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్తో పాటు మిట్టపల్లి నాగేశ్వరరావు (రైతుబంధు మండల అధ్యక్షులు), గుమ్మా రోశయ్య (మాజీ మార్కెట్ కమిటి చైర్మన్), ఇటికల మురళీ (సర్పంచ్ అష్టగుర్తి) బహిష్కరణకు గురైన వారిలో ఉన్నారు.

Amaravati: రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ..

దిల్లీ: ఏపీ రాజధాని అమరావతి(Amaravati)పై దాఖలైన పిటిషన్ల విచారణ అంశం సుప్రీంకోర్టు(Supreme Court)లో ప్రస్తావనకు వచ్చింది..

పిటిషన్లను త్వరితగతిన విచారించాలని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. దీనిపై అమరావతి ప్రాంత రైతులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయస్థానం ఇచ్చిన నోటీసులు జనవరి 27న అందాయని పేర్కొన్నారు.

ఆరోజే తాము ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ విచారణ జరగనందున తమకు ఇప్పటి నుంచి కనీసం 2 వారాల సమయం ఇస్తే కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపారు. రైతుల తరఫు న్యాయవాదులకే ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సమర్థించారు..

ఇరుపక్షాలు ప్రస్తావించిన అంశాలపై చర్చించిన అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఆలోపు ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేయాలని.. మరోవైపు ప్రభుత్వం కూడా ఆలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.