VijayaKumar

May 11 2024, 19:24

పూస బాల కిషన్ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఈరోజు ఉదయం 11:00 గంటలకు గ్రామంలో మహిళలు గ్రామీణ ఉపాధి పని చేస్తుండగా స్వయంగా వారి దగ్గరికి వెళ్లి మహిళలతో మమేకమై వారి కష్టం సుఖాలు తెలుసుకొని మహిళలకు మజ్జిక పంపణి చేసి బాలకిషన్ గారు మాట్లాడుతూ. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలు అయింది ఉపాధి హామీ కూలీలకు ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ మహిళలను అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే ఉపాధి కూలీలకు 400 రూపాయలు వేతనం ఇస్తారు ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం, మరియు 500 రూపాయలకె గ్యాస్ సిలిండర్ 200 యూనిట్స్ ఉచిత కరెంట్, మీకు అందుతున్నాయి పార్టీలకు అతీతంగా ఇల్లు లేని వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీకుఏ కష్టం నష్టం వచ్చిన నేను ముందు ఉండి మిములని ఆదుకుంటాం దేశం లో ప్రజా సామ్యం కూని ఐతున్నది భారత రాజ్యాంగాని మారుస్తాం అనే దృష్టిలో బీజేపీ పార్టీ ఉన్నది కాబట్టి మన హక్కులు మనకు రావాలి మనం స్వాతంత్ర0గ బ్రతకాలంటే దేశం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి త్యాగల పునాధుల మీద ఉన్న కుటుంబంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడం మన లక్ష్యం.... కాబట్టి దయచేసి మే 13న జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సీరియల్ నెంబర్ 03 హస్తం గుర్తు పైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపియాలని కిరణ్ అన్నని గెలిపిస్తే ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మరియు చామల కిరణ్ కుమార్ రెడ్డి చోరువతో అనేక నిధులు తెచ్చి మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం అని తెలియజేసి కూలీలను అభ్యర్ధించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూస బాలకిషన్ గారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీపి పూస బాలమణి గారు, మాజీ సర్పంచ్ కాటపెల్లి యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ గార్ధస్ సురేష్,శివగళ్ల మల్లయ్య, మందడి గోపాల్ రెడ్డి, పెద్దగోని వెంకటేష్ జోగు నర్సింహా, పర్శరాములు , బందెల క్రిస్టఫర్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.



VijayaKumar

May 11 2024, 17:03

ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : AITUC


కార్మిక హక్కులు మరియు చట్టాల పరిరక్షణకై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని భువనగిరి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మరియు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ పిలుపునిచ్చారు. శనివారం రోజున ఇండియ కూటమి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్మికుల అడ్డాల వద్ద తిరిగి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించిన ఏఐటీయూసీ కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ, కేసీఆర్ ఒక్కేటనని అన్నారు, పొరపాటున BRSకి ఓటు వేసిన అది,BJP కే వెళ్తుందని అన్నారు, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సాగిస్తున్న ఎన్నికల ప్రచారం బాహాటంగానే మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతోందని, ఈ నేపథ్యంలోనే బీజేపీ నిసిగ్గుగా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం సిగ్గు చేటు అన్నారు. ఓట్లను సంపాదించడం కోసం కుల, మత భావాలను రెచ్చగొట్టరాదన్నారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను మానుకోవాలని అన్నారు. 13 సోమవారం రోజున జరిగే ఎన్నికలలో కార్మికులందరూ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ లో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కసబ శ్రీనివాస్ రావు, పిట్టల బాలరాజ్, ఏఐటీయూసీ నాయకులు గనబోయిన వెంకటేష్, సామల భాస్కర్, ముదిగొండ బసవయ్య, వల్దాస్ నరసింహ, ఐలయ్య, మల్లేష్, గణేష్, పరశురాములు, కృష్ణా, జగన్, తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

May 11 2024, 16:36

ప్రజల కోసం పోరాడుతున్న ఒక అవకాశం కల్పించండి: భువనగిరి సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్

నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న తనను రాజకీయంగా చూడకుండా ప్రజల కోసం పోరాడే అభ్యర్థిగా ఓటేసి గెలిపించాలని సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈరోజు మండల పరిధిలోని వర్కట్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజా ఉద్యమాల పట్ల అనేక పోరాటాలు నడిపిన నాకు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తూ ఒక అవకాశం కల్పించి ఎంపీగా గెలిపించాలని రాజకీయంగా చూడకుండా ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని కార్పొరేట్లకు పెట్టుబడుదారులకు డబ్బున్న బడా నాయకులకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని ప్రజల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థిగా ముందుకు వచ్చిన తన పట్ల మంచి నిర్ణయం తీసుకొని ఓటు వేసి గెలిపించాలని కోరారు భువనగిరి పార్లమెంటుకు మూడుసార్లు ఇప్పటికే ఎన్నికలు జరిగాయని మూడుసార్లు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఏనాడు గ్రామాలను ప్రజలను పట్టించుకోలేదని అటువంటి వారందరికీ తగిన బుద్ధి ఈ ఎన్నికల్లో చెప్పాలని కోరారు తనను ఎంపీ గా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు భువనగిరి కేంద్రంగా అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్,కలుకూరి రామచందర్,సిపిఎం శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి,మండల కమిటీ సభ్యులు కవిడే సురేష్, భీమనబోయిన జంగయ్య ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు బుచ్చిరెడ్డి, చేగురి నరసింహ,ఆకుల మారయ్య,మాడుగుల వెంకటేశం,రొండి మల్లేశం,నాగేల్లి లక్ష్మయ్య,రొండి రాములు,చేగురి రాములు,మెట్టు లక్షమమ్మ,మాడుగుల కృష్ణవేణి,సిర్పంగి స్వప్న,వేముల జ్యోతి బస్,తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

May 11 2024, 16:32

బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశం గెలుపు కోసం ఎనిమిదవ వార్డులో ఇంటింట ప్రచారం

భువనగిరి పట్టణములో పైళ్ళ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 8వ వార్డ్ రామ్ నగర్ జంఖన్నగూడెం నందగుట్ట సీతానగర్ భువనగిరి పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కామ మల్లేష్ గారి గెలుపు కోసం ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పంగ రెక్క స్వామి, కో అప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబిత గోపాల్ ,ఇట్టబోయిన పావని ,సుదర్శన్, సత్యనారాయణ ,వార్డ్ ప్రజలు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

May 10 2024, 23:31

ప్రజా ఉద్యమ నాయకుడు జహంగీర్ ను ఎంపీగా గెలిపించండి: నారి ఐలయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు

భువనగిరి పార్లమెంట్ కు పోటీ చేస్తున్న అందరి అభ్యర్థుల్లో ప్రజా ఉద్యమాల్లో మెరుగైనవాడుగా ఉన్న ప్రజా నాయకుడు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం రోజున మండల పరిధిలోని వలిగొండ పట్టణం మరియు వెంకటాపురం, వేములకొండ,అరూర్ గ్రామాల్లో సిపిఎం నాయకులు వేరువేరు బృందాలుగా ఏర్పడి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నారీ ఐలయ్య,మాటూరి బాలరాజు లు మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటుకు పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థుల కన్నా మెరుగైనవాడుగా నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజా ఉద్యమ నాయకుడిగా ఉన్న సిపిఎం ఎంపీ అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ కు ఒక్క అవకాశం కల్పించి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు ఈ ప్రాంతంలో గత 35 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న జహంగీర్ పట్ల ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు ప్రజల్లో లేని ఎలాంటి ప్రజా ఉద్యమాలు నిర్వహించని వారందరూ ఎన్నికల్లో డబ్బు మద్యం పరమావధిగా వ్యవహరిస్తూ పోటీ చేస్తున్నారని వారందరినీ ఓడించాలని ప్రజల కోసం పోరాడే జాంగిర్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజా ఉద్యమాలతో సంబంధం లేని కార్పొరేట్ అధిపతులు ముందుకు వచ్చి ప్రజల సమస్యలను ఇబ్బందులను అర్థం చేసుకోలేని వారు ధన బలంతో గెలవాలని చూస్తున్నారని అలాంటి వారందరికీ తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎన్నికల్లో ఉందని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ కూర శ్రీనివాస్, మెరుగు వెంకటేశం, చీర్క శ్రీశైలం రెడ్డి,కల్కూరి రామచందర్,పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ,పట్టణ సీనియర్ నాయకులు కొండూరు సత్తయ్య,సిపిఎం మండల కమిటీ సభ్యులు ఏలే కృష్ణ, కవిడే సురేష్,కర్ణకటి యాదయ్య,నాయకులు కంబాలపల్లి వెంకటేశం, వేముల లక్ష్మయ్య,రాపోతు వెంకులు,షాహిద్,పిట్టల అంజయ్య,వేముల జ్యోతి బస్,గంగాపురం వెంకటేశం,పెద్దబోయిన కాంతయ్య,కంబలపల్లి మహేష్త,మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 10 2024, 23:26

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీలో వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అక్కంపల్లి అవాస గ్రామం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 50 మంది, వెల్వర్తి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కొంతమంది, వలిగొండ మండల కేంద్రంలో పబ్బు ఉపేందర్ బోస్ ఆధ్వర్యంలో 30 మంది, రెడ్ల రేపాక మాజీ సర్పంచ్ మాదా లావణ్య శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో20 మందిఅనిల్ కుమార్ రెడ్డి సమక్షంలోచేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


