నిజంనిప్పులాంటిది

11 hours ago

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు..?

- త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ

- కాంగ్రెస్‌లో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

- మంత్రి కోమటిరెడ్డి కీలక కామెంట్స్

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 20 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు.

తాజాగా.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. అందుకు డేట్ కూడా ఫిక్స్ అయిందిన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా.. జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరనున్నట్లు కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఆరుగురు నామినేషన్ కంటే ముందు తనను సంప్రదించారని మరో బాంబ్ పేల్చారు.

కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిందేలు ఎవరూ లేరని.. మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. త్వరలో నియోజకవర్గాల డీలిమిటేషన్ ఉంటుందని.. తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య 154కు పెరుగుతుందని చెప్పారు. డీలిమిటేషన్ తర్వాత 154 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు గెలుచుకుంటుందని జోష్యం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావటంపైనా కోమటిరెడ్డి స్పందించారు. ఆమె తెలంగాణ పరువు తీస్తున్నారని ఫైరయ్యారు.

త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని.. జూన్ 5న వారు హస్తం గూటికి చేరనున్నట్లు వెల్లడించారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 154కు చేరుకుంటుందని... ఇందులో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

నిజంనిప్పులాంటిది

May 08 2024, 15:24

అమ్మ ఆశీర్వాదం లేకుండా మొదటిసారి ఎన్నికల్లో మోడీ !

- మోదీ ఆరడుగుల బుల్లెట్.. : బండి సంజయ్

- మోదీ తల్లి మరణాన్ని గుర్తుచేసిన బండి 

- మనమందరం మోడీ కుటుంబీకులమే - బండి సంజయ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు (BJP MP Candidate Bandi Sanjay) మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు. 

కాంగ్రెస్ చవటల్లారా మోదీని విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే దేశం.. ఒకే విధానం ఉండాలన్నదే మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించామన్నారు. నరేంద్ర మోదీ మేడ్ ఇన్ ఇండియా అని.. సోనియా, రాహుల్ ఏ దేశం వారో చెప్పాలని వ్యాఖ్యలు చేశారు.

మోదీ పక్కా లోకల్ అని అన్నారు. కాంగ్రెస్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు బాస్మాసుర అస్త్రమన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఒక గాడిద గుడ్డు అంటూ సెటైర్ విసిరారు. ‘‘మీరు ఆరు గ్యారంటీల దొంగల బ్యాచ్’’ అని మోదీ ఆరడుగుల బుల్లెట్ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 08 2024, 15:20

రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో చెప్పిన మోదీ !

వరంగల్ నగరానికి బీజేపీతో మంచి అనుబంధం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారన్నారు. అందులో ఒక ఎంపీ జంగారెడ్డి.. హన్మకొండ నుంచి గెలుపొందారని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అహ్మదాబాద్ తన కర్మభూమి అని.. ఆ నగర దేవత భద్రకాళి అని చెప్పారు. అలాగే వరంగల్‌లో కూడా నగర దేవత భద్రకాళి అని మోదీ గుర్తు చేశారు. ఈ క్షేత్రం కాకతీయ సామ్రాజ్య వైభవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. భద్రకాళి చరణాలకు ఈ సందర్బంగా మోదీ నమస్కారాలు తెలిపారు.

బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అదికారంలోకి వస్తే.. ఆ రాష్ట్రం.. ఆ పార్టీకి ఏటీఎంగా మారుతుందని పేర్కొన్నారు. అందుకు జార్ఖండ్‌లో దొరికిన నగదే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని విమర్శించారు. ఆ నగదు ఎక్కుడకు వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ ద్వారా ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఆ డబుల్ ఆర్ ట్యాక్స్‌లో ఒక ఆర్ హైదరాబాద్‌కు వెళ్లితే.. మరో ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి వెళ్తుందని ఆరోపించారు.

ప్రపంచంలో చాలా దేశాల్లో అశాంతి, అస్థిరత్వం ఉందని మోదీ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఇతరుల చేతిలోకి వెళ్ల కూడదని ఆయన స్పష్టం చేశారు. అందుకే దేశం అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటుందన్నారు. గతంలో దేశంలో వరుస బాంబు పేలుళ్ల జరిగేవన్నారు. కానీ ఇప్పటి వరకు మూడు దశల్లో పోలింగ్ జరిగిందని.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు.

నిజంనిప్పులాంటిది

May 07 2024, 17:42

కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ !

కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ !

- కవితకు మళ్లీ చుక్కెదురు...

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ప్రస్తుతం జ్యుడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న కవితకు.. కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. పైగా.. కవిత జ్యుడీషియల్‌ కస్టడీని కూడా రౌజ్‌ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తున్న కోర్టు.. ఇప్పుడు మే 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కూడా రౌజ్‌ ఎవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది.

