Anantapur

Mar 31 2024, 20:52

◆ జోరుగా ప్రచార పర్వం ◆ సామాన్యుడిని.. ఆశీర్వదించండి
.
● శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి సామాన్య పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పెద్ద బాధ్యత అప్పగించారని తనను గెలిపించాలని ఎం. వీరాంజనేయులు కోరారు. గార్లదిన్నె మండలం ముకుందాపురం, యర్రగుంట్ల, కేకే తాండ, కొట్టాలపల్లి, కామలాపురం గ్రామాల్లో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబుళేసు, మాజీ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులుతో కలసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. గ్రామాల్లోని పార్టీ శ్రేణులు శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల లబ్దిని వివరిస్తూ, నిరుపేదను దీవించి "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని కరపత్రాలను అందజేస్తూ అభ్యర్థించారు. వీరాంజనేయులు మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని వలంటీర్ల వ్యవస్థతో మన రాష్ట్రంలో ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించి అగ్రగామిగా నిలిచిందన్నారు. సీఎం జగనన్న పై కక్షతో పేదలను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. వలంటీర్లపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వా, తాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతారని ఈసీ తన నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేశారు. జగనన్న పరిపాలనలో ఇంటి దగ్గరికి సంక్షేమ పథకాలు అందించడం వల్ల చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ఇలాంటి నీచ పనులకు పాల్పడుతున్నారన్నారు. పేదల ఉసురు తగులుతుందన్నారు. ఇలాంటి ఘాతకానికి తలపడుతున్న టిడిపికి ఓటు వేసే ప్రసక్తే లేదని ప్రజలు చెబుతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో అసెంబ్లీ స్థానానికి తనకు, ఎంపీ అభ్యర్థి గా శంకర్ నారాయణ కు "ఫ్యాన్ " గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

Jan 30 2024, 15:55

గన్నవరం లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు..

గన్నవరం లో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు.. నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణీకుల ఆందోళన* హైదారాబాద్ నుంచి గన్నవరం వెళ్తున్న విమానం గన్నవరంలో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానం. లాండింగ్ సమయంలో తెరుచుకొని విమానం వీల్ రన్‌వే పైకి వచ్చి... తిరిగి టేక్‌ఆఫ్ అవడంతో కుదుపులకు లోనైన విమానం. కాసేపు గాల్లో చక్కర్లు కొట్టిన విమానం. ఏం జరుగుతోందో అర్ధం కాక ప్రయాణీకుల ఆందోళన. తిరిగి విమానం వీల్ బయటకు రావడం తో సేఫ్ గా లాండింగ్ అయిన విమానం.

Anantapur

Jan 30 2024, 13:52

చీని చెట్లను గుర్తుతెలియనీ వ్యక్తులు నరికివేత..

సింగమల మండలం జూలా కాలువ రెవిన్యూ పొలంలో సర్వే నెంబర్ 198-1 లో రైతు ఈడిగ నడిపి సుబ్బరాయుడు చెందిన ఐదు సంవత్సరాల పది చీని చెట్లను గుర్తుతెలియనీ వ్యక్తులు నరికి వేశారు...

Anantapur

Jan 30 2024, 12:01

Breaking.. యువకుడు దారుణ హత్య..

అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలంలో యువకుడు దారుణ హత్య గార్లదిన్నె మండలం జమ్ములదిన్నే కొట్టాల గ్రామానికి చెందిన రాజేష్ నాయక్ అనే యువకుడు దారుణ హత్య సివి రామన్ కాలేజ్ వెనుక భాగంలో ఉన్న మైదానంలో రాజేష్ నాయక్ తలపై బలంగా కొట్టి హత్య చేసిన దుండగులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అక్రమ సంబంధంతోనే రాజేష్ నాయక్ ను హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు

Anantapur

Jan 29 2024, 17:26

సిద్దాపురం గ్రామం నందు తలారి పెయింటర్ రాము యొక్క 60 వేల విలువగల గడ్డివాము దగ్ధం...

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామం నందు తలారి పెయింటర్ రాము రెండు రోజుల క్రితం 60 వేల విలువ గల వరిగడ్డిని తమ పశువుల కోసం తెచ్చుకున్నాడు ఈరోజు కొద్ది గంటల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు గడ్డివామును తగలబెట్టడం జరిగిందని రాము పేర్కొన్నారు ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి వచ్చిన గ్రామస్తులు విశ్వప్రయత్నం చేసిన మంటలు ఆగడం లేదు అంతలోనే ఫైర్ ఇంజన్ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు

Anantapur

Jan 29 2024, 07:46

చంద్రబాబు నెల్లూరు పర్యటనకు బయలుదేరిన సందర్బంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర కార్యదర్శి శింగనమల దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు

రా కదిలిరా కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారు అనంతపురం జిల్లా పర్యటన ముగించుకొని నెల్లూరు పర్యటనకు బయలుదేరిన సందర్బంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర కార్యదర్శి శింగనమల దిసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసనాయుడు గారు..

Anantapur

Jan 29 2024, 07:41

కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి..
కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ల దాడి! పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో 'బాబు ష్యూరిటీ, భవష్యత్తుకు గ్యారంటీ'కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇంచార్జి కన్నా లక్ష్మీనారాయణపై ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి దిగారు. పథకం ప్రకారం లైట్లు ఆర్పివేసి భవనాలపై నుంచి రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామి, టీడీపీ నాయకులకు గాయాలయ్యాయి.

Anantapur

Jan 29 2024, 07:35

అనంతపురం జిల్లా జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక సమావేశం..

స్థానిక జిల్లా సబ్ జైళ్ల ఆపీసు ఆవరణం లో అనంతపురం జిల్లా జైళ్ల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది ఈ కార్యక్రమం లో శ్రీ ఫరూక్ అలీ ఖాన్ గారు శ్రీ ఫాజుళక్ గారు కొండప్ప గారు మరియు జిల్లా జైలు పర్యవేక్షణ అధికారి శ్రీ రహమాన్ గారు శ్రీ పక్కిరప్ప గారు శ్రీ రామ సుబ్బయ్య గారు రవీంద్ర కుమార్ గారు పాల్గొన్నారు

Anantapur

Jan 29 2024, 07:28

భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక..

బుక్కరాయసముద్రం మండలం దండువారి పల్లి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి గారి ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక . జరిగింది శాఖ కాలనీ సెక్రటరీగా ఎట్టి కృష్ణమూర్తి. బీసీ కాలనీ సెక్రటరీగా తలారి రంగయ్య ఎంపిక చేయడం జరిగింది. నారాయణస్వామి మాట్లాడుతూ గతంలో సిపిఐ పార్టీ చేసిన సేవలు దండువారి పల్లి కి అనేకంగా సేవలందించడం జరిగింది ప్రజల సమస్యల మీద సిపిఐ పార్టీగా ముందుండి ప్రజల సమస్యలను తీర్చడంలో కమ్యూనిస్టు పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కళాకారుడు పూజారి కిష్ట మండల కార్యవర్గ సభ్యులు సాకే రాజకుల్లాయప్ప మండల రైతు సంఘం కార్యదర్శి సాకే భాస్కర్ రంగనాయకులు. బ్యాంకుఅంజి సూర్యనారాయణ. పూజారి రామకృష్ణ.హీరు నాయక్ భాష చాకలి రాము మహిళలు తదితరులు పాల్గొన్నారు

Anantapur

Jan 28 2024, 13:42

అనంతపురము లో ఉన్న రేవతి పర్టిలైజర్స్ లైసెన్స్ రద్దు చేసి.. నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్షరూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి.. ఎపి రైతుసంఘం డిమాండ్..

నాసిరకం కళింగర విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఎకరాకు లక్షరూపాయలు పరిహారం ఇవ్వాలి ---ఎపి రైతుసంఘం డిమాండ్ నార్పలమండలం బండ్లపల్లి గ్రామంలో నాసిరకం కళింగర విత్తనాలతో దిగుబడిరాక నష్టపోయిన రైతులతో కలిసి ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ రెడ్డి పోలాలు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బండ్లపల్లి గ్రామంలో 10 మంది రైతులు 25 ఎకరాలలో అప్పులు చేసి అనంతపురములో ఉన్న రేవతి పర్టిలైజర్స్ షాపులో కళింగర విత్తనాలు తెచ్చుకొని పంటలు సాగు చేశారు నార్పల మండలంలో ఉన్న పర్టిలైజర్స్ షాపులలో పురుగుమందులు అప్పు తెచ్చి పిచికారి చేశారు 60రోజులలో పంట కోతకు రావాలి 80 రోజులు దాటినా దిగుబడి రాకపోవడం వచ్చిన కొంత మేర కాయలు నాణ్యత లేక పోవడంతో రైతులు విత్తనాలు నాణ్యత లేకపోవడంతో మనం త్రీవంగా నష్టపోయామని దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు స్థానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు పొలాలు పరిశీలించి మీకు ఇచ్చిన రేవతి పర్టిలైజర్స్ వారు నాసిరకం కళింగర విత్తనాలతో దిగుబడి రాలేదు అని చెప్పారు దీంతో దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉంది. ఎకరాకు లక్షరూపాయలు పెట్టుబడి పెడితే ఎకరాకు 20 టన్నులు పైగా దిగుబడి రావాలసిఉంటే కనీసం 2నుండి 5 క్వింటాళ్లు కూడా రాకపోవడంతో తెచ్చిన అప్పులు ఎలా కట్టాలో అని దిక్కుతోచని పరిస్థితులలో రైతులు ఉన్నారు. కావున వ్యవసాయ ఉద్యానశాఖ అధికారులు నాసిరకం , ఎక్స్ ఫైర్ అయిన విత్తనాలు అమ్మిన అనంతపురము లో ఉన్న రేవతి పర్టిలైజర్స్ లైసెన్స్ రద్దు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్షరూపాయలు నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాధిత రైతులు వెంకటనారాయణ రెడ్డి మల్లేశ్వరమ్మ లక్ష్మినారాయణ మధుసూధన్ రెడ్డి మల్లిరెడ్డి తదితరులు పాల్గొన్నారు