నిజంనిప్పులాంటిది

Jun 02 2024, 09:33

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం..!!

- అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సోనియా గాంధీ 

- సోనియమ్మ లేకుండానే ఆవిర్భావ వేడుకలు

మరికాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సంరంభం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు.

పోలీస్ సిబ్బందికి అవార్డులను అందజేస్తారు. ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రావడం లేదని తెలుస్తోంది. కానీ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. 

ఉదయం 9.35లకు పరేడ్ గ్రౌండ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వస్తారు.

9.55కు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ స్వాగతం

10 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణ

10.35కు తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఆవిష్కరణ

10.38కు సోనియా గాంధీ ప్రసంగం (షెడ్యూల్‌లో ఉంది. అనారోగ్య కారణాల వల్ల హాజరుకావడం లేదు)

10.43కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం11.08కు పోలీస్ సిబ్బందికి అవార్డుల ప్రదానం

తెలంగాణ ఆవిర్భవ వేడుకల నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. ఆవిర్భావ వేడుకల కోసం జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలొస్తున్నారు. ఆ క్రమంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 02 2024, 08:40

నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు.

హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో వేడుకలు. 

పరేడ్‌ గ్రౌండ్స్‌ వేడుకల్లో పాల్గొననున్న గవర్నర్‌, సీఎం రేవంత్ రెడ్డి. 

సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు.

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Jun 01 2024, 19:18

జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు..!

•వాహనదారులకు అలర్ట్‌..

•ట్రాఫిక్‌ రూల్స్‌లో మార్పులు..!

ఇక మే నెల ముగిసింది. జూన్‌ నెల ప్రారంభం కానుంది. జూన్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఒకవైపు దేశ పొలిటికల్ కారిడార్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. మరోవైపు, మొదటి తేదీ నుండి మీ జేబుకు సంబంధించిన అనేక విషయాలలో మార్పులు ఉండబోతున్నాయి. గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు మొదటి తేదీ ఉదయాన్నే నిర్ణయించబడతాయి..

 ఒకటో తేదీ నుంచి ఆధార్‌కు సంబంధించిన నిబంధనలలో కూడా మార్పులు రానున్నాయి. దీంతోపాటు ట్రాఫిక్ రూల్స్‌లో కూడా అనేక మార్పులు రానున్నాయి. వీటిని పాటించకుంటే సామాన్యుల జేబులపై పెనుప్రభావం పడుతుంది.

జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో కూడా చెప్పుకుందాం.

గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు: గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలో ప్రతి నెలా ఒకటో తేదీన మార్పు ఉంటుంది. దేశీయ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి. జూన్ 1న రెండు రకాల గ్యాస్ సిలిండర్ల ధరలో మార్పు ఉండవచ్చు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై డేటా ప్రకారం, గృహ గ్యాస్ సిలిండర్ ధరలో చివరిసారిగా మార్చి 9న తగ్గుదల కనిపించింది. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లు చౌకగా మారాయి.

ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్‌పై ఉపశమనం: సామాన్యులకు గొప్ప ఉపశమనం ఇస్తూ, UIDAI ఉచిత ఆన్‌లైన్ ఆధార్ అప్‌డేట్‌ తేదీని జూన్ 14 వరకు పొడిగించింది. అంటే ఎవరైనా ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకుంటే ఒక్కో అప్ డేట్ కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

25 వేల జరిమానా విధించే నిబంధన: మరోవైపు, మైనర్ వాహనం నడుపుతున్నట్లు తేలితే, అతనికి భారీ జరిమానా విధించబడుతుంది. ప్రస్తుతం, దేశంలో వాహనం నడపడం లేదా లైసెన్స్ పొందే వయస్సు 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ. మైనర్ ఇలా చేస్తే రూ.25,000 జరిమానా విధించవచ్చు. అలాగే, అతనికి 25 ఏళ్లు వచ్చే వరకు ఎలాంటి లైసెన్సు లభించదు.

ట్రాఫిక్ రూల్స్‌లో కూడా మార్పులు: జూన్ 1 నుంచి ట్రాఫిక్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్ ప్రకారం.. అతి వేగంతో వాహనం నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడిపితే రూ.100 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

నిజంనిప్పులాంటిది

Jun 01 2024, 19:16

అవమానించారు ... నేను రాను ..!

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(KCR)ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలకు తాను హాజరుకాబోవడం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. అందుకుగల కారణాలను పేర్కొంటూ సీఎం రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) శనివారం బహిరంగ లేఖ రాశారు.