అయితే.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా.. జ్యుడీషల్ కస్టడీలో భాగంగా ఆమెను తీహార్ జైల్‌లో ఉంచారు. జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న సమయంలోనే.. ఏప్రిల్‌ 11వ తేదీన సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం రిమాండ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు 2 కేసుల్లో కవిత బెయిల్ కేసం పిటిషన్లు వేస్తూ ఉంటే.. ఈడీ, సీబీఐ మాత్రం కస్టడీని పొడిగించాలని, బెయిల్ ఇవొద్దంటూ పిటిషన్లు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. న్యాయస్థానం కూడా ఈడీ, సీబీఐ అధికారుల వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ నిరాకరించటమే కాకుండా కస్టడీని కూడా పొడిగిస్తూ వస్తోంది.

ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి అక్రమార్జన చేశారని కవితపై ఈడీ, సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నాయి. ఇందుకు గానూ.. ఆప్‌కు కవిత రూ. 100 కోట్ల లంచం ఇచ్చారని అభియోగం మోపగా.. ఆ రూ.100 కోట్ల లంచం సొమ్మును సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి కవిత వసూలు చేశారంటూ వాధిస్తున్నారు. పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్‌లో 33 శాతం వాటా దక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. కాగా.. బెయిల్ ఇవ్వటం వల్ల.. సాక్ష్యాధారాలను కవిత తారుమారు చేసే అవకాశాలున్నాయంటూ న్యాయస్థానం ముందు అధికారులు వాధిస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఇప్పటికే తాము పలు ఆధారాలు సేకరించామని.. మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని.. కవితను విచారిస్తే తమకు కావాల్సిన వివరాలు దొరుకుతాయంటూ అధికారులు చెప్తూ వస్తున్నారు. దీంతో.. అటు బెయిల్ దొరకట్లేదు.. ఇటు కస్టడీ కూడా పొడిగిస్తూ వస్తున్నారు.

అయితే.. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కావాలనే.. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని.. ఇప్పుడు కూడా విచారణ పేరుతో కస్టడీని పొడిగిస్తూ వస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు.. ఎన్నికలయ్యే వరకు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బెయిల్ రాకుండా.. కస్టడీని పొడిగిస్తూ.. కవితను జైలులోనే ఉండేలా చేస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.

నిజంనిప్పులాంటిది

May 07 2024, 17:41

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ రిలీఫ్ !

- తగ్గనున్న భానుడి భగభగ

- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయంటూ ఐఎండి వెల్లడి

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది...

వచ్చే మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Rains) పడే అవకాశముందని హైదరాబాద్‌ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అన్ని జిల్లాల్లో సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించకపోవచ్చని వివరించింది. 

నేడు నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే.. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి . 

ఏపీలో ఇలా..!

విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడతాయని తెలిపింది. 

మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఇంకా గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

వడగళ్ల వానలతో రైతులకు పంట నష్టమే !

అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం కొనసాగింది. ప్రధానంగా రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో గాడ్పులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. 

కాగా, విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులు వీచాయి. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

నిజంనిప్పులాంటిది

May 07 2024, 17:34

అన్నా, చెల్లెళ్ళ సెంటిమెంట్ రిపీటవుతుందా ?

పార్లమెంటు ఎన్నికల్లో అన్నా చెల్లెళ్ళు రాహుల్ గాంధి, ప్రియాంకగాధీల సెంటిమెంటు కాంగ్రెస్ కు వర్కవుటవుతుందా ? ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఇద్దరు కూడా విడివిడిగా చెరో 15 సార్లు పర్యటించారు. పర్యటించిన ప్రతిసారి పార్టీ వీళ్ళతో తక్కువలో తక్కువ రెండ రెండు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయించింది. అనేక అంశాలకు తోడు వీళ్ళ ఆకర్షణ, ప్రచారం కూడా కలిసొచ్చే అవకాశం .

అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకలతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయిస్తోంది. ఇప్పటికే ఒక విడత అన్నా, చెల్లెళ్ళు ప్రచారం చేశారు.తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగసభలో రాహుల్ కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టోను విడుదల చేసి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు . ఈమధ్యనే నిర్మల్, గద్వాలలో జరిగిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. 9వ తేదీన కరీంనగర్, కూకట్ పల్లి, సరూర్ నగర్ బహిరంగసభల్లో రాహుల్ పాల్గొంటున్నారు. అలాగే 10వ తేదీన కామారెడ్డి, షాద్ నగర్, తాండూరు బహిరంగసభల్లో పాల్గొననున్నారు . 11వ తేదీ సాయంత్రంతో ప్రచారం పూర్తయిపోతుంది కాబట్టి అవకాశం ఉంటే ఇద్దరితోను హైదరాబాద్ నగరంలో భారీ రోడ్ షోతో ఎన్నికల ప్రచారం ముగియనుంది . 

