నిజంనిప్పులాంటిది

15 min ago

ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలించేందుకు వెళ్తున్న మరో హెలికాప్టర్..

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని సహాయక బృందాలు గుర్తించాయని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ పేర్కొంది..

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైంది.

ఆదివారం నాడు హార్డ్ ల్యాండింగ్‌కు గురైన హెలికాప్టర్‌లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఉన్నారని ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

'ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్న ప్రదేశాన్ని గుర్తించాం. కానీ, పరిస్థితి అంత బాగోలేదు' అని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థకు ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ హెడ్ చెప్పారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం, ఇరాన్, అజర్ బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదాఫరీన్ అనే రెండు డ్యామ్‌లను ఇబ్రహీం రైసీ ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి బయలుదేరారు. అప్పుడే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది..

నిజంనిప్పులాంటిది

May 19 2024, 07:32

వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు..

వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు. ఆయన కుమారుడు లోకేశ్‌ కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలసి అమెరికా వెళ్లారు..

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

May 18 2024, 13:37

నేడే CSK vs RCB రణరంగం !

ఐపీఎల్-2024 (IPL 2024) ప్లేఆఫ్స్‌లో ఇప్పటికే మూడు బెర్తులు ఖరారయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇప్పుడు మిగిలింది కేవలం ఒక్క స్థానమే. దాని కోసం చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

నేడు సాయంత్రం 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడనున్న ఈ రెండు జట్లలో.. ఏదైతే విజయం సాధిస్తుందో అదే ప్లేఆఫ్స్‌కి చేరుతుంది. అయితే.. ఆర్సీబీ ముందు ఇక్కడ ఓ పెద్ద సవాల్ ఉంది. అదే.. రన్‌రేట్. చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం ఆ జట్టుని ఓడిస్తే సరిపోదు.. నెట్ రన్‌రేట్‌ని కూడా బీట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెన్నై రన్‌రేట్ 0.528 ఉండగా.. ఆర్సీబీ రన్‌రేట్ 0.387గా ఉంది. అది మెరుగుపడాలంటే, రెండు సమీకరణాలు ఉన్నాయి.

ఒకవేళ ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తే.. 200 పరుగులకు మించి స్కోరు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక్క పరుగు తేడాకొట్టినా.. అంటే 17 పరుగులతో విజయం సాధించినా ప్రయోజనం ఉండదు. అప్పుడు చెన్నై ఓడిపోయినప్పటికీ ప్లేఆఫ్స్‌కి చేరిపోతుంది. ఆర్సీబీ ఇంటిబాట పట్టాల్సి ఉంటుంది.

ఒకవేళ చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. దాన్ని ఆర్సీబీ 11 బంతులు మిగిలి ఉండగానే ఛేధించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక బంతి తేడాకొట్టినా.. ఆర్సీబీ గెలిచినప్పటికీ ఇంటిబాట పట్టక తప్పదు. కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లో అయినా లక్ష్యాన్ని 18.1 బంతుల్లో తప్పకుండా ఛేంజ్ చేయాలి. మరి.. ఆర్సీబీకి ఇది సాధ్యమవుతుందా? లేదా?

ఒక రకంగా చెప్పాలంటే.. ప్లేఆఫ్స్‌లో ఆర్సీబీ చోటు సంపాదించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఆర్సీబీతో పోలిస్తే చెన్నైకే ప్లేఆఫ్స్‌లో స్థానం సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రెండు సమీకరణాల్ని ఆర్సీబీ అందుకోకపోతే.. చెన్నై ఓడినా సింపుల్‌గా ప్లేఆఫ్స్‌కి వెళ్లిపోతుంది. ఈ లెక్కన.. అద్భుతం జరిగితే కానీ ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కి చేరదు. మరి.. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో ఎవరెలా రాణిస్తారో చూడాలి.

నిజంనిప్పులాంటిది

May 18 2024, 13:34

కాళేశ్వరం ప్రోజెక్ట్ పై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష !

- మైంటైన్ చేస్తున్న ప్రైవేట్ కంపెనీలపై దృష్టి

- పంపుల సమీక్షపై కొనసాగుతున్న చర్చ

- మేడిగడ్డ బ్యారేజ్ పై రేవంత్ రెడ్డి ఫోకస్

లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలోని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై ఫోకస్ పెట్టింది.

ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజిల మరమత్తులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలకు చేపట్టాల్సిన మరమత్తులపై కీలక చర్చ నిర్వహించనున్నారు. ఇవాళ్టి సమావేశంలో మరమత్తులకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్ అయ్యర్ అధ్వర్యంలో నియమించిన ఎన్‌డీఎస్ఏ నిపుణుల కమిటి ఇప్పటికే నివేదిక ఇచ్చింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసరంగా మరమత్తులు చేపట్టాలని నిర్ణయించింది. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు ఖర్చు అవుతాయని అంచనా వేస్తన్నారు.

నిజంనిప్పులాంటిది

May 18 2024, 13:30

ప్రధాని మోడీ ఆస్తుల విలువ తెలుసా ?

- సొంత ఇల్లు, కారు లేవు.. ఎన్నికల అఫిడవిట్‌లో ప్రధాని వెల్లడి

- వారాణసీ నుంచి నామినేషన్ 

- గంగా సప్తమి పర్వదినాన దాఖలు

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా సప్తమి పర్వదినాన.. ప్రధాని మోదీ వారాణసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్‌ వేశారు. అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సహా పలువురు ఎన్డీయే కూటమి నేతలు తదితర అతిరథమహారథులు వెంటరాగా.. మంగళవారం ఉదయం ఆయన జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

సార్వత్రిక ఎన్నికల ఆఖరి దశలో (జూన్‌ 1న) పోలింగ్‌ జరిగే నియోజకవర్గాల్లో వారాణసీ ఉంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు మంగళవారమే. గంగాదేవి భూమికి దిగివచ్చిన గంగా సప్తమి, పుష్యమి నక్షత్రం కలిసి రావడంతో.. మోదీ ఈరోజును ఎంచుకున్నారు. నామినేషన్‌ వేయడానికి ముందు ఆయన దశాశ్వమేధ ఘాట్‌లో గంగా స్నానం చేశారు.

అక్కడ జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుడి గుడికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ప్రార్థనలు చేశారు. ‘‘కాశీతో నా అనుబంధం అద్భుతమైనది, విడదీయలేనిది, పోలిక లేనిది. మాటల్లో చెప్పలేనిది. మీ అందరి ఆప్యాయతతో పదేళ్లు ఎలా గడిచిపోయాయో కూడా గుర్తురావట్లేదు. ఈరోజు గంగమ్మ తల్లి నన్ను తన దత్తత తీసుకుంది’’ అని ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు.

ప్రతి బూత్‌లోనూ.. గతంలో పోలైన ఓట్ల కంటే 370 ఓట్లు అధికంగా పోలయ్యేలా చూడాలని సూచించారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఆయన ఈ సూచన చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత ప్రధాని మోదీ ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టారు. ‘‘ఈ చారిత్రక నియోజకవర్గం (వారాణసీ) నుంచి పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం’’ అని పేర్కొన్నారు.

నిజంనిప్పులాంటిది

May 18 2024, 13:27

లండన్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ !

- కుటుంబంతో జగన్‌ లండన్‌కు

- విమానం అద్దె గంటకు 12 లక్షలు!

- నలుగురు భద్రతాధికారుల ఖర్చే కోటిన్నర

- ఇక సీఎం కుటుంబం ఖర్చు ఎంతో?

- 31వ తేదీన తిరిగి రాష్ట్రానికి రాక

సీఎం జగన్‌ తన కుటుంబంతో కలసి విమానంలో లండన్‌కు విహార యాత్రకు వెళ్లారు. ఈ ప్రత్యేక విమానంలో పడకలతో పాటు 14 సీట్లు మా త్రమే ఉంటాయి. విమానం అద్దె గంటకు 12 లక్షలు మాత్రమే! ఇది ప్రపంచంలోనే విలాసవంతమైనది.

విస్టా జెట్‌ కంపెనీకి చెందిన బొంబార్డియర్‌ 7500. నిరుపేద సీఎం కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి ఈ విమానాన్ని తెప్పించారు. గురువారమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు జగన్‌ తన కుటుంబంతో కలసి ఈ విమానంలో గన్నవరం నుంచి నేరుగా లండన్‌కు బయల్దేరారు.

సీఎం భద్రత కోసం నలుగురు అధికారులు ముందుగానే లండన్‌ వెళ్లారు. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి కోటిన్నర మాత్రమే. తరచూ పేదవాడినని చెప్పుకొనే జగన్‌ సింప్లిసిటీ ఇదన్నమాట. జగన్‌ భద్రతాధికారులకు అయ్యే ఖర్చు కోటిన్నరను ప్రభుత్వమే భరించనుంది. వ్యక్తిగత పర్యటన కావడంతో సీఎం కుటుంబానికి అయ్యే ఖర్చంతా ప్రైవేటు ఖర్చు.

ఈ నెల 31న ఆయన రాష్ట్రానికి తిరిగి రానున్నారు. జగన్‌ కుటుంబంతో కలసి తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి రాత్రి చేరుకున్నారు. జగన్‌కు మంత్రులు జోగి రమేశ్‌, కొట్టు సత్యనారాయణ తదితరులు వీడ్కోలు పలికారు.

నిజంనిప్పులాంటిది

May 18 2024, 13:24

మాజి మంత్రి మల్లారెడ్డి భూములు కబ్జా !

మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది.

కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులతో కూడా మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు వాగ్వాదానికి దిగారు.

సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 లో ఉన్న రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదనకు దిగారు.

ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేయాలని సదరు 15 మంది వ్యక్తులు చెబుతున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వారు అంటున్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున ఘటనా స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకూ పోలీసులు సర్డి చెబుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని సదరు 15 మంది వ్యక్తులు చెబుతున్నారు. పోలీసులు ఇంకా ఘటనా స్థలంలోనే ఉన్నారు.

నిజంనిప్పులాంటిది

May 18 2024, 10:23

Chhattisgarh:ఎన్‌కౌంటర్‌ మావోయిస్టు మృతి.. మరికొందరికి గాయాలు

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. టెట్రైతోల్నై అటవీప్రాంతంలో డీఆర్‌జీ సైనికులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి..

ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా.. మరికొందరికి గాయాలైనట్టు తెలుస్తోంది.

తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. ఎన్‌కౌంటర్‌ను సుక్మాజిల్లా ఎస్పీ కిరణ్‌ చవాన్ ధ్రువీకరించారు..

నిజంనిప్పులాంటిది

May 18 2024, 08:26

Cabinet Meeting: నేడు క్యాబినెట్ భేటీ వ్యవసాయ రంగంపై ప్రధాన చర్చ?

Cabinet Meeting: కొద్దిరోజుల విరామం తర్వాత తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు కావస్తున్నందున పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. . ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పులపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

ఉద్యోగుల బదిలీల సమస్యను ఇరు రాష్ట్రాల సమన్యాయంతో పరిష్కరించాలన్నారు సీఎం రేవంత్. క్లిష్టమైన సమస్యలపై రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 15లోగా రైతుల రుణాలను మాఫీ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించగా.. సంబంధిత నిధుల సమీకరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది..

జూన్‌ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. పాఠశాలలు, కళాశాలలు తెరిచేలోపు అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ తదితర అంశాలపై చర్చించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల పాలన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ వంద రోజుల్లోనే ఐదు హామీలను హడావుడిగా అమలు చేశారు. ఆ పథకాల అమలుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశాలున్నాయి. లోపాలుంటే వాటిని సరిదిద్దేందుకు చర్చిస్తామన్నారు. అలాగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిపై మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో పాటు నెరవేర్చాల్సిన హామీలపై రేవంత్ చర్చించే అవకాశం ఉంది..

నిజంనిప్పులాంటిది

May 17 2024, 18:19

రైతు పండించిన ప్రతి గింజకు బోనస్ ఇవ్వాలి

•పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవిగౌడ్

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో వడ్లకు కింటా ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి నేడు మాట మార్చటం సబబు కాదని నల్గొండ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రవిగౌడ్ అన్నారు.

వరి నారు మడులు అలికిన నాటి నుండి వరి కోతల వరకు అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది అని, పండిన పంటలో అధిక మొత్తం పెట్టుబడులకు పోతుంది ఆని ,చివరికి రైతుకు మిగిలేది ఏమ్ లేదని అన్నారు.

ఈ విధంగా నాన ఇబ్బందులు పడి పంటలు పండిస్తే సరైన ధర లేకపోతే రైతు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. అధికారం చేపట్టకముందు మీరు చెప్పిన మాట ప్రకారం రైతు పండించిన ప్రతి గింజకు ఐదు వందల రూపాయల బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని రవిగౌడ్ కోరారు.