VijayaKumar

May 10 2024, 22:37

రెడ్డి నాయక్ తండాలో ఇంటింటికి BRS విస్తృత ప్రచారం

భువనగిరి మండలంలో రెడ్డి నాయక్ తండా లో గ్రామశాఖ అధ్వర్యం లో BRS పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశం గెలుపుకోసం ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్ధి క్యామ మల్లేశం  గెలుపుకోసం BRS పార్టీ గ్రామశాఖ అధ్వర్యం లో ఇంటింటికి విస్తృత ప్రచారం   నిర్వహించి, అనంతరం ఉపాధి హామీ కింద పని చేస్తున్న కార్మికుల ధగ్గరకి వెళ్లి కలిసి  క్యామ మల్లేశం గెలుపుకోసం ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ , భువనగిరి ZPTC బీరు మల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షులు ఇస్లావత్ నరేష్ నాయక్, మాజీ సర్పంచ్ మంజి నాయక్, భూక్యా నంద నాయక్, భువనగిరి ఎస్టీ సెల్ అధ్యక్షులు కునుసోత్ గోపి నాయక్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కునుసోత్ నరేష్ నాయక్ మరియు కునుసోత్ వెంకటేష్, గుగులోత్ చిన్నా నాయక్, రవి నాయక్,లింగ నాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు గ్రామశాఖ కార్యకర్తలు పార్టీ పెద్దలు పాల్గొన్నారు.

VijayaKumar

May 10 2024, 20:44

పిల్లల సమస్యలు పట్టించుకోని నాయకుల్లారా... పిల్లలతో రాజకీయ ప్రచారం మానుకోండి: కొడారి వెంకటేష్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు

పిల్లల సమస్యలు పట్టించుకోని నాయకుల్లారా... పిల్లలతో రాజకీయ ప్రచారం మానుకోండి* కొడారి వెంకటేష్ *బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు* విద్యా హక్కు చట్టం వచ్చి 15 సంవత్సరాలు దాటుతున్నా , తరగతి వారి విద్యా సామర్ధ్యాలు అందించడంలో,మౌళిక సదుపాయాల కల్పనలో, భోదన, బోధనేతర సిబ్బంది నియామకాల్లో, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణలో పూర్తిగా విఫలమైన రాజకీయ పార్టీల నాయకులకు ఓట్లు అడిగే అర్హతలు లేవని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పిల్లల సమస్యలు పట్టించుకోని నాయకుల్లారా! ప్రస్తుతం జరుగుతున్న 18వ లోక్ సభ ఎన్నికల్లో పిల్లలతో ప్రచారం చేయించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల నేతలు పిల్లలను ఎన్నికల ప్రచారానికి ,ర్యాలీల్లో, సభలు ,సమావేశాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో వినియోగించడం, పిల్లలచేత పార్టీ జెండాలను పట్టించి ప్రచారం చేయించడం పై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్ లు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించక పోవడం , మౌళిక వసతులు కల్పించకపోవడం వల్ల పేద, మద్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగి పోయే ప్రమాదముందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ/ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు విద్యాప్రమాణాల పెంపుకు , పాఠశాలల్లో మౌళిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వం యుధ్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో "విద్యా వ్యవస్థ ఎమర్జెన్సీ" లో ఉందని, వచ్చే జూన్ నుండి విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం పూనుకోవాలని ఆయన కోరారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన కోరారు.




VijayaKumar

May 10 2024, 20:36

ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలి : బుద్ధుల సునీత తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యురాలు

ఉమ్మడి వరంగల్, ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రజలు, విద్యార్థులు , మేదావులు,ప్రజాస్వామిక వాదులు కృషి చేయాలని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుద్దుల సునీత కోరారు. శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు కలిసి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ ను నామరూపం లేకుండా చేయుటకు నిరంతరం తన గలంతో "క్యూ న్యూస్" వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొందిన తీన్మార్ మల్లన్న ను చట్టసభలకు పంపించే భాద్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు. తెలంగాణలోని విద్యార్థులు ,మేధావులు, ఉపాధ్యాయులు, రిటైర్ ఉద్యోగులు, ప్రతి ఒక్కరూ ఈనెల 27 న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుగా తీన్మార్ మల్లన్న కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్,తీన్మార్ మల్లన్న టీం యాదాద్రి మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 10 2024, 20:30

వలిగొండలో 93.78 లీటర్ల మద్యం, 5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం సీజ్: ఎస్ఐ డి మహేందర్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న 93.78 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై డి మహేందర్ తెలిపారు దీని విలువ రూ.1,03,158 ఉంటుందని తెలిపారు. అలాగే వలిగొండ మండల కేంద్రంలోని నువ్వుల శ్రీను అనే వ్యక్తి అక్రమంగా ఇంట్లో విలువ ఉంచిన 5 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.