అమరుల చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ(Congress).. ప్రస్తుతం వారి పేరు చెబుతూ రాజకీయాలు చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను ప్రజలు మరువరని అన్నారు. రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పాత్రను కాంగ్రెస్ సర్కార్ తక్కువ చేసి చూపుతోందని.. ఇది రాష్ట్ర సాధకుడైన తనకు అవమానమని.. అందుకే వేడుకలకు హాజరుకావట్లేదని వెల్లడించారు.

ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన నేను మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమనీ, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా, కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్ర్యాన్ని నేను మొట్టమొదట నిరసిస్తున్నాను. 1969 నుండీ ఐదు దశాబ్దాలు, భిన్నదశలలో, భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. 

చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం. బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ప్రజా పాలన అని చెబుతూ ఒక్క హామీ నెరవేర్చకుండా పబ్బం గడుపుతున్నారు. ముందు వాటిని నెరవేర్చండి" అంటూ కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 01 2024, 19:14

లోక్‌సభ ఎన్నికలు సమాప్తం.. ముగిసిన ఏడో దశ పోలింగ్

లోక్‌సభ ఎన్నికలు-2024లో (Lok Sabha Elections 2024) భాగంగా.. ఏడో దశ పోలింగ్ ముగిసింది. జూన్ 1న (శనివారం) ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో.. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు 44 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ (ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా) ఫలితాలు రానున్నాయి.

తొలి దశ: ఏప్రిల్ 19వ తేదీ :20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 101 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. తొలి దశలో మొత్తం 64 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇక సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది.

రెండో దశ: ఏప్రిల్ 26వ తేదీ: 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ రెండో దశలో మొత్తం 60.96 శాతం పోలింగ్ నమోదు అయింది

మూడో దశ: మే 7వ తేదీ: 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ మూడో దశలో మొత్తం 64.58 శాతం పోలింగ్ నమోదు అయింది.

నాలుగో దశ: మే 13వ తేదీ: 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నాలుగో దశలో మొత్తం 69.16 శాతం పోలింగ్ నమోదు అయింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ దశలోనే.. ఒకే సారి జరిగాయి.

అయిదో దశ: మే 20వ తేదీ: 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు పోలింగ్ జరిగింది. ఈ అయిదో దశలో మొత్తం 62 శాతం పోలింగ్ నమోదు అయింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. ఆ అసెంబ్లీకి తొలి దశ పోలింగ్ జరిగింది.

ఆరో దశ: మే 25వ తేదీ: 8 రాష్ట్రాలు, కేంద్రాపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఆరో దశలో మొత్తం 59.06 శాతం పోలింగ్ నమోదు అయింది. ఈ దశలో ఒడిశా అసెంబ్లీకి రెండో దశ పోలింగ్ జరిగింది.

ఏడో దశ: జూన్ 01వ తేదీ: 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ ఏడో దశలో సాయంత్రం 5.00 గంటల వరకు 58.34 శాతం పొలింగ్ నమోదు అయింది. ఒడిశా అసెంబ్లీకి మూడో దశ లేదా తుది దశ పోలింగ్ పూర్తి అయింది.

నిజంనిప్పులాంటిది

Jun 01 2024, 12:43

నేడే కొండగట్టు అంజన్న జయంతి ..!

కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.

అంజన్న జయంతి వేడుకలల్లో భాగంగా భద్రాచలం సీతారాముల దేవస్థానం తరుపున ఈవో రమాదేవి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా కళాకారులతో నిర్వహించిన శోభాయాత్రతో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. అనంతరం అర్చకులు.. ఆలయంలోని ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు.

మూడు రోజుల పాటు యాగశాలలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞం వైభవంగా నిర్వహించనున్నారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

నిజంనిప్పులాంటిది

Jun 01 2024, 12:41

రేషన్ కార్డు ఎప్పుడిస్తారు సారు ..?

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ కార్డులు లేకపోవడంతో గత ప్రభుత్వ హయాం నుంచి అనేక మంది సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు.

రేషన్‌ కార్డులు లేకపోవడంతో గత ప్రభుత్వ హయాం నుంచి అనేక మంది సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చింది.

ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. వివిధ కేటగిరీల కింద ఆరు గ్యారంటీలకు 1.92 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తెల్లరేషన్‌ కార్డు కోసం ఆప్షన్‌ ఇవ్వకపోవడంతో ఆరు గ్యారంటీల దరఖాస్తులతోపాటు విడిగా తెల్ల కాగితాలపైనే రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు సమర్పించారు.

