Venkatesh1

May 08 2024, 08:12

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో సిద్దారంపురం గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం..
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించి *ఉమ్మడి MP అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారికి, ఉమ్మడి MLA అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారికి ఓటు వేసి వేపించి గెలిపించాలి* అని కోరిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్,ఎంపీటీసీ భర్త సాకే నాగేంద్ర జిల్లా తెలుగుయువత కార్యదర్శి చెన్నమయ్య, నాగేంద్ర, కాటమయ్య, నారాయణస్వామి,ఆదినారాయణ,మారుతీ, చిన్నరాజు, లింగమయ్య,చిన్న మద్దిలేటి,నరసింహులు,కిష్టయ్య, సాకే మహేష్, పెద్దమద్దిలేటి,మాజీ డీలర్ కొండన్న, ,రమేష్, హరి,తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

May 08 2024, 08:04

బుక్కరాయసముద్రంలో ఆలం నరసా నాయుడు మొండిమడుగు కేశవరెడ్డి కే రామలింగారెడ్డి పర్వతనేని శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీ లోకి ఆహ్వానించిన ద్విసభ్య కమిటీ సభ్యులు అలంనరసానాయుడు గారు ముంటిమడుగు కేశవరెడ్డి గారు కె.రామలింగారెడ్డి గారు పర్వతనేని శ్రీదర్ బాబు గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిలుగా పోటీ చేస్తున్న బండారు శ్రావణీ శ్రీ అంభికా లక్ష్మి నారాయణ గారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు..

Venkatesh1

May 08 2024, 07:51

ప్రచార హోరు...'ఫ్యాన్ జోరు' వీరాకు అడుగడుగునా జన నీరాజనం.. 'ఫ్యాన్ ' గుర్తుకు ఓటు వేసి గెలిపించండి..
సైకిల్ కి ఓటు వేస్తే వందేళ్లు వెనక్కి వెళ్లినట్లే సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారం జోరు పెంచింది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు. శింగనమల మండలం పెద్ద మట్లగొంది, గోవిందరాయునిపేట గ్రామాలలో మరియు మండల కేంద్రంలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు. ఆయనకు ప్రజలు, అభిమానులు, అడుగడునా పూలమాలలు వేసి నీరాజనాలు పలికారు. ఇంటింటికి వెళ్లి అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఐదేళ్లలో జగనన్న చేసిన సంక్షేమాన్ని వారికి గుర్తు చేస్తూ.. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శింగనమల మండల కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి ఎం శంకర్ నారాయణ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, రీజనల్ కోఆర్డినేటర్ రాగే పరశురాం, గిరిజన ప్రజా సమైక్య జాతీయ అధ్యక్షుడు వడిత్య శంకర్ నాయక్ , పార్టీ నాయకులతో కలసి వీరాంజనేయులు పాల్గొన్నారు. వీరాంజనేయులు మాట్లాడుతూ..ఒక సామాన్యుడిని పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన తనను ఇలా మీ ముందు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాను, దీనికి కారణం అణగారిన వర్గాలను పైకి తీసుకువచ్చిన దళితుల దేవుడు డా.బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తున్న మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. నన్ను తమ్ముడిలా ప్రోత్సహిస్తున్న మన ఎమ్మెల్యే పద్మమ్మ, ఆలూరు సాంబశివారెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గానికి అనేకమంది ఎమ్మెల్యేలు పాలన చేశారు. 50 ఏళ్ల చరిత్రను తిరగరాస్తు శింగనమల చెరువును లోకలైజేషన్ చేసిన ఏకైక ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి చరిత్రలో నిలిచారన్నారు. ఐదేళ్లలో సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగించారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పాలన కొనసాగించారన్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలను ఎన్నికల వేళ మరోసారి మోసం చేయటానికి వస్తున్నారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడుకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈనెల 13 తేదీన ఈవీఎం మెషినల్ లో సీరియల్ నెంబర్ 3 వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి శింగనమల నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని కోరారు. శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు కూటముల పేరుతో ప్రజలని మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు వారిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈనెల 13న ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వీరాంజనేయులు, ఎంపీ అభ్యర్థి అయిన తనను మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

May 07 2024, 07:09

జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు తమ అభ్యర్థులను గెలిపించాలంటూ విస్తృత ఎన్నికల ప్రచారం చేపట్టారు
శింగనమల నియోజవర్గం బుక్కరాయసముద్రం మండలం L.B కాలని రేగడీ కొత్తూరు నీలంపల్లి చెన్నంపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ(NDA కూటమి) అసెంబ్లీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ తెలుగుదేశం పార్టీ (NDA కూటమి ) అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారికి మద్దతుగా ద్విసభ్య కమిటి సభ్యలు ఆలం నరసానాయుడు ముంటీమడుగు కేశవరెడ్డి రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కె. రామలింగారెడ్డి జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు మండల కన్వీనర్ అశోక్ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను గడపగడప తిరుగుతూ వివరించడం జరిగింది.పేద బడుగు బలహీన వర్గాలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించాలని కోరారు.

పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారికి అసెంబ్లీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గారికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి,వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

May 07 2024, 07:04

అత్యధిక మెజారిటీతో వీరాను గెలిపించండి.. కార్యకర్తల సమావేశంలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి..
అత్యధిక మెజారిటీతో వీరాను గెలిపించండి.. కార్యకర్తల సమావేశంలో తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కలసి కట్టుగా పని చేద్దాం.. జగనన్నను ముఖ్యమంత్రి గా చేసుకుందాం.. ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి.. జగనన్న గెలుపు ప్రజల కోసమే.. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్ళీ చీకటి రోజులే.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీవెనలతో నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు కోసం కలిసికట్టుగా పని చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలోని తన నివాసంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పనిచేసి రానున్న ఎన్నికలలో మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగనన్న గెలుపు ప్రజల కోసమేనని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు. యల్లనూరు మండల కేంద్రంలోను, మరియు తిమ్మంపల్లి, కొడవాండ్లపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారంతో పాటు, మండల కేంద్రంలో రోడ్డు షో పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి శింగనమల నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం ప్రతి కార్యకర్త, నాయకులు కష్టపడి శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును, ముఖ్యమంత్రిగా వైస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొనే బాధ్యత మన అందరిదన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీరాంజనేయులు ద్వారా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సాంబ శివారెడ్డి మాట్లాడుతూ.. మనమందరం జగనన్న కోసం కష్టపడి ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి గిఫ్ట్ గా ఇద్దామని కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు.

పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు ఉంటే ప్రక్కన పెట్టి వైఎస్సార్సీపీ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

May 07 2024, 06:51

జనం జగనన్న వైపే.. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరేద్దాం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
జనం జగనన్న వైపే.. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరేద్దాం.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపడం ఖాయం ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో ప్రజలంతా అధికశాతం జగనన్న వైపే ఉన్నారని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు అన్నారు. పుట్లూరు మండల కేంద్రంలో, మరియు కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి, నాగిరెడ్డిపల్లి, నాయకునిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలసి వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని, మరియు రోడ్డు షో ను వీరాంజనేయులు చేపట్టారు. పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి జగనన్న చేసిన మేలుని వివరించారు. ఈవీఎం మెషిన్ లో 3 వ నెంబర్ వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..గత రెండు నెలల నుంచి ఏ పల్లెకు పోయినా తనను సోదరుడిలా భావించి ఆశీర్వదిస్తున్న శింగనమల నియోజకవర్గ ప్రజలకు శిరసు వంచి రెండు చేతులు జోడించి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బర్త్ సర్టిఫికెట్ కావాలన్నా క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా ఏ ఇతర సర్టిఫికెట్లు కావాలన్నా ఆఫీసర్ల ముందర చేతులు కట్టుకుని నిలబడి వాళ్ల దయా దక్షిణ్యాల మీద మనం ఆధారపడేవాళ్ళం. జగనన్న ప్రభుత్వం వచ్చాక మనకు అతి దగ్గరలో ఉన్న సచివాలయాల్లోనే అన్ని సేవలు అందుతూ ఉన్నాయన్నారు.

రెండేళ్లు కరోనా కష్టకాలంలో ప్రపంచమంతా వణికిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న మాత్రం ఎక్కడా సంక్షేమాన్ని ఆపకుండా ప్రతి ఇంటికి అందించారన్నారు. టిడిపి ఒంటరిగా పోటీ చేసి గెలవలేననే భయంతో జనసేన ని కలుపుకొందని, అయినా ధైర్యం చాలక ఢిల్లీ దర్బార్ ముందు సాగిలపడి బిజెపితో కూడా జతకట్టిందన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలోని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 2024 లో టిడిపిని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. మరోసారి జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

May 06 2024, 08:18

టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీని పరామర్శించిన.. ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటీమడుగు కేశవరెడ్డి..
శింగనమల నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గములో విరామం లేకుండా ప్రచార కార్యక్రమం చేశారు. ఈ నేపథ్యంలో అత్యధిక ఉష్ణోగ్రత ప్రభావంతో బండారు శ్రావణిశ్రీ గారు వడదెబ్బకు గురయ్యారు. ఇంటిలో వైద్య సేవలు పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకట శివ యాదవ్ గారు, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు గారు ముంటీమడుగు కేశవరెడ్డి గారు,అనంతపురం జిల్లా ఎన్నికల సమన్వయకర్త ఈరన్న గారు శింగనమల నియోజకవర్గం పరిశీలకులు గుర్రప్ప నాయుడు గారు బండారు శ్రావణి గారి నివాసానికి వెళ్లి పరామర్శించిన సందర్భంగా. అలాగే ప్రజలు, టిడిపి శ్రేణులు, అభిమానులు, అందరూ వడదెబ్బకు గురైన బండారు శ్రావణి శ్రీ గారు త్వరగా ఆరోగ్యంగా కోలుకొని మరి ప్రజలతో కలిసి ప్రచారంలో పాల్గొనాలని ప్రజలు ప్రార్థించారు.

Venkatesh1

May 06 2024, 07:56

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె. రామలింగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో 100 మంది టీడీపీ లోకి
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె. రామలింగారెడ్డి మరియు జిల్లా అధికార ప్రతినిధి పర్వాతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో 100 మంది టీడీపీ లోకి చేరినారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మేజర్ పంచాయతీలో జన చైతన్య కాలనీ,రామిరెడ్డి కాలనీ,ఎల్బీ నగర్ కాలనీ, గాయత్రి కాలనీలలో *టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు, జిల్లా అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో 100 మంది వైస్సార్సీపీ పార్టీ నుండి తెలుగుదేశంపార్టీలోకి చేరినారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అశోక్ కుమార్,పొడరాళ్ళ రవీంద్ర, మాజీ ఎంపీపీ SK వెంకటేష్, మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ, కేశన్న, నారాయణ స్వామి, సాయి నాథ్ రెడ్డి,బాబాయ్య లోక్ నాథ్ రెడ్డి, బాబా ఫకృద్దీన్ వలి , టోపీ బాషా తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Venkatesh1

May 06 2024, 07:45

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రభంజనం సృష్టిద్దాం.. వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రభంజనం సృష్టిద్దాం.. వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యం.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు ◆ హోరెత్తిన ఎన్నికల ప్రచారం అడుగడుగునా ప్రజల నీరాజనం ◆ నియోజకవర్గంలో టిడిపి ఓటమి భయంతో జిమ్మిక్కులు.. శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రభంజనం సృష్టించాలని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు కోరారు. శింగనమల మండలం గుమ్మేపల్లి, ఏకులనాగేపల్లి, కల్లుమడి, తరిమెల గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణతో, పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఏడిసిసి బ్యాంక్ మాజీ ఛైర్మన్ తరిమెల కోనారెడ్డి, తరిమెల వంశీ గోకుల్ రెడ్డి, కంచె రెడ్డి భాస్కర్ రెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డిలతో కలసి గడప గడపకు వైఎస్ఆర్ ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు.

కల్లుమడి గ్రామంలో ఎమ్మెల్యే, ఎంపీ, అభ్యర్థులకు పార్టీ నాయకులు గజమాల వేసి స్వాగతం పలికారు. అనంతరం తరిమెల గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే అభ్యర్థికి స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. ఈవీఎం మెషిన్ లో 3 వ నెంబర్ వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ..2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టి అధికారం కట్టబెట్టారని, అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేసి పేద కుటుంబాలు సంతోషంగా ఉండేలా పాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారన్నారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. ఐదేళ్ల జగనన్న పాలనలో రెండేళ్లు కరోన మింగేసినా, ఉన్న మూడేళ్లలోనూ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. కూటమి మేనిఫెస్టో అంతా బూటకమేనన్నారు. నియోజకవర్గంలో టిడిపి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ఐదేళ్లలో ప్రజలకు కనిపించని టీడీపీ అభ్యర్థి కూడా ఓట్ల కోసం నానా.. తంటాలుపడుతూన్నారన్నారు. అలాంటి వారు కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటమి భయంతో జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ప్రజలు టిడిపి వాగ్దానాలను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా జగనన్న అవడం ఖాయం అన్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Venkatesh1

May 05 2024, 07:03

టిడిపి నుంచి వైసీపీలోకి చేరుతున్న టిడిపి కార్యకర్తలు..

టిడిపి నుంచి వైసీపీలోకి చేరుతున్న టిడిపి కార్యకర్తలు..

బుక్కరాయసముద్రం మండలం లో నుంచి వరుస పెడుతున్న టిడిపి కార్యకర్తలు నాయకులు తలారి పోతలయ్య , పాముల నాగభూషణ్ రెండు కుటుంబాలు ఈరోజు వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది 

బుక్కరాయసముద్రం మండల ఇన్చార్జ్ ఆలూరి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ కండువా వేసి ఆహ్వానించారు 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కుల మత పార్టీ తేడా చూడకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు..