WestBengalBangla

Apr 23 2024, 19:04

फिल्म के हीरो और हीरोइन "रुस्लान" के प्रमोशन के लिए कोलकाता में हैं

# Entertainment # Hindi #Ruslaan#Stretbuzz

Khabar kolkata: आज कोलकाता के एक पांच सितारा होटल में "रुस्लान" के प्रमोशन के मौके पर फिल्म के हीरो आयुष शर्मा और हीरोइन सुश्री मिश्रा मौजूद थे. यह फिल्म 26 अप्रैल को देश के सभी सिनेमाघरों में रिलीज होगी. इस फिल्म की नायिका सुश्री मिश्रा की यह पहली बड़े पर्दे की फिल्म है. फिल्म की शूटिंग देश-विदेश में अलग-अलग जगहों पर की गई है. इस फिल्म को बनाने में लगभग दो साल का समय लगा।

फोटो: संजय हाजरा.

madagoni surendar

Mar 28 2023, 15:42

ఏపీ:ఎస్సీ సబ్ ప్లాన్ పనుల కోసం రూ.13112 కోట్ల వ్యయం.ఫిబ్రవరి మాసాంతానికి 70.81% నిధుల ఖర్చు • 100% నిధులు ఎస్సీలకు చేరేలా అధికారులు పని చేయాలి.

ఎస్సీ సబ్ ప్లాన్ పనుల కోసం రూ.13112 కోట్ల వ్యయం

• ఫిబ్రవరి మాసాంతానికి 70.81% నిధుల ఖర్చు

• 100% నిధులు ఎస్సీలకు చేరేలా అధికారులు పని చేయాలి

• నోడల్ ఏజెన్సీ సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున.

Stretbuzz news:

అమరావతి, మార్చి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.18518.29 కోట్ల లో గత ఫిబ్రవరి మాసాంతానికి నాటికి 70.81శాతం నిధులు ఖర్చు కావడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం మరింతగా పెరగాలని , ఎస్సీల కోసం కేటాయించిన నిధులన్నీ వారి సంక్షేమానికే ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ సబ్ ప్లాన్(ఎస్సీ కాంపొనెట్)కు చెందిన 30వ నోడల్ ఏజెన్సీ సమావేశంలో నాగార్జున సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ శాఖల్లో 43 శాఖలకు చెందిన అధికార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ శాఖల ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వ్యయం గురించి వివరించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమైన శాఖలకు ప్రభుత్వం రూ.18518.29 కోట్లను ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిందని చెప్పారు. అయితే రాష్ట్రంలోని కొన్ని శాఖలు సబ్ ప్లాన్ ద్వారా తాము ప్రతిపాదించిన పనుల కోసం అదనపు బడ్జెట్ కావాలని కోరడం, ప్రభుత్వం ఆ విధంగానే అదనపు బడ్జెట్ ను కేటాయించడంతో ఈ మొత్తం రూ.20605.44 కోట్లకు చేరిందని తెలిపారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం విషయంలో కొన్ని శాఖలు అంచనాలకు మించి ప్రగతిని సాధిస్తుండగా కొన్ని శాఖలు మాత్రం వెనుకబడి ఉన్నాయని గుర్తించామన్నారు. ఆయా శాఖల పనితీరు ఆధారంగా గ్రేడ్లను నిర్ణయించామన్నారు. 76% నుంచి 100% నిధులను వినియోగించిన శాఖలు ఏ-గ్రేడ్ గాను, 51% నుంచి 75% దాకా నిధులను వినియోగించిన శాఖలను బీ-గ్రేడ్ గానూ,26% నుంచి 50% దాకా నిధులను వాడుకున్న శాఖలను సీ-గ్రేడ్ గాను, 25% వరకూ మాత్రమే నిధుల వినియోగం ఉన్న శాఖలను డీ-గ్రేడ్ గాను గుర్తించామని, ఈ గ్రేడ్ల ఆధారంగానే సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని నాగార్జున వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సబ్ ప్లాన్ నిధుల్లో రూ.13112.36 కోట్లు ఫిబ్రవరి మాసాంతానికి ఖర్చు అయ్యాయని వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల్లో అత్యధికశాతం ఖర్చు చేసిన విద్యుత్, సివిల్ సప్లయిస్, ప్రజారోగ్యం, పరిశ్రమలు, వైద్య విద్య, ఎస్సీ గురుకులాలు, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ, భూ పరిపాలన, వ్యవసాయం, బలహీనవర్గాల గృహనిర్మాణం, పంచాయితీరాజ్ తదితర శాఖల పనితీరును ప్రశంసించారు. నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖల పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో వినియోగించుకోని నిధులను మరొక ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం లేదని గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ కారణంగానే సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో ప్రతి రుపాయి కూడా ఎస్సీల ప్రగతికి ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.జయలక్ష్మి, డైరెక్టర్ కే.హర్షవర్ధన్, అడిషనల్ డైరెక్టర్ రఘురామ్, డిప్యుటీ డైరెక్టర్ లక్ష్మీ సుధ తో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

• ఫోటోవార్త: ఎస్సీ సబ్ ప్లాన్ నోడల్ ఏజెన్సీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మేరుగు నాగార్జున.

madagoni surendar

Mar 28 2023, 09:56

న్యూడిల్లీ :కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత

కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత

 

Stretbuzz news.

 

కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత..

న్యూఢిల్లీ : స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయించాలంటూ అడ్వకేట్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇటువంటి అంశాలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయని.. వాటిలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ డి.వై.చంద్రచూడ్​ నేతృత్వంలోని బెంచ్​ ఈ వ్యాఖ్యలు చేసింది.స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయిస్తూ చట్టం చేయాలని తాము పార్లమెంటుకు మాండమస్​(ఎక్స్​ట్రాడినరీ రిట్) ను జారీ చేయలేమని బెంచ్​ స్పష్టం చేసింది.

ఒకవేళ తాము ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరిస్తే.. దానికి అనుగుణంగా కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయిస్తూ చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించినట్లు అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లు, మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే ఇందుకు అనుగుణంగా మహిళల కనీస వివాహ వయసును కూడా 21 ఏళ్లకు పెంచాలని పిటిషనర్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ కోరారు. పురుషాధిక్య దృక్పథంతోనే మనదేశంలో పురుషుల వివాహ వయసును ఎక్కువగా, మహిళల వివాహ వయసును తక్కువగా ఉంచారని పిటిషన్ లో​ పేర్కొన్నారు.

WestBengalBangla

Apr 23 2024, 19:04

फिल्म के हीरो और हीरोइन "रुस्लान" के प्रमोशन के लिए कोलकाता में हैं

# Entertainment # Hindi #Ruslaan#Stretbuzz

Khabar kolkata: आज कोलकाता के एक पांच सितारा होटल में "रुस्लान" के प्रमोशन के मौके पर फिल्म के हीरो आयुष शर्मा और हीरोइन सुश्री मिश्रा मौजूद थे. यह फिल्म 26 अप्रैल को देश के सभी सिनेमाघरों में रिलीज होगी. इस फिल्म की नायिका सुश्री मिश्रा की यह पहली बड़े पर्दे की फिल्म है. फिल्म की शूटिंग देश-विदेश में अलग-अलग जगहों पर की गई है. इस फिल्म को बनाने में लगभग दो साल का समय लगा।

फोटो: संजय हाजरा.

madagoni surendar

Mar 28 2023, 15:42

ఏపీ:ఎస్సీ సబ్ ప్లాన్ పనుల కోసం రూ.13112 కోట్ల వ్యయం.ఫిబ్రవరి మాసాంతానికి 70.81% నిధుల ఖర్చు • 100% నిధులు ఎస్సీలకు చేరేలా అధికారులు పని చేయాలి.

ఎస్సీ సబ్ ప్లాన్ పనుల కోసం రూ.13112 కోట్ల వ్యయం

• ఫిబ్రవరి మాసాంతానికి 70.81% నిధుల ఖర్చు

• 100% నిధులు ఎస్సీలకు చేరేలా అధికారులు పని చేయాలి

• నోడల్ ఏజెన్సీ సమావేశంలో మంత్రి మేరుగు నాగార్జున.

Stretbuzz news:

అమరావతి, మార్చి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.18518.29 కోట్ల లో గత ఫిబ్రవరి మాసాంతానికి నాటికి 70.81శాతం నిధులు ఖర్చు కావడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం మరింతగా పెరగాలని , ఎస్సీల కోసం కేటాయించిన నిధులన్నీ వారి సంక్షేమానికే ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సచివాలయంలో మంగళవారం జరిగిన ఎస్సీ సబ్ ప్లాన్(ఎస్సీ కాంపొనెట్)కు చెందిన 30వ నోడల్ ఏజెన్సీ సమావేశంలో నాగార్జున సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ శాఖల్లో 43 శాఖలకు చెందిన అధికార ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ శాఖల ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వ్యయం గురించి వివరించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రధానమైన శాఖలకు ప్రభుత్వం రూ.18518.29 కోట్లను ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిందని చెప్పారు. అయితే రాష్ట్రంలోని కొన్ని శాఖలు సబ్ ప్లాన్ ద్వారా తాము ప్రతిపాదించిన పనుల కోసం అదనపు బడ్జెట్ కావాలని కోరడం, ప్రభుత్వం ఆ విధంగానే అదనపు బడ్జెట్ ను కేటాయించడంతో ఈ మొత్తం రూ.20605.44 కోట్లకు చేరిందని తెలిపారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం విషయంలో కొన్ని శాఖలు అంచనాలకు మించి ప్రగతిని సాధిస్తుండగా కొన్ని శాఖలు మాత్రం వెనుకబడి ఉన్నాయని గుర్తించామన్నారు. ఆయా శాఖల పనితీరు ఆధారంగా గ్రేడ్లను నిర్ణయించామన్నారు. 76% నుంచి 100% నిధులను వినియోగించిన శాఖలు ఏ-గ్రేడ్ గాను, 51% నుంచి 75% దాకా నిధులను వినియోగించిన శాఖలను బీ-గ్రేడ్ గానూ,26% నుంచి 50% దాకా నిధులను వాడుకున్న శాఖలను సీ-గ్రేడ్ గాను, 25% వరకూ మాత్రమే నిధుల వినియోగం ఉన్న శాఖలను డీ-గ్రేడ్ గాను గుర్తించామని, ఈ గ్రేడ్ల ఆధారంగానే సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని నాగార్జున వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సబ్ ప్లాన్ నిధుల్లో రూ.13112.36 కోట్లు ఫిబ్రవరి మాసాంతానికి ఖర్చు అయ్యాయని వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల్లో అత్యధికశాతం ఖర్చు చేసిన విద్యుత్, సివిల్ సప్లయిస్, ప్రజారోగ్యం, పరిశ్రమలు, వైద్య విద్య, ఎస్సీ గురుకులాలు, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ, భూ పరిపాలన, వ్యవసాయం, బలహీనవర్గాల గృహనిర్మాణం, పంచాయితీరాజ్ తదితర శాఖల పనితీరును ప్రశంసించారు. నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖల పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో వినియోగించుకోని నిధులను మరొక ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం లేదని గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ కారణంగానే సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో ప్రతి రుపాయి కూడా ఎస్సీల ప్రగతికి ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.జయలక్ష్మి, డైరెక్టర్ కే.హర్షవర్ధన్, అడిషనల్ డైరెక్టర్ రఘురామ్, డిప్యుటీ డైరెక్టర్ లక్ష్మీ సుధ తో పాటుగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

• ఫోటోవార్త: ఎస్సీ సబ్ ప్లాన్ నోడల్ ఏజెన్సీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మేరుగు నాగార్జున.

madagoni surendar

Mar 28 2023, 09:56

న్యూడిల్లీ :కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత

కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత

 

Stretbuzz news.

 

కనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ ​కొట్టివేత..

న్యూఢిల్లీ : స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయించాలంటూ అడ్వకేట్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇటువంటి అంశాలు పార్లమెంటు పరిధిలోకి వస్తాయని.. వాటిలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ డి.వై.చంద్రచూడ్​ నేతృత్వంలోని బెంచ్​ ఈ వ్యాఖ్యలు చేసింది.స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయిస్తూ చట్టం చేయాలని తాము పార్లమెంటుకు మాండమస్​(ఎక్స్​ట్రాడినరీ రిట్) ను జారీ చేయలేమని బెంచ్​ స్పష్టం చేసింది.

ఒకవేళ తాము ఈ పిటిషన్​ను విచారణకు స్వీకరిస్తే.. దానికి అనుగుణంగా కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయిస్తూ చట్టం చేయాలని పార్లమెంటును ఆదేశించినట్లు అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లు, మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే ఇందుకు అనుగుణంగా మహిళల కనీస వివాహ వయసును కూడా 21 ఏళ్లకు పెంచాలని పిటిషనర్​ అశ్వినీ ఉపాధ్యాయ్​ కోరారు. పురుషాధిక్య దృక్పథంతోనే మనదేశంలో పురుషుల వివాహ వయసును ఎక్కువగా, మహిళల వివాహ వయసును తక్కువగా ఉంచారని పిటిషన్ లో​ పేర్కొన్నారు.