పార్టీ ఎన్నికల ప్రచారంలో గ్యారెంటీగా పార్టీ గెలుస్తుందని అనుకున్న నియోజకవర్గాల్లో అన్నా, చెల్లెళ్ళతో ప్రచారంచేయించలేదు. ప్రత్యర్ధుల నుండి టఫ్ ఫైట్ ఉండి, గెలుపు విషయంలో వెనకబడ్డామని అనుకున్న నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువ ప్రచారం చేయించింది

మొత్తంమీద రాహుల్, ప్రియాంక ప్రచారం వల్ల కాంగ్రెస్ అభ్యర్ధులు లబ్దిపొందుతారని, గెలుపు అవకాశాలు ఎడ్జిల ఉన్న చోట్ల గెలుపు గ్యారెంటీ అని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

నిజంనిప్పులాంటిది

May 07 2024, 17:26

రేవంత్ రెడ్డి సర్కార్ కు ఎదురుదెబ్బ !

- బ్యాంక్ ఖాతాల్లో పడతాయనుకుంటే ట్విస్టు

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. నిన్ననే ఐదెకరాల పైబడి వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు నిదులు విడుదల చేసినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతలోనే.. రైతుభరోసా ప్రక్రియను ఆపేయాలంటూ ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ పేర్కొంది. పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఆదేశించింది.

రైతు భరోసా నిధుల (Rythu Bharosa Funds) విడుదలపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ (Polling Day) ముగిసిన తర్వాతే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని.. అప్పటివరకు రైతు భరోసాను ఆపేయాలని రేవంత్ రెడ్డి సర్కారును ఆదేశించింది. రైతు భరోసా విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఎన్‌ వేణుకుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ సీఎం రేవంత్‌ రెడ్డి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది.

మరోవైపు.. ఐదు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ కూడా చేపట్టింది. ఇందుకోసం.. 2 వేల కోట్లకు పైగా నిధులు సమీకరించి.. విడుదల చేసినట్టు పేర్కొంది. అంతేకాదు.. ఈ ప్రక్రియ 3 రోజుల్లోనే పూర్తవుతుందని కూడా అధికారులు భావించారు. కాగా.. ప్రస్తుతం ఈసీ ఇచ్చిన ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది.

అయితే.. రైతులకు పెట్టుబడి సాయం విషయంలో ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మే 9వ తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా నిధువు విడుదల చేస్తామంటూ పలు ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటాన్ని కోడ్ ఉల్లంఘనగా భావించిన ఈసీ.. కీలక ఆదేశాలు జారీ చేసింది.

నిజంనిప్పులాంటిది

May 07 2024, 17:19

రాష్ట్రంలో రసవత్తరంగా లోక్ సభ ఎన్నికల ప్రచారం !*

- నేడు కరీంనగర్‌కు రాహుల్ గాంధీ, రేపు ప్రధాని మోదీ రాక, 9,10 తేదీల్లో కేసీఆర్ పర్యటనలు

పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అగ్రనేతలు క్యూ కట్టారు. వరుసగా కాంగ్రెస్, బిజేపి, బిఆర్ఎస్ నేతలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటనలతో ప్రచారం చేస్తున్న అభ్యర్థులతోపాటు నాయకులు, ఆఖరి మోఖ అన్నట్లు అగ్రనేతల పర్యటనలు ఖరారయ్యారు.

మే 7న మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కరీంనగర్ లో జరిగే కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొంటారు. 8వ తేదీ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు.

మే 9, 10 తేదీల్లో రెండురోజుల పాటు బస్సుయాత్రతో బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రోడ్ తో కరీంనగర్, సిరిసిల్లలో ప్రచారం నిర్వహించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లలో ఆయా పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి ఐదు జన జాతర సభలు

ఎన్నికల ప్రచారంలో బాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నాలుగు జనజాతర సభలు నిర్వహించారు. మరోసభకు సిద్దమయ్యారు.

ఏప్రిల్ 30న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జమ్మికుంటలో జనజాతర నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మే 1న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో జన జాతరతో ప్రచారం నిర్వహించారు.

3న పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో, అదే రోజు రాత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల లో జన జాతర సభతో కేంద్రంలోని బిజేపి ప్రభుత్వతీరు, పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కేసిఆర్ వైఖరి బిఆర్ఎస్ తీరును విమర్శించారు. మళ్ళీ రాహుల్ గాంధీతో కలిసి ఏడున మంగళవారం సాయంత్రం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే జనజాతర సభలో పాల్గొంటున్నారు.

జగిత్యాల నుంచి జైత్రయాత్ర కు మోదీ శ్రీకారం

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రచార శంఖారావం పూరించారు. మార్చి 18న జగిత్యాల లో కరీంనగర్ నిజామాబాద్, పెద్దపల్లి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన భారీ బహిరంగ సభతో సమరశంఖం పూరించారు.

ముగ్గురు అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, గోమాసె శ్రీనివాస్ లను ప్రజలకు పరిచయం చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో కమలనాధులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడంతోపాటు అదనంగా పెద్దపల్లిలో సైతం కాషాయజెండా ఎగుర వేయాలని కసరత్తు చేస్తున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా సోమవారం పెద్దపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. 8న మోదీ మరోసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దక్షిణకాశీగా పేరొందిన వేములవాడకు చేరుకుని శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభలో పాలొంటారు.

...మరో రెండు రోజులు కేసిఆర్ పర్యటన …!

గులాబీ దళపతి కేసీఆర్ కు అచ్చోచ్చిన కలిసొచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే పార్లమెంట్ ఎన్నికల కదనభేరీ మ్రోగించారు. బస్సు యాత్రతో రోడ్ షోలు చేపట్టిన కేసిఆర్, నామినేషన్ ల ప్రక్రియ ముగియగానే ఇప్పటికే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్రతో ప్రచారం నిర్వహించారు.

మే 2న జమ్మికుంటలో రోడ్ షో ఉండగా ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు నిషేధం విధించడంతో మే 3న రాత్రి 8 గంటల తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలోని గోదావరిఖనిలో రోడ్ షో తో ప్రచారం నిర్వహించారు. మరుసటి రోజు 4న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వీణవంకకు చేరుకుని రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు 5న హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంతో ప్రచారం సాగించారు.

చివరగా బస్సు యాత్రతో ఈనెల9న మళ్ళీ కరీంనగర్ కు చేరుకుని కరీంనగర్ లో రోడ్ షో తో ప్రచారం నిర్వహించి ఆ రోజు ఉత్తర తెలంగాణ భవన్ లో బస చేసి మరుసటి రోజు 10న సిరిసిల్లలో బస్సు యాత్రతో రోడ్ షో ద్వారా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజులు ప్రచారం చేసిన కేసిఆర్ మరో రెండు రోజులు ఆఖరి మోఖ గా ఉమ్మడి జిల్లాలో ప్రచారం సాగిస్తుండడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

పార్టీల అగ్రనేతలు వరుస కట్టి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తు ఎన్నికల ప్రచారం సాగిస్తుండడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కీ రోల్ పోషిస్తుందనే ప్రచారం సాగుతుంది.

నిజంనిప్పులాంటిది

May 07 2024, 17:16

ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన మాజీ సీఎం కేసిఆర్

- ఫోన్ ట్యాపింగ్ ఆరోపణే కాదు

- ఆ వ్యవహారంతో మాకు సంబంధం లేదు

- మాజి సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందని అనుకోలేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదికలివ్వడం అత్యంత సహజ పరిణామమన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఆరోపణే కాదని ఆయన కొట్టి పడేశారు.

పార్లమెంట్ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా.. పలు పార్టీల నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాలు సాధించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లు ట్యాపింగ్ చేయించారని మండిపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు కాగా.. విచారణ కొనసాగుతోంది. ఇదే క్రమంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కీలక ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నారు.

ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఓ ప్రముఖ మీడియా దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదికలివ్వడం అత్యంత సహజ పరిణామమని అన్నారు. సీఎం, ఇతర మంత్రుల చేతికి ఆ రిపోర్ట్‌లు వస్తాయని.. కానీ, వాళ్లు ట్యాపింగ్‌ చేశారా? లేదా? అనేది మాకేలా తెలుస్తుందని అన్నారు. అది తమ పరిధిలోకే రాదని.. ఫోన్‌ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత తెలివితక్కువగా ఆలోచిస్తుందని తాను అనుకోలేదని చెప్పారు.

తమ పదేళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించామని.. ఐదు నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్‌ రాచిరంపాన పెట్టిందని మండిపడ్డారు. ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా కనిపిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలను రెఫరెండమన్న సీఎం రేవంత్ తోక ముడిచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి వస్తుందని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే కొలువుదీరనుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని.. సంకీర్ణ ప్రభుత్వంలో తాము కీ రోల్ పోషిస్తామన్నారు.

ప్రధాని మోదీ వికృతరూపానికి ఢిల్లీ మద్యం కేసు నిదర్శనమని కేసీఆర్ ఫైరయ్యారు. ఆడబిడ్డ అని చూడకుండా అప్రజాస్వామికంగా, అరాచకంగా, క్రూరంగా తన కుమార్తె కవితను జైళ్లో పెట్టించారనన్నారు. మోదీ వికృత పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడతారని జోష్యం చెప్పారు.

నిజంనిప్పులాంటిది

May 06 2024, 15:11

తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. భానుడి భగభగలు నుంచి ఉపశనం..

_ మరో రెండు రోజులు వర్షాలు..

భానుడు భగభగలు, ఎండ వేడి, వడగాల్పులు తో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

మరో వైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.