తెల్లరేషన్‌ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఆశలు చిగురింపజేస్తున్నా స్పష్టత మాత్రం రావడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం లక్షా 73 వేల 745 రేషన్‌ కార్డులు ఉన్నాయి. 4,97,103 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఆహార భద్రత కార్డులు 1,59,854, అంత్యోదయ కార్డులు 13,684, అన్నపూర్ణ కార్డులు 207 ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ ముగిసిన తరువాత రేషన్‌ కార్డులు ఇస్తారని లబ్ధిదారులు ఆశగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డులు రాకపోగా కనీసం ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చలేదు.

చేర్పులు, మార్పులు కూడా లేవు. జిల్లాలో చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులు 20,606 పెండింగ్‌లో ఉన్నాయి. రేషన్‌ కార్డుల్లో పిల్లల పేర్లు, కోడళ్ల పేర్లు చేర్చాలంటూ వేలాది మంది కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటితోపాటు గతంలోనే రేషన్‌ కార్డు కోసం 40 వేల మంది వరకు అర్హులు దరఖాస్తు చేసుకున్నారు.

2018 సంవత్సరానికి ముందు రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 2021 ఆగస్టులో 2271 మందికి రేషన్‌ కార్డులు అందించారు. ఆ తరువాత కనీసం మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా అందించలేకపోయారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు అర్హత ఉన్నా తెల్లరేషన్‌కార్డు లేకపోవడంతో అనేకమంది డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల్ల స్థలాలు అందుకోలేకపోయారు. మరోవైపు వివిధ ధ్రువీకరణ పత్రాలు పొందే సమయంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు కూడా రేషన్‌ కార్డును పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో దాదాపు 40 వేల మంది అర్హులు దూరమయ్యే పరిస్థితి.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే బోయినపల్లి మండలంలో 12,808 మంది, చందుర్తి 11,737, ఇల్లంతకుంట 16,598, గంభీరావుపేట 15,567, కోనరావుపేట 14,802, ముస్తాబాద్‌ 16,127, రుద్రంగి 5404, తంగళ్లపల్లి 16,766, వీర్నపల్లి 4741, వేములవాడ 7854, వేములవాడ రూరల్‌ 8050, ఎల్లారెడ్డిపేట 17,030, సిరిసిల్ల మున్సిపాలిటీలో 30,146, వేములవాడ మున్సిపాలిటీలో 14,987 మంది దరఖాస్తు చేసుకున్నారు.

నిజంనిప్పులాంటిది

Jun 01 2024, 12:39

ఫోన్‌పేలో ఇక‌పై హోమ్, గోల్డ్‌ లోన్స్‌

కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్‌ల‌ను తెచ్చిన ఫోన్‌పే

అందుబాటులోకి మ్యూచువల్ ఫండ్, గోల్డ్, బైక్, కారు, హోమ్/ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ లోన్లు

ఇందుకోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో సంస్థ‌ భాగ‌స్వామ్యం

ఫోన్‌పే త‌న‌ కస్టమర్ల కోసం కొత్తగా ఆరు విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. 

ఫోన్‌పే వినియోగదారులకు మ్యూచువల్ ఫండ్, గోల్డ్, బైక్, కారు, హోమ్/ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ లోన్లను అందిస్తున్నట్టు గురువారం సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

ఇందుకోసం బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు), టాటా క్యాపిటల్, ఎల్‌&టీ ఫైనాన్స్, హీరో ఫిన్‌కార్ప్, ముత్తూట్ ఫిన్‌కార్ప్, డీఎంఐ హౌసింగ్ ఫైనాన్స్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, రూపే, వోల్ట్ మనీ, గ్రాడ్‌రైట్ వంటి ఫిన్‌టెక్ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నట్టు ఫోన్‌పే ప్ర‌క‌టించింది. ప్రస్తుతం 15 సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని, వచ్చే త్రైమాసికం నాటికి మరో 10 సంస్థల‌ను భాగ‌స్వాములుగా చేర్చుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

ఫోన్‌పే లెండింగ్ సీఈఓ హేమంత్ గాలా మాట్లాడుతూ.. "సెక్యూర్డ్ లోన్ల‌ను డిజిటల్ ప‌ద్ద‌తిలో మంజూరు చేయ‌డానికి రుణదాతలు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. క‌స్ట‌మ‌ర్లు కూడా వేగంగా డిజిటలైజేషన్‌కు అల‌వాటు ప‌డుతున్నారు. అందుకే లెండింగ్ ఎకోసిస్టమ్‌తో పని చేసే కస్టమర్ల‌కు సెక్యూర్డ్ లోన్స్‌ను అందించ‌డానికి ఇది గొప్ప సమయం అని మా న‌మ్మ‌కం" అని అన్నారు.

నిజంనిప్పులాంటిది

May 31 2024, 15:36

Gold smuggling: ప్రైవేట్ పార్ట్‌లో కేజీ బంగారాన్ని దాచిన ఎయిర్ హోస్టెస్

కేరళలోని కన్నూర్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ ఎయిర్‌ హోస్టెస్‌ నుంచి కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దీని తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్న ఎయిర్ హోస్టెస్ 960 గ్రాముల బంగారాన్ని తన పురీషనాళంలో దాచినట్లు గుర్తించబడింది మరియు మే 28 న అరెస్టు చేయబడింది కన్నూర్‌లో దిగిన విమానంలో మస్కట్‌ క్యాబిన్‌ సిబ్బంది.

ఒక నిర్దిష్ట గమనికపై, కోల్‌కతాకు చెందిన సురభి ఖాటూన్ మంగళవారం మస్కట్ నుండి విమానంలో వచ్చినప్పుడు DRI అధికారులు ఆమెను ఆపారు. అతడిని పరిశీలించగా మలద్వారంలో దాచిన 960 గ్రాముల బంగారం బయటపడింది. తర్వాత ఖాతూన్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

సహచరులను గుర్తించడానికి మరియు ఆపరేషన్‌తో ముడిపడి ఉన్న బంగారం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను కనుగొనడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని DRI తెలిపింది.

మూలం ప్రకారం, స్మగ్లింగ్ కార్యకలాపాలకు తనను నియమించిన కొంతమంది వ్యక్తుల పేర్లను సురభి వెల్లడించింది. ఇతర క్యాబిన్ సిబ్బంది స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా DRI దర్యాప్తు చేస్తోంది. స్మగ్లింగ్‌లో మరికొంత మంది సిబ్బంది ప్రమేయం ఉందన్న ఆరోపణలపై విచారణలో వివరాలు వెల్లడయ్యాయని, రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.

నిజంనిప్పులాంటిది

May 31 2024, 12:56

జయలలితను 'హిందుత్వ నాయకురాలు' అని అన్నామలై; శశికళ, ఏఐఏడీఎంకే నిప్పులు చెరిగారు: 'ఆమెకు దేవుడిపై నమ్మకం ఉంది, మత విశ్వాసాలు లేవు'

1992లో జయలలిత కరసేవ అనేది తప్పు పదం కాదని అన్నారు.

"బాబ్రీ కూల్చివేత తర్వాత 3 రాష్ట్రాల బిజెపి ప్రభుత్వాల తొలగింపును ఆమె వ్యతిరేకించారు"

"1993లో, ఆమె రామమందిర నిర్మాణానికి అనుకూలంగా సంతకాల ప్రచారాన్ని నిర్వహించింది"

"భారతదేశంలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మించలేమా, పాకిస్తాన్‌లో నిర్మించడం సాధ్యమేనా" అని కూడా ఆమె ప్రశ్నించారు.

"ఆమె యూనిఫాం సివిల్ కోడ్‌కు మొగ్గు చూపారు. రామసేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించడానికి కూడా ఆమె నిలబడింది"

"1993లో b0mb పేలుడు కారణంగా చెన్నైలోని RSS ప్రధాన కార్యాలయం చదును చేయబడినప్పుడు, ఆమె దానిని ప్రభుత్వ నిధుల నుండి నిర్మించడానికి ముందుకొచ్చింది"

"ఆమె కఠినమైన మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించింది మరియు వేదపాటశాలను కూడా ఏర్పాటు చేసింది"

"ఈరోజు EPS తాను కాళ్ళ నొప్పి కారణంగా రామమందిరాన్ని సందర్శించలేనని చెబుతున్నాడు. జయలలిత & హిందూత్వపై బహిరంగ చర్చకు ADMK నాయకులను నేను ఆహ్వానిస్తున్నాను"

"జయలలిత పూర్వ యుగంలో, రాష్ట్రంలోని హిందూ ఓటర్లు జయలలిత తన హిందూ గుర్తింపును బహిరంగంగా ప్రదర్శించినందున బిజెపి కంటే జయలలితను ఎన్నుకున్నారు" అన్